ఐజేయూతోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం.

ఐజేయూతోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం.

టీయూడబ్ల్యూజే (ఐజేయు)జిల్లా అద్యక్ష,కార్యదర్శులు రాజిరెడ్డి,సుధాకర్

పరకాల నేటిధాత్రి

ఐజేయూ అనుబంధ టియుడబ్ల్యూజే తోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం సాధ్యమని టీయూడబ్ల్యూజేే (ఐజేయూ) హనుమకొండ జిల్లా అద్యక్ష, కార్యదర్శులు గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్ అన్నారు.సోమవారం పరకాలలో టీయూడబ్ల్యూజేే హనుమకొండ జిల్లా యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

TUWJ.

ఈ సందర్భంగా గడ్డం రాజిరెడ్డి,తోట సుధాకర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ముందుండి పోరాటం సాగిస్తున్న సంఘం టియుడబ్ల్యూజే (ఐజేయూ) మాత్రమే నని అన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ లు,హెల్త్ కార్డులు,ఇండ్ల స్థలాలు సాధించి పెట్టిన ఘనత ఈ సంఘానికే ఉందన్నారు. రానున్న రోజుల్లో వరంగల్ నగరంతో సహా మండల కేంద్రాలలో జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు,ఇండ్లు సాధించేందుకు పోరాడుతామన్నారు.రాష్ట్రంలో వివిధ కారణాలతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునేందుకు కృషి చేయడం జరుగుతుందని చెప్పారు.భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ సమస్యల సాధనకై జర్నలిస్టులకు అండగా టీయూడబ్ల్యూజేే నిలుస్తుందని, అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డుల జారీ, ఇతర సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి అమలుపరిచేలా కృషి చేస్తామని చెప్పారు.ఆరు దశాబ్దాల చరిత్ర ఉన్న యూనియన్ పై జర్నలిస్టులకు ఎంతో విశ్వాసం ఉందని,ప్రతి జర్నలిస్టు ఐజేయూ లో సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజేే రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడిపెల్లి మధు, జిల్లా కోశాధికారి బచ్చు పురుషోత్తం, జిల్లా సహాయ కార్యదర్శి గన్ను సంతోష్, కార్యవర్గ సభ్యులు గడ్డం బాలరాజు,అల్లె రామారావు,ముదిగిరి ఓదెలు, తాళ్ల రవి, నాయకులు బొజ్జం శ్రీనివాస్ రెడ్డి,భాస్కర్, పాషా, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version