25 వ వార్డు సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా
క్యాతరాజు సతీష్
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న కారల్ మార్క్స్ కాలనీ 25వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 25వ వార్డు శాఖా సమితి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది అనంతరం మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు 25వ వార్డు ఇంచార్జ్ సతీష్ మాట్లాడుతూ 25వ వార్డులో మంచినీటి సౌకర్యం కల్పించాలని మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీటి విడుదల సమయాన్ని పెంచాలని పరిశుభ్రమైన నీరును విడుదల చేయాలని, కాలనీలో అంతర్గత రోడ్లను నిర్మించాలని, సైడ్ కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించాలని, 6 ఇంక్లైన్ గని గోడకు సింగరేణి స్కూల్ గోడకు మధ్యలో ఉన్న రోడ్డుపై చెత్తాచెదారం పేరుకుపోయి ఉండడం మూలాన ఆ రహదారి మొత్తం డంపింగ్ యార్డ్ ల తయారైన పరిస్థితి కనపడుతుందన్నారు దీని మూలాన కార్మికులు స్కూలుకు పోయే పిల్లలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మున్సిపల్ అధికారులు తక్షణమే ఆ రోడ్డుపై ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించాలని, కోరారు అంతేకాకుండా వార్డులో వీధి దీపాలు వెలగడం లేదని అడిగితే టెండర్ అయిపోయిందని సమాధానం గత రెండు నెలలుగా చెబుతున్నారని ఇకనైనా వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరారు అంతేకాకుండా వార్డులో ఉన్న సెల్ టవర్ ను తొలగించాలని డిమాండ్ చేశారు సమస్యలతో సతమతమవుతున్న కాలనీ ప్రజలను మున్సిపల్ అధికారులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేనియెడల సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు నేరెళ్ల జోసెఫ్, డి హెచ్ పి ఎస్ జాతీయ సమితి సభ్యురాలు పొన్నగంటి లావణ్య, 25 వ వార్డు మహిళా నాయకురాలు పల్లెల రజిత, పెద్దమాముల సంధ్య, క్యాత రాజు అనూష, పోతుగంటి స్వప్న, గుండేటి శివకుమార్, బిల్ సింగ్, మట్టి కృష్ణ, తోపాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు