త్వ‌ర‌లో శివ‌4K రీరిలీజ్.

 త్వ‌ర‌లో శివ‌4K రీరిలీజ్…

శివ సినిమాను అతి త్వ‌ర‌లో 4కేలో రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు అక్కినేని నాగార్జున.

రామ్‌పాల్ వ‌ర్మ (RGV) , నాగార్జున (Akkineni Nagarjuna) కాంబోలో వ‌చ్చి టాలీవుడ్‌ క‌ల్ట్‌ క్లాసిక్‌గా నిలిచిన చిత్రం శివ (Siva). ఈ యేటితో 35సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకోబోతుంది. ఇప్ప‌టికే చాలాసార్లురీ రిలీజ్ అవుతూ వ‌చ్చిన ఈ సినిమాను 4కే ఫార్మాట్‌లో అతి త్వ‌ర‌లో రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు కింగ్ నాగార్జున ఆదివారం స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఆయ‌న‌, ధ‌నుష్ కీల‌క పాత్ర‌ల్లో రూపొందిన కుబేర ప్రీ రిలీజ్ ఈ వెంట్ నిన్న హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతున్న స‌మ‌యంలో ఫ్యాన్స్ అదే ప‌నిగా శివ శివ గోల చేస్తుండ‌డంతో అతి త్వ‌ర‌లో శివ సినిమా 4కేను రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఎగిరి గంతేశారు. అయితే ఈ సారి ఇంకా బెట‌ర్ క్వాలిటీతో సినిమాను తీర్చిదిద్ది ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని ఇచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే నాగార్జున పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆగ‌స్టు నెలాఖ‌రున గానీ సెప్టెంబ‌ర్‌లో గానీ ఈ శివ (Shiva4K) సినిమా ప్రేక్ష‌కుల‌కు ముందు మ‌రోసారి రానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు రీ రిలీజ్‌ అయిన ప్ర‌తీసారి ఆడియెన్స్ నీరాజ‌నాలు అందుకున్న ఈ చిత్రం ఈ సారి ఏమేర‌కు అల‌రిస్తుందో చూడాలి.

వాహనాలను తనిఖీ చేసిన పట్టణ పోలీసులు.

వాహనాలను తనిఖీ చేసిన పట్టణ పోలీసులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణ పరిధిలో గల ఝరాసంగం రోడ్డు పై జర్నలిస్ట్ కాలనీ సమీపంలో రాకపొకలు సాగించే చిన్న మధ్య తరహా వాహనాలను ఆదివారం సాయంత్రం పట్టణ పోలీసులు తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూ రెన్స్, హెల్మెట్, సీట్ బెల్ట్ పట్ల పోలీసు సిబ్బంది వాహన చోదకులకు అవగాహన కల్పించారు.

ఘనంగా అజ్వ జన్మదిన వేడుకలు.

ఘనంగా అజ్వ జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:.

 

 

 

ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షుడు షైక్ రబ్బాని యొక్క తమ్ముడు షైక్ సులేమన్ తనయుని కూతురు అజ్వ యొక్క జన్మదిన సంధర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కేకు కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. షేక్ రబ్బాని మాట్లాడుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.అని చెప్పారు. ఈ కార్యక్రమంలో షేక్ షఫీ ఉద్దీన్ షేక్ సజ్జహోద్దీన్ బంధుమిత్రులు కుటుంబ సభ్యుల తదితరులు పాల్గొన్నారు.

 సర్ఫరాజ్ సంచలన ఇన్నింగ్స్ నోరెత్తకుండా చేశాడు…

 సర్ఫరాజ్ సంచలన ఇన్నింగ్స్ నోరెత్తకుండా చేశాడు…

 

యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తన విలువ ఏంటో మరోమారు చూపించాడు. సంచలన బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. వాళ్లు నోరెత్తకుండా చేశాడు.

టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ చెలరేగిపోయాడు. ఇండియా ఏ-ఇండియా మధ్య జరుగుతున్న ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు సర్ఫరాజ్. 76 బంతుల్లోనే 101 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇందులో 15 బౌండరీలు, 2 భారీ సిక్సులు ఉన్నాయి. ఫోర్లు, సిక్సుల ద్వారానే 72 పరుగులు చేశాడు సర్ఫరాజ్. సెంచరీ తర్వాత కూడా అతడు ఔట్ కాలేదు. ఇతర బ్యాటర్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ నాక్‌తో విమర్శకులతో పాటు సెలెక్టర్లకు సర్ఫరాజ్ ఇచ్చిపడేశాడని నెటిజన్స్ అంటున్నారు.

 

నోళ్లు మూయించాడు..

ఇటీవలే ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన టెస్టులో 92 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు సర్ఫరాజ్ ఖాన్. ఇప్పుడు టీమిండియాతో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. దీంతో విమర్శకుల నోళ్లు మూయించాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 10 కిలోల బరువు తగ్గడమే గాక బ్యాట్‌తోనూ విధ్వంసం సృష్టిస్తున్నాడు.. ఇలాంటోడ్ని ఇంగ్లండ్‌ సిరీస్‌కు ఎంపిక చేయకుండా తప్పు చేశారని అంటున్నారు. దీనిపై సెలెక్టర్లు పునరాలోచించుకోవాలని చెబుతున్నారు.

అగార్కర్ ముందే..

ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు.. సర్ఫరాజ్‌ను భారత జట్టులోకి తీసుకోవాలని నెటిజన్స్ సూచిస్తున్నారు. కాగా, ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లకు ప్రాక్టీస్ ఉండాలనే ఉద్దేశంతో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ నిర్వహించారు. ఈ పోరుకు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా హాజరయ్యాడు. అగార్కర్ ముందే బౌండరీలు, సిక్సులతో చెలరేగిపోయాడు సర్ఫరాజ్. దీంతో అతడ్ని భారత జట్టులోకి తీసుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌కు మీడియా, అభిమానులను అనుమతించలేదు.

సఫారీలు సాధించారు.

సఫారీలు సాధించారు

 

రెండేళ్ల పాటు అద్భుత విజయాలతో సాగిన దక్షిణాఫ్రికా ప్రయాణం.. ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌పను కైవసం చేసుకోవడంతో ముగిసింది. శనివారం డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించిన…

ఫైనల్లో ఆసీ్‌సపై ఘనవిజయం

27 ఏళ్ల తర్వాత తొలి ఐసీసీ టైటిల్‌ సొంతం

 

 

 

 

 

ప్రైజ్‌మనీ

దక్షిణాఫ్రికాకు – రూ. 31.05 కోట్లు

ఆస్ట్రేలియాకు – రూ. 18.63 కోట్లు

 

ఏళ్లు కాదు.. దశాబ్దాలపాటు ఎదురుచూసిన తరుణమిది. తమ శక్తి యుక్తులన్నీ ధారపోసి పోరాడినా ఐసీసీ టోర్నీల్లో నిరాశగా వెనుదిరగడమే చూసిన దక్షిణాఫ్రికా ఇప్పుడు సగర్వంగా ‘గద’ ఎత్తుకుంది. ఒత్తిడికి చిత్తయ్యే జట్టంటూ.. చోకర్స్‌గా ముద్ర వేసి క్రీడాలోకం పరిహసించినా.. క్రికెట్‌ పుట్టినిల్లుగా భావించే లార్డ్స్‌లోనే ‘ఇదిగో ఇదీ మా సత్తా’ అంటూ వరల్డ్‌ టెస్టు చాంపియన్స్‌ హోదాలో పోడియంపై నిలిచింది. బలమైన ప్రత్యర్థి ఆసీస్‌ బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో విలవిల్లాడిన బ్యాటర్లు లక్ష్య ఛేదనలో మాత్రం తెగించి నిలబడ్డారు. శతక వీరుడు మార్‌క్రమ్‌తో పాటు చీలమండ గాయం ఇబ్బందిపెట్టినా గెలుపు కోసం కెప్టెన్‌ బవుమా క్రీజులో నిలిచిన తీరుకు వహ్వా.. అనాల్సిందే. దీంతో 27 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీల్లో సఫారీలు విజేతలయ్యారు

 

లండన్‌: రెండేళ్ల పాటు అద్భుత విజయాలతో సాగిన దక్షిణాఫ్రికా ప్రయాణం.. ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌పను కైవసం చేసుకోవడంతో ముగిసింది. శనివారం డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించిన బవుమా సేన ఐసీసీ టెస్టు గదను సగర్వంగా అందుకుంది. అలాగే ఈ జట్టుకిది వరుసగా ఎనిమిదో టెస్టు విజయం కాగా.. 1998లో నాకౌట్‌ ట్రోఫీ తర్వాత రెండో ఐసీసీ టోర్నీ విజయం కావడం విశేషం. అటు ఇప్పటికే పది ఐసీసీ టైటిళ్లను ఖాతాలో వేసుకున్న ఆసీస్‌ రెండోసారి డబ్ల్యూటీసీ టైటిల్‌పై ఆశలు పెట్టుకున్నా నిరాశే ఎదురైంది. 2010 (టీ20 వరల్డ్‌కప్‌) తర్వాత కంగారూలు ఓ ఐసీసీ టోర్నీ ఫైనల్లో ఓడడం ఇదే తొలిసారి. నాలుగో రోజు కేవలం విజయానికి 69 పరుగుల దూరంలో నిలిచిన సఫారీలు తమ రెండో ఇన్నింగ్స్‌లో 282/5 స్కోరు సాధించారు. మార్‌క్రమ్‌ (136), బవుమా (66) గెలుపులో కీలక పాత్ర పోషించారు. స్టార్క్‌కు మూడు వికెట్లు దక్కాయి. అంతకుముందు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 212, సౌతాఫ్రికా 138 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులు సాధించిన ఆసీస్‌ ప్రత్యర్థి ముందు 282 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా మార్‌క్రమ్‌ నిలిచాడు.

 

 

తొలి సెషన్‌లోనే..: నాలుగో రోజు 213/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన సౌతాఫ్రికా గెలుపునకు మరో 69 పరుగులే చేయాల్సివుంది. ఆసీస్‌ బౌలర్లు సఫారీలపై ఒత్తిడి పెంచేందుకు స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుని బంతులు విసిరారు. వికెట్ల కోసం ఆసీస్‌ తమకున్న మూడు రివ్యూలను కూడా వాడేసుకుంది. కొత్త బంతిని సైతం తీసుకున్నా.. మొక్కవోని ఏకాగ్రతతో బ్యాటర్లు క్రీజులో నిలిచారు. తొలి సెషన్‌లో కేవలం మూడు బౌండరీలు మాత్రమే వచ్చాయి. అయితే మూడో ఓవర్‌లోనే కెప్టెన్‌ బవుమాను కమిన్స్‌ దెబ్బతీయడంతో మూడో వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కానీ మార్‌క్రమ్‌ వారికి అడ్డుగా నిలిచాడు. స్టబ్స్‌ (8)తో కలిసి నాలుగో వికెట్‌కు 24.. బెడింగమ్‌ (21 నాటౌట్‌)తో కలిసి ఐదో వికెట్‌కు 35 పరుగులు జోడించాడు. గెలుపునకు మరో 6 పరుగుల దూరంలో అతడి 6 గంటల 23 నిమిషాల సుదీర్ఘ పోరాటానికి పేసర్‌ హాజెల్‌వుడ్‌ తెరదించాడు. మార్‌క్రమ్‌కు ఇరు జట్ల ఆటగాళ్లతో పాటులార్డ్స్‌ ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో అభినందనలు తెలిపారు. చివరకు 84వ ఓవర్‌లో స్టార్క్‌ వైడ్‌ ఫుల్‌టా్‌సను కవర్‌ పాయింట్‌ వైపు వెరెయిన్‌ (4 నాటౌట్‌) సింగిల్‌ తీయడంతో దక్షిణాఫ్రికా అంతులేని సంబరాల్లో మునిగింది.

 

 

టీమిండియా వల్ల నిద్రపట్టలేదు..

టీమిండియా వల్ల నిద్రపట్టలేదు.. మార్క్రమ్ ఎమోషనల్!

 

 

 

 

 

ఐసీసీ ట్రోఫీ దాహాన్ని ఎట్టకేలకు తీర్చుకుంది సౌతాఫ్రికా. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ట్రోఫీని అందుకుంది ప్రొటీస్.

సెమీఫైనల్స్, ఫైనల్స్ వరకు రావడం ఖాళీ చేతులతో ఇంటిదారి పట్టడం.. గత రెండు దశాబ్దాలుగా ఐసీసీ టోర్నమెంట్లలో సౌతాఫ్రికా పరిస్థితి ఇది. టీ20లు, వన్డేలు, టెస్టులు అనే తేడాల్లేకుండా ప్రతి ఫార్మాట్‌లోనూ అదరగొట్టడం, మేజర్ టోర్నమెంట్స్‌లో నాకౌట్స్ వరకు దూసుకురావడం.. కీలకపోరులో చతికిలపడటం వాళ్లకు ఓ సంప్రదాయంలా మారింది. దీంతో వాళ్లపై చోకర్స్ అనే ముద్ర పడింది. ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ మొదలైనప్పుడు సఫారీలకు మరో ఓటమి తప్పదని చాలా మంది అనుకున్నారు. అయితే అంతా రివర్స్ అయింది. చెలరేగి ఆడిన బవుమా సేన.. కంగారూలను చిత్తు చేసి 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ కలను నిజం చేసుకున్నారు. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మ్యాచ్ హీరో ఎయిడెన్ మార్క్రమ్ కూడా ఎమోషనల్ అయ్యాడు.

ఆసీస్‌పె చిరస్మరణీయ విజయం సాధించడంతో మార్క్రమ్ భావోద్వేగానికి లోనయ్యాడు. సహచర ఆటగాళ్లతో కలసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత అతడు మాట్లాడుతూ.. టీ20 వరల్డ్ కప్-2025 ఫైనల్‌ను తలచుకున్నాడు. ఆ మ్యాచ్‌లో భారత్ చేతుల్లో ఓడటంతో తనకు నిద్రపట్టలేదన్నాడు. ఆ పోరులో ఔట్ ‌అయ్యాక ఒంటరిగా కూర్చొని ఉండిపోయానని, ఆ క్షణం చాలా నిస్సహాయంగా అనిపించిందన్నాడు. అప్పుడే నిర్ణయించుకున్నానని, ఇలాంటి సమయం వస్తే అలా కూర్చోకూడదని, అటో ఇటో తేల్చేయాలని డిసైడ్ అయ్యానని మార్క్రమ్ చెప్పుకొచ్చాడు.

‘నిన్న మొత్తం టీ20 ప్రపంచ కప్ గురించి ఆలోచించా. ఔట్ అయ్యాక నిస్సహాయంగా ఎలా కూర్చున్నానో గుర్తొచ్చింది. అందుకే మళ్లీ అలాంటి పరిస్థితి తీసుకురావొద్దని నిర్ణయించుకున్నా. ఇది నాలో స్ఫూర్తిని నింపింది. అందుకే ఆసీస్‌తో పోరులో క్రీజులో పాతుకొనిపోయా. నా బాధ్యత నేను నిర్వర్తించాలి, జట్టు గెలుపు కోసం సాధ్యమైనంతగా పోరాడాలి అనేది దృష్టిలో పెట్టుకొని బ్యాటింగ్ చేశా’ అని మార్క్రమ్ వ్యాఖ్యానించాడు.

ట్రంప్ బర్త్‌డే రోజు పుతిన్ ఫోన్ ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం గురించి చర్చలు.

ట్రంప్ బర్త్‌డే రోజు పుతిన్ ఫోన్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి చర్చలు…

Donald Trump: ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ స్పందించారు. తన బర్త్‌డే రోజున రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ తనకు ఫోన్ చేశాడని, యుద్ధంపై మాట్లాడామని చెప్పారు. యుద్ధం ఆపడానికి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. మిస్సైల్స్, డ్రోన్లతో పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగానే ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా, ఇరాన్.. ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ స్పందించారు. తన బర్త్‌డే రోజున రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ తనకు ఫోన్ చేశాడని, యుద్ధంపై మాట్లాడామని చెప్పారు. యుద్ధం ఆపడానికి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఈ విషయాలను సోషల్ మీడియా వేదికగా ఆయన వెల్లడించారు. ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో.. ‘అధ్యక్షుడు పుతిన్ ఈ రోజు ఉదయం నాకు ఫోన్ చేశారు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దాని కంటే ముఖ్యంగా ఇరాన్ దేశం గురించి మాట్లాడుకున్నాం. దాదాపు గంట సేపు మాట్లాడుకున్నాం. నేను అనుకుంటున్నట్లే ఆయన కూడా అనుకుంటున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ఆగాలని కోరుకుంటున్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం గురించి కొంచెంసేపు మాత్రమే మాట్లాడుకున్నాం.

ఈ అమ్మాయి ఇంత ఘోరం చేస్తుందని ఊహించలేదు.

ఈ అమ్మాయి ఇంత ఘోరం చేస్తుందని ఊహించలేదు..

 

పర్సు లాక్కోవడంతో చూస్తుండగానే..

 

 

 

 

ఓ మహిళ ఓ భవనంలో నుంచి బయటికి వెళ్తుంటుంది. అయితే ప్రధాన ద్వారం వద్ద కొంత మంది యువకులు అడ్డుగా నిలబడి ఉంటారు. ఆ యువతి దగ్గరికి రాగానే.. ఆమె చేతిలోని పర్సు లాక్కుని దూరంగా పడేశారు. ఆ తర్వాత ఆమెను లైంగికంగా వేధించే ప్రయత్నాలు చేస్తారు. అయితే..

ఒంటరి మహిళలపై నిత్యం అనేక రకాలుగా దాడులు జరగడం చూస్తున్నాం. శారీరకంగా కొందరు, మానసికంగా మరికొందరు వేధింపులకు గురి చేస్తున్నారు. ఇంకొందరు వారి పర్సులు, మెడలోని గొలుసులు లాక్కుని పారిపోవడం చూస్తున్నాం. దీంతో ఆత్మ రక్షణకు సంబంధించిన శిక్షణ తీసుకోవడం తప్పనిసరి అయింది. ఇలాంటి శిక్షణ తీసుకోవడం వల్ల మహిళలు తమని తాము రక్షించుకోవడానికి వీలుంటుంది. ఇలాంటి శిక్షణ ఎంత ఉపయోగపడుతుందో తెలిపేలా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఈ అమ్మాయి ఇంత ఘోరం చేస్తుందని ఊహించలేదు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ ఓ భవనంలో నుంచి బయటికి వెళ్తుంటుంది. అయితే ప్రధాన ద్వారం వద్ద కొంత మంది యువకులు అడ్డుగా నిలబడి ఉంటారు. ఆ యువతి దగ్గరికి రాగానే.. ఆమె చేతిలోని పర్సు లాక్కుని దూరంగా పడేశారు. ఆ తర్వాత ఆమెను లైంగికంగా వేధించే ప్రయత్నాలు చేస్తారు. అయితే అప్పటివరకూ సైలెంట్‌గా ఉన్న ఆమె.. ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చుతుంది.

అక్కడున్న యువకులందరినీ (Woman Beat Up The Thieves) తన పవర్‌ఫుల్ పంచ్‌లతో కుమ్మేస్తుంది. దెబ్బకు వారంతా కిందపడిపోయి.. నొప్పితో కుయ్యో.. ముర్రో అనుకుంటూ పడిపోతారు. చివరకు దూరంగా పడిపోయిన పర్సును తిరిగి తెచ్చి ఆమెకు ఇచ్చేస్తారు. వెళ్తూ వెళ్తూ పర్సు ఇచ్చిన వ్యక్తికి కూడా ఫినిషింగ్ టచ్ ఇస్తుంది. ఇలా వారందరికీ తన పంచ్ దెబ్బ రుచి చూపించి తనని తాను రక్షించుకుంటుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది.

ఇదంతా అవగాహన కల్పించడానికి చేశారో.. రియల్‌గా జరిగిందో తెలీదు గానీ.. ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘మొత్తానికి అందరికీ చుక్కలు చూపించిందిగా’.. అంటూ కొందరు, ‘అమ్మాయిలంతా ఇలా మారితే ఎంతో బాగుంటుంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9,700కి పైగా లైక్‌లు, 7.14 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

అలరించే వంతెన.

అలరించే వంతెన…

 

కనుచూపుమేర పచ్చందనం… అక్కడే రెండు సుందరమైన కొండలు… వాటిని వయ్యారంగా కలుపుతూ ఓ గాజు వంతెన. దూరం నుంచి చూస్తే అచ్చంగా మూడు అలలు కదులుతున్నట్లు భ్రమ చెందుతాం… దగ్గరికెళ్తే నిజంగానే అలల వంతెనను వదిలి రాబుద్ధి కాదంటారు సందర్శకులు. అదే ‘రుయి’ వంతెన…

భారీ, విభిన్న నిర్మాణాలతో తరుచూ ప్రపంచ దృష్టిని ఆకర్షించే చైనా మరో ఇంజనీరింగ్‌ అద్భుతం ‘రుయి’ బ్రిడ్జ్‌. దీనిని మూడేళ్ల పాటు నిర్మించి, 2020లో వంతెనపైకి పర్యాటకులను అనుమతించారు. చైనీస్‌ రుయి (అదృష్టానికి ప్రతీక) చిహ్నం ప్రేరణతో దీనిని నిర్మించారు. ఇది భూమి నుంచి 140 మీటర్లు(460 అడుగులు) ఎత్తులో ఉంటుంది. దీని పొడవు 100 మీటర్లు(330 అడుగులు). ఈ వంతెనను ప్రారంభించిన తర్వాత కేవలం రెండు నెలల వ్యవధిలోనే సుమారు రెండు లక్షల మంది సందర్శించడం విశేషం. స్థానికులు ఈ వంతెనను ‘బెండింగ్‌ బ్రిడ్జ్‌’ అని పిలుస్తారు.

మెట్లూ ఉన్నాయి…

కళ్లు చెదిరే ఈ బ్రిడ్జ్‌ చైనాలోని జెజియాంగ్‌ ప్రావిన్స్‌లో ఉంది. ఇదొక గాజు వంతెన. వంతెన నిర్మాణాల్లో విశేష అనుభవమున్న హీయున్‌చాంగ్‌ అనే ఇంజనీర్‌ దీనికి రూపకల్పన చేశాడు. జాగ్రత్తగా గమనిస్తే వంతెనను ఓచోట మూడు దారులుగా విభజించారు. ఇంకోచోట కలిపినట్లుగా ఉంటుంది. దీనిపై సులువుగా నడవటానికి మెట్లు కూడా ఉన్నాయి. సందర్శకులు వంతెనపై నడుస్తున్నంతసేపూ గాల్లో తేలుతున్నట్లు, మేఘాలు హాయ్‌ చెప్పుతున్నట్లు అనుభూతి చెందుతారట.

 

బండి కుమారస్వామి బాధితుడు మృతి.

బండి కుమారస్వామి బాధితుడు మృతి

బయటకు వస్తున్న బండి బాధితులు.

నేటిధాత్రి, వరంగల్

 

 

మిల్స్ కాలని పోలీస్ స్టేషన్ కు పెరుగుతున్న బండి బాధితుల సంఖ్య..

నాలుగు రోజుల క్రితం జరిగిన పెట్రోల్ సంఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు మృతి.

బండి మీద పీడీ యాక్ట్ నమోదు చేయండి. దళిత సంఘాల డిమాండ్..

మిల్స్ కాలని పోలీస్ స్టేషన్ లో పెరుగుతున్న పిర్యాదుల సంఖ్య.

గతంలో ఏకంగా బండి కుమారస్వామి పేరిట బాధితుల సంఘం ఏర్పాటు..

ఒకే వ్యక్తిపై మిల్స్ కాలని పోలీసు స్టేషన్ లో 30 కి పైగా కేసులు?

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి “బండి” పయనం..

 

Bandi Kumaraswamy

 

భూ కబ్జాదారుడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి..

న్యాయం చేయాలి

భూ కబ్జాదారుల( బండి కుమారస్వామి, పులి రంజిత్ రెడ్డి, తాళ్ల పద్మావతి కాలేజీ యాజమాన్యం) ఆగడాలకు బలైపోయిన నిరుపేద దళితుడు పోలేపాక కుమారస్వామి వారి కుటుంబానికి న్యాయం చేయాలి.

మాదాసి సురేష్
ప్రజాసంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ హనుమకొండ!

ఘనంగా సిపిఐ భూపాలపల్లి పట్టణ 18వ మహాసభలు.

ఘనంగా సిపిఐ భూపాలపల్లి పట్టణ 18వ మహాసభలు

కమ్యూనిస్టులను లేకుండా చేసేందుకే కగార్ ఆపరేషన్

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

దేశంలో కమ్యూనిస్టులను లేకుండా చేసేందుకే కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ చేపట్టిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు.

ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ భూపాలపల్లి పట్టణ మహాసభ ఘనంగా నిర్వహించారు.

ముందుగా మహాసభ ప్రాంగణంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పార్టీ పతాకాన్ని ఎగురవేశారు.

అనంతరం సుభాష్ కాలనీలోని సింగరేణి ఫంక్షన్ హాల్ లో జరిగిన మహాసభకు సిపిఐ పట్టణ కార్యదర్శి సొతుకు ప్రవీణ్ అద్యక్షత వహించగా రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

మావోయిస్టుల ఏరివేత పేరుతో కేంద్రం ఎంతోమందిని పాశవికంగా హత్య చేస్తున్నదని అన్నారు.

కార్పొరేట్ శక్తులకు దేశంలోని సహజ వనరులను కట్టబెట్టేందుకు, అడవులను వారికి అప్పగించేందుకు మావోయిస్టులను లేకుండా చేసేందుకే ప్రయత్నిస్తున్నారని అన్నారు.

ఒకవైపున మావోయిస్టులు తాము చర్చలకు సిద్దం అని ప్రకటించినా, లొంగిపోతున్నా వారిని చంపడమే ద్యేయంగా ముందుకు సాగుతున్నారని అన్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2026 మార్చి నాటికి మావోయిస్టులను దేశంలో లేకుండా చేస్తామని చెప్పడం ఫ్యూడల్, ఫాసిజం, హంతకుల మనస్తత్వానికి నిదర్శనం అని అన్నారు..

తక్షణమే ఆపరేషన్ కగార్ నిలిపివేసి మావోయిస్టులతో చర్చలకు జరపాలని తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

మరోవైపు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధంగా కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, సింగరేణి సంస్థలను ప్రైవేటు పరం చేసి నిర్వీర్యం చేయడం కోసం కేంద్రం కుట్ర చేస్తుందన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను వారికి దారాధత్తం చేస్తున్నదని విమర్శించారు.

కార్పొరేట్ శక్తులైన అంబానీ, ఆదానీలకు వంతపాడుతూ పేదల సంక్షేమాన్ని విస్మరించారని అన్నారు.

కార్పొరేట్ శక్తులకు వేలకోట్ల రూపాయల రాయితీ కల్పించి పేదల పై మాత్రం పెనుభారాలు మోపుతున్నారని అన్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతిలో ప్రధాని మోడీ పావుగా మారాడాని, అమెరికాలో మన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా మోడీ మాట్లాడడం లేదని అన్నారు.

గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించిందని ప్రజలు మళ్లీ కాంగ్రెస్ అధికారం ఇచ్చారని అన్నారు.

కాలేశ్వరం పేరుతో లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని, కాలేశ్వరం వల్ల ఉమ్మడి వరంగల్ భూపాలపల్లి జిల్లాలకు ఒక్క ఎకరానికి నీరు అందలేదని అన్నారు.

ఎప్పటికైనా ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులేనని, భవిష్యత్తులో ప్రజల పక్షాన మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

భూపాలపల్లి మున్సిపాలిటీపై ఎర్రజెండా ఎగరేద్దాం
సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో భూపాలపల్లి మున్సిపాలిటీ పై ఎర్రజెండాను ఎగరవేద్దామని సిపిఐ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు.

చట్టసభలలో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఉంటేనే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు.

నూతన కమిటీ నిర్ణయాలను అమలు చేసే దిశగా పనిచేయాలని కోరారు.

ఈ సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహించాలని మహాసభలో తీర్మానించారు.

మీరు చేయబోయే ప్రతి పోరాటం లో రాష్ట్ర, జిల్లా పార్టీ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు.

ఈ మహా సభల్లో సిపిఐ కౌన్సిల్ సభ్యులు గురుజపెల్లి సుధాకర్ రెడ్డి, జి శ్రీనివాస్, మాతంగి రామ్ చందర్, కొరిమి సుగుణ, మాజీ కౌన్సిలర్ నూకల భూలక్ష్మి చంద్రమౌళి, ఆసిఫ్ పాషా, తాళ్ల పోషం నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్ తో పాటు 250 మంది డెలిగేట్స్ పాల్గొన్నారు.

సరికొత్త అధ్యాయం.

సరికొత్త అధ్యాయం…

ఎన్నాళ్ల నిరీక్షణ.. ఎన్నేళ్ల నిర్వేదన..! కీలక నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఓటములతో అభిమానుల కలలు కల్లలు కావడం.. జట్టు నైరాశ్యంలో మునిగిపోవడం. మొత్తంగా వెరసి ‘అన్‌ లక్కీ’ అనే ట్యాగ్‌ను…

ఎన్నాళ్ల నిరీక్షణ.. ఎన్నేళ్ల నిర్వేదన..! కీలక నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఓటములతో అభిమానుల కలలు కల్లలు కావడం.. జట్టు నైరాశ్యంలో మునిగిపోవడం. మొత్తంగా వెరసి ‘అన్‌ లక్కీ’ అనే ట్యాగ్‌ను సొంతం చేసుకొన్న జట్టు దక్షిణాఫ్రికా.

చోకర్స్‌ (కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడికి చిత్తయ్యే జట్టు)గా ముద్ర వేసుకొన్న సఫారీలు ఇప్పుడు చాంపియన్లుగా నిలిచారు.

దిగ్గజాల వల్ల కానిది..: ఏబీ డివిల్లీర్స్‌, గ్రేమ్‌ స్మిత్‌, గ్యారీ కిర్‌స్టెన్‌, అలెన్‌ డొనాల్డ్‌, జాక్‌ కలిస్‌ లాంటి దిగ్గజ ఆటగాళ్లు జట్టు కోసం ఎంతో శ్రమించారు. వీరందరి కృషితో జట్టు మెరుగుపడినా..

ఐసీసీ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షే అయింది. ఎట్టకేలకు మార్‌క్రమ్‌, బవుమా అద్భుత పోరాటంతో సౌతాఫ్రికా క్రికెట్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు.

ఓటములను దిగమింగుకొని నాకౌట్స్‌లో నిరాశ.. సఫారీలకు 1992 నుంచి వెంటాడుతోంది. ఆ వరల్డ్‌క్‌పలో ఇంగ్లండ్‌తో సెమీస్‌ మ్యాచ్‌లో వరుణుడి రూపంలో షాక్‌ తగిలింది.

1999 వరల్డ్‌క్‌పలో ఆస్ట్రేలియాతో సెమీస్‌ మ్యాచ్‌ టై కావడం అనేది ఎప్పటికీ గుండెల్లో ముల్లులాంటిదే. గతేడాది జూన్‌ 29న జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా.. ఏడాది తిరిగే సరికి ‘జూన్‌ 14’ను సువర్ణాక్షరాలతో లఖించదగ్గ రోజుగా మార్చుకొంది.

కెరీర్‌ చివర్లో ఉన్న రబాడ.. ఫైనల్‌ మ్యాచ్‌లో కంగారూల పనిబట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన మార్‌ క్రమ్‌.. భారీ శతకంతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. వీరిద్దరి పోరాట స్ఫూర్తితో సౌతాఫ్రికా అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.

తొలినాటి కూరగాయ దొండ…

తొలినాటి కూరగాయ దొండ…

 

తొంటి అంటే తొలినాటిదని అది తొండి కాయ’గా కన్నడంలోనూ దొండకాయగా తెలు గులోనూ పరిణామం చెందింది.

దొండ మన ప్రాచీన కూరగాయ! లాటిన్‌లో ‘కాక్సీనియా’ అంటే ఎర్రపండు అని! బెండని లేడీస్‌ ఫింగర్‌ అన్నట్టే, దీన్ని ‘జెంటిల్‌ మాన్స్‌ టో’ అంటారు.

ఘృతపాకేన కరోతి రోచనమ్‌

తొంటి’ అంటే తొలినాటిదని! అది ‘తొండి కాయ’గా కన్నడంలోనూ, దొండకాయగా తెలు గులోనూ పరిణామం చెందింది. దొండ మన ప్రాచీన కూరగాయ! లాటిన్‌లో ‘కాక్సీనియా’ అంటే ఎర్రపండు అని! బెండని లేడీస్‌ ఫింగర్‌ అన్నట్టే, దీన్ని ‘జెంటిల్‌ మాన్స్‌ టో’ అంటారు.

జీర్ణకోశాన్ని శుభ్రపరచటం, తల్లి పాలు పెరిగేలా చేయటం, రక్తహీనత, జ్వరాలు, క్షయ వంటి వ్యాధుల్లో పోషకం ఇది. దీనిలోని కుకుర్బిటాసిన్‌ మధుమేహాన్ని నియంత్రిస్తుందని పరిశోధిస్తున్నారు.

లేత దొండకాయల్ని నిలువు చీలి కలుగా కోసి, ఉప్పు, పసుపు వేసిన నీళ్లలో మరిగించి ఆ నీటిని పిండేయాలని నలుడు ‘పాక దర్పణం’లో చెప్పాడు. ఉప్పు వేసి పిసికి నీరు పిండటం కూడా చెయ్యదగిందే! ఈ జాగ్రత్త తీసుకోకుండాదొండ ముక్కల్ని నేరుగా కూర,పప్పు పచ్చడి వగైరా చేస్తే తల తిరుగుడు లాంటి సమస్యలు కలుగుతాయి.

ఇగురుకూర: ఒక చెంచాడు నేతిలో ఇంగువ, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు జీలకర్రవగైరా తాలింపు గింజలు వేగించి, నీరుపిండిన ముక్కలి అందులో కలిపి మిరియాలపొడి వేసి మగ్గనిస్తే అదే కమ్మని దొండ ఇగురుకూర! పొయ్యి మీంచి దించాక రవ్వంతపచ్చకర్పూరం కలిపితే పరిమళ భరితంగా ఉంటుందన్నాడు నలుడు. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది!

మజ్జిగ పులుసు: ‘‘బింబీఫలం సకలమేవఘృతే నిధాన…’’ దొండకాయల్ని నాలుగు పక్షాలుగా చీల్చి నీరుపిండి, కొద్దిగా నెయ్యి వేసి వేగనిచ్చి ఉప్పు, మిరియాలపొడి వేసి, కాయలు మునిగే దాకా చిక్కని మజ్జిగ పోసి ఉడికించాలి.

ఈ మజ్జిగపులుసు జాఠరాగ్నిని పెంచుతుందని క్షేమ కుతూహలం గ్రంథం పేర్కొంది.

ముద్ద కూర: లావుగా పెద్దవిగా ఉండే దొండకాయల్ని నిలువుగా మధ్యకు కోసి, ఇంగువ+ఉప్పు కలిపిన పొడిని ఒక్కో ముక్కకూబాగా పట్టించాలి.తర్వాతభాండీలో తాలింపుగింజలు వేగించిన నూనెలో వేసి నీళ్ళమూత పెట్టి ప్రలేహ విధిలో ముద్దగా అయ్యేలా మగ్గించాలి!

 

పెరుగుపచ్చడి: అంగారభర్జితం అంటేనిప్పులు లేదా మంటమీద కాల్చిన దొండకాయల్ని పైన మాడు వలిచి, నెయ్యి, ఉప్పు వేసి పిసికి పెరుగులో కలిపి ఇంగువ తాలింపు పెట్టి కొత్తిమీర వగైరాలతో అలంకరించిన పెరుగు పచ్చడి జీర్ణకోశవ్యాధులన్నింటికీ మంచిది!

ఆవ పెరుగుపచ్చడి: దొండకాయని నిలువుగా మూడుపక్షాలుగా చీల్చి, నీరు పిండి పెరుగులో వేసి ఉప్పు, నల్ల ఆవాల పిండి కలిపిన ఆవ పెరుగుపచ్చడి కృష్ణదేవరాయలు అన్నట్టు ముకుమందు… అంటే జలుబునీళ్లువదిలిస్తుంది!

దొండకాయ పప్పు: నీరుపిండేసిన ముక్కల్ని పెసరపప్పుతో, ధనియాలు, కొబ్బరి, సుగంధ ద్రవ్యాల పొడిని కలిపి వండిన పప్పు పోషక విలువలు కలిగి ఉంటుంది.

దొండకాయని చింతపండుతోనూ, అల్లం వెల్లుల్లితోనూ వండే విధానాలను పాకశాస్త్ర గ్రంథాలేవీ చెప్పలేదు. కఫాన్ని తగ్గిస్తుంది. ముక్కులోంచి రక్తస్రావాన్ని తగ్గించే గుణం దీనికుంది. అందుకని, వేడి చేసే వాటితో దీన్ని కలిపి వండటాన్ని శాస్త్రం ఒప్పుకోలేదు.

దొండ కాయ ఉబ్బరాన్ని కలిగిస్తుంది! అందుకని శనగ పిండి వేసి పకోడీ కూరల్లాంటివి కూడా నిషేధం! ఉబ్బసం, ఊపిరితిత్తుల వ్యాధుల్ని తగ్గిస్తుంది. వాటిని పెంచే అజీర్తికర పదార్థాలతో వండకపోవటమే మంచిది.

దొండకాయలో దోషాలకు విరుగుడుగా దోసకాయ, కాకరకాయ పనిచేస్తాయి. దొండని వండినప్పుడు కాకర లేదా దోస కూడా తప్పకుండా వండుకోండి!

ఫ్రెంచ్‌ ఆనియన్‌ సూప్‌

కావలసిన పదార్థాలు: శాండ్విచ్‌ బ్రెడ్‌లు-ఆరు, ఉల్లి ముక్కలు (పెద్దవి)- మూడు కప్పులు, బటర్‌-మూడు స్పూన్లు, గోధుమ పిండి- రెండు స్పూన్లు, బిర్యానీ ఆకు-ఒకటి, ఆపిల్‌ సెడార్‌ వెనిగర్‌-స్పూను, ఉడికించిన కూరగాయలతో నీళ్లు-మూడున్నర కప్పులు, వెల్లుల్లి ముక్కలు-అర స్పూను, మిరియాల పొడి – పావు స్పూను, చీజ్‌-ఆరు స్పూన్లు, కొత్తిమీర తరుగు-స్పూను.

 

తయారుచేసే విధానం: వెడల్పాటి పాన్‌లో కాస్త బటర్‌ వేయాలి. అది కరుగుతుంటే ఉల్లి ముక్కలను చేర్చాలి. ఉల్లి బంగారు రంగులోకి మారాక ఆపిల్‌ సెడార్‌ను వేసి, గోధుమ పిండి, బిర్యానీ ఆకు, వెల్లుల్లి కలపాలి.

ఉప్పు, మిరియాల పొడితో పాటు కూరగాయల నీళ్లని ఇందులో పోసి, మూతపెట్టాలి. మంటని తగ్గించి, మధ్యలో కలుపుతూ 30 నిమిషాల పాటు ఉడికించాలి.

బ్రెడ్‌ చివర్లు కత్తిరించి, పెనంపై కాస్త బటర్‌ వేసి ఒక్కో ముక్కను అటూ ఇటూ దోరగా కాల్చాలి లేదా ఓవెన్‌లో టోస్ట్‌ చేయాలి. బౌల్‌లలో సూప్‌ వేసి పైన బ్రెడ్‌ ముక్కలను ఉంచాలి. పైన ఛీజ్‌ తురుమును, కొత్తిమీర తరుగును చల్లితే సరి.

తవా పనీర్‌

కావలసిన పదార్థాలు: పనీర్‌ ముక్కలు – పదహారు, ఉల్లి, టమాటా ముక్కలు- కప్పు, క్యాప్సికం ముక్కలు – పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు – స్పూను, పెరుగు – పావు కప్పు, పసుపు- అర స్పూను, కారం- రెండు స్పూన్లు, జీలకర్ర పొడి – అర స్పూను, ధనియాల పొడి – అర స్పూను, గరం మసాలా – అర స్పూను, కొత్తిమీర తరుగు- రెండు స్పూన్లు, ఉప్పు, నూనె, నీళ్లు – తగినంత.

తయారుచేసే విధానం: గిన్నెలో పావు కప్పు పెరుగు, కొద్దిగా పసుపు, స్పూను కారం, పావు కప్పు గరం మసాలా, కాస్త జీలకర్ర పొడి, అర స్పూను ఉప్పు, రెండు స్పూన్ల నూనె వేసి అంతా బాగా కలపాలి.

ఇందులోనే పనీర్‌ ముక్కలనీ వేసి, బాగా కలిపి అరగంట పాటు మూత మూసి పక్కన పెట్టాలి. ఓ పాన్‌లో కాస్త నూనె వేసి జీలకర్ర చిటపటలాడించి, ఉల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ జతచేయాలి.

ఉల్లి రంగు మారగానే, మంట తగ్గించి ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర చేర్చాలి. నిమిషం తరవాత టమాటా ముక్కలూ వేయాలి. కాస్త దగ్గరకి వచ్చాక క్యాప్సికం ముక్కలూ చేర్చాలి. క్యాప్సికం కరకరలాడుతుంటే నానబెట్టిన పనీర్‌ను కలపాలి.

అరకప్పు నీళ్లు, అర స్పూను ఉప్పు వేసి బాగా కలిపి, మూతపెట్టాలి. అయిదు నిమిషాల తరవాత మూత తీసి గరం మసాలా, మిగతా కొత్తిమీర వేసి అంతా కలిపితే తవా పనీర్‌ సిద్ధం.

గుర్రం ముందు డాన్స్ చేస్తే ఇలాగే అవుతుంది మరి.

గుర్రం ముందు డాన్స్ చేస్తే ఇలాగే అవుతుంది మరి.. ఈమె పరిస్థితి చివరకు..

 

 

 

ఓ మహిళ గడ్డి మైదానంలో డాన్స్ చేస్తూ రీల్స్ తీస్తుంటుంది.

అక్కడే రెండు గుర్రాలు మేత మేస్తుంటాయి.

ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ..

ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది.

ఆమె డాన్స్ చూసి విసుగొచ్చిందో ఏమో గానీ..

గుర్రం ఊహించని విధంగా ప్రవర్తిస్తుంది..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ రీల్స్ చేయడం అలవాటుగా చేసుకున్నారు.

ఆఖరికి పల్లెటూరిలో చదువు రాని వారు కూడా రీల్స్ చేయడం దినచర్యగా చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో కొందరు చుట్టూ ఏం జరుగుతుందో..

అన్న కనీస స్పృహ కూడా లేకుండా రీల్స్ చేస్తుంటారు.

ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి.

ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.

తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఓ మహిళ డాన్స్ చేస్తుండడం చూసి గుర్రానికి చిర్రెత్తుకొస్తుంది.

చివరకు ఏం చేసిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది.
ఓ మహిళ గడ్డి మైదానంలో డాన్స్ చేస్తూ రీల్స్ తీస్తుంటుంది.
అక్కడే రెండు గుర్రాలు మేత మేస్తుంటాయి. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ..
ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది.
ఆమె డాన్స్ చూసి విసుగొచ్చిందో ఏమో గానీ..
గుర్రం ఊహించని విధంగా ప్రవర్తిస్తుంది.

‘ప్రశాంతంగా మేత మేస్తుంటే.. నీ డాన్స్ గోల ఏంటహే’.. అన్నట్లుగా కోపంగా ఆమె వద్దకు వెళ్లి .. వెనక్కు తిరిగి మరీ (Horse kicked the woman) కాలితో ఒక్క తన్ను తన్నింది. దెబ్బకు ఆమె దూరంగా పడిపోతుంది. వామ్మో ఇక బుద్ధి ఉంటే గుర్రాల ముందు డాన్స్ చేయొద్దు.. బాబోయ్.. అనుకుంటూ అక్కడి నుంచి పారిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘రీల్స్ తయారీదారులంటే ఈ గుర్రానికి పడదనుకుంటా’.. అంటూ కొందరు, ‘నా ఏరియాలోకి వచ్చి ఏంటీ నీ రీల్స్ గోల.. అనేది గుర్రం ఇన్నర్ ఫీలింగ్’… అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లు, 25 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

వాముతో కలిగే లాభాలు ఏమిటి.

వాముతో కలిగే లాభాలు ఏమిటి…

కారంగా, ఘాటుగా, వగరుగా ఉండే వాము లేదా ఓమ గింజలను వివిధ మసా లాలలో భాగంగా వంటకాల్లో వాడతారు. ఈ గింజలలో ఉండే థైమాల్‌, కార్‌ వాకరల్‌ అనే పదార్థాల వల్ల వాముకు సాల్మొనెల్లా, ఈ కొలై వంటి హానికారక సూక్ష్మజీవుల పెరుగుదల వేగాన్ని తగ్గించే గుణాలున్నాయి.

వాము లేదా ఓమ మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఏవైనా ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయా?
మంజులత, కర్నూల్‌

కారంగా, ఘాటుగా, వగరుగా ఉండే వాము లేదా ఓమ గింజలను వివిధ మసా లాలలో భాగంగా వంటకాల్లో వాడతారు. ఈ గింజలలో ఉండే థైమాల్‌, కార్‌ వాకరల్‌ అనే పదార్థాల వల్ల వాముకు సాల్మొనెల్లా, ఈ కొలై వంటి హానికారక సూక్ష్మజీవుల పెరుగుదల వేగాన్ని తగ్గించే గుణాలున్నాయి. కాబట్టి వాము ఫుడ్‌ పాయిజనింగ్‌ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంచడమే కాక కడుపులో అల్సర్ల వల్ల వచ్చే నొప్పి తీవ్రతను వాము తగ్గిస్తుంది. దీర్ఘకాలికంగా ఉండే దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులను ఎదుర్కోవడానికి కూడా వాము ఉపయోగపడుతుంది. వాము తరచూ తీసుకోవడం వల్ల బీపీ, అధిక కొలెస్ట్రాల్‌ మొదలైన సమస్యలకు మూలమైన దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్‌ను నియంత్రించవచ్చు. అయితే ఇన్ని ఔషధ గుణాలున్న వామును ఔషధం లాగానే తగిన మోతాదుల్లో మాత్రమే తీసుకోవాలి.

 

వానాకాలం అంటేనే పిల్లలకు జలుబు, జ్వరాలు వచ్చే కాలమని భయమేస్తుంది. ఈ కాలంలో పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగేందుకు ఏ ఆహారం ఇవ్వాలి?

స్పందన విజయవాడ

 

వర్షాలు పడడం మొదలవగానే ఉష్ణోగ్రతలు తగ్గి, వాతావరణంలో తేమ పెరుగుతుంది. ఈ పరిస్థితులు సూక్ష్మజీవులు పెరగడానికి . వ్యాపించడానికి ఎంతో అనుకూలమైనవి. అందుకే వర్షాలు మొదలవగానే పిల్లల్లో జలుబు, జ్వరాలు వచ్చేస్తాయి. రకరకాల వైరస్‌, బ్యాక్టీరియా, ఫంగస్‌ లాంటి సూక్ష్మజీవులవల్ల ఈ అనారోగ్యాలు వస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు కొంతవరకు వీటినుంచి రక్షణ పొందవచ్చు. రోగనిరోధక శక్తికి పోషకపదార్థాలు కొన్ని అత్యవసరం. నిమ్మ, నారింజ, ఆపిల్‌, జామ లాంటి తాజా పండ్లన్నింటి లోనూ అధికంగా ఉండే విటమిన్‌ సి; బాదం, పిస్తా, ఆక్రోట్‌, పొద్దు తిరుగుడు గింజల లాంటి వాటిలో ఉండే విటమిన్‌ ఈ; అరటి పండ్లు, ఉడికించిన దుంపలు, సెనగల్లో ఉండే విటమిన్‌ బీ 6; క్యారెట్‌, బొప్పాయి, గుమ్మడి మొదలైన వాటిల్లో ఉండే విటమిన్‌ ఏ; ఆకుకూరల్లో, పప్పు ధాన్యాల్లో ఉండే ఫోలేట్‌; సూర్యరశ్మి నుంచి వచ్చే విటమిన్‌ డీ; మాంసాహారం, ఆకుకూరల నుంచి వచ్చే ఐరన్‌; పెరుగు, మజ్జిగ నుంచి వచ్చే ప్రోబయాటిక్స్‌ ఇవన్నీ కూడా రోగ నిరోధక శక్తికి ఎంతో అవసరం. ఈ మినరల్స్‌, విటమిన్స్‌ను మాత్రల రూపంలో కాకుండా ఆహారంగా తీసుకున్నప్పుడు వాటి ఉపయోగం ఎక్కువ. అలాగే ఆహారంతో పాటు శుచి, శుభ్రతపాటిస్తే జలుబులు, జ్వరాలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

ఈ మధ్య మా చిన్నాన్నకు గుండె ఆపరేషన్‌ చేసి స్టెంట్‌ వేశారు. గుండె ఆరోగ్యానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

 శశి, ఆదిలాబాద్‌

గుండె ఆరోగ్యానికి మంచి ఆహారం, జీవన శైలి ఎంతో ముఖ్యం. ఆహారంలో సాచ్యు రేటెడ్‌ ఫ్యాట్స్‌ అధికంగా ఉండే వెన్న, నెయ్యి, కొబ్బరి నూనె మానెయ్యడం మంచిది. రెడ్‌ మీట్‌ కి బదులుగా కొవ్వు తక్కువగా ఉండే చికెన్‌, చేప లాంటివి తినాలి. గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్‌ ఉన్నప్పటికీ అందులో మరెన్నో గుండెకు మేలు చేసే పోషకాలు ఉన్నందున వారానికి 4-5 మించకుండా గుడ్లు (పచ్చ సొనతో సహా) తీసుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌ అధికంగా ఉంటే రక్తనాళాల్లో ప్లాక్‌ చేరుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ పెరగకుండా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలను రోజుకు కనీసం 300 గ్రాములైనా తీసుకోవాలి. బరువు ఎక్కువ ఉన్నవారు కొంత తగ్గాలి కూడా. అన్ని రకాల పండ్లు తీసుకోవచ్చు. మంచి కొవ్వులు ఉండే బాదం, ఆక్రోట్‌, అవిసెగింజల వంటి వాటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలవాటు లేని వ్యాయామాలు అకస్మాత్తుగా ఎక్కువగా చేయడం కంటి వైద్యుల సలహా మేరకు తక్కువ శ్రమతో కూడుకున్న నడక, ఈత వంటి తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, నిద్ర పోవడం ముఖ్యం. మానసిక ఆందోళనలను తగ్గించుకునేందుకు ధ్యానం లాంటివి ఉత్తమం.

బన్నీ హాప్స్‌ క్యాచ్‌లు కుదరవు.

బన్నీ హాప్స్‌ క్యాచ్‌లు కుదరవు

 

 

 

 

బౌండరీల దగ్గర పట్టే ‘బన్నీ హాప్స్‌’ క్యాచ్‌ల విషయంలో మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. క్యాచ్‌ విషయంలో ఫీల్డర్‌ నియంత్రణ…

దుబాయ్‌: బౌండరీల దగ్గర పట్టే ‘బన్నీ హాప్స్‌’ క్యాచ్‌ల విషయంలో మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. క్యాచ్‌ విషయంలో ఫీల్డర్‌ నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటే మైదానంలో ఉన్నప్పుడే బంతిని పైకి విసిరి.. లైన్‌ దాటి తిరిగి లోనికి వచ్చే అందుకోవాల్సి ఉంటుంది. అంటే బౌండరీ బయట బంతిని పలుమార్లు ఎగర వేయడం కుదరదు. ఈనెల నుంచే కొత్త రూల్‌ ఐసీసీ ప్లేయింగ్‌ కండిషన్‌లో భాగం కానుండగా.. వచ్చే ఏడాది అక్టోబరు నుంచి ఎంసీసీ రూల్‌ ఆఫ్‌ లాలో అధికారికంగా చేరుస్తారు. మరోవైపు వన్డేల్లో రెండు కొత్తబంతుల నిబంధనల్లో మార్పు, కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ ప్రొటోకాల్‌ను ఐసీసీ ఆమోదించింది.

17 ఏళ్ల తర్వాత రాక్షసుడి రీఎంట్రీ..

17 ఏళ్ల తర్వాత రాక్షసుడి రీఎంట్రీ.. జాన్ సీనాకు ఇక దబిడిదిబిడే!

 

 

 

 

17 ఏళ్లుగా రాయల్ రంబుల్‌కు దూరంగా ఉన్న ఓ రాక్షసుడు రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. అతడు గానీ వస్తే చాంపియన్ జాన్ సీనాకు కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

డబ్ల్యూడబ్ల్యూఈ రాయల్ రంబుల్ గెలవాలనేది ప్రతి రెజ్లర్ కల. ఈ ఒక్క ట్రోఫీ గెలిస్తే వాళ్ల కెరీరే మారిపోతుంది. రాయల్ రంబుల్‌లో గెలిచిన రెజ్లర్లకు రసల్ మేనియాలో వరల్డ్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌ ఆడే అవకాశం దక్కుతుంది. అక్కడ కూడా నెగ్గితే డబ్ల్యూడబ్ల్యూఈ చరిత్రలో వాళ్లు ఎప్పటికీ నిలిచిపోతారు. అందుకే ప్రతి రెజ్లర్ రాయల్ రంబుల్ మీదే దృష్టి పెడతాడు. అయితే ఈ పోరులో నెగ్గడం అంత ఈజీ కాదు. యంగ్ రెజ్లర్లు, స్టార్లతో పాటు ఒకప్పుడు అందర్నీ వణికించిన మాజీలు కూడా పోటీలో నిలుస్తారు. వచ్చే రాయల్ రంబుల్ కోసం అలాంటి ఓ రాక్షసుడే రాబోతున్నాడు. అతడే స్నిట్‌స్కీ.

39వ రాయల్ రాయల్ రంబుల్‌కు ఇంకా 6 నెలల సమయం ఉంది. కానీ ఇప్పటినుంచే దానిపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. వచ్చే రాయల్ రంబుల్‌లో మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ స్నిట్‌స్కీ పాల్గొనబోతున్నాడు. 2008 నుంచి డబ్ల్యూడబ్ల్యూఈకి దూరంగా ఉంటున్న ఈ వెటరన్ రెజ్లర్.. రాయల్ రంబుల్‌లో గెలవాలనే కసితో కనిపిస్తున్నాడు. తాను ఇంకా రిటైర్ కాలేదని అంటున్నాడీ 55 ఏళ్ల స్టార్. స్నిట్‌స్కీతో జాన్ సీనాకు దబిడిదిబిడేనని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో సీనాతో పాటు బటిస్టా, సీఎం పంక్ లాంటి చాంపియన్ రెజ్లర్లకు అతడు టఫ్ ఫైట్ ఇచ్చాడని.. ఇప్పుడు కూడా అదే రేంజ్‌లో ఆడితే అదిరిపోతుందని చెబుతున్నారు.

 

స్నిట్‌స్కీకి అంత సీన్ లేదని.. క్రేజ్ కోసమే అతడు రీఎంట్రీ ఇస్తున్నాడని మరికొందరు నెటిజన్స్ చెబుతున్నారు. ఈసారి పప్పులు ఉడకవని, అతడో సాధారణ రెజ్లర్ అని చెబుతున్నారు. కాగా, 2025 డిసెంబర్‌లో డబ్ల్యూడబ్ల్యూఈకి గుడ్‌బై చెబుతున్నట్లు ఇప్పటికే జాన్ సీనా ప్రకటించాడు. ఆ లెక్కన అతడు వచ్చే రాయల్ రంబుల్‌లో ఆడకపోవచ్చు. కానీ ఒకవేళ ఆడితే మాత్రం స్నిట్‌స్కీతో పాటు ఇతర రెజ్లర్లకు చుక్కలేనని సీనా అభిమానులు చెబుతున్నారు.

కల్తీ ఇంధనమే కూల్చిందా…

కల్తీ ఇంధనమే కూల్చిందా?

 

 

 

 

అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదానికి కల్తీ ఇంధనమే కారణమా? దీనివల్లే తగినంత ఎత్తు ఎగిరేందుకు అవసరమైన శక్తి విమానానికి లభించలేదా? అంటే కొందరు విమానయాన రంగ నిపుణులు అవుననే సమాధానం ఇస్తున్నారు.

  • తప్పు ఎక్కడ జరిగిందని వైమానిక నిపుణుల విశ్లేషణలు

న్యూఢిల్లీ/చెన్నై, జూన్‌ 14: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదానికి కల్తీ ఇంధనమే కారణమా? దీనివల్లే తగినంత ఎత్తు ఎగిరేందుకు అవసరమైన శక్తి విమానానికి లభించలేదా? అంటే కొందరు విమానయాన రంగ నిపుణులు అవుననే సమాధానం ఇస్తున్నారు. నేషనల్‌ ఏరోస్పేస్‌ లేబొరేటరీ్‌స(ఎన్‌ఏఎల్‌) మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ సాలిగ్రామ్‌ జే మురళీధర్‌ తాజాగా ఓ వార్తా సంస్థ తో మాట్లాడుతూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పక్షి ఢీకొంటే రెండు ఇంజన్లు ఒకేసారి విఫలంకావడానికి అవకాశం ఉందన్న వాదనను తోసిపుచ్చారు. ‘పక్షి ఢీకొంటే విద్యుత్తు సరఫరాకు ఆటంకం కలిగి నిప్పురవ్వలు, పొగ వస్తాయి. రెండు ఇంజన్లను పక్షులు ఒకేసారి ఢీకొనే అవకాశం ఉండదు. విమాన ప్రమాదానికి ఇంధన కల్తీనే ప్రధాన కారణంకావచ్చు. ఇంధనం కల్తీ అయితే రెండు ఇంజన్లపైనా ఒకే ప్రభావం పడుతుంది. దీనివల్ల వేగం తగ్గిపోయి విమానం ఎగరడానికి అవసరమైన శక్తి లభించదు. 35టన్నుల కంటే అధికంగా ఇంధనం ఉన్నందున విమానం కూలిపోయిన క్షణాల్లోనే భారీ విస్ఫోటనంతో అగ్నిగోళం ఏర్పడింది’ అని మురళీధర్‌ వివరించారు. ఈ ఘోరానికి గల కారణాలపై నిపుణుల నుంచి సీనియర్‌ పైలట్ల వరకూ విభిన్న ఊహాగానాలు చేస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం విమాన ప్రమాదానికి కారణాలు ఇవీ..

ఒక ఇంజన్‌ వైఫల్యం, ల్యాండింగ్‌ గేర్‌ మూసుకోకపోవడం..

విమానం టేకాఫ్‌ అయిన వెంటనే పక్షులు ఢీకొనడం లేదా అంతర్గత సమస్యలతో ఒక ఇంజన్‌ విఫలమై ఉంటుంది. బోయింగ్‌లోని అత్యాధునిక శ్రేణి విమానాల్లో రెండు శక్తిమంతమైన ఇంజన్లు ఉంటాయి. వీటిలో ఒకటి విఫలమైనా రెండోదాని సాయంతో విమానం పైకి ఎగురుతుంది. విమానం టేకాఫ్‌ అయ్యాక ల్యాండింగ్‌ గేర్‌ మూసుకుంటే విమానం పైకి ఎగరడానికి సాయపడే ఏరోడైనమిక్‌ ప్రవాహం ఏర్పడుతుంది. తీవ్ర ఒత్తిడితో కూడుకున్న సమయాల్లో పైలట్లు ల్యాండింగ్‌ గేర్‌ను పైకి ఎత్తడం మర్చిపోయే అవకాశమూ ఉంది. ఒక ఇంజన్‌ విఫలం కావడానికి తోడు గేర్‌ను కిందకు వదిలేయడం వల్ల విమానం ఎత్తుకు ఎగిరే సామర్థ్యం కోల్పోతుంది. భూమికి 300-400 అడుగుల ఎత్తున ఇలాంటి పరిస్థితి ఎదురైతే దాని నుంచి బయటపడటానికి పైలట్‌కు ఎక్కువ సమయం లభించదు.

రెండు ఇంజన్లు విఫలం కావడం..

ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా సంభవిస్తాయి. పక్షులు ఢీకొనడం, ఇంధనం కల్తీతోపాటు సాధారణ తనిఖీల్లో గుర్తించని యాంత్రిక లోపాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తడాన్ని తోసిపుచ్చలేం. ఈ సమయంలో ల్యాండింగ్‌ గేర్‌ను ఎత్తడానికి, గాలి వేగాన్ని నియంత్రించడానికి అవసరమైన థ్రస్ట్‌ (ఎగరడానికి అవసరమైన వేగం) ఉండదు. ఈ కారణంగా విమానం క్షణాల్లోనే వేగాన్ని కోల్పోవడంతో పాటు అది ఎగురుతున్న ఎత్తు నుంచి శరవేగంగా కింద కు పడిపోవడం ప్రారంభమవుతుంది.

ఫ్లాప్‌ కాన్ఫిగరేషన్‌లో సమస్య..

సురక్షితమైన ఎత్తుకు చేరే వరకూ రెండు ఫ్లాప్‌లు (రెక్కల వెనుక భాగం) విచ్చుకొని ఉంటేనే విమానం ఎగరడానికి అవసరమైన శక్తి లభిస్తుంది. ఒకవేళ వీటిని ముం దుగానే మూసేస్తే ఆ శక్తి కూడా గణనీయంగా తగ్గిపోతుం ది. ప్రమాదం జరిగిన సమయంలో అహ్మదాబాద్‌లో గాలి సాంద్రత తక్కువగా ఉంది. విమానం గేర్‌ తెరుచుకొని ఉం డగానే ఫ్లాప్‌లు మూసుకుపోయాయి. దీంతో పైకెగరడానికి కావాల్సిన శక్తి సమకూరక విమానం అదుపు తప్పుతుంది.

సెన్సార్లలో లోపాలు..

ఆధునిక విమానాలన్నీ ఆటోమేటెడ్‌ వ్యవస్థలపై ఆధారపడినవే. గాలి వేగాన్ని, యాంగిల్‌ ఆఫ్‌ అటాక్‌ను గుర్తించే సెన్సార్లు విమాన కంప్యూటర్‌కు తప్పుడు డేటాను ఇస్తే ఆటో-థ్రోటిల్‌ వ్యవస్థ ఇంజన్‌ శక్తిని ముందుగానే తగ్గించే ప్రమాదం ఉంది. ఇటువంటి తప్పుడు హెచ్చరికల కారణంగా విమానం ఎగిరే ఎత్తు తగ్గిపోతుంది. అలాగే గాలివేగాన్ని కొలిచే పిటాట్‌ ట్యూబ్‌ మూసుకోపోవడం, విమాన నియంత్రణ వ్యవస్థ విఫలంకావడం వల్ల విమానం వేగం, ఎగురుతున్న కోణం విషయంలో పైలట్లు పొరబడే అవకాశం ఉంటుంది. కాగా బ్లాక్‌బాక్స్‌ డేటాను విశ్లేషించాక పూర్తి స్పష్టత వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

‘బోయింగ్‌’ నివేదికను వెంటనే విడుదల చేయాలి..

అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాదం నేపథ్యంలో బోయింగ్‌ 787 విమానాలకు సంబంధించిన నిర్మాణ లోపాలపై నివేదికను వెంటనే విడుదల చేయాలని ప్రజావేగు సలే్‌హపూర్‌ తరపు న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అమెరికాకు చెందిన ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ)కు లేఖ రాశారు. ‘బోయింగ్‌ 787, 777 విమానాల్లో తీవ్రమైన నాణ్యతా లోపాలు ఉన్నాయని బోయింగ్‌ క్వాలిటీ ఇంజనీర్‌ అయిన సలే్‌హపూర్‌ 2024 ప్రారంభంలో ఆరోపించారు. దీనిపై 2024 మార్చిలో దర్యాప్తు ప్రారంభించిన ఎఫ్‌ఏఏ ఉన్నతాధికారులు.. అదే ఏడాది డిసెంబరులో విచారణ పూర్తయిందని సమాచారం ఇచ్చారు. తమ దర్యాప్తునకు సంబంధించిన నివేదికను త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఆ నివేదిక వెలుగు చూడలేదు’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. తక్షణమే ఆ నివేదికను విడుదల చేయాలని కోరారు. దీనిపై ఎఫ్‌ఏఏ స్పందించాల్సి ఉంది.

పహల్గామ్ ఉగ్ర దాడి. రెండు నెలల తర్వాత..

పహల్గామ్ ఉగ్ర దాడి.. రెండు నెలల తర్వాత..

 

 

 

 

 

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించిన విషయం తెలిసిందే.

ఈ దాడిలో 26 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే..

Pahalgam Terror Attack: పహల్గామ్‌ ఉగ్రవాద దాడి యావత్ భారత్‌ను ఉలిక్కిపడేలా చేసిన విషయం తెలిసిందే.

ఏప్రిల్ 22న పహల్గామ్ సమీపంలోని బైసరన్ గడ్డి మైదానంలో ఆహ్లాదంగా గడుపుతున్న పర్యాటకులపై టెర్రరిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

ఆ ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

కేవలం పురుషులే లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ ఉన్మాదంతో ఎంతో మంది మహిళలు తమ పసుపు కుంకుమ లకు దూరమయ్యారు.

అయితే, ఈ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేసి ఉగ్రవాదులను చావుదెబ్బ కొట్టింది.

ఇదిలాఉంటే..

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడింది.
పహల్గామ్, చుట్టుపక్కల ప్రాంతాలలో పర్యాటకుల రాకపోకలు తగ్గిపోయాయి.
అక్కడికి వెళ్లాలంటనే ప్రజలు అమ్మో..
అంటూ భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని పర్యాటక ప్రాంతాలను అధికారులు మూసివేశారు.
అక్కడి తోటలు, పార్కులు, పర్యాటక ప్రాంతాలన్నీ తాత్కాలికంగా బంద్ చేశారు.
అయితే, దాదాపు రెండు నెలలు గడుస్తున్నా..
ఇంకా అక్కడి పర్యాటక ప్రాంతాలను తెరవలేదు.
ఉగ్రవాద దాడి కశ్మీర్ లోయలోని పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.
జమ్మూలోని మతపరమైన యాత్రలపై కూడా ప్రభావం చూపింది.
తాజాగా, ఈ విషయంపై జమ్మూ & కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు. మూసివున్న పర్యాటక ప్రదేశాలు తిరిగి తెరచుకోనున్నాయని ఆయన ట్వీట్ చేశారు. భద్రతా పరంగా తీసుకున్న ముందు జాగ్రత్తల కారణంగా తాత్కాలికంగా మూసిన జమ్మూ కశ్మీర్‌లోని కొన్ని పర్యాటక ప్రదేశాలను జూన్ 17 నుంచి తిరిగి ప్రారంభించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇందులో పహల్గామ్ మార్కెట్, వెరినాగ్ గార్డెన్, కోకర్నాగ్ గార్డెన్, అచాబల్ గార్డెన్, బేతాబ్ వ్యాలీ, పార్కులు ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని తిరిగి నిలబెట్టేందుకు వివిధ చర్యలు తీసుకుంటోంది. గత నెలలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పహల్గామ్‌లో క్యాబినెట్ సమావేశానికి హాజరై, బేతాబ్ వ్యాలీ వంటి మూసివున్న ప్రాంతాలను సందర్శించారు.

ఆడ‌దాని ప్రేమ‌ను.చెప్ప‌డానికి ఏమున్నాయ్‌..

ఆడ‌దాని ప్రేమ‌ను.. చెప్ప‌డానికి ఏమున్నాయ్‌.. ‘8 వసంతాలు’ ట్రైల‌ర్‌ అదిరింది

 

 

 

 

 

‘మ్యాడ్’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మ‌ల‌యాళ బ్యూటీ అనంతిక సనీల్ కుమార్ లీడ్ రోల్‌లో నటించిన నూత‌న చిత్రం ‘8 వసంతాలు’

రెండేండ్ల క్రితం ‘మ్యాడ్’ (MAD) సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మ‌ల‌యాళ బ్యూటీ అనంతిక సనీల్ కుమార్ (Ananthika Saneel Kumar) లీడ్ రోల్‌లో నటించిన నూత‌న చిత్రం ‘8 వసంతాలు’ (8 Vasanthalu). ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మార్షల్ ఆర్ట్స్ కాన్సెప్ట్‌, న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామా చిత్రంలో రవితేజ దుగ్గిరాల (Raviteja Duggirala), హ‌ను రెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ యర్నేని (Naveen Yarneni), వై. రవిశంకర్ నిర్మించిన ఈఅ మూవీ జూన్‌20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.ఈ ఏప‌థ్యంలో ఇప్ప‌టికే మేక‌ర్స్‌ ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన పాట‌లు ఒక దానిని మించి మ‌రోటి మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుని టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. అయితే సినిమా విడుద‌ల‌కు మ‌రో వారం మాత్ర‌మే ఉండ‌డంతో తాజాగా ఆదివారం ఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. 

ఈ ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే..ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ప్రేమ చిత్రాల‌కు భిన్నంగా అమ్మాయి త‌రుపు ప్రేమ‌ను తెలిపే చిత్రంగా తెర‌కెక్కించిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ఈకోవ‌లోనే హీరోయన్‌తో చెప్పించిన డైలాగులు మెస్మ‌రైజింగ్‌గా ఉన్నాయి. మాములుగా మ‌గాడి ప్రేమ‌కు సాక్ష్యాలుగా పాల‌రాతి సౌధాలు, భాగ్య‌ న‌గ‌రాలు ఉన్నాయి గానీ ఆడ‌దాని ప్రేమ‌కు ఏముంది మ‌న‌సులోనే స‌మాధి చేసుకున్న జ్ఞాప‌కాలు త‌ప్పా అనే హృద్య‌మైన ప‌దాల‌తో సినిమా ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version