విత్తన దుకాణాలపై పోలీసులు,వ్యవసాయ శాఖ అధికారుల సంయుక్త దాడులు
మరిపెడ నేటిధాత్రి.
మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని పలు విత్తన దుకాణాలపై పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. శనివారం వారు మండల కేంద్రంలోని సూర్య తేజ విత్తన దుకాణంపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి బి వీరసింగ్, ఎస్సై సంతోష్ కుమార్ మాట్లాడుతు నాణ్యమైన విత్తనాలు రైతులకు అందియాలని కోరారు. రైతులకు పలు సూచనలు చేశారు.లైసెన్స్ ఉన్న దుకాణాలలోనే విత్తనాలు కొనుగోలు చేయాలని విత్తనాలు అవునో కాదు నిర్ధారించాలి. లూజ్ విత్తనాలు ఎవరు కూడా తీసుకోవద్దని హెచ్చరించారు. ప్రతి విత్తనానికి డీలర్లు వద్ద బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. విత్తన ప్యాకెట్టు కూడా పంట చివరి వరకు దాచుకోవాలని తెలిపారు. ఈ దారులలో మండల వ్యవసాయ శాఖ అధికారి బి వీరా సింగ్,ఎస్సై సంతోష్ పాల్గొన్నారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ అధికారులు పదవి విరమణ పొందిన SI మారుతి , హెడ్ కానిస్టేబుల్ రాజమౌళి కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు తెలియజేశారు. 42 సంవత్సరాల విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని ఈ రోజు పదవీ విరమణ పొందుతున్న వేములవాడ రూరల్ ఎస్.ఐ మారుతి మరియు కొనరావుపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తు హెడ్ కానిస్టేబుల్ రాజమౌళి శాలువా, పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐ.పీ.ఎస్.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.
సుదీర్ఘ కాలం పాటు పోలీస్ శాఖలో మీరు అందించిన సేవలు భవిష్యత్ తారాల వారికి స్ఫూర్తిదాయకమని,ప్రజలను పోలీసులు సక్రమంగా విధులను నిర్వర్తించడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉంటుందని వారి తోడ్పాటు వల్లనే విధులను నిర్వర్తించి ఉన్నత స్థానాలకు ఎదగగలరని తెలియజేశారు.
SI Maruthi
పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చే ప్రయోజనాలను త్వరగా అందించాలని సిబ్బందికి తెలియజేశారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో తమ శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆనందంగా గడపాలని సూచించారు. తమ ఆరోగ్యాల పట్ల తగు జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు.ఎటువంటి అవసరం ఉన్న పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసినా డిసిపి
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ను పెద్దపల్లి డిసిపి కరుణాకర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు.పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ సందర్భంగా డిసిపి గారు ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, వివిధ కేసులలో సిజ్ చేసిన వాహనాలను పరిశీలించి అనంతరం రిసెప్షన్ సిబ్బందిని అడిగి పిర్యాదుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు.పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి వారి సమస్యను తెలుసుకొని వారికీ భరోసా నమ్మకం కల్పించాలని చట్టపరిధిలో సమస్య పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు.స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు,సిబ్బంది వివరాలను డిసిపి ఎస్ఐ దీకొండ రమేష్ ను అడిగి తెలుసుకొవడంతో పాటు, స్టేషన్ పరిధిలో అత్యధికంగా ఎలాంటి నేరాలు నమోదవుతాయి,సమస్యత్మక గ్రామాల, సరిహద్దు ప్రాంత వివరాలు, రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు వారి ప్రస్తుత స్థితి గతులను సంబంధిత ఎస్ఐని అడిగి తెలిసుకోవడంతో పాటు స్టేషన్వారిగా బ్లూకోల్ట్స్ సిబ్బంది పనితీరుతో పాటు, వారు విధులు నిర్వహించే సమయాలను అడిగి తెలుసుకున్నారు.గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలకు సంబంధించి అక్రమ రవాణా, సరఫరా, నిల్వ, సేవించే వారిపై స్టేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మత్తు పదార్థాల నియంత్రణకై నిరంతరం పనిచేయాలని నేరాల నియంత్రణకై విజుబుల్ పోలీసింగ్ అవసరమని, నిరంతం పోలీసులు పెట్రొలింగ్ నిర్వహించాలని డిసిపి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి ఏసిపి జి కృష్ణ,ఎస్ఐ దీకొండ రమేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
గుండాల పోలీసు స్టేషన్ సిఐ రవీందర్, ఎస్సై సైదా రహూఫ్ ఆధ్వర్యములో వ్యవసాయ అధికారితో కలసి గుండాల లో ఉన్న సీడ్స్,ఫర్టిలైజర్ షాపులపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రవీందర్ మాట్లాడుతూ సీడ్స్, ఫర్టిలైజర్స్ షాప్ యజమానులు నిబంధనలకు లోబడి వ్యాపారాలు చేసుకోవాలని, నకిలీ, కల్తీ విత్తనాలు,ఎరువులు సరఫరా చేసి రైతులను మోసం చేస్తే కఠినమైన చర్యలు తప్పవు అని అన్నారు. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించాలని వ్యవసాయాన్ని బలోపేతం చేయాలని అన్నారు. కల్తీ విత్తనాలు విక్రయించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు అనుమతి లేని విత్తన విక్రయాదారులవద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న విత్తన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయలని, తప్పనిసరిగా కొనుగులుకు సంభందించి రశీదు అడిగి తీసుకోవాలని తెలిపారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వెంటనే సంబంధిత వ్యవసాయ అధికారులకు, పోలీస్ స్టేషన్ కు తెలపలన్నారు.
చిలుక ప్రవీణ్ పై యూట్యూబర్ చల్లా చేసిన దైవదూషణ వ్యాఖ్యలపై జహీరాబాద్ ముస్లింలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్, ఇస్లాం చివరి ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (స) గౌరవార్థం దైవదూషణ మరియు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ చిలుక ప్రవీణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, సయ్యద్ షా ఫర్హాన్ ఖాద్రీ బాగ్దాది నేతృత్వంలోని జహీరాబాద్ ముస్లింల ప్రతినిధి బృందం సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాశీనాథ్ ను కలిసి ఈ విషయంలో అధికారిక ఫిర్యాదు చేసింది. చిలుక ప్రవీణ్ “యు న్యూస్” అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతోందని చెప్పబడింది. దీనిలో అతను ఉద్దేశపూర్వకంగా ఇస్లాం, ముస్లింలు మరియు ఇస్లాం ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (స) గురించి రెచ్చగొట్టే మరియు అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. యూట్యూబ్ లో తప్పుడు ఖ్యాతిని పొందడానికి మరియు తన ఛానల్ యొక్క అభిప్రాయాలను పెంచడానికి మాత్రమే అతను ఇదంతా చేస్తున్నాడు. పర్వీన్ యొక్క ఈ చర్యలు ముస్లింల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా దేశ సామరస్యాన్ని కూడా బెదిరించాయని జహీరాబాద్ ముస్లింల ప్రతినిధి బృందం చెబుతోంది చిలుక ప్రవీణ్ మాటలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, భవిష్యత్తులో ఆమె ద్వేషపూరిత ప్రసంగాలు చేయకుండా ఉండటానికి ఆమెను వెంటనే అరెస్టు చేయాలని ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా, సయ్యద్ షా ఫర్హాన్ ఖాద్రీ బాగ్దాదీ చిలుక ప్రవీణ్ ప్రకటనలను తీవ్రంగా ఖండించారు మరియు అలాంటి ద్వేషపూరిత ప్రసంగం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని మరియు భవిష్యత్తులో ఎవరూ అలాంటి ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ధైర్యం చేయకుండా దానిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మరియు ఏ మతానికి వ్యతిరేకంగానైనా ఇటువంటి చర్యలు చేసే వారిపై భారత ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు, తద్వారా ఎవరూ అలా చేయడానికి ధైర్యం చేయరు. ప్రతినిధి బృందంలో సయ్యద్ షా రిజ్వాన్ ఖాద్రీ, సజ్జాదా నషీన్ ముహమ్మద్ మహమూద్ సూఫీ, హఫీజ్ ముహమ్మద్ ఇర్ఫాన్, ముహమ్మద్ అజీముద్దీన్ ఖాద్రీ ముహమ్మద్ ముస్తెయిన్ నవాజ్ ముహమ్మద్ ఇంతియాజ్ సాకి, హఫీజ్ ముహమ్మద్ హమీద్ ముహమ్మద్ ఇబ్రహీం ఖలీల్ ముహమ్మద్ రఫీ, స్టేషనరీ ముహమ్మద్ ఫయాజ్ అహ్మద్, క్రైమ్ రిపోర్టర్ మరియు ఇతరులు ఉన్నారు.
పదోన్నతులు పోలీస్ లకు మరింత బాధ్యతను పెంచుతాయి సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే
సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )
పదోన్నతులు జీవన శైలిని మార్చే విధంగా ఉత్సాహాన్ని కలిగిస్తాయని ఎస్పీ మహేష్ బి గితే అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ఎస్ఐ లుగా పదోన్నతి పొందిన శంకర్ సిరిసిల్ల టౌన్ ప్రస్తుతం, లక్పతి వేములవాడ రూరల్ మోతీరం,బోయినపల్లి లను ఎస్పీ మహేష్ బి గితే అభినందించినారు.ఈసందర్భంగా ఎస్పి మహేష్ బి గితే మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని అన్నారు, పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలనిఅన్నారు. పోలీసు శాఖలో క్రమశిక్షణతో బాధ్యతగా విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు,గౌరవ మర్యాదలు లభిస్తాయనిఅన్నారు.
మంద మహేష్ బీజేవైఎం కలాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్
గణపురం నేటి ధాత్రి :
గణపురం మండల పోలీసులు కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ముందస్తు అక్రమ అరెస్టులను నిరసిస్తూ బి జే వైఎం కలాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యం ఆరోగ్యం అనే ప్రజల యొక్క కనీస అవసరాలను మరిచిపోయి ప్రపంచ అందగత్తెల పోటీలు నిర్వహించడానికి ఉన్న సమయం చదువుకునే విద్యార్థుల ఫీజు రియంబర్మెంట్స్ అకాల వానలతో చేతికొచ్చిన పంటలను కోల్పోతున్న రైతులను పరామర్శించడానికి సమయం ఉండాదని ఎద్దేవ చేశారు సరస్వతి పుష్కరాలకు కోట్ల రూపాయల డబ్బుతో భక్తుల సౌకర్యాలకు పూర్తిస్థాయిలో నిర్మాణాలు కాకపోయినా ఆగమేఘాల మీద పుష్కరాలు నిర్వహిస్తు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుతున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్తారని అన్నారు
క్రిమినల్స్ చేంజ్ పట్టుకొని కటకటాల్లోకి పంపాల్సిన పోలీలులే క్రిమినల్స్ అయ్యారు. జైల్లో ఖైదీలకు కాపలాగా ఉండే పోలీస్ కాస్తా ఖైదీల బట్టలు వెళుకోవడానికి సిద్ధం అయ్యాడు. సిగరెట్లు డిస్టిబ్యూటీ చెస్తున్న వ్యక్తులను భయబ్రాంతులకు గురి చేసి డబ్బులు వసూలు చేస్తు సిగరెట్ ప్యాకెట్లను తీసుకెళ్తున్న ఇద్దరు పోలీసులతో సహా మరో ఇద్దరిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 3.5 లక్షలు విలువ చేసే పలు కంపెనీలకు చెందిన సిగరెట్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చెలుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలు మియాపూర్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ కుమార్ వెల్లడించారు. వారసిగూడా కు చెందిన గాయని శ్రీకాంత్ (36) కంది జైల్లో జైల్ వార్డెన్ గా పని చేటున్నాడు. కడప జిల్లాకు చెందిన చిదిరి అమర్నాథ్ (41) ఎపి లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ పలు కెసుల్లో జైల్ కి వెళ్లి వచ్చాడు. ఇద్దరు సస్పెన్షన్ లో ఉండగాఆరో ఇద్దరు మల్కాజిగిరి దాయనంద్ నగర్ కి చెందిన ఎండి ఇమ్రాన్ (32), మలక్ పెట్, మూసరం బాగ్ కి చెందిన వాసం శ్రీకాంత్ (32) లతో పరిచయం ఏర్పడింది. ఇమ్రాన్ డెలివరీ బాయ్ గా శ్రీకాంత్ పెయింటర్ గా పనిస్తున్నారు. నలుగురు ముఠా గా ఏర్పడి ఇటిసి నుండి సిగరెట్లు షాప్ లలో సప్లై చేసే వారే టార్గెట్ గా పెట్టుకొని రెక్కీ నిర్వహించేవారు. వారు బైక్ పై వెళ్తున్న సమయంలో ఆపి మేము క్రైమ్ డిపార్ట్మెంట్ పోలీసులం మీరు తిఅంకెళ్తున్న సిగరేట్లలో గంజాయి కలిపి అమ్ముతున్నారు అని భయబ్రాంతులకు గురి చేసేవారు. సిగరేట్లతో పాటు గంజాయి, డ్రగ్స్ సప్లై చేటున్నందుకు కేసులు పెడతామని బెదిరిస్తారు. వాటిని పరిశీలించి లోకల్ పోలీసులకు అప్పగించాలి అంటూ బెదిరించి డబ్బ, సిగరెట్ ప్యాకెట్లు తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు. కాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాతృ శ్రీ నగర్ లో ఏప్రిల్ 28 వ తేదీన సిగరెట్ సప్లైర్ బెదిరించి సిగరెట్ ప్యాకెట్లు తీసుకెళ్లారు. అనుమానం వచ్చిన సప్లర్ శ్రీహరి వెంటనే మియాపూర్ పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేయాయడంతో నిందితులను అదుపులోకి తిఆకున్నారు. వారి నుండి 3.5 లక్షల విలువ చేసే పలు రకాల కంపెనీలకు చెందిన సిగరెట్ ప్యాకెట్లను పోలీసుల స్వాధీనం చెలుకున్నారు. ఈ విధంగా వారిపై అల్వాల్, మియాపూర్, సైఫాబాద్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో నాలుగు కేసులు ఉన్నాయి. ఈ మేరకు నిందితులను రిమాండ్ కు తరలించి కేసును చేధించిన పోలీసులని ఏసీపీ, శ్రీనివాస్ కుమార్ అభినందించారు ఈ కార్యక్రమంలో, క్రాంతి కుమార్, రవీందర్, రమేష్ నాయుడు,విజయ్ కుమార్, శ్రీకాంత్, చంద్రశేఖర్, ప్రేమ్ కుమార్, పుల్య నాయక్, సుభాష్
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముస్లిములను ఉగ్రవాదులు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో ముస్లిం యువకులు బుధవారం ఫిర్యాదు చేశారు. వందశాతం ముస్లిములు ఉగ్రవాదులే అని పవన్ ద్వేషపూరిత ప్రకటన చేశారని పేర్కొన్నారు. ముస్లింల టోపీలు, గడ్డాలు, కుర్తాలు ఉగ్రవాదానికి చిహ్నాలుగా పవన్ ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఆయనపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎనుమాముల పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్
ఏనుమాముల, నేటిధాత్రి
https://youtu.be/GCpLX43wfVs?si=qoAdJYysMaLnnAWn
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ మంగళవారం మామూనూర్ డివిజన్ పరిధిలోని ఏనుమాముల పోలీస్ స్టేషన్ను సందర్శించారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఎనుమాముల పోలీస్ స్టేషన్ను సందర్శించిన పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశీలించారు. అనంతరం స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలను సిపి సంబంధిత స్టేషన్ ఇన్స్స్పెక్టర్ రాఘవేందర్ ను అడిగి తెలుసుకొవడంతో పాటు, స్టేషన్ పరిధిలో అత్యధికంగా ఎలాంటి నేరాలు నమోదవుతాయి.
Commissioner
స్టేషన్ పరిధిలో ఎన్నిసెక్టార్లు వున్నాయి, సెక్టార్వారిగా ఎస్.ఐలు నిర్వహిస్తున్న విధులు, వారి పరిధిలోని రౌడీ షీటర్లు, అనుమానితులు వారి ప్రస్తుత స్థితి గతులను సంబంధిత సెక్టార్ ఎస్.ఐని అడిగి తెలిసుకోవడంతో పాటు స్టేషన్వారిగా బ్లూకోల్ట్స్ సిబ్బంది పనితీరుతో పాటు, వారు విధులు నిర్వహించే సమయాలను పోలీస్ కమిషనర్ స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ అధికారులకు పలుసూచనలు చేస్తూ ప్రతి స్టేషన్ అధికారి తప్పనిసరిగా రౌడీ షీటర్ ఇండ్లను సందర్శించి వారి స్థితిగతులపై ప్రత్యక్షంగా ఆరా తీయాలని, ఆర్థిక సైబర్ నేరాలకు సంబంధించి కేవలం కేసు నమోదు చేయడమే తమ బాధ్యతనే కాకుండా సైబర్ నేరాలకు సంబంధించి నేరానికి పాల్పడిన నేరస్థుల మూలాల కూడా దర్యాప్తు అధికారులు కనిపెట్టి నిందితులను అరెస్టు చేయాలని.
Commissioner
ట్రైసిటి పరిధిలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలకు సంబంధించి క్రయ విక్రయాలపై స్టేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మత్తు పదార్థాల నియంత్రణకై నిరంతరం పనిచేయాలని. నేరాల నియంత్రణకై విజుబుల్ పోలీసింగ్ అవసరమని, ఇందుకొసం నగరంలో నిరంతం పోలీసులు పెట్రొలింగ్ నిర్వహించాలని పోలీస్ కమిషనర్ స్టేషన్ అధికారులకు సూచించారు.
పోలీస్ కమిషనర్ వెంట ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, మామూనూర్ ఏసిపి తిరుపతి ఇన్స్స్పెక్టర్ రాఘవేందర్, స్టేషన్ ఎస్.ఐ రాజు, పోలీసు సిబ్బంది పాల్గోన్నారు.
పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిది లో ఆరుగురు గంజాయి అమ్మకం దారుల పట్టివేత…
గంజాయి పండించిన, తరలించినా, అమ్మిన సేవించిన వారి పైన కఠిన చర్యలు తప్పవు – డీసీపీ కరుణాకర్
ఓదెల (పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి :
ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో విలేఖరుల సమావేశంలో డిసీపీ పి కరుణాకర్ కేసు వివరాలను వెల్లడించారు. పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టు గా అమ్ముచున్న గంజాయి ముఠాను పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ మరియు సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు.. పోత్కపల్లి రైల్వే స్టేషన్ లో అనుమానస్పదంగా తిరుగుచున్న వ్యక్తులను పట్టుకొని ని విచారించగా గంజాయి అమ్మడానికి వచ్చినట్టు తెలియ చేయగా నిందితుల వద్ద ఉన్న గంజాయిని చూపించగా అది 9.664 కిలోల ఎండు గంజాయి గా ఉంది, అట్టి గంజాయిని మరియు ఒక మోటార్ సైకిల్, రెండు మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకుని ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు డిసిపి పి. కరుణాకర్ అన్నారు ఈ సందర్భంగా పట్టుబడిన కిరణ్ వివరాలు:-ఎ 1. గ్రామం. ముర్ముర్, అంతర్గాం మండలం. ఎ 2. జాడి ప్రకాష్ గ్రామం. ముర్ముర్, అంతర్గాం మండలం. ఎ) 3. గుజ్జుల సాయి తేజ, గ్రామం. ద్వారకా నగర్, గోదావరిఖని. ఎ 4. కొమురవెల్లి పవన్, గ్రామం. రామగుండం. ఎ 5. ఇందిబెల్లి సందీప్ గ్రామం. అంతార్గాం. ఎ 6. లింగన్నపేట విష్ణువర్ధన్ గ్రామం. ముర్ముర్, అంతర్గాం మండలం. మరియు పరారీలో ఉన్న నిందితులు ఎ 7. ఖేల కుమార్, గ్రామం. ఉరుమనూర్, కలిమేల, ఒడిస్స రాష్ట్రము. స్వాధీనం చేసుకున్న గంజాయి దాదాపు 9.664 కిలోల పట్టుకున్న గంజాయి విలువ రు. 4,80,000/- ఒక మోటార్ సైకిల్, రెండు మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పట్టుకున్న గంజాయిని డిప్యూటీ తాసిల్దార్ బాలసాని శ్రీనివాస్. రెవిన్యూ ఇన్స్పెక్టర్ మహేష్ జూనియర్ అసిస్టెంట్ అనిల్ కుమార్ ఫోటోగ్రాఫర్ ఇరుకుల వీరేశం ఏఎస్ఐ రత్నాకర్ హెచ్ సి జి కిషన్ పిసి రాజేందర్ సతీష్ ల సమక్షంలో పంచనామ నియమించారని అన్నారు యువకులు ఈజీ మనీ కోసం అమాయకుల ప్రాణాలతో చెలగాటం వాడుతున్నారని గంజాయి మహమ్మారి బారినపడి ఎంతో విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని మత్తు కు అలవాటు పడి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని ఇలాంటి వ్యక్తులు 4698 ఎక్కడ కనబడ్డ విక్రయించిన పోలీసు వారికి సమాచారం అందించాలని అన్నారు అదేవిధంగా ఆర్థిక నేరాలకు చేస్తున్న పలువురిని చకచక్యంగా పట్టుకున్నందుకు ఎస్సై దీకొండ రమేష్ మరియు పోలీస్ సిబ్బందిని అభినందిస్తూ వారికి రివార్డు అందజేశారు ఈ కార్యక్రమంలో డిసిపి పి కరుణాకర్ ఏసిపి గజ్జి కృష్ణ యాదవ్ సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి ఎస్సై దీకొండ రమేష్ ఏఎస్ఐ రత్నాకర్ జి కిషన్ పిసి రాజేందర్ సతీష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
సైబర్ నేరాల చెధనకు పోలీసులకు ప్రత్యేక సైబర్ శిక్షణ కార్యక్రమం
జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి ):
ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాష్ట్ర డీజీపీ జితేందర్ ఐపిఎస్ ఆదేశాల మేరకు సైబర్ నేరాల పరిశోధనలో ఊపయోగించవలసిన అంశాలపై సైబర్ నిపుణులతో కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల సిబ్బంది,అధికారులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం. అందులో భాగంగా మంగళవారం రోజున,,సి.డి.టీ.ఐ ( సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ) హైదరాబాద్,రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ సంయుక్తంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, సిద్ధిపేట జిల్లాల పోలీస్ అధికారులకు,సిబ్బందికి సైబర్ నిపుణులు ఆధ్వర్యంలో రెండు రోజుల ‘ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, పై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్ హాజరై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించరు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ. పోలీస్ అధికారులు, సిబ్బంది నిత్య విద్యార్థిగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే మోసాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు.ప్రస్తుత సమాజంలో.
crimes
ప్రజలు ఎక్కువగా సైబర్ నేరాల బారిన పడుతున్న నేపథ్యంలో సిబ్బంది,అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటు సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. సైబర్ మోసాలకు ,సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడే నేరగాళ్ళకు శిక్ష పడటంతో డిజిటల్ సాక్ష్యాధారాలు ప్రధాన పత్ర పోషిస్తాయన్నారు. సైబర్ నేరం జరిగినప్పుడు పిర్యాదు నమోదు నుండి డిజిటల్ ఆధారాలు సేకరణ, విశ్లేషణ మొదలగు అంశాలపై సైబర్ నిపుణులు ఇచ్చిన శిక్షణ సద్వినియోగం చేసుకొని సైబర్ నేరస్థులకి శిక్షలు పడేవిధంగా కృషి చేయాలన్నారు.సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేసే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయా పోలీస్ స్టేషన్లలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.భౌతిక పోలీసింగ్ తో పాటు డిజిటల్ పోలీసింగ్ పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల పడకుండా ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి
1.అనుమానాస్పద లింక్స్పై క్లిక్ చేయకండి. 2.వ్యక్తిగత సమాచారం (బ్యాంక్ డిటైల్స్, OTP, పాస్వర్డ్లు) ఎవరితోనూ పంచుకోకండి. 3.గుర్తు తెలియని ఫోన్ కాల్స్ లేదా మెసేజెస్ ద్వారా వచ్చిన డిమాండ్లను పట్టించుకోకండి. 4.బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు మాత్రమే అధికారిక వెబ్సైట్లు, యాప్స్ ద్వారానే చేయండి. 4.సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు షేర్ చేయడంలో జాగ్రత్త వహించండి. 5.ప్రస్తుత డిజిటల్ యుగంలో పిల్లల ఆన్లైన్ భద్రత పై తల్లిదండ్రులు దృష్టి సారించాలి,పిల్లల ప్రవర్తన పై నిత్యం తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి. 6.ఆన్లైన్ ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టి మోసపోవద్దు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, రాజ్ కుమార్ డీఎస్పీ , కోర్స్ కోఆర్డినేటర్ ,సి.డి.టీ.ఐ హైదరాబాద్ భీమా కృష్ణా నాయక్ ,,సి.డి.టీ.ఐ అఖిల్ రావు కొండూరి, ఇంటర్నేషనల్ సైబర్ ఎక్స్పోర్ట్ ,పోలీస్ అధికారులు, వివిధ జిల్లాల నుండి వచ్చిన పోలీస్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
ఆకాశ రామన్న ఉత్తరంపై పోలీసులకు ఫిర్యాదు విలేఖరి పై అనుమానాలు జమ్మికుంట :నేటిధాత్రి
జమ్మికుంట అయ్యప్ప దేవాలయం అధ్యక్షుడు సిరిమల్లె జయేందర్, కార్యదర్శి ఎలిమెల్ల రాజేంద్రప్రసాద్ లపై ఆలయానికి వచ్చినటువంటి విరాళాలు సొంతానికి వాడుకొని లెక్కలు చూపించకుండా అక్రమాలు చేసినట్టు ఆలయ సభ్యులకు అయ్యప్ప మాలధారులకు కరపత్రాలు పోస్ట్ ద్వారా సీతారామయ్య చీటీ లాగా అడ్రస్ లేకుండా పంపించిన వారు ఎవరనేది తెలియకుండా పంపించడం జరిగింది ఇది జమ్మికుంట పట్టణం ఒక సంచలన వార్తగా మిగిలిపోయింది ఈ కరపత్రాల సమస్య విషయమై ప్రజల యొక్క నానుడి ఎలా ఉందంటే ఆలయ నిర్మాణ టైంలో యాంసాని కృష్ణమూర్తి అధ్యక్షులుగా ఉన్నప్పుడు అయ్యప్ప మాల వేసుకునే భక్తుడే కృష్ణమూర్తి అనుచరుడిగా శ్రేయోభిలాషిగా మెదులుతూ అతనిని తప్పుదోవ పట్టించి తప్పు చేయించి లక్షల రూపాయలు బ్లాక్ మెయిల్ చేసి తీసుకున్నటువంటి ఈ భక్తుడే కృష్ణమూర్తి ఉండే టైంలో గుడి పైసలు లక్షల రూపాయలు వాడుకొని కృష్ణమూర్తి తో ని కట్టించిన ఘనత ఈయనదే అని అనుకుంటున్నారు ఇతని లీలలు శ్రీకృష్ణ లీలలు త్వరలోనే బయటికి వస్తాయి అనుకుంటున్నారు ఇకపోతే ఆలయానికి చాలా ఖర్చులు ఉంటాయి ఒక కుటుంబం పోషించడానికి ఎంత ఖర్చు అవుతుందో మనందరికీ తెలుసు అలాంటిది వందల సంఖ్యలో వేల సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి ఆలయానికి సౌకర్యాలు కలిగించడం ఉత్సవాలు జరిపించడం ప్రతి పండుగ రోజు పండుగ వాతావరణం కలిగించడానికి ఎంతో ఖర్చవుతుంది అలాంటిది రాయలేదు వచ్చిన రూపాయలు అక్రమం జరిగిందని రాస్తున్నారు అందులో ఎంతవరకు నిజం ఉన్నదో ఈ ఆకాశరామన్న ఉత్తరంలో ఏది నిజమో ఏది అబద్దమో కాలమే తెలియజేస్తుంది అలాగే ఆలయ మొత్తము విలువ 20 కోట్లు ఉంటుందేమో కానీ 15 కోట్ల రూపాయలు అక్రమం జరిగింది 15 కోట్ల రూపాయలు సంతానికి వాడుకున్నారు అనేదాంట్లో ఎంతవరకు నిజమో అనేది ప్రజలు గమనిస్తున్నారు ఏది ఏమైనా భగవంతుని యొక్క సన్నిధిలో ఉంటూ భగవంతుని యొక్క పైసల విషయంలో ప్రజల్లోకి ఇలాంటి వార్తలు రావడం రానున్న రోజుల్లో విరాళాలు కూడా రాకుండా ఆలయ అభివృద్ధికి వెనకడుగు వేసే విధంగా చేసినారు తప్ప ఇది ఏదో అభివృద్ధి కో లేకుంటే ఏదో ఆలయానికి పనికివచ్చే విషయం అనేది ఎవరూ పరిగణించట్లేదు వాళ్ల దాంట్లో వాళ్లకు పడక ఆదిపత్య పూర్ లో భాగంగానే ఇది వచ్చిందని నిపుణులు భక్తులు ప్రజలు అనుకుంటున్నారు.
జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు మానసిక,ఆరోగ్య అవగాహన సదస్సు
శాంతి భద్రతల పరిరక్షణకు ముందుండే అధికారుల,సిబ్బంది యొక్క భద్రత,ఆరోగ్యం మాకు ముఖ్యమైనవి
పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరు మానసిక పరిపక్వత పెంపొందించుకోవాలి.
జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్
సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతి భద్రతల పరిరక్షణకు ఎప్పుడూ ముందుండే పోలీస్ సిబ్బంది,అధికారులకు మానసిక స్థితి ఎంతో కీలకం వారి మానసిక ఆరోగ్యం కాపాడటం అనేది తక్షణ అవశ్యకతగా గుర్తించి రాష్ట్ర డిజిపి శ్రీ జితేందర్ ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు గురువారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవతో ప్రఖ్యాత మానసిక నిపుణులు డాక్టర్ అశోక్ కుమార్& టీం చే మానసిక ఆరోగ్య అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమనికి ముఖ్య అతిదిగా జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐ.పీ.ఎస్ హాజరైనరు.
ఈఅవగాహన సదస్సులో పోలీసు అధికారులు,సిబ్బంది ఎదుర్కొంటున్న వివిధ మానసిక ఒత్తిడులపై సమగ్ర అవగాహన ఇచ్చారు.
ముఖ్యంగా నిరంతర ఒత్తిడిలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి ఎలాంటి మానసిక సమస్యలు ఎదురవుతాయో, వాటిని ఎలా గుర్తించాలి ఎలా పరిష్కరించుకోవలెనే మార్గాల, ఒత్తిడి నిర్వహణ,మానసిక స్థైర్యం,ఆత్మవిశ్వాసం పెంపు, కుటుంబ వ్యక్తిగత జీవితానికి సమతుల్యత ,ఫైన్షియల్ మేనేజ్మెంట్ వంటి పలు అంశాల పై అవగాహన, పలు సూచనలు అందించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.
శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్ , ఆర్ముడ్ పోలీస్ సిబ్బంది పాత్ర కీలకమని అట్టి సిబ్బంది సంక్షేమానికి తెలంగాణ పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు.
సిబ్బంది అధికారుల మానసిక స్థితి ,మానసిక ఆరోగ్యం కాపాడటం అనేది తక్షణ అవశ్యకతగా గుర్తించి రాష్ట్ర డి.జి.పి జితేందర్ ఐ.పి.ఎస్ ఆదేశాలమేరకు జిల్లా పొలిస్ అధికారులకు,సిబ్బందికి మానసిక ఆ అగహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
పోలీస్ సిబ్బందికి శాఖపరమైన, వ్యక్తిగత సమస్య వుంటే ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకరవలని ఆయా సమస్యల పరిష్కరనికి కృషి చేయడం జరుగుతుందన్నారు.
వ్యక్తిగత సమస్యలకు గురై ఒంటరిగా ఉన్నామనే భావన నుండి బయటకు రావాలని మీ భద్రత,ఆరోగ్యం మాకు ముఖ్యమైనవి అని సిబ్బందికి భరోసా కల్పించారు.
ప్రతి ఒక్కరు మానసిక పరిపక్వత కలిగి ఉండాలని ఆయా పోలీస్ స్టేషన్ అధికారులు ప్రతి నెల సిబ్బందితో సవేశాలు నిర్వహించి వారి సమస్యలు, ఇబ్బందులు అడిగి తెలుసుకోవలన్నారు.
తాత్కాలిక ఆనందాల కోసం ప్రాణాలను,కుటుంబ సభ్యులను ప్రమాదంలో పెట్టవద్దని అధికారులు, సిబ్బంది విరామ సమయంలో కుటుంబలతో గడపాలని తెలిపారు.
మహిళ సిబ్బందికి సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుందని,మహిళ సిబ్బందికి అన్ని రకాల అండగా ఉంటామని ఎస్పి తెలిపారు.
జిల్లా పోలీస్ శాఖ జిల్లా సిబ్బంది సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అధికారులకు, సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య శిబిరాలు,యోగ తరగతులు, క్రీడలు,చేపడుతు సిబ్బందిలో నూతనోత్సాహం నింపడం జరుగుతుందన్నారు.
నిత్యం యోగ,వ్యాయామం లాంటివి అలవాటు చేసుకోవడం ద్వారా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటూ ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ఎదురుకోవచ్చని అధికారులకి,సిబ్బంది సూచించారు.
పిలువగానే వచ్చి జిల్లా అధికారులకు, సిబ్బందికి పలు అంశాలపై అవగాహన కల్పించిన రాష్ట్ర ఆత్మహత్యలు నివారణ సంస్థ టీమ్ సబ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,ఆత్మహత్యలు నివారణ సంస్థ చైర్మన్ డాక్టర్ అశోక్, సభ్యులు రామకృష్ణ ,సైకాలజిస్ట్ లు శైలజ,రామోజిరావు, బోడా అరుణ,సి.ఐ మొగిలి, మధుకర్, ఆర్.ఐ లు రమేష్, మధుకర్, యాదగిరి, ఎస్.ఐ లు రమాకాంత్, రామ్మోహన్, ప్రశాంత్ రెడ్డి, శ్రీకాంత్, ఆర్.ఎస్.ఐ లు శ్రవణ్, సాయి కిరణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
*స్టెరాయిడ్స్ పై జిమ్ సెంటర్ నిర్వాహకులకు, వరంగల్ నార్కోటిక్స్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం.*
వరంగల్, నేటిధాత్రి:
తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య ఆదేశాల మేరకు, ఎస్పీ రూపేష్ ఐపీఎస్ పర్యవేక్షణలో, 23 ఏప్రియల్ బుధవారం నాడు నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్, వరంగల్ నందు హన్మకొండ, వరంగల్ పట్టణ పరిధిలోని జిమ్ ఓనర్స్ అలాగే జిమ్ కోచ్లకు మాదకద్రవ్యాలు మరియు సింథటిక్ ఇంజేక్షన్స్, స్టెరాయిడ్స్ కు సంబంధించి అవగాహనా సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా ఎవరైనా స్టెరాయిడ్స్ ఉపయోగిస్తే చట్టరీత్య చర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు వరంగల్ నార్కోటిక్ పోలీసులు. ఈ సదస్సులో జిమ్ సెంటర్ల రికార్డుల నిర్వహణ, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల కొనుగోలు, అమ్మకం, రవాణా, వాడకంపై ముఖ్యంగా స్టెరాయిడ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై వివరించారు. జిమ్ కు వచ్చిన కస్టమర్ల ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డుల సేకరణ, జిమ్లలో సీసీ కెమెరాల పర్యవేక్షణ గురించి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా నిరోధించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నదని, ఇందులో భాగంగానే నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేయబడిందని వారికి వివరించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు నార్కోటిక్స్ బ్యూరో కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనిని నిరోధించడం ప్రతీ పౌరుడి బాధ్యత అని తెలిపారు. మన రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల ముప్పు నుండి రక్షించేందుకు ప్రతి ఒక్కరు కలసి పనిచేయాలి అని పిలుపునిచ్చారు. ఎవరైనా గంజాయి మరియు డ్రగ్స్ కి సంభందించిన అమ్మకాలు, కొనుగోలు, త్రాగే వారి వివరాలు తెలిసినచో, టోల్ ఫ్రీ నంబర్ 1908, టిజిఎన్ఏబి కంట్రోల్ రూమ్ నంబర్: 8712671111 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వగలరు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి అని తెలిపారు. ఈ సమావేశంలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ కె. సైదులు, ఇన్స్పెక్టర్ బి. రవిందర్ , మట్టేవాడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గోపి, నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఎస్సై రాజు, నార్కోటిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని మిట్టపెల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం జైపూర్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.ముఖ్య అతిథిగా జైపూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీధర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రజలు సైబర్ క్రైమ్ లకు గురవుతున్నారని,ప్రలోభపెట్టేమాటలకు లొంగకూడదని,ముక్కు మొహం తెలియని వారిని నమ్మి నగదు లావదేవీలు చేయకూడదని,ఏదైనా అనుమానంగా అనిపిస్తే తప్పకుండా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
యువకులారా మత్తును వీడండి
నేటితరం యువత గంజాయికి, మాదకద్రవ్యాలకు, మద్యానికి,మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని,యుక్త వయసులోనే వ్యసనాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, తాగి వాహనాలు నడుపుతూ ఘోర ప్రమాదాలకు గురవుతున్నారని,జల్సాలకు అలవాటు పడి మద్యం,గంజాయి మత్తులలో క్షణికా ఆవేశాలకు లోనై నేరాలు చేస్తూ చేతులారా భవిష్యత్తును చెరసాలలో బందీగా మార్చుకుంటున్నారని వాపోయారు.సోషల్ మీడియా ప్రభావానికి లోనై అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని,ఆన్లైన్ లో బెట్టింగులు కాస్తూ డబ్బులు కోల్పోయి కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నారని,ఆత్మహత్యలు చేసుకుంటున్నారని,ఇవన్నీ చాలా విచారకరమని అన్నారు.యువకుల్లారా మత్తును వీడండి.చెడు అలవాట్లను వదిలేసి చదువు పైన దృష్టి సారించి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని,విద్యలో బాగా రాణించి ఉన్నత స్థాయికి చేరుకొని తల్లిదండ్రులకు,కుటుంబానికి సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని కలిగించాలని, సత్ప్రవర్తన తోని జీవించాలని తెలిపారు.
Chief guest
తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి*
పిల్లల ప్రవర్తనలో మార్పు గురించి ముందుగా తల్లిదండ్రులకి తెలుస్తుందని, పిల్లలను మార్చుకునే శక్తి తల్లిదండ్రులకే ఎక్కువగా ఉంటుందని,ఎప్పటికప్పుడు వారిని గమనిస్తూనే ఉండాలని,వారిని మంచి మార్గంలో నడిపించే విధంగా అన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలని సూచించారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
ప్రతి పల్లెటూరు లో సీసీ కెమెరాలు ఉండటం చాలా అవసరమని, దొంగతనాలు,నేరాలు జరగకుండా చూడడానికి, ఒకవేళ జరిగిన నేరస్తులను పట్టుకోవడానికి సీసీ కెమెరా ఎంతగానో సహాయపడతాయని,నిఘా నేత్రాల ద్వారా ప్రజలకు పోలీసులకు ఎంతో ఉపయోగం ఉందని,గ్రామస్తులంతా కలిసి సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు.
పోలీస్ శాఖ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుంది
ప్రజలకు ఏ కష్టం వచ్చినా,ఏ సమయంలోనైనా 100 నెంబర్ కు డయల్ చేయాలని చేసిన వెంటనే నిమిషాల వ్యవధిలో పోలీసులు అందుబాటులోకి వస్తారని మీ సమస్యలను పరిష్కరిస్తానని,రాత్రి పగలు తేడా లేకుండా ప్రజలకు శాంతి భద్రతలకు రక్షణ వలయంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని, ప్రజలు కూడా బాధ్యతగా పోలీసు వారితో సహకరించాలని కోరారు.ప్రజలందరూ కూడా సామరస్యంగా తమ యొక్క సమస్యలను తీర్చుకోవాలని,క్షణిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు మంచిది కాదని, జనాలు తెలిసి తెలియక తప్పులు చేసి కేసులలో ఇరుక్కొని పోలీస్ స్టేషన్ చుట్టూ,కోర్టు చుట్టూ తిరుగుతూ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారని,ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయకుండా మంచిగా సమాజంలో ప్రతి ఒక్కరితో ఐకమత్యంగా జీవించాలన్నారు.పోలీస్ శాఖ ఎల్లప్పుడు ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని న్యాయం కొరకు పోరాడుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జైపూర్ ఎస్సై శ్రీధర్,పోలీసులు,స్థానిక నాయకులు,మిట్టపల్లి గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం తో 10 గంటల్లో దొంగతనం కేసు చెందించి దొంగను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్ తెలిపారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గోదావరి ఖని కి చెందిన ఇమాన్యూల్ అనే యువకుడు జల్సా లకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. రామకృష్ణపూర్ పట్టణం లోని హనుమాన్ నగర్ లో ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో కిటికీ ప్రక్కన నిద్రిస్తున్న మహిళ మేడలో నుండి మూడున్నర తులాల బంగారు పుస్తెల తాడు, ఎదురు ఇంటిలో కిటికీ ప్రక్కన పెట్టిన మొబైల్ ఫోన్ లను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. బాధితులు పిర్యాదు చేయగా సి.సి కెమెరాలను పరిశీలించి ఇమాన్యూల్ నేరాలకు పాల్పడ్డాడని నిర్ధారిరించుకొని పొలుసులు మూడు బృందాలుగా ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశం లో మందమర్రి సి.ఐ శశిధర్ రెడ్డి,పట్టణ ఎస్.ఐ రాజ శేఖర్, కాసిపేట ఎస్. ఐ ప్రవీణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. క్రైమ్ టీమ్ సిబ్బంది జంగు, రాకేష్, మహేష్ ,వెంకటేష్, సిసిఎస్ సిబ్బంది సతీష్ శ్రీనివాస్ లను ఏసిపి అభినందించి రివార్డులను అందజేశారు.
సుమారు లక్షన్నర విలువగల నిషేధిత అంబర్, గుట్కాలు స్వాధీనం.
మణికంఠ కిరాణం యజమాని దొడ్డ పుష్పలీలపై కేసు నమోదు.
వివరాలు వెల్లడించిన టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్, సీఐ శ్రీధర్..
నేటిధాత్రి నర్సంపే;
నర్సంపేట డివిజన్ పరిధిలో ప్రభుత్వ నిషేధిత అక్రమ అంబర్,గుట్కా, తంబాకు నిలువలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పలు కిరాణం దుకాణాలు, పాన్ షాపులు, వివిధ హోల్ సేల్ దుకాణాలలో అక్రమ అంబర్,గుట్కాలు నిల్వలను టాక్స్ ఫోర్స్ అధికారులు, పోలీసుల దాడుల్లో లభ్యం అవ్వడం కొద్దిరోజుల తర్వాత ఆ అమ్మకాలు మరింత పెరగడం చర్చనీయాంశంగా మారింది. కాగా నర్సంపేట పట్టణంలో భారీ ఎత్తున నిషేధిత అంబర్, గుట్కా ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం పలు అనుమానాలకు దారి తీస్తున్నది. నర్సంపేట పట్టణంలో ఒక కిరాణంలో దాడులు నిర్వహించి సుమారు 1,59 వేల రూపాయల విలువగల అంబర్ గుట్కాలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్ తెలిపారు.
నర్సంపేట పట్టణంలోని పాకాల రోడ్డుకు గల మణికంఠ కిరాణం దుకాణంపై పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించి నిషేధిత అక్రమ అంబర్ గుట్కాలను స్వాధీనం చేసుకొని కిరాణం షాపు యజమాని దొడ్డ పుష్పలీలపై కేసు నమోదు చేసినట్లు టాక్స్ ఫోర్స్ ఏసీపి మధుసూదన్, సీఐ శ్రీధర్ తెలిపారు. ఇలాంటి అక్రమ నిషేధిత అంబర్, గుట్కాలను నిలువచేసిన,అమ్మిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.
వ్యభిచారం గృహంపై పోలీస్,టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి.
పోలీసుల అదుపులోకి నలుగురు నిందితులు..
హెచ్ఐవి పరీక్ష కిట్లు, కండోమ్ ప్యాకెట్స్,సెల్ ఫోన్లు,టూ వీలర్, నగదు స్వాధీనం
నర్సంపేట,నేటిధాత్రి:
వ్యభిచార గృహంపై నర్సంపేట పోలీసులు,టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడి చేసి వారి గుట్టు రట్టు చేశారు.
ఈ నేపథ్యంలో వ్యభిచారం నిర్వకురాలు,ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లు,ఒక విద్యార్థితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సంఘటన గురువారం మధ్యాన్నం చోటుచేసుకున్నది.
నర్సంపేట టౌన్ సీఐ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డు గల నూతన ఏర్పాటు చేసిన ఒక కమ్యూనిస్టు పార్టీకి చెందిన గుడిసెల ఎదురుగా కిన్నెరపు ఉమా అనే మహిళ తన ఇంట్లో సెక్స్ వర్కర్లతో వ్యభిచారం నిర్వహిస్తున్నది.
ఇతర ప్రాంతాల నుండి మహిళలను వ్యభిచార రొంపులో దింపి తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నది.
Police
నర్సంపేట పట్టణానికి చెందిన కిన్నెరపు ఉమా నర్సంపేట మండలంలోని బానోజీపేట గ్రామానికి చెందిన కొయ్యల రమేష్,అదే బానోజీపేట గ్రామానికి చెందిన విద్యార్థి కొయ్యల నితిన్ అలాగే నర్సంపేట పట్టణానికి చెందిన కేసనపల్లి విక్రమ్ అనే యువకుడు ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లతో కలిసి వ్యభిచార నిర్వహిస్తున్నది.
పక్క సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు, నర్సంపేట ఎస్సై అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై దాడి చేయడం జరిగిందన్నారు.
ఇందులో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళాతో పాటు ఒక విద్యార్థి,మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.
కాగా ఆ నలుగురిని అదుపులోకి తీసుకుని మరో ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లతో కాపడినట్లు సీఐ తెలిపారు.
వ్యభిచారం గృహంలో తనిఖీలు చేపట్టగా 29 హెచ్ఐవి పరీక్ష కిట్లు, కండోమ్ ప్యాకెట్స్,5 సెల్ ఫోన్లు,1 ద్విచక్ర వాహనం,రూ. 2750 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.
ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి వారి కుటుంబ సభ్యుల వద్దకు పంపి నలుగురు నిందితులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ రమణమూర్తి తెలిపారు.వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై దాడిలో టాస్క్ ఫోర్స్ సీఐ కె. శ్రీధర్,డబ్ల్యూఏ ఎస్.ఐ రాజేశ్వరి, హెడ్ కానిస్టేబుల్ కృష్ణ,కానిస్టేబుల్ బి.రాజు,బి. నరేష్, ఎం.గణేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
వ్యభిచారం గృహంపై పోలీస్,టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి.
పోలీసుల అదుపులోకి నలుగురు నిందితులు..
హెచ్ఐవి పరీక్ష కిట్లు, కండోమ్ ప్యాకెట్స్,సెల్ ఫోన్లు,టూ వీలర్, నగదు స్వాధీనం
నర్సంపేట,నేటిధాత్రి:
వ్యభిచార గృహంపై నర్సంపేట పోలీసులు,టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడి చేసి వారి గుట్టు రట్టు చేశారు.ఈ నేపథ్యంలో వ్యభిచారం నిర్వకురాలు,ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లు,ఒక విద్యార్థితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సంఘటన గురువారం మధ్యాన్నం చోటుచేసుకున్నది.నర్సంపేట టౌన్ సీఐ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డు గల నూతన ఏర్పాటు చేసిన ఒక కమ్యూనిస్టు పార్టీకి చెందిన గుడిసెల ఎదురుగా కిన్నెరపు ఉమా అనే మహిళ తన ఇంట్లో సెక్స్ వర్కర్లతో వ్యభిచారం నిర్వహిస్తున్నది.ఇతర ప్రాంతాల నుండి మహిళలను వ్యభిచార రొంపులో దింపి తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నది.నర్సంపేట పట్టణానికి చెందిన కిన్నెరపు ఉమా నర్సంపేట మండలంలోని బానోజీపేట గ్రామానికి చెందిన కొయ్యల రమేష్,అదే బానోజీపేట గ్రామానికి చెందిన విద్యార్థి కొయ్యల నితిన్ అలాగే నర్సంపేట పట్టణానికి చెందిన కేసనపల్లి విక్రమ్ అనే యువకుడు ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లతో కలిసి వ్యభిచార నిర్వహిస్తున్నది. పక్క సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు, నర్సంపేట ఎస్సై అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై దాడి చేయడం జరిగిందన్నారు.ఇందులో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళాతో పాటు ఒక విద్యార్థి,మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.కాగా ఆ నలుగురిని అదుపులోకి తీసుకుని మరో ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లతో కాపడినట్లు సీఐ తెలిపారు.వ్యభిచారం గృహంలో తనిఖీలు చేపట్టగా 29 హెచ్ఐవి పరీక్ష కిట్లు, కండోమ్ ప్యాకెట్స్,5 సెల్ ఫోన్లు,1 ద్విచక్ర వాహనం,రూ. 2750 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.ఇద్దరు మహిళా సెక్స్ వర్కర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి వారి కుటుంబ సభ్యుల వద్దకు పంపి నలుగురు నిందితులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ రమణమూర్తి తెలిపారు.వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై దాడిలో టాస్క్ ఫోర్స్ అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.