చైన్‌ స్నాచర్‌ ఆటకట్టించిన వరంగల్‌ పోలీసులు.

చైన్‌ స్నాచర్‌ ఆటకట్టించిన వరంగల్‌ పోలీసులు.

*వరంగల్, నేటిధాత్రి

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నిర్మానుష్య ప్రదేశాల్లో రోడ్లపై ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా వారి మెడల్లో చైన్‌ స్నాచింగ్‌లతో పాటు ద్విచక్రవాహన చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని కెయూసి, సిసిఎస్‌ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేసారు. అరెస్టు చేసిన నిందితుడి నుండి సూమారు 23లక్షల 50వేల రూపాయల విలువ గల 237గ్రాముల బంగారు పుస్తెల తాళ్ళు, గొలుసులు, మూడు ద్విచక్ర వాహనాలు, పదివేల రూపాయల నగదు, ఒక సెల్‌ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Police Commissionerate

ఈ అరెస్టుకు సంబందించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ వివరాలను వెల్లడిస్తూ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం, దామెర ప్రాంతానికి చెందిన మంతుర్తి హరీష్‌(29), ప్రస్తుతం హన్మకొండ రెడ్డి కాలనీలో అద్దె ఇంటిలో నివాసం వుంటున్న నిందితుడు డిగ్రీ వరకు చదువు పూర్తి చేసిన ఓ సిమెంట్‌ కంపెనీలో క్వాలిటీ టెక్నిషన్‌గా హైదరాబాద్‌లో పనిచేసేవాడు ఇదే క్రమములో మొదటగా ఈ ఏడాది ఇదే సిమెంట్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న సహోఉద్యోగి ఇంటిలో బంగారు గోలుసు చోరీకి పాల్పడి దానిని స్థానిక మణిప్పురం గోల్డ్‌ లోన్‌ కంపెనీలో తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బుతో నిందితుడు జల్సాలు చేసేడు. ఈ సంఘటలో నిందితుడుని స్థానిక నెరెడ్‌మెట్‌ పోలీసులు ఈ ఏడాది అరెస్టు చేసిన జైలుకు తరలించారు.
బెయిల్‌పై విడుదలైన నిందితుడిలో ఏలాంటి మార్పు రాకపోగా తన జల్సాలకు అవసరమైన డబ్బు తన వద్ద లేకపోవడంతో నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా రొడ్డుపై వెళ్తున్న మహిళల మెడలో చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేద్దామనుకున్న నిందితుడు ముందుగా చైన్‌ స్నాచింగ్‌ చేసేందుకు ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి వెళ్ళి చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. ఇదే రీతిలో నిందితుడు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం పది చైన్‌ స్నాచింగ్‌లు, మూడు ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడ్డాడు. ఇందులో కెయూసి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూడు, రాయపర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు, అలాగే సుబేదారి, కాజీపేట,హసన్‌పర్తి, కమలాపూర్‌, కరీంనగర్‌ జిల్లాలోని చిగురుమామిడి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఒకటి చోప్పున చైన్‌ స్నాచింగ్‌ చోరీలకు పాల్పడగా, హన్మకొండ, హసన్‌పర్తి, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నిందితుడు మూడు ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడటం జరిగింది. ఈ వరుస చైన్‌ స్నాచింగ్‌ చోరీలపై అప్రమత్తమైన పోలీసులు క్రైమ్స్‌, హన్మకొండ ఏసిపిల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకొని నిందితుడుని గుర్తించిన పోలీసులు పక్కా సమచారంతో ఈ రోజు ఉదయం పోలీసులు ఉదయం యాదవ్‌నగర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద వాహన కెయూసి, సిసిఎస్‌ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో చోరీ చేసిన బంగారు గొలుసులను విక్రయించేందుకు అనుమానస్పదంగా చోరీ చేసిన ద్విచక్ర వాహనంపై వస్తున్న నిందితుడుని రోడ్డుపై తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి తప్పించుకొని పారిపోతున్న నిందితుడుని పోలీసులు పట్టుకొని తనిఖీ చేయగా నిందితుడి వద్ద బంగారు గొలుసును గుర్తించిన పోలీసులు నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకొని విచారించగా నిందితుడు పాల్పడిన చైన్‌ స్నాచింగ్‌, ద్విచక్ర వాహన చోరీలను అంగీకరించాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో అతను నివాసం వుంటున్న అద్దె ఇంటి నుండి పోలీసులు మిగితా చోరీ సోత్తును స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడుని పట్టుకోవడంలో ప్రతిభ కబరిచిన క్రైమ్స్‌ డిసిపి గుణశేకర్‌, క్రైమ్స్‌ ఏసిపి సదయ్య, హన్మకొండ ఏసిపి నర్సింహరావు, కెయూసి, సిసిఎస్‌ ఇన్స్‌స్పెక్టర్లు రవికుమార్‌, రాఘవేందర్‌, ఏఏఓ సల్మాన్‌ పాషా, సిసిఎస్‌ ఎస్‌.ఐ లు రాజ్‌కుమార్‌, శివకుమార్‌, హెడ్‌కానిస్టేబుళ్ళు అంజయ్య, జంపయ్య, కానిస్టేబుళ్ళు మధుకర్‌, చంద్రశేకర్‌, రాములు, నగేష్‌లతో కెయూసి పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు.

జహీరాబాద్ లో వినాయక చవితి సమీక్ష సమావేశం..

జహీరాబాద్ లో వినాయక చవితి సమీక్ష సమావేశం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ లో బుధవారం మధ్యాహ్నం డీఎస్పీ సైదా అధ్యక్షతన వినాయక చవితి పండగ సందర్భంగా ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్ఐలు కాశీనాథ్, నరేష్, వినయ్ కుమార్ తో పాటు పురపాలక, రోడ్లు భవనాలు, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తల్లిని అత్యాచారం చేసిన ఢిల్లీ వ్యక్తి అరెస్టు..

ఢిల్లీలో ఒక షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. 39 ఏళ్ల మద్ ఫిరోజ్, అలియాస్ సుహెల్, తన తల్లిని అత్యాచారం చేసిన ఆరోపణలతో అరెస్టు అయ్యాడు. తల్లి ఇటీవల సౌదీ అరేబియాకు యాత్ర చేసి తిరిగి వచ్చారు. అతను ఆమెను ఒక గదిలో లాక్ చేసి, చాకూ మరియు కత్తులతో కొట్టడం తో పాటు గత conduct కోసం శిక్షగా అత్యాచారం చేశాడని ఆరోపణ. భయంతో ఆమె మొదట పోలీసులు దగ్గరకు వెళ్లలేదు, కానీ తర్వాత ఫిర్యాదు చేసింది. ఢిల్లీ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

హద్నూర్ లో మోటార్ సైకిల్ దొంగ అరెస్ట్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T125406.062.wav?_=1

 

హద్నూర్ లో మోటార్ సైకిల్ దొంగ అరెస్ట్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గంలోని హద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంగ్వార్ గ్రామానికి చెందిన నడిమి దొడ్డి అశోక్ అనే వ్యక్తి తన మోటార్ సైకిల్ దొంగిలించబడిందని ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి, బీహార్ రాష్ట్రానికి చెందిన లక్ష్మన్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్ట్ చేశారు. ఐదు నెలలుగా బీదర్ లో పని చేసుకుంటున్న లక్ష్మన్, కూలీ డబ్బులు సరిపోక దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఒప్పుకున్నాడు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ తెలిపారు.

పరకాల పట్టణంలో పలుచోట్ల ఘనంగా జెండా పండుగ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-51.wav?_=2

పరకాల పట్టణంలో పలుచోట్ల ఘనంగా జెండా పండుగ

క్యాంపు కార్యాలయంలో జెండా ఎగరావేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగరవేసిన అధికారులు

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో అమరధామం యందు ఆగస్టు 15 రోజున 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు రేవూరిప్రకాశ్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా జాతీయ పతాకాన్ని ఎగరావేశారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ఆర్డీఓ కార్యాలయంలో….

పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్డీఓ డాక్టర్.కన్నం.నారాయణ జెండా ఎగరావేయడం జరిగింది.అనంతరం జాతీయ గీతాలాపన చేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్ లో….

79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణలోని పరకాల పోలీస్ వారి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ స్టేషన్ ప్రాంగణం లో జెండా ఎగరవేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రమేష్ బాబు,విఠల్,మహిళపోలీసులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

CI Krantikumar

ఎమ్మార్వో కార్యాలయంలో…..

పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవం సందర్బంగా ఎమ్మార్వో విజయలక్ష్మి జెండా ఎగరావేయడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ మహనీయులను అనుదినం స్మరించుకోవాలని వారి త్యాగల ఫలమే ఈ రోజని అన్నారు.ఈ కార్యక్రమంలో డీటీ.సుమన్,ఎలక్షన్ డీటీ.సూర్యప్రకాష్,ఎం.ఆర్ఐ అశోక్ రెడ్డి,దామోదర్,ఏఎస్ఓ కుమారస్వామి, ధరణి ఆపరేటర్ రఘుపతి,సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్,ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ భద్రయ్య, జూనియర్ అసిస్టెంట్ అర్జున్,రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎంపిడిఓ కార్యాలయం లో…….

79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది.ఆంజనేయులు జాతీయ పతాకాన్ని ఎగరావేశారు.అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు ఎల్లంకి బిక్షపతి,కార్యాలయ పర్యవేక్షకులు సిహెచ్ శైలశ్రీ, ఏపిఓ ఇందిర,కార్యాలయ, ఈజీయస్ సిబ్బంది,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

వ్యవసాయ మార్కెట్ లో……

స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ,ఏఐటీయూసీ హమాలి యూనియన్ ఆధ్వర్యంలో సిపిఐ జిల్లాకౌన్సిల్ సభ్యుల లంక దాసరి అశోక్ అధ్యక్షతన 79వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.అనంతరం హమాలి యూనియన్ నాయకులు మహనీయుల చిత్రపటాలకు పూలతో నివాళులు అర్పించి జెండావిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగెళ్లి శంకర్,శ్రీపతి రాజయ్య,హమాలీ సీనియర్ ముఠామేస్త్రి బొట్ల భద్రయ్య,కొడపాక ఐలయ్య,కోయిల శంకరయ్య,కోట యాదగిరి,గుట్ట రాజయ్య ల్,దొడ్డే పోచయ్య,కార్మిక నాయకులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో BRS నాయకుల ఆగడాలకు చట్టపరమైన చర్యలు కోరారు

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-15T131641.925.wav?_=3

 

చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని వీధి రౌడీ లా ప్రవర్తించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ లో సెట్విన్ కార్యాలయంలో ప్రభుత్వపరమైన కార్యక్రమం నిర్వహిస్తుండగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో తమకు విలువనివ్వడం లేదని కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గౌరవనీయులు ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉన్న ఫ్లెక్సీ ని చింపి వేసినారు వాస్తవానికి వారికి ఏదైనా అసౌకర్యం అనిపిస్తే వారి పరువుకు భంగం కనిపిస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి గానీ తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి ప్రశాంత వాతావరణంలో ఉన్న రాష్ట్రాన్ని కావాలని రాజకీయ పార్టీ గొడవలను సృష్టించాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల ముసుగులో ఉన్న గుండాలు వీరు చేసిన ఆగడాల వీడియో క్లిప్పులను జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఇవ్వడం జరిగినది వెంటనే వీరిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది కార్యక్రమంలో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కండెం నర్సింలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉగ్గేల్లి రాములు యాదవ్ జహీరాబాద్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాజామియా జహీరాబాద్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మొహమ్మద్ జాంగిర్ రాజశేఖర్ మోతి రామ్ రాథోడ్ పి.రాములు నేత మహమ్మద్ యూనుస్ జహీరాబాద్ మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ మోయుజోద్దీన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ ఇనాయత్ అల్లి మహమ్మద్ అక్బర్ మొహమ్మద్ అబ్దుల్ ఖదీర్ మహమ్మద్ గౌస్ కాశీనాథ్ సురేష్ స్వామి నసురుల్లా ఖాన్ మొహమ్మద్ జమీల్ కురేషి మహమ్మద్ ఖదీర్ ఖురేషిఇస్మాయిల్ నైస్ టైలర్ సీనియర్ నాయకులు పద్మారావు మొహమ్మద్ ఇస్మాయిల్ పటేల్ మొహమ్మద్ మసీదున్ పేర్ల నాగేష్ గార్లు వినతి పత్రం ఇచ్చి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉండండి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-4-3.wav?_=4

_ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉండండి – బొరేగౌ నాగేందర్ పటేల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

భారీ వర్షాల కారణంగా జహీరాబాద్ నియోజకవర్గంలోని పలు మండలంలోని వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.రహదారులు నీటితో నిండిపోవచ్చని ముందస్తు హెచ్చరిక ఇవ్వుతూ, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు బొరేగౌ నాగేందర్ పటేల్ సూచించారు.సెల్ఫీల కోసం ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలతో చెలగాటం ఆడకూడదని, ఉధృత ప్రవాహం ఉన్న చోట్లకు చేరరాదని సూచించారు.వాగులు, వంకల వద్దకు చేపల వేటకు జాలర్లు వెళ్లకూడదు. పశువులను కాయడానికి నదులు, వాగులు, చెరువుల దగ్గరకు తీసుకెళ్లకుండా జాగ్రత్త వహించాలని కోరారు.అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదని, సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచించారు.వర్షాల వల్ల ప్రమాదకరంగా మారే ప్రాంతాల్లో ఎలాంటి విపత్తులు జరుగకుండా మండల పోలీసులు మరియు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి, అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లి, వారి ప్రాణాలు రక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మల్లన్నను దర్శించుకున్న పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్ట్

మల్లన్నను దర్శించుకున్న పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్ట్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-31T132053.087.wav?_=5

నేటిధాత్రి ఐనవోలు :-

తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్ట్, ఐపీఎస్ గురువారం ఐనవోలు మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు. పోలీస్ డ్యూటీ మీట్ సందర్భంగా జిల్లాకి అభిలాష్ బిస్ట్ వచ్చారు. ఈ సందర్భంగా మల్లన్న దర్శనానికి విచ్చేసిన వారిని దేవాలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికి, శ్రీ స్వామి వారి దర్శనం అనంతరం స్వామి వారి శేష వస్త్రములతో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో దేవాలయ ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్ శర్మ, వేద పారాయణ దారులు గట్టు పురుషోత్తం శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు పాతర్లపాటి నరేష్ ,నందనం మధు, ఉప్పుల శ్రీనివాస్,దేవేందర్ పోలీసు ఉన్నతాధికారులు, స్థానిక సీఐ రాజగోపాల్ గౌడ్ ఎస్ఐ పస్థం శ్రీనివాస్ పాల్గొన్నారని దేవాలయ కార్యనిర్వణాధికారి అద్దంకి నాగేశ్వర్ రావు తెలిపారు.

సైబర్ నేరగాళ్ల చేతిలో లో పోగొట్టుకున్న డబ్బులు..

సైబర్ నేరగాళ్ల చేతిలో లో పోగొట్టుకున్న డబ్బులు రికవరీ చేసిన మరిపెడ పోలీసులు

మరిపెడ నేటిధాత్రి.

ఈ మద్య కాలంలో జరిగిన సైబర్ నేరాలలో మరిపెడ పరిది లో బాధితులు డబ్బులు పోగొట్టుకొని పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించినారు.వెంటనే పోలీసు లు స్పందించి టోల్ ఫ్రీ నెంబర్ 1930 ద్వారా కంప్లైంట్ చేసి తదుపరి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అన్నారు, 1930 నెంబర్ కి కాల్ చేయడం ద్వారా కొంత డబ్బు నిందితుని అకౌంట్ కి చేరకుండా హోల్డ్ లో ఉంచబడింది అన్నారు,మరిపెడ సి.ఐ రాజ్ కుమార్ గౌడ్ , ఇట్టి కంప్లైంట్ లను ఐ టి యాక్ట్ కింద కేసు కట్టి విచారణ చేపట్టి, హోల్డ్ లో ఉంచబడిన అమౌంట్ ను బాధితులకు రిటర్న్ వచ్చేలా గౌరవ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, తొర్రూరు గారికి లెటర్ పెట్టి, తద్వారా మేజిస్ట్రేట్ ఆదేశాలు తీసుకొని బాధితులు పోగొట్టుకున్న అమౌంట్ ను వారి ఖాతా లోకి తిరిగి జమ అయ్యేలా చేయడం జరిగింది అన్నారు,ఒక క్రైమ్ నందు 13,700/- రూపాయలు ఇంకొక క్రైమ్ నందు 6,821/- రూపాయలు రిటర్న్ వచ్చాయి, గతం లో మరిపెడ లో ఒక షాప్ యజమాని 40,000/- పోగొట్టుకొని వెంటనే 1930 కి కాల్ చేయడం ద్వారా, మొత్తం డబ్బులు వెనక్కి తెప్పించడం జరిగింది.ఇంకా మూడు కేసులలో అమౌంట్ రీఫండ్ కావలసి ఉంది.ఈ మధ్య కాలంలో చాలా సైబర్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి కావున ప్రజలు ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930 కి కాల్ చేసి పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించగలరు,బాధితుల సమస్యలకు తక్షణమే స్పందించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన ఎస్సై సతీష్ గౌడ్ ని అభినందించడం జరిగింది.

నేరాల నియంత్రణలో, పోలీస్ జగిలాలు పాత్ర కీలకం..

నేరాల నియంత్రణలో, పోలీస్ జగిలాలు పాత్ర కీలకం

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

పోలీస్ జాగిలాలకు నుతంగా నిర్మించిన గదులను ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే. ఐపీఎస్
పోలీస్ జగిలాలు (Police Dogs)నేర పరిశోధన,భద్రతా చర్యలు,మాదకద్రవ్యాల నియంత్రణ,విపత్తు పరిస్థితుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయిని,శిక్షణా సామర్థ్యం వల్ల విభిన్న ఆపరేషన్లలో వీటిని వినియోగిస్తున్నామని ఎస్పీ గారు తెలిపారు.పోలీస్ జగిలాల సంరక్షణలో భాగంగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో వాటి కోసం నూతనంగా నిర్మించిన గదులను ప్రారంభించారు.ఈ సందర్భం గా ఎస్పీ మాట్లాడుతూ..విశ్వాసానికి మారు పేరుగా నిలిచే జాగిలాలు పోలీస్‌ శాఖకు నేర పరిశోధనలో కీలకంగా మారుతున్నాయిని హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జగిన సమయంలో నిందితులను పట్టించడం,సంఘవిద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ప్రాణ,ఆస్తి నష్టం నివారించడంలో పోలీసు జాగిలాలు అత్యంత కీలక పాత్రను పోషిస్తున్నాయిని అన్నారు.

మాదకద్రవ్యాలు (Drugs), బాంబులు (Explosives), మరియు ఇతర అనుమానాస్పద వస్తువులను గుర్తించడంలో ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయిని జిల్లాలో అనేక కేసులను ఛేదించడంలో మరియు ఆధారాల సేకరణలో వీటి పనితీరు ప్రశంసనీయమైనది అని అన్నారు. పోలీస్ జగిలాలకు అధునాతన శిక్షణ,వైద్య సంరక్షణ,మరియు తగిన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నాలుగు జగిలాలు ఉన్నాయని, వీటి నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణ పొందిన హ్యాండ్లర్స్ ఉన్నారని వెల్లడించారు.ఎస్పీ వెంట వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సి.ఐ లు కృష్ణ, మొగిలి, నటేష్,ఆర్.ఐ లు రమేష్,యాదగిరి,ఎస్.ఐ లు,ఆర్.ఎస్.ఐ లు, డాగ్స్ హ్యాండ్లర్స్ కార్తీక్,సురేష్, శ్రీనివాస్, కిరణ్,సిబ్బంది పాల్గొన్నారు.

సోషల్‌ మీడియా పోస్టులపై జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘా..

సోషల్‌ మీడియా పోస్టులపై జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘా

శాంతి భద్రతలకు విఘాతం కలిగించేల సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే జైలు శిక్షలు తప్పవు.

జిల్లాలో సోషల్ మీడియా ట్రాకింగ్ సెల్ (SOCIAL MEDIA TRACKING CELL) ఏర్పాటు:జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సామాజిక మాధ్యమాల్లో మతవిద్వేషాలు రెచ్చగొట్టేల,ఒక వర్గాన్ని,పార్టీని టార్గెట్ గా చేసుకొని పోస్టులు పెట్టె వారిపై,శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై,వాస్తవాలను తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు ఫార్వర్డ్ చేసే వారిపై,ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు పెట్టె వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక మధ్యమల్లో
(ట్విటర్‌,ఫేస్‌బుక్‌,వాట్సాప్‌,ఇతర సోషల్‌ మీడియా..)వచ్చే పోస్టులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజ నిజాలు తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో అట్టి మెసేజ్లను ఫార్వర్డ్ చేయకూడదని,సోషల్ మీడియా పోస్టులపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా ట్రాకింగ్ విభాగం(“SOCIAL MEDIA TRACKING CELL”)ప్రతి పోస్టును నిశితంగా పరిశీలించడం జరుగుతుందని,జిల్లాలో సోషల్ మీడియా విభాగం ద్వారా సోషల్ మీడియా పోస్టులపై 24*7 నిరంతరం పోలీస్ నిఘా ఉంటుందని ఈసందర్భంగా హెచ్చరించారు.
సామాజిక మధ్యమల్లో మతవిద్వేషాలు,ఒక వర్గాన్ని,పార్టీని టార్గెట్ గా,శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులపై,వాస్తవాలను తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు ఫార్వర్డ్ చేసే వారి సమాచారం సోషల్ మీడియా ట్రాకింగ్ సెల్ 8712537826 నంబర్ కి మెసేజ్ రూపంలో పంపగలరు.

సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్” గా నూతన బాధ్యతలు చేపట్టిన.

సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్” గా నూతన బాధ్యతలు చేపట్టిన క్రాంతి గారికి సన్మానించిన నాయకులు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-83.wav?_=6

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం పీఎస్ నుండి కోహీర్ పీఎస్ కి బధిలిపై వెళ్లిన”సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నరేష్ సర్” మరియూ పుల్కల్ పిఎస్ నుండి ఝరాసంగం పీఎస్‌లో “సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్” గా నూతన బాధ్యతలు చేపట్టిన క్రాంతి గార్లకు మర్యాదపూర్వకంగా కలిసి శాలువ పూలమాలతో సన్మానం చేసి వీడ్కోలు పలికి ఝరాసంగం మండల నాయకులు.ఇట్టి కార్యక్రమములో ఝరాసంగం శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ శేఖర్ పాటిల్, మాజీ సర్పంచ్‌లు వేణుగోపాల్ రెడ్డి, సిద్ధు పాటిల్, డప్పూరు సంగమేష్, శ్రీకాంత్ రెడ్డి నాయకులు లక్ష్మారెడ్డి,షకిల్ సర్, వై నాగేష్, ఎం విష్ణు, అమృత్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఝరాసంగం మండల రాఘవేంద్ర,యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఝరాసంగం మండల చింతలగట్టు శివరాజ్,ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు రాంపూర్ ప్రకాష్,గంగారం నర్సింలు తదితరులు పాల్గోని ఎస్ఐ నరేష్ , పటేల్ క్రాంతి గార్లకు వీడ్కోలు మరియు స్వాగతం పలికారు..

ఓటీటీకి వ‌చ్చేసిన పోలీస్ థ్రిల్ల‌ర్‌! క్లైమాక్స్ మైండ్ బ్లాకే..

స‌డ‌న్‌గా.. ఓటీటీకి వ‌చ్చేసిన పోలీస్ థ్రిల్ల‌ర్‌! క్లైమాక్స్ మైండ్ బ్లాకే

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు స‌డ‌న్‌గా ఓ లేటెస్ట్ మ‌ల‌యాళ‌ చిత్రం రోంత్ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు స‌డ‌న్‌గా ఓ లేటెస్ట్ మ‌ల‌యాళ‌ చిత్రం రోంత్ (Ronth) డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. పోలీస్ ప్రోసిడ్యూర‌ల్ జాన‌ర్‌లో వ‌చ్చిన ఈ సినిమా గ‌త నెల జూన్ 13న కేర‌ళ‌లో థియేట‌ర్ల‌లో విడుద‌లై సైలెంట్‌గా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. దిలీష్ పోత‌న్ (Dileesh Pothan), రోష‌న్ మాథ్యూ (Roshan Mathew) కీల‌క పాత్ర‌ల్లో న‌టించగా, ఆఫీస‌ర్ ఆన్ డ్యూటీ, నాయ‌ట్టు వంటి సినిమాల‌కు క‌థా ర‌చ‌న చేసిన‌ షాహి కబీర్ (Shahi Kabir) ర‌చించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రోంత్ అంటే నైట్ పెట్రోలింగ్ అని అర్థం. తెలుగులో గ‌స్తీ, ప‌హారా ఖాయ‌డం అని అంటారు.

క‌థ విష‌యానికి వ‌స్తే.. ఒక రాత్రిలో విధుల్లో ఉన్న‌ ఇద్ద‌రు భిన్న మ‌న‌స్త‌త్వాలు ఉన్న‌ పోలీసులు చాలా సీనియ‌ర్ అయున‌ సబ్‌ఇన్స్పెక్టర్ యోహన్నాన్ (దిలీష్ పోథన్) మరియు కొత్తగా డ్యూటీలో చేరిన కానిస్టేబుల్ డినానత్ (రోషన్ మాథ్యూ) ల మ‌ధ్య సాగుతుంది. ఓ రోజు రాత్రి పాట్రోల్ డ్యూటీకి వెళ్లిన ఈ ఇద్ద‌రికి అనుకోకుండా వ‌రుస‌గా ఎదురైన ఘ‌ట‌న‌లు వారిని ఎలా మార్చాయి, వారు ఆ క్ష‌ణంలో తీసుకున్న నిర్ణ‌యాలు ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీశాయి వాటికి వారు రియాక్ట్ అయిన తీరు వ‌ళ్ల‌ ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొవాల్సి వ‌చ్చిది, వారి జీవితాలు ఎలా మలుపులు తిరిగాయో థ్రిల్లింగ్ అంశాల‌తో ఈ సినిమా సాగుతుంది. ఓ పిచ్చోడు బిడ్డ‌ను డ్ర‌మ్ములో ఉంచి హింసించ‌డం, ఓ త‌ల్లి త‌న‌ ప‌క్క‌నే పిల్ల‌ల‌ను పెట్టుకుని ఊరేసుకోవ‌డం, ఓ ప్రేమ జంట లేచి పోవ‌డం, వారి స్థానంలో వేరే వారిని ప‌ట్టుకోని కొట్ట‌డం వంటి సిట్యువేష‌న్స్ ఎదుర‌వుతాయి. వాటికి తోడు ఇంటి స‌మ‌స్య‌లు, ఆ రోజే స్టేష‌న్‌కు వ‌చ్చిన కేసులు ఇలా వాళ్ల‌కు అనేక స‌స‌మ‌స్య‌లు అ ఒక్క రోజులో వ‌చ్చి మీద ప‌డ‌తాయి.

ఇప్పుడీ చిత్రం జియో హాట్‌స్టార్‌లో మ‌ల‌యాళంతో పాటు తెలుగు ఇత‌ర సౌత్ భాష‌ల్లోనూ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన‌ రొటీన్ కమర్షియల్ స్టోరీలా మాదిరి కాకుండా, నిజ జీవిత పోలీస్ పట్రోల్ తీరు తెన్నుల‌ను, పోలీసులు అనుభవించే స‌మ‌స్య‌ల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించడం ఈ సినిమా ప్రత్యేకత. ఇద్ద‌రు ప్ర‌ధాన పాత్ర‌ధారులు పోటీ ప‌డి మ‌రీ న‌టించారు. సినిమాటోగ్రఫీ, లైట్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా చాలా సంద‌ర్బాల్లో స్లోగా సాగిన‌ప్ప‌టికీ ఎక్క‌డా బోర్ అనే ఫీల్ రాదు. ఎలాంటి యాక్ష‌న్‌, మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకునే వారికి ఈ చిత్ర నిరాశే మిగులుస్తుంది. సస్పెన్స్, సీరియస్ కంటెంట్, స్లో బర్న్ థ్రిల్లర్స్ ఇష్ట‌ప‌డే వారికి ఈ మూవీ ప‌ర‌మాన్నం లాంటిది. అంతేకాదు స్ట‌న్నింగ్ క్లైమాక్స్‌, ఊహ‌కంద‌ని ట్విస్టుల‌తో ఈ మూవీ షాకి ఇస్తుంది. గ‌తంలో మ‌ల‌యాళం నుంచే వ‌చ్చిన నయాట్టు, జన గణమన వంటి రియలిస్టిక్ పోలీస్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా పర్ఫెక్ట్. ఎక్క‌డా ఎలాంటి అభ్యంత‌రక‌ర స‌న్నివేశాలు లేవు ఇంటిల్లిపాది క‌లిసి చూసేయ‌వ‌చ్చు.

17వ పోలీస్ బెటాలియన్ లో కొణిజేటి రోశయ్య జయంతి వేడకలు.

17వ పోలీస్ బెటాలియన్ లో కొణిజేటి రోశయ్య జయంతి వేడకలు.

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోశయ్య జయంతి సందర్భంగా..17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ నందు బెటాలియన్ కమాండెంట్ M.I. సురేష్ కొనిజేటి రోశయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ సదర్భంగా కమాండేంట్ మాట్లాడుతూ రోశయ్య 1933 జూలై 4వ తేదీన గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు.
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన ఆయన 1978 నుండి 2009 వరకు పలుసార్లు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో భాగమయ్యారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘ కాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన రోశయ్య మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి ఏడు సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనపాటిగా పేరు పొందినారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009 సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబర్ 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించారు. ఆ తరువాత తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్ర గవర్నరు గా పనిచేశారు.

Assistant Commandant Jagadeeshwar Rao, officers

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ జగదీశ్వరరావు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు.

ఝరాసంగం: వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఆదివారం సాయంత్రం ఝరాసంగం పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఎస్సై నరేష్ తన పోలీస్ సిబ్బందితో కలిసి కుప్పానగర్ గ్రామ శివారులో గల మల్లన్న గట్టుకు వెళ్లే కూడలి రామయ్య జంక్షన్ వద్ద జహీరాబాద్ నుండి రాయికోడ్ వైపు వెళ్లే రోడ్డు పై రాకపోకలు సాగించే వాహనాల్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వాహనదారులకు పలు సూచనలు సలహాలు చేస్తూ, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించి, హెల్మెట్ ధరించాలని సూచించారు.

కరకగూడెం పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్

కరకగూడెం పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్

ఆదివాసీ యువతకు వాలీబాల్ కిట్లు ,మరియు దోమతెరలు పంపిణీ

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.నేటిధాత్రి..

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కరకగూడెం మండలంలోని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు అశ్వాపురంపాడు వలస ఆదివాసి గ్రామము మరియు అనంతారం గ్రామము లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ఈ ప్రోగ్రాం అనంతరం యువతకు వాలీబాల్సు మరియు వారి కుటుంబాలకు దోమతెరలను (ఎన్జీవో సహకారంతో) అందించిన తర్వాత ఏడుల్లబయ్యారం సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆదివాసీ ప్రజలు మావోయిస్టులకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించవద్దని తెలిపారు.ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తూ అభివృద్ధి దిశగా పయనించాలని తెలిపినారు.అభివృద్ధిని అడ్డుకునే మావోయిస్టులకు సహకరించవద్దని తెలిపారు.మావోయిస్టులవి కాలం చెల్లిన సిద్ధాంతాలని తెలిపినారు. యువత,పిల్లలు విద్య ద్వారానే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు.అసాంఘీక శక్తులకు సహకరించి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ అనవసరంగా కేసులు,జైలు పాలు కావద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో. ఏడుల్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్ఐ పివిఎన్ రావ్ మరియు స్పెషల్ పార్టీ టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు

డ్రగ్స్ గంజాయి వాడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

డ్రగ్స్ గంజాయి వాడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి జిల్లా ఎస్పీ

వనపర్తి నెటిదాత్రి :

 

 

 

వనపర్తి జిల్లాలో నిషా కొరకు ఎవరైనా డ్రగ్స్ గంజాయి వాడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు 100 1908 పోలీసులకు సమాచారం ఇస్తే వెంటనే డ్రగ్స్ గాన్ oజాయ్ వాడే వారిపై చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు . యువకులు విద్యార్థులు డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలు వాడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన కోరారు . విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో వారిని చదివించి ఉన్నత స్థాయికి ఎదగాలని వారి నమ్మకాలను దుర్వినియోగం చేయవద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి విద్యార్థులకు సూచించారు మరక ద్రవ్యాలు వాడరాదని ర్యాలీ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి జిల్లా ఎస్పీ రావుల గరీధర్ పోలీస్ డి సి ఆర్ సి ఉమా మహేశ్వరరావు వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు సీఐ కృష్ణయ్య కొత్తకోట సీఐ రాంబాబు జిల్లా అధికారులు సుధీర్ రెడ్డి సుధారాణి క్రీడల అధికారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

వలస ఆదివాసి గ్రామంలో వాలీబాల్ కిట్లు పలకలు అందజేసిన కరకగూడెం పోలీసులు.

వలస ఆదివాసి గ్రామంలో వాలీబాల్ కిట్లు పలకలు అందజేసిన కరకగూడెం పోలీసులు

 

కరకగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి:

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు వలస ఆదివాసి నిమ్మలగూడెం, నీలాద్రి పేట, గండి గ్రామాలలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి ఆదివాసి ప్రజలు మావోయిస్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించద్దని తెలిపారు ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తూ అభివృద్ధి దిశగా ప్రయాణించాలని అభివృద్ధిని అడ్డుకునే మావోయిస్టులకు సహకరించరాదని తెలిపారు. మావోయిస్టులని కాలం చెల్లిన సిద్ధాంతాలని యువత పిల్లలు విద్య ద్వారానే ఉన్నంత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు అసంఘిక శక్తులకు సహకరించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ అనవసరంగా జైలు పాలై కేసులు పాలు కావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడుల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై పివి నాగేశ్వరరావు, మరియు స్పెషల్ పార్టీ టి జి ఎస్ పి సిబ్బంది పాల్గొన్నారు.

తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్.

తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TGSP)
ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణి*

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

shine junior college

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం పరిధిలోని సర్ధాపూర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 17వ బెటాలియన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TGSP) ఆధ్వర్యంలో ఉచితంగా విద్యా సామగ్రి, వాటర్ ప్యూరిఫైయర్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం బెట్టాలియన్ కమాండెంట్ ఎం.ఐ. సురేష్.
ఆధ్వర్యంలో బుధవారం సర్ధాపూర్ ప్రభుత్వ పాఠశాలలో జరిగినది. పోలీస్ కానిస్టేబుల్ అయినా ఇటువంటి రామ్- అంజలి దంపతుల కుమార్తె లక్ష్మి వర్ణిక పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు పంపిణి చేశారు.అనంతరం బేటాలియన్ పోలీసు సిబ్బంది పిల్లలకు నోట్ పుస్తకాలు, ఎగ్జామ్ ప్యాడ్‌లు, వాటర్ బాటిల్, ఇతర స్టేషనరీ వస్తువులు పంపిణీ చేశారు, అదే విధంగా బెట్టాలియన్ పోలీస్ క్రికెట్ టీం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో
వాటర్ ప్యూరిఫైయర్ అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమాండెంట్ ఎం.ఐ. సురేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ఈ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కూడా తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మొదటి విడతలో భాగంగా.

సర్ధాపూర్ ప్రభుత్వ పాఠశాలను ఆదర్శంగా ఎంచుకొని, పాఠశాలకు పెయింటింగ్ వేయడం, మెరుగైన విద్యకు తోడ్పడటం, మంచి తాగునీటిని అందించడం వంటి పనులకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. పోలీస్ క్రికెట్ టీమ్ నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడానికి, వారి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి మంచి తాగునీరు అందించడానికి కృషి చేస్తుందని కమాండెంట్ అన్నారు. ఈ గ్రామానికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తమ వంతు సాయం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ జే. రాందాస్, పాఠశాల ఎం.ఈ.ఓ దూస రఘుపతి,
ఏఏపీసీ చైర్మన్ లక్ష్మి, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ బి. స్వాతి, పోలీస్ ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, 17వ బెటాలియన్ పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ హయాంలోసెటిల్ మెంట్ లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు మారాయి కేటీఆర్

కాంగ్రెస్ హయాంలోసెటిల్ మెంట్ లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు మారాయి- కేటీఆర్

సివిల్ మ్యాటర్ లో దూరి పోలీసులు అరాచకాలు సృష్టిస్తున్నారు

కాంగ్రెస్ నేత భూమి కబ్జా చేయడం,పోలీసులు ఉల్టా కేసు పెట్టి వేధించడంతోనే బీఆర్ఎస్ నేత కుంటయ్య ఆత్మహత్య

కుంటయ్య చావుకు కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం-న్యాయపోరాటం చేస్తాం

కుంటయ్య ఇద్దరు పిల్లల చదువులు,పెళ్లిల్లు చేయడంతో పాటు కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది

కుంటయ్య కుటుంబసభ్యులను పరామర్శించిన కేటీఆర్

సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి):

shine junior college

కాంగ్రెస్ హయాంలో సెటిల్ మెంట్ లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు మారాయని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు.తన భూమిని కాంగ్రెస్ నేత కబ్బా చేశాడని ఫిర్యాదుచేస్తే ఉల్టా తమ పార్టీ నేత కర్కబోయిన కుంటయ్యపైనే కేసు బనాయించి వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు.సివిల్ మ్యాటర్ లో దూరి పోలీసులు సెటిల్మెంట్లు, అరాచకాలు చేయడం సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ నేత భూమిని కబ్బా చేయడంతో ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్య కుటుంబాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ సిరిసిల్లలో పరామర్శించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ నాయకులు ఏం చేప్తే అది చేయడాన్నే డ్యూటీగా భావించి పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కుంటయ్య చావుకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఎవరిని వదిలిపట్టమన్నారు. తాము అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ నేతలు ఎవరూ కూడా ఇంత చిల్లర, లేకి పనులు చేయలేదన్నారు.


మొన్న ఏసీబీ విచారణ జరుగుతున్నప్పుడు తన కోసం హైదరాబాద్ దాకా వచ్చి ధైర్యం చెప్పిన కుంటయ్య అదే రోజు రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి మనసు కకావికలమైందన్నారు కేటీఆర్. రాజకీయ నాయకులు అంటే అందరూ ఏదోదో ఊహించుకుంటారన్న కేటీఆర్, బయటికి గంభీరంగా కనిపడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని ఓ వైపు ప్రజల కోసం పనిచేస్తూ మరోవైపు కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురవుతారన్నారు.తన భూమిని కాంగ్రెస్ నేత కబ్బా చేయడం, పోలీసులు కూడా ఆయనకే వత్తాసు పలకడంతో కుంటయ్య ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.విషయం తెలిసిన వెంటనే పార్టీ నేతలను పంపి ఆయనను కాపాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు. పార్టీలో నిబద్దత కల నాయకుడు, నిఖార్సైన గులాబీ సైనికుడు కుంటయ్య ఇద్దరు పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లు , ఇతర సమస్యలు అన్నింటికీ తనదే బాధ్యత అన్నారు కేటీఆర్. కుంటయ్య కుటుంబానికి పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామి ఇచ్చారు. ఈరోజు కుంటయ్య కి జరిగింది రేపు మరొకరికి జరగొచ్చన్న కేటీఆర్, ఈ అరాచకాలను ప్రభుత్వం అదుపుచేయాలన్నారు.ఈ ఆపద సమయంలో కుంటయ్య కుటుంబానికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు. పెద్దకర్మ జరిగేదాకా పార్టీ జిల్లా నాయకత్వమే అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటుందన్నారు. కుంటయ్య ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని కేటీఆర్ ప్రార్థించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version