మల్లన్నను దర్శించుకున్న పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్ట్
నేటిధాత్రి ఐనవోలు :-
తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్ట్, ఐపీఎస్ గురువారం ఐనవోలు మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు. పోలీస్ డ్యూటీ మీట్ సందర్భంగా జిల్లాకి అభిలాష్ బిస్ట్ వచ్చారు. ఈ సందర్భంగా మల్లన్న దర్శనానికి విచ్చేసిన వారిని దేవాలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికి, శ్రీ స్వామి వారి దర్శనం అనంతరం స్వామి వారి శేష వస్త్రములతో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో దేవాలయ ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్ శర్మ, వేద పారాయణ దారులు గట్టు పురుషోత్తం శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు పాతర్లపాటి నరేష్ ,నందనం మధు, ఉప్పుల శ్రీనివాస్,దేవేందర్ పోలీసు ఉన్నతాధికారులు, స్థానిక సీఐ రాజగోపాల్ గౌడ్ ఎస్ఐ పస్థం శ్రీనివాస్ పాల్గొన్నారని దేవాలయ కార్యనిర్వణాధికారి అద్దంకి నాగేశ్వర్ రావు తెలిపారు.