సైబర్ నేరగాళ్ల చేతిలో లో పోగొట్టుకున్న డబ్బులు రికవరీ చేసిన మరిపెడ పోలీసులు
మరిపెడ నేటిధాత్రి.
ఈ మద్య కాలంలో జరిగిన సైబర్ నేరాలలో మరిపెడ పరిది లో బాధితులు డబ్బులు పోగొట్టుకొని పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించినారు.వెంటనే పోలీసు లు స్పందించి టోల్ ఫ్రీ నెంబర్ 1930 ద్వారా కంప్లైంట్ చేసి తదుపరి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అన్నారు, 1930 నెంబర్ కి కాల్ చేయడం ద్వారా కొంత డబ్బు నిందితుని అకౌంట్ కి చేరకుండా హోల్డ్ లో ఉంచబడింది అన్నారు,మరిపెడ సి.ఐ రాజ్ కుమార్ గౌడ్ , ఇట్టి కంప్లైంట్ లను ఐ టి యాక్ట్ కింద కేసు కట్టి విచారణ చేపట్టి, హోల్డ్ లో ఉంచబడిన అమౌంట్ ను బాధితులకు రిటర్న్ వచ్చేలా గౌరవ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, తొర్రూరు గారికి లెటర్ పెట్టి, తద్వారా మేజిస్ట్రేట్ ఆదేశాలు తీసుకొని బాధితులు పోగొట్టుకున్న అమౌంట్ ను వారి ఖాతా లోకి తిరిగి జమ అయ్యేలా చేయడం జరిగింది అన్నారు,ఒక క్రైమ్ నందు 13,700/- రూపాయలు ఇంకొక క్రైమ్ నందు 6,821/- రూపాయలు రిటర్న్ వచ్చాయి, గతం లో మరిపెడ లో ఒక షాప్ యజమాని 40,000/- పోగొట్టుకొని వెంటనే 1930 కి కాల్ చేయడం ద్వారా, మొత్తం డబ్బులు వెనక్కి తెప్పించడం జరిగింది.ఇంకా మూడు కేసులలో అమౌంట్ రీఫండ్ కావలసి ఉంది.ఈ మధ్య కాలంలో చాలా సైబర్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి కావున ప్రజలు ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930 కి కాల్ చేసి పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించగలరు,బాధితుల సమస్యలకు తక్షణమే స్పందించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన ఎస్సై సతీష్ గౌడ్ ని అభినందించడం జరిగింది.