ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T142912.081-1.wav?_=1

 

ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. జహీరాబాద్ పట్టణంలో ఆవిష్కరించిన విగ్రహానికి పూలమాల వేసి జయంతోత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా సర్దార్ పాపన్న పోరాటాలు, త్యాగాలు వెనకబడిన వర్గాల గౌరవాన్ని కాపాడటమే కాకుండా సామాజిక సమానత్వానికి మార్గదర్శకమయ్యాయని పలువురు కొనియాడారు. జహీరాబాద్ పట్టణ గౌడ్ సంఘాల అధ్యక్షులు, సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శ్రీకృష్ణుని కృప అంద‌రిపై ఉండాల‌ని కోరుకున్నా..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-30-3.wav?_=2

శ్రీకృష్ణుని కృప అంద‌రిపై ఉండాల‌ని కోరుకున్నా..

*ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు.

తిరుప‌తి(నేటిధాత్రి(ఆగస్టు 16:

శ్రీకృష్ణ జ‌న్మాష్ట‌మి సంద‌ర్భంగా ఇస్కాన్ లోని రాధా కృష్ణ‌ స‌మేత అష్ట‌స‌తులను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు శ‌నివారం ఉద‌యం దర్శించుకున్నారు.ఆల‌య ప్ర‌తినిధులు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులకు స్వాగ‌తం ప‌లికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. గోకులాష్ట‌మి సంద‌ర్భంగా శ్రీకృష్ణ ప‌ర‌మాత్మున్ని ద‌ర్శించుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. భ‌క్తుల‌కు ఎటువంటి అసౌకర్యం క‌ల‌గ‌కుండా ఆల‌య ప్ర‌తినిధుల తీసుకున్న చ‌ర్య‌ల‌ను ఆయ‌న అభినందించారు.తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లంద‌రిపై శ్రీకృష్ణుని కృపాక‌టాక్షాలు మెండుగా ఉండాల‌ని ఆకాంక్షించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆర‌ణి జ‌గ‌న్, రాజా రెడ్డి, జీవ‌కోన సుధా, బాబ్జీ, రాజేష్ ఆచ్చారీ, మున‌స్వామి, పురుషోత్తం, శ్రావ‌ణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

న్యాల్ కల్ మండలం లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-25-4.wav?_=3

న్యాల్ కల్ మండలం లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్ కల్ మండలంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా న్యాల్ కల్ మండలం కుర్మ సంఘం అధ్యక్షులు గొల్ల నర్సింలు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులు గా జహీరాబాద్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ జక్కుల హనుమంత్ సార్ హద్నూర్ గారు రావడం జరిగింది గోపికలు శ్రీకృష్ణ వేశాధారణ తో చిన్నారులతో కృష్ణ భగవానునికి పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం ఉట్టి కొట్టు కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం శ్రీకృష్ణ భగవానుని జీవిత చరిత్ర గురించి విశ్వాహిందు పరిషత్ మండలం అధ్యక్షులు రాంచందర్ పవార్ మాట్లాడం జరిగింది ఈ కార్యక్రమం లో మల్గి మాజీ సర్పంచ్ జట్టుగొండ మారుతీ ఓంకార్ యాదవ్ మల్గి ఎంపీటీసీ శివానంద శ్రీపతి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివరాజ్ మాజీ ఎస్. ఎం.సీ. చేర్మెన్ నర్సప్ప అశోక్ చల్కి దత్తు గొల్ల దిలీప్ కుమార్ యాదవ్ శ్రీనివాస్ పెద్దగొల్లా శ్రీనివాస్ గొల్ల రాములు మారుతీ మహేష్ సిద్దు సునీల్ మొగుళప్ప రాకేష్ ఆకాష్ విట్టల్ గొల్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు,

మండలంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు…

మండలంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

మహాదేవపూర్ ఆగస్టు 16 (నేటి ధాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో శుక్రవారం రోజున ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా మండలంలోని పాఠశాలల్లో జెండా ఆవిష్కరణ అనంతరం పాటలు, ఆటలు, క్విజ్ లు నిర్వహించి విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలలో జెండా ఆవిష్కరించిన అనంతరం పలువురు అధికారులు విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.

సర్దార్ సర్వాయి పాపన్న375 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలి…

సర్దార్ సర్వాయి పాపన్న375 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలి

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

 

 

నిర్వహించాలని,ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు నేరెళ్ల సుభాష్ కోరారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఈ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తోందని గౌడ సోదరులు ముందుండి బహుజన సోదరులను ఆహ్వానిస్తూ అందరూ కలిసి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను నిర్వహిస్తూ ఆయన బహుజన బహుజనుల కోసం చేసిన సేవలను గుర్తు చేసుకోవాలని కోరారు.చాలా గ్రామాల్లో పాపన్న గౌడ్ విగ్రహాలు ఉన్నాయని లేనిచోట్ల ఆయన ఫోటోకు పూలదండలు వేసి వేడుకలను నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ గౌడ సంఘం అధ్యక్షులు ఎలుక అశోక్ గౌడ్, నేరెళ్ల సత్యం గౌడ్, గౌడ సంఘ సభ్యులు అబ్బూరి ఆనంద్ రాజ్, చీకట్ల వేణు గౌడ్, అబ్బూరి ప్రకాష్ గౌడ్, నేరెళ్ల రాజకుమార్ గౌడ్, అబ్బూరి శ్రీనివాస్, నేరెళ్ల అంజా గౌడ్, ఎలుక శివలింగం, అబ్బూరి దశ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లిలో 79వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-15T151830.696-1.wav?_=4

బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

 

బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రోజున 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి.

జాతీయ గీతలాపన అనంతరం స్వీట్లు పంచి వేడుకలను ఘనంగా జరిపారు.అనంతరం బెల్లంపల్లి పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే
బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసి ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే
బెల్లంపల్లి పట్టణంలో భవిత డిగ్రీ కాలేజ్ ఆవరణలో, కాలటెక్స్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు.ఏఎంసి చౌరస్తా వద్ద స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రివర్యులు కాక గడ్డం వెంకటస్వామి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు
ఎమ్మెల్యే మాట్లాడుతూ
అందరూ మహనీయులు త్యాగాలు ఫలితమే భారత దేశ స్వతంత్రం అని అన్నారు వారి సేవలను గుర్తు చేసుకోవాలని కోరారు
ఆంగ్లేయుల దాస్య శృంఖలాల నుంచి భరతమాత విముక్తి కోసం
పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ
దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు, మహిళలనాయకురాలు,ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

పరకాల పట్టణంలో పలుచోట్ల ఘనంగా జెండా పండుగ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-51.wav?_=5

పరకాల పట్టణంలో పలుచోట్ల ఘనంగా జెండా పండుగ

క్యాంపు కార్యాలయంలో జెండా ఎగరావేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగరవేసిన అధికారులు

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో అమరధామం యందు ఆగస్టు 15 రోజున 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు రేవూరిప్రకాశ్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా జాతీయ పతాకాన్ని ఎగరావేశారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ఆర్డీఓ కార్యాలయంలో….

పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్డీఓ డాక్టర్.కన్నం.నారాయణ జెండా ఎగరావేయడం జరిగింది.అనంతరం జాతీయ గీతాలాపన చేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్ లో….

79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణలోని పరకాల పోలీస్ వారి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ స్టేషన్ ప్రాంగణం లో జెండా ఎగరవేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రమేష్ బాబు,విఠల్,మహిళపోలీసులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

CI Krantikumar

ఎమ్మార్వో కార్యాలయంలో…..

పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవం సందర్బంగా ఎమ్మార్వో విజయలక్ష్మి జెండా ఎగరావేయడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ మహనీయులను అనుదినం స్మరించుకోవాలని వారి త్యాగల ఫలమే ఈ రోజని అన్నారు.ఈ కార్యక్రమంలో డీటీ.సుమన్,ఎలక్షన్ డీటీ.సూర్యప్రకాష్,ఎం.ఆర్ఐ అశోక్ రెడ్డి,దామోదర్,ఏఎస్ఓ కుమారస్వామి, ధరణి ఆపరేటర్ రఘుపతి,సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్,ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ భద్రయ్య, జూనియర్ అసిస్టెంట్ అర్జున్,రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎంపిడిఓ కార్యాలయం లో…….

79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది.ఆంజనేయులు జాతీయ పతాకాన్ని ఎగరావేశారు.అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు ఎల్లంకి బిక్షపతి,కార్యాలయ పర్యవేక్షకులు సిహెచ్ శైలశ్రీ, ఏపిఓ ఇందిర,కార్యాలయ, ఈజీయస్ సిబ్బంది,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

వ్యవసాయ మార్కెట్ లో……

స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ,ఏఐటీయూసీ హమాలి యూనియన్ ఆధ్వర్యంలో సిపిఐ జిల్లాకౌన్సిల్ సభ్యుల లంక దాసరి అశోక్ అధ్యక్షతన 79వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.అనంతరం హమాలి యూనియన్ నాయకులు మహనీయుల చిత్రపటాలకు పూలతో నివాళులు అర్పించి జెండావిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగెళ్లి శంకర్,శ్రీపతి రాజయ్య,హమాలీ సీనియర్ ముఠామేస్త్రి బొట్ల భద్రయ్య,కొడపాక ఐలయ్య,కోయిల శంకరయ్య,కోట యాదగిరి,గుట్ట రాజయ్య ల్,దొడ్డే పోచయ్య,కార్మిక నాయకులు పాల్గొన్నారు.

నిజాంపేట లో ఘనంగా 79వ స్వాతంత్ర వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-43.wav?_=6

నిజాంపేట లో ఘనంగా 79వ స్వాతంత్ర వేడుకలు

నిజాంపేట: నేటి ధాత్రి

79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజాంపేట మండలం ప్రభుత్వ కార్యలయాలు, వివిధ పార్టీ కార్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం లో ఎమ్మార్వో శ్రీనివాస్, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ. రాజేష్. ఎంపీడీఓ కార్యలయంలో రాజీరెడ్డి, రైతు వేదికలో సోమలింగారెడ్డి, విద్యుత్ కార్యలయంలో ఏఈ గణేష్, కాంగ్రేస్ పార్టీ కార్యలయంలో వెంకట్ గౌడ్, గ్రామాల్లో గల పాఠశాలలలో ప్రధానోపాధ్యాయులు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.

ఆగస్టు 18–25 పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు..

ఆగస్టు18 నుండి 25 వరకు పాపన్న గౌడ్ 375 వ జయంతి వరోస్తవాలు జయప్రదం చేయండి

తాండూరు( మంచిర్యాల) నేటి ధాత్రి :

భారతదేశం మొట్టమొదటి దళిత బహుజన విప్లవ వీరుడు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం సాధన మార్గాన్ని సూచించి మొగలు పాలకుల మెడలు వంచి పన్నులను రద్దు చేసిన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతివారోత్సవాలను దేశవ్యాప్తంగా ఈ నెల 18 నుండి 25 వరకు గ్రామ గ్రామాన అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని జయప్రదం చేయాలని రాష్ట్ర గౌడ సోదరులందరికి పిలుపునిస్తున్నాం.

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాణిక్ రావు

 

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు , కోహిర్ మాజి సర్పంచ్ కళీమ్ గారి జన్మదిన సందర్భంగా క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు కోహిర్ మండలం అధ్యక్షులు నర్సింలు, ఝరసంఘం మండలం అధ్యక్షులు వెంకటేశం ,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ ,యువ నాయకులు ముర్తుజా ,దీపక్ , మల్లేష్ తదితరులు..

ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు

ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పాకాల మహిళా బ్యాంకులో స్నేహితుల దినోత్సవం వేడుకలు అధ్యక్షురాలు పెండెం రాజేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకొని స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా పెండెం రాజేశ్వరి మాట్లాడుతూ ఈ లోకంలో తల్లితండ్రుల తర్వాత స్వచ్ఛమైన ప్రేమను పంచేది స్నేహితులే అని అన్నారు. కష్టసుఖాల్లో తోడుండి మంచి చెడులను ఆలోచింపజేసే స్నేహితులను ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా బ్యాంక్ కార్యదర్శి ఇమ్మడి పద్మ, డైరెక్టర్ గొర్రె రాధా, గండు శ్రీదేవి, వనజ, మంజుల, మాణిక్యం, స్పందన, కీసర,విజయతోపాటు పలువురు పాల్గొన్నారు.

ఎమ్మార్పిఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఎమ్మార్పిఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

మైకీల్ మాదిగ ఝరాసంగం ఎమ్మార్పీఎస్  మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో  రాయికోటి నర్సింములు విహెచ్పిఎస్ జిల్లా నాయకులు సమన్వయంతో ఝరాసంగం మండలం కేంద్రంగా ఏర్పాటు చేసిన ఆత్మ గౌరవ పతాక ఆవిర్భావ వేడుకలో  ముఖ్య అతిథులుగా విచ్చేసిన అబ్రహం మాదిగ ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు, ఉల్లాస మాదిగ ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్  లు మాట్లాడుతూ సామాజిక న్యాయం పునాదిగా ముప్పై ఏళ్ల పాటు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం అలుపెరుగని పోరాటం చేసి విజయం సాధించి మాదిగ జాతి ఆత్మ గౌరవ ప్రతీకగా భారతీయ సమాజంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు నిలిచిపోయారని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో సైతం ఉద్యమం నడిపిన చరిత్ర ఎమ్మార్పీఎస్ కు మాత్రమే దక్కిందని అన్నారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లు సాధించిన ఘనత ఒక్క ఎమ్మార్పీఎస్ దేనని అన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిరక్షణ ఉద్యమం చేసి చట్టాన్ని కాపాడిందన్నారు. ఎమ్మార్పీఎస్ నడిపిన గుండె జబ్బు పిల్లల ఉద్యమం చేసి దేశవ్యాప్త ఆరోగ్యశ్రీ పథకం రావడానికి స్ఫూర్తి నిచ్చిందని అన్నారు. వృద్ధులు వికలాంగులు వితంతువులు పెన్షన్లు పెరగడానికి ఎమ్మార్పీఎస్ చేసిన ఉద్యమ ఫలితం అన్నారు. ఆకలి కేకల ఉద్యమ యాత్రతో రేషన్ బియ్యం పెంపు జరిగిందన్నారు. అమరవీరుల తల్లుల కడుపుకోత ఉద్యమంతో అమరుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చేసిందని అన్నారు. ఇలాంటి ఎన్నో సామాజిక ఉద్యమాలు నిరంతరం చేసి సమాజంలోని అన్ని వర్గాలకు అండగా ఎమ్మార్పీఎస్ నిలిచిందని అన్నారు.

వెంకటేశం బిఆర్ఎస్ పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు, రబ్బానీ ఎంఐఎం ఝరాసంగం మండల అధ్యక్షులు, నరసింహ గౌడ్ కేతకి సంగమేశ్వర ఆలయ కమిటీ మాజీ చైర్మన్, ఎజాజ్ బాబా టిఆర్ఎస్ పార్టీ ఝరాసంగం పట్టణ అధ్యక్షులు, శివరాజ్ బహుజన సంఘర్షణ సమితి అధ్యక్షులను సన్మానీచడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు.జైరాజ్ మాదిగ జిల్లా
ఉపాధ్యక్షులు,నిర్మల్,ధనరాజ్,హనోక్ తరుణ్, నాగేష్, ప్రశాంత్, రాజు,దినాకర్,ప్రశాంత్, నరేష్, ఇమ్మానుయేల్, అభిషేక్, బన్నీ, డాన్నీ, శ్రీను, రమేష్,నర్సిoములు,శ్రీకాంత్,ప్రవీణ్, చిరంజీవి, బాలరాజ్, రహీం, అరుణ్,భాను మాదిగలు పాల్గొన్నారు.

తీజ్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా” భూక్యా మురళీ నాయక్…

తీజ్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా” భూక్యా మురళీ నాయక్

గిరిజన సాంస్కృతిక వైభవానికి తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తుంది…

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని సబ్ స్టేషన్ తండాలో తీజ్ పండుగ వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు బాదావత్ పవన్ కళ్యాణ్ ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా మహబూబాబాద్ శాసనసభ్యులు డా”భూక్యా మురళీ నాయక్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా మురళీ నాయక్ మాట్లాడుతూ, గిరిజనులందరికి తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన సాంస్కృతిక వైభవానికి తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తుందన్నారు.గిరిజన మహిళలు ఆనందంగా జరుపుకునే ప్రకృతి పండగ తీజ్,అని భక్తి శ్రద్ధలతో జరుపుకోవలన్నారు.

తీజ్ పండగ సందర్భంగా గోధుమ బుట్టలు నెత్తిన పెట్టుకొని పాటలు పాడుతూ, గిరిజన నృత్యం చేసిన గిరిజన మహిళలు.గిరిజనుల తో కలిసి గోధుమ బట్టలు నెత్తిన పెట్టుకున్న ఎమ్మెల్యే డా మురళీ నాయక్ ప్రకృతిని ఆరాధిస్తూ గొప్పగా పూజించే గిరిజన సాంస్కృతిక పండగ తీజ్ ఉత్సవాల్లో పాల్గొనటం సంతోషంగా ఉంది.శ్రావణ మాసంలో గిరిజన మహిళలు అంతా కలిసి ఘనంగా నిర్వహించుకునే తీజ్ పండుగ గిరిజన సాంస్కృతిక వైభవానికి నిదర్శనం అన్నారు. ప్రకృతి తమను చల్లగా చూడాలని కోరుకున్నారు.పూలను, ప్రకృతి ని ఆరాధిస్తూ పండుగలు జరుపుకోవటం మన సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా మారిందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తండావాసులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు..

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

హైదరాబాద్ లో జరిగిన మాజి మార్కెట్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి గారి మేనల్లుడి వివాహా వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు ,మాజి సర్పంచ్ లు కలిం,రవికిరణ్,రమేష్ ,బి ఆర్ ఎస్ నాయకులు నసీర్ ఉద్దీన్, రయిస్ తదితరులు పాల్గొన్నారు.

సాహితీ మేరు నగ ధీరుడు సినారే జయంతి వేడుకలు

సాహితీ మేరు నగ ధీరుడు సినారే జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో లక్ష్మణ్ ప్రింటర్స్ లో డాక్టర్ జనపాల శంకరయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్యనిర్వహణలో జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సినారె జయంతి ఘనంగా జరిగినది. ఈ కార్యక్రమం అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ సాహితి సముద్రుడు మేరు నగ ధీరుడు తెలుగు వెలుగును, తెలుగు కవితను, తెలుగు భాష ఔన్నత్యాన్ని, కడలి దాటించిన తొలి తెలంగాణ జ్ఞానపీఠ సాహితీ శిఖరం, అవార్డు గ్రహీత డాక్టర్ సినారె, అంటూ పద్యాలను ఆలాపించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆకునూరి ఎల్లయ్య మాట్లాడుతూ సినారే వారి సినీ పాటలు కవిత్వము జగము నకు తెలిసిన మహానుభావులు అన్నారు. ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ మాట్లాడుతూ గులేబకావళి కథలో గుబాలింపజేసే సాహిత్యాన్ని విరచించి, సినీ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ప్రతిభాశాలి సినారే. అని అన్నారు. సహాధ్యక్షులు కోడం నారాయణ మాట్లాడుతూ సి.నారాయణ రెడ్డి ప్రముఖ కవిగా, గాయకుడిగా, బోధకుడిగా గురువుగా, మరి సాహిత్యంలో ఎనలేని సేవ చేసినటువంటి ప్రముఖ కవిగా మరియు సినిమాకు రంగంలో పాత్రకు తగ్గట్టుగా పాటలు రాసి మన్నన పొందినాడు. మన తెలంగాణకే ఒక మణి,మకుటమై నిలిచినారు అని అన్నారు. ఉపాధ్యక్షులు బూర దేవానందం కవితా గానం ఆలాపించారు,గుండెల్లి వంశీ కవిత గానాన్ని అలా పించారు,చారి తదితరులు పాల్గొన్నారు

వైభవంగా నాగుల పంచమి వేడుకలు..

వైభవంగా నాగుల పంచమి వేడుకలు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-29T151443.431.wav?_=7

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాత నమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాల యంలో ఉన్న నాగేంద్ర స్వామి గుడిలో మంగళవారం నాగుల పంచమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శ్రావణమాసం పురస్కరించుకొని దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమా చారి నాగదేవతల విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించినారు. దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి రాజ మణి దంపతులు పుట్టలో పాలు పోసి వెండి నాగమయ ప్రతిమను వస్త్రాలను సమ ర్పించి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి భక్తిశ్రద్ధలతో నాగదేవతలను తమ కోరికలు నెరవేర్చాలని వేడుకున్నారు ఈ కార్యక్రమం లో బాసని రమేష్ ధనలక్ష్మి మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆర్కేపీలో నాగుల పంచమి వేడుకలు…

ఆర్కేపీలో నాగుల పంచమి వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-29T143010.107.wav?_=8

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

పవిత్ర శ్రావణమాసంలో మహిళలు జరుపుకునే తొలి పండుగ నాగుల పంచమి.భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో పూజించే వారికి నాగ పంచమి శుభాలను అందిస్తుంది.శ్రావణ మాసం అంటేనే శుభకరం.. మంగళకరం. అలాంటి మాసంలో పర్వదినాలు చాలా ఉన్నాయి. ఈ మాసంలో వచ్చే తొలి పండగ నాగ పంచమి. మంగళవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని విజయ గణపతి దేవాలయంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలంతా ఉదయం నుండి దేవాలయం ప్రాంగణంలోని పుట్ట దగ్గర నాగ దేవుడికి పాలు పోసి, కొబ్బరికాయలు కొట్టి నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని నాగదేవతకు మొక్కుకున్నట్లు పలువురు మహిళలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆలయ పూజారులు రాజేందర్ శర్మ, సతీష్ శర్మ లు మాట్లాడారు. హిందువులు పాములను నాగేంద్ర స్వామి దైవంగా భావించి పూజలు చేస్తారని, నాగేంద్ర స్వామిని పూజించేందుకు నాగుల చవితి తర్వాత నాగపంచమి రోజున పుట్టలో పాలు పోసి ప్రత్యేకంగా పూజలు చేస్తారని తెలిపారు.

ఘనంగా నాగుల చవితి వేడుకలు..

జహీరాబాద్ లో నాగుల చవితి వేడుకలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-29T123835.900.wav?_=9

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ లో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నాగదేవత ఆలయాలు, పుట్టల వద్ద పాలు పోసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పట్టణంలోని 1008 నాగదేవత ఆలయం, నాగుల కట్టలోని నాగదేవత ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లోని పుట్టల వద్ద భక్షాలు, పాలు నైవేద్యంగా సమర్పించి మొక్కలు చెల్లించుకుంటున్నారు.

పూరి సేతుప‌తి సెట్‌లో.. స‌ర్ మేడ‌మ్‌సెల‌బ్రేష‌న్స్‌..

పూరి సేతుప‌తి సెట్‌లో.. స‌ర్ మేడ‌మ్‌సెల‌బ్రేష‌న్స్‌

విజ‌య్ సేతుప‌తి నూత‌న చిత్రం స‌ర్ మేడ‌మ్ సెల‌బ్రేష‌న్స్ పూరి జ‌గ‌న్నాథ్ కార్యాల‌యంలో నిర్వ‌హించారు.

నిత్యం వైవిధ్య‌భ‌రిత‌ సినిమాల‌తో అల‌రిస్తున్న త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి (Vijay Sethupathi). తాజాగా స‌ర్ మేడ‌మ్ అనే త‌మిళ అనువాద చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ప్ర‌స్తుతం ఆయ‌న తెలుగులో పూరి జ‌గ‌న్నాథ్ (Puri Jagannadh) తో క‌లిసి ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సంయుక్త మీన‌న్ (Samyuktha) క‌థానాయిక‌గా చేస్తోంది. ఇప్ప‌టికే షూటింగ్ స్టార్ట్ చేసి శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ చేస్తున్నారు.

అయితే విజ‌య్ సేతుప‌తి రీసెంట్ సినిమా త‌లైవ‌ర్ త‌లైవి (స‌ర్ మేడ‌మ్ Sir Madam) ఈ రోజు (శుక్రవారం) థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఇటు తెలుగు, అటు త‌మిళంలో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్న నేపథ్యంలో చార్మీ (Charmme Kaur), పూరి (Puri Jagannadh) స‌మ‌క్షంలో హైద‌రాబాద్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ సెల‌బ్రేష‌న్స్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య్ సేతుప‌తి (Vijay Sethupathi)తో పాటు పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మీ వారి సినిమా బృందం (#PuriSethupathi) పాల్గొంది. ఇదుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్నాయి.

ఘనంగా కేటీర్ జన్మదిన వేడుకలు..

ఘనంగా కేటీర్ జన్మదిన వేడుకలు..

ఏనుమాముల, నేటిధాత్రి

మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) 49వ జన్మదిన వేడుకలను గురువారం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కేతిరి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ వద్ద ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏల్లవుల కుమార్ యాదవ్ కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం అన్నారు. కేతిరి రాజశేఖర్ మాట్లాడుతూ 18నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ,ఎప్పుడు ఎన్నికలు జరిగినా టిఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గండ్రాతి భాస్కర్ పత్రి సుభాష్ ఉద్యమకారుడు హస్తం యాదగిరి పసులాది మల్లయ్య కేతిరి సమ్మక్క రంగరాజు విజయ ఆటో యూనియన్ నాయకుడు ఎండి సలీం భామల పెళ్లి కిరణ్ పున్నం ప్రభాకర్ వీరాచారి గండ్రాతి నవీన్ సతీష్ కొత్తపెళ్లి సునీల్ ఆడేపు అశోక్ బొల్లె సాంబయ్య గుమలాపురం హైమావతి ఎండి గౌస్య కుడికాల పద్మ ఈరెల్లి రజిత, రంగు లక్ష్మి, ఎండి జావిద్, ఎండి ఫిరోజ్, గంధం కిషోర్, పస్తం రవి ప్రసాద్ శ్రీనివాస్ దామెర లెనిన్ తదితరులు పాల్గొనడం జరిగింది

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version