మున్సిపల్ చైర్మన్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు…

మున్సిపల్ చైర్మన్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు

అభివృద్దే ద్యేయంగా పనిచేసే నాయకుడు పావుశెట్టి సునీల్

18వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యులు పసుల శ్రీనివాస్

పరకాల,నేటిధాత్రి

 

పరకాల మున్సిపాలిటీ నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పావుశెట్టి సునీల్ కుమార్‌ను శుక్రవారం పలువురు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.ఈ సందర్భంగా 18వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యుడు పసుల శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒంటేరు రమేష్ చైర్మన్‌ను కలసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ సందర్బంగా పసుల శ్రీనివాస్ మాట్లాడుతూ పావుశెట్టి సునీల్ కుమార్ మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం పరకాల పట్టణ అభివృద్ధికి మంచి సూచిక అని నాయకులు పేర్కొన్నారు. ప్రజల ఆశయాలను నెరవేర్చేలా ఆయన పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.పట్టణ అభివృద్ధి కోసం చైర్మన్ పావుశెట్టి సునీల్ సమర్థంగా పనిచేస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేయాలని కోరారు.

డీసీసీ అధ్యక్షుడికి ఘన సత్కారం

ఇనుగాలకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

పరకాల,నేటిధాత్రి

 

డీసీసీ అధ్యక్షుడిగా ఇనుగాల వెంకటరామిరెడ్డి నియమితులు అయినా సందర్బంగా పరకాల మున్సిపలైటిటి 18వ వార్డు అధ్యక్షుడు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు పసుల శ్రీనివాస్,ఒంటెరు కుమార్,బొచ్చు వినోద్ కుమార్ లు కలిసి పూల బొకే అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పార్టీని మునుముందు రోజుల్లో పెద్ద ఎత్తున బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలని శ్రీనివాస్,కుమార్, ఇనుగాలను కోరారు.జిల్లాకు పార్టీ కొత్త అధ్యక్షులు ఇనుగాల నియామకం కావడంతో మర్యాదపూర్వకంగా కలిసి శుభాభినందనలు తెలిపామన్నారు.డిసిసి జిల్లాఅధ్యక్షులు వరంగల్ కూడా చైర్మన్ మరియు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికలలో విజయ డంక మోగిస్తుందని ఆకాంక్షించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version