విధి నిర్వహణలో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి.

విధి నిర్వహణలో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి

జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి జైపూర్ మండలంలోని ఇందారం,టేకుమట్ల, కిష్టాపూర్,వేలాల గ్రామపంచాయతీలను ఆకస్మికంగా సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్లాస్టిక్ ఎక్కడ ఉండకూడదని,క్రమం తప్పకుండా డ్రై వేస్ట్ కలెక్షన్ చేయాలని,డ్రైనేజీలలో పూర్తిస్థాయిలో మట్టి తీయాలని,క్రమం తప్పకుండా రికార్డులను అప్డేట్ చేయాలని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంటుంది. గనుక ముందస్తుగా గ్రామంలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని,అదేవిధంగా నీటిని పంపిణీ చేసే ప్రతిసారి బ్లీచింగ్ పౌడర్ కలపాలని,క్రమం తప్పకుండా నీటిని పరీక్షించాలని,వేస్ట్ కలెక్షన్ రిజిస్టర్,కంపోస్ట్ కంజుమ్షన్ రిజిస్టర్ నిర్వహించాలని,క్యాష్ ఇన్ హ్యాండ్ త్వరగా గ్రామపంచాయతీ సాధారణ నిధికి జమ చేయాలని,విధి నిర్వహణలో ప్రతిక్షణం చాలా అప్రమత్తంగా ఉండాలని లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గురువారం రాత్రి సంభవించిన గాలి దుమారానికి ఎగిరిపోయిన నర్సరీ షేడ్ నెట్ ను సరిచేయాలని,చలివేంద్రంలో వాటర్ క్రమం తప్పకుండా నింపాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వరరావు,ఎంపీఓ శ్రీపతి బాపు రావు,పంచాయితీ కార్యదర్శులు ఏ.సుమన్,ఆర్. శ్రావణి,ఎల్.ప్రశాంత్,రాకేష్ గ్రామపంచాయతీల పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్నికల విధులు నిర్వహించు సిబ్బందికి నియామక ఉత్తర్వులు జారీ చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

శనివారం ఐడిఓసి కార్యాలయంలో గ్రామ పంచాయతి, మండల, జిల్లా ప్రజా పరిషత్తు ఎన్నికలు నిర్వహణకు సిబ్బంది నియామకం, శిక్షణా కార్యక్రమాలు నిర్వహణ తదితర అంశాలపై రెవెన్యూ, పంచాయతి రాజ్, మాస్టర్ ట్రైనర్లుతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా సాగేందుకు అవసరమైన సిబ్బంది నియామకం చేపట్టి, వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించుటకు సిబ్బందికి శిక్షణ అత్యంత కీలకమని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగి తన బాధ్యతలను సమగ్రంగా అర్థం చేసుకుని, సక్రమంగా విధులు నిర్వహించడానికి శిక్షణ కార్యక్రమాలు అత్యంత ముఖ్యమని తెలిపారు. ఎన్నికల విధులకు అవసరమైన సిబ్బందిని సకాలంలో నియమించి, వారికి విధుల నిర్వహణ ప్రక్రియపై ఎన్నికల సంఘం మార్గదర్శకాలను వివరించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు భూపాలపల్లి, కాటారం డివిజన్లు వారిగా షెడ్యూల్ తయారు చేయాలని పేర్కొన్నారు. ఎన్నికలు నిర్వహణపై సిబ్బంది సమగ్రమైన అవగహన కలిగి ఉండాలని, అపుడే ఎన్నికలను ఎలాంటి పొరపాటుకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిపిఓ నారాయణరావు, భూపాలపల్లి ఆర్డీఓ రవి, అన్ని మండలాల ఎంపీడీఓలు, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version