రామన్నపేట నియోజకవర్గం తప్పకుండా ఏర్పాటు చేయాలి.

రామన్నపేట నియోజకవర్గం తప్పకుండా ఏర్పాటు చేయాలి

రామన్నపేట అఖిలపక్ష నాయకులు

రామన్నపేట నేటి ధాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా

 

 

 

 

రామన్నపేట నియోజకవర్గం ఏర్పడాలని మండల కేంద్రంలో మల్లికార్జున ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ సాధన సమితి రెండవ సమావేశానికి రెబ్బసు రాములు అధ్యక్షతన వహించగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ
రామన్నపేట నియోజకవర్గం 1952లో ఏర్పడినది నాటి నుంచి రామన్నపేట నియోజకవర్గంలో వలిగొండ
మోత్కూరు ఆత్మకూరు గుండాల మండలాలు ఉండేవి
ఈ ప్రాంతాన్ని పరిపాలించిన నాయకుల్లో ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అయినారు ఈ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు రామన్నపేట మండల కేంద్రంలో నాడు అన్ని రకాల సౌకర్యాలు ఉండేవి రామన్నపేట నియోజకవర్గం గొప్ప నాయకులు అభివృద్ధి పథంలో నడిపినారు రామన్నపేట నియోజకవర్గం 2009లో మన ప్రాంత నాయకులు ఢిల్లీ వరకు పోరాటం చేసిన మన పోరాటం ఒక పీడకల లాగా మనకు మెలిగింది మన మండలంలో వివిధ పార్టీలకు సంబంధించిన గొప్ప పోరాట యోధులు గొప్ప లీడర్లు ఉన్నారు ఢిల్లీ వరకు వెళ్లి పోరాటం చేసిన దురదృష్టం మనల్ని వెంటాడుతూ నియోజకవర్గం మన నుండి విడిపోయి నకిరేకల్ లో కలిసినది నాటి నుంచి రామన్నపేట నియోజకవర్గం కాస్త మండలం గా మారినది ఆ తర్వాత 100 పడకలు కావలసిన హాస్పిటల్ రికార్డుల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా బోర్డులో మాత్రం ఏరియా హాస్పిటల్ గా కొనసాగుతున్నది రామన్నపేట మండలానికి రావలసిన రెవిన్యూ డివిజన్ డీఎస్పీ ఆఫీసు వివిధ రకాల ఆఫీసులు ఇతర ప్రాంతాలకు తరలిపోయినవి మన నాయకులు పోరాటం చేసిన అదృష్టం మనకు కలిసి రాలేదు
కానీ నేడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు నియోజకవర్గ పునర్విభజన కార్యక్రమం దేశవ్యాప్తంగా కులకన సర్వే జరుగుతున్నది దీనికి అవకాశం 2026 డిసెంబర్ వరకు ఒక నివేదిక పంపాలని చిన్న అవకాశం ఉన్నది యాదాద్రి జిల్లాలో రామన్నపేట నియోజకవర్గం చేసే అవకాశం ఉన్నది కావున ఈ ప్రాంత బిడ్డలుగా ఈ ప్రాంత వాసులుగా నియోజకవర్గానికి కావలసిన అన్ని రకాల ఆఫీసులు కావాల్సినన్ని సౌకర్యాలు ఉన్నవి మన ప్రాంతవాసుల మందరం కలిసికట్టుగా పోరాటం చేసి రామన్నపేట నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కలిసి రామన్నపేట నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలని ముందుకు సాగుదాం అని తెలిపినారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే చాంద్ బిజెపి రాష్ట్ర నాయకులు కన్నెకంటి వెంకటాచారి
బీజేవైఎం నాయకులు లక్ష్మణ్ టిపిసిసి రాష్ట్ర నాయకులు వనం చంద్రశేఖర్
రామన్నపేట పట్టణ అధ్యక్షులు
జమీరుద్దీన్ కాంగ్రెస్ పార్టీ మాజీ వార్డు మెంబర్ గొలుసుల ప్రసాద్
కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ఉద్యమ నాయకులు బొడ్డుపల్లి లింగయ్య
టిడిపి మండల అధ్యక్షులు
ఎండి ఫజల్ టిడిపి నాయకులు పోష బోయిన. మల్లేశం రామన్నపేట పట్టణ టిడిపి అధ్యక్షులు రాములు
డీఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల. నరేందర్ మండల అధ్యక్షులు బందేల .అశోక్ డి.ఎస్.పి నాయకులు మల్లేశం శేఖర్
కిరణ్ కుమార్ సిపిఐ జిల్లా కౌన్సిల్ ఎర్ర రమేష్ గౌడ్.
సిపిఐ నాయకులు శ్రీరామోజు నరసింహాచారి సిపిఎం నాయకులు ఎస్.కె మన్సూర్
రామన్నపేట మాజీ ఉపసర్పంచ్
తెలంగాణ ఉద్యమ నాయకులు గంగాపురం యాదయ్య
ప్రజా పోరాటాల సమితి మండల అధ్యక్షుడు వరి కప్పల గోపాల్ ,ఉద్యమకారుల ఫోరం మండలాధ్యక్షులు
నోముల శంకర్ తదితరులు పాల్గొన్నారు

కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై సమగ్ర న్యాయవిచరణ జరిపించాలి.

కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై సమగ్ర న్యాయవిచరణ జరిపించాలి

ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి వై గీత

వికారాబాద్/ హైదారాబాద్ నేటిధాత్రి:

సంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని పాశం మైలారంలోని సిగా చి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో పదుల సంఖ్యలో కార్మికులు మరణించడం అనేకమంది తీవ్ర క్షతగాత్రులైన సంఘటనపై సమగ్ర న్యాయచారణ జరిపించాలని ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి వై గీత డిమాండ్ చేశారు.ఈ సంఘటనకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని తేల్చి చెప్పారు.ఈ దుర్ఘటనకు ఫ్యాక్టరీలో తగిన రక్షణ చర్యలు చేపట్టకపోవడం, లేబర్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ల ఇన్స్పెక్షన్ లేకపోవడం వలన జరిగిందని ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ అభిప్రాయపడిందన్నారు. మరణించిన క్షతగాత్రులైన కార్మిక కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని తక్షణమే ప్రాసిక్యూట్ చేసి, సెక్షన్ 304 కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, మరణించిన కార్మికులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లిస్తూ కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని ఇవ్వాలని, తీవ్రంగా క్షతగాత్రులైన కార్మికులకు ఒకరికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వివరించారు. కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని ప్రభుత్వ పరివేక్షణలో యాజమాన్యం,ప్రభుత్వం పూర్తిస్థాయిలో వారు( కార్మికులు) సంపూర్ణంగా కోరుకునే వరకు అందించాలని వై గీత డిమాండ్ చేశారు.

మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలు

మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలు

వనపర్తి లో వార్డుల పర్యటనలో బీ ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్

వనపర్తి నేటిదాత్రి :

మాజి మంత్రి నిరంజన్ రెడ్డి ఆదే శాల మేరకు స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీ ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలను ఉత్తజ పరుస్తూ వనపర్తి లో పట్టణ బీ ఆర్ ఎస్ అధ్యక్షులు పలస రమేష్ గౌడ్ బీ ఆర్ ఎస్ పార్టీ నేతల తో కలిసి 5 20 వార్డులలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ఈమేరకు బీ ఆర్ ఎస్ పార్టీ ప్రజల కు అండ గా ఉంటుందని వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు.
వనపర్తి పట్టణంలో రోడ్ల విస్తరణతో,చెరువుల పునరుద్ధరణ,పార్కుల అభివృద్ధి ,విద్యా మెడికల్ ఇంజనీరింగ్ చిట్యాల రోడ్డు లో నూతన మార్కెట్ యార్డు ఇంకా వనపర్తి పట్టణ అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి మున్సిపల్ ఎన్నికలలో బి.ఆర్.ఎస్ పార్టీకి పట్టం కట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు వార్డుల పర్యటన లోజిల్లా బీ ఆర్ ఎస్ అధ్యక్షులు గట్టు యాదవ్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఆసరా పింఛన్లు,మహిళలకు 2500,గ్యాస్ సబ్సిడీ, మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వారు అన్నారు వార్డుల పర్యటన లో
జిల్లా అధికార ప్రతినిధి వాకిటి.శ్రీధర్,మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ప్రధాన కార్యదర్శి గంధం.పరంజ్యోతిమాజీ కౌన్సిలర్స్ నాగన్న యాదవ్, ఉంగ్లం. తిరుమల్,రమేష్ నాయక్,స్టార్.రహీమ్ గులాం ఖాదర్ ఖాన్ సూర్యవంశంగిరి జోహెబ్ హుస్సేన్ఇమ్రాన్,వార్డ్ అధ్యక్షులు రవి కుమార్,చంద్రయ్య జహంగీర్
ఎర్ర.శ్రీనివాసులుసునీల్ వాల్మీకి,బొడ్డుపల్లిసతీష్ నందిమల్ల.రమేష్,ప్యాత.తిరుపతయ్య,ప్రేమ్ కుమార్ఎ.కె పాషా,బెంగాలీ.రఘు మునికుమార్, గోకం.శివ,రామస్వామి,రామ్ చంద్రయ్య,మహిళా అధ్యక్షురాలు నాగమ్మ,నల్లవత్తులవెంకట్ ఉందేకోటి.కృష్ణ,తోట.శ్రీను,జావేద్,జానకి రామ్,ఆంజనేయులు,బోయ.లక్ష్మీ,షాహిన్,షాహిద్, దేవమ్మ పార్టీ నేతలు పాల్గొన్నారు.

అనధికారిక నిర్మాణాలపై చర్యలు తీసుకోండి..

*అనధికారిక నిర్మాణాలపై చర్యలు తీసుకోండి..

కమిషనర్ ఎన్.మౌర్య..

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 01:

 

 

 

 

నగరపాలక సంస్థ అనుమతులు లేకుండా నగరంలో నిర్మిస్తున్న భవనాలు, నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని 45 వ వార్డు లోని శివజ్యోతినగర్, ప్రగతి నగర్, అయ్యప్ప కాలని, అంధుల శరణాలయం తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య, అభివృద్ధి పనులను కార్పొరేటర్ అనీష్ రాయల్, వివిధ శాఖల అధికారులతో కమిషనర్ పరిశీలించారు. శివజ్యోతి నగర్ వద్ద వేసిన కొత్త రోడ్డులో వాహనాలు పార్కింగ్ చేయడం, మద్యం సేవిస్తున్నారని, రోడ్లలో గుంతలు ఎక్కువగా ఉన్నాయి పూడ్చాలని ప్రజలు కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పోలీసుల సాయంతో వాహనాలు పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. డ్రైనేజీ కాలువల్లో ఉన్న చెత్తను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించి నోటీసులు ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ప్రగతి నగర్, అయ్యప్ప కాలనీల్లో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బైపాస్ రోడ్డులోని ఓరియన్ హోటల్ నుండి మురుగునీటి కాలువల్లో కలుస్తున్న వ్యర్థాలను అరికట్టి తగు చర్యలు చేపట్టాలని హెల్త్ ఆఫీసర్ ను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ గోమతి,డి.ఈ. రమణ, శిల్ప, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ రవి, ఏసీపీ మూర్తి, సర్వేయర్ కోటేశ్వర రావు, శానిటరీ సూపర్ వైజర్ సుమతి, తదితరులు ఉన్నారు.

డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆందోళన

డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆందోళన

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్లో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. ఏడాదిన్నర క్రితం ఇళ్లు కేటాయిస్తూ మంజూరుపత్రాలు జారీచేసినా ఇళ్లను అప్పగించడంలేదని స్థానిక మండల రెవెన్యూ కార్యాలయాన్ని సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడించారు. ఆందోళనపై స్పందించిన అధికారులు ఈనెల 7వ తేదీలోపు ఇళ్లతాళాలు లబ్ధిదారులకు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. లబ్దిదారులకు తాళాలు ఇవ్వనిపక్షంలో ఆందోళన చేపడతామని సీపీఎం నాయకుడు మహిపాల్ హెచ్చరించారు.

అప్పులున్నా హామీలు నెర‌వేరుస్తున్నాం ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు.

అప్పులున్నా హామీలు నెర‌వేరుస్తున్నాంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

తిరుప‌తి(నేటి ధాత్రి) జూలై 01:

ఎన్నిక‌ల హామీలను ఏడాదిలోనే 85శాతం నెర‌వేర్చిన ఘ‌నత ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వానికే ద‌క్కింద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. ఎన్టీఆర్ భ‌రోషా పెన్ష‌న్ల‌ను మూడువ డిజ‌వ‌న్ లోని ప్ర‌గ‌తీన‌గ‌ర్ లో ఎమ్మెల్యే ల‌బ్దిదారుల ఇళ్ళ‌కు వెళ్ళి పంపిణీ చేశారు. ఎన్డీఏ కూట‌మి నాయ‌కుల‌తోపాటు సిపిఐ నాయ‌కులు పెంచ‌ల‌య్య పెన్ష‌న్ల పంపిణీలో పాల్గొన్నారు. ప్ర‌ధాన డ్రైనేజీ కాలువ ఎత్తు త‌క్కువుగా ఉండ‌టంతో మురుగు నీరు పొర్లి ఇళ్ళ‌లోకి వ‌స్తున్న‌ట్లు స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువ‌చ్చారు. కాల‌నీ విస్తరిస్తున్నా విద్యుత్ అధికారులు పోల్స్ ఏర్పాటు చేయ‌క‌పోతుండ‌టంతో త‌మ‌కు వీధి లైట్లు లేక ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు వారు ఎమ్మెల్యేకి తెలిపారు. కాగా సిపిఐ నాయ‌కులు పెంచ‌ల‌య్య ప్ర‌గ‌తీన‌గ‌ర్ లోని స‌మ‌స్య‌ల‌ను ఎమ్మెల్యేకి వివ‌రించారు. స్థానికులు త‌న దృష్టికి తీసుకువ‌చ్చిన స‌మ‌స్య‌ల‌ను వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రిస్తామ‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు హామీ ఇచ్చారు. కాగా ఎన్నిక‌ల్లో ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ఇచ్చిన మాట ప్ర‌కారం మూడు వేల రూపాయ‌ల పెన్ష‌న్ ను నాలుగు వేలు చేసి ఏడాది నిండింద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు. తిరుప‌తిలో 18వేల 664 మంది పెన్ష‌న‌ర్లు ఉండ‌గా వారికి 8 కోట్ల 23 ల‌క్ష‌ల రూపాయ‌లు అందిస్తున్నట్లు ఆయ‌న తెలిపారు. సూప‌ర్ సిక్స్ హామీల్లో కీల‌క‌మైన పిఎం కిసాన్ – అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కం త్వ‌ర‌లో ప్ర‌భుత్వం అమ‌లు చేస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. అలాగే ఆగ‌స్టు 15వ తేదీ మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం ప్ర‌భుత్వం క‌ల్పించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాల‌న‌లో పెన్ష‌న్ రెండు వేల నుంచి మూడు వేల‌కు పెంచేందుకు ఐదేళ్ళు ప‌ట్టింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. బ‌ట‌న్ నొక్కి సొంత ప్ర‌చారం మాజీ సిఎం జ‌గ‌న్ చేసుకున్నారే త‌ప్ప ల‌బ్దిదారుల‌కు డ‌బ్బులు మాత్రం ప‌డ‌లేద‌ని ఆయ‌న ఆరోపించారు. 10ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని వైసిపి ప్ర‌భుత్వం దివాళా తీయించినా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోది స‌హ‌కారంతో సంక్షేమం, అభివృద్ధి స‌మ‌పాళ్ళ‌లో ముందుకు తీసుకువెళ్ళుతున్న ఘ‌న‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్, యువ‌నాయుకుళు లోకేష్ ల‌దేన‌ని ఆయ‌న కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి నాయ‌కులు కోడూరు బాల‌సుబ్ర‌మ‌ణ్యం, సిపిఐ నాయ‌కులు పెంచ‌ల‌య్య‌, జ‌న‌సేన నాయ‌కులు రాజా రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీదే గెలుపు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీదే గెలుపు

మాటేడు ఎంపీటీసీ పరిధి లో
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరవేయాలని బిఆర్ఎస్ తొర్రూర్ మండల పార్టీ ఇన్చార్జ్ శ్రీరామ్ సుధీర్, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు మరియు మాజీ జెడ్పిటిసి జిల్లా ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ గార్లు అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి:

 

గౌరవ శ్రీ మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు* చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుంది
తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు చేసింది ఏమీలేదు అన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలలో కోతలు ఎగవేతలు తప్ప చేసింది ఇచ్చింది శూన్యం అన్నారు..
ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తగిన బుద్ధి చేపటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
రైతు బంధు రెండు పంటలకు ఎగనామం పెట్టారని రైతు రుణమాఫీ 60% రైతులకు కూడా జరగలేదని తెలిపారు.
మహిళలకు తులం బంగారం మరియు 2500 రూపాయలు ఇస్తానని మోసం చేసారు. భూమి లేని పేదలకు 12000 ఇస్తామని ప్రజలను మభ్యపెట్టారని తెలిపారు.
మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మొదలు పెట్టిన అభివృద్ధి పనులు ఎందుకు పూర్తి చేయలేదని స్థానిక ఎంఎల్ఏ ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు..
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు లబ్ధి చేకూరింది.తప్ప పేద ప్రజలకు వచ్చింది శూన్యం అన్నారు…
ఈ కార్యక్రమంలో తొర్రూర్ పట్టణ పార్టీ అధ్యక్షులు బిందు శ్రీనివాస్ ,తొర్రూర్ పట్టణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నలమాస ప్రమోద్ ,తొర్రూర్ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ ఎన్నమనేని శ్రీనివాసరావు, కాలు నాయక్ ప్యాక్స్ డైరెక్టర్ జనార్దన్ రాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు సముద్రాల శీను, బిక్షపతి గ్రామ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ మరియు సోషల్ మీడియా నాయకులు తదితరులు పాల్గొన్నారు

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నర్సంపేట మున్సిపాలిటీ కమిషనర్ కు సమ్మె నోటీసు ఇచ్చారు.సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆరూర్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకు వచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఉన్నటువంటి హక్కులను ఈ నాలుగు లేబర్ కోడ్ వలన కార్మికులకు అన్యాయం జరుగుతుందని ఆదాని అంబానికి మేలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు హన్మకొండ శ్రీధర్, కందికొండ రాజు, నాయకులు ఇప్ప సతీష్, జగన్నాధం కార్తీక్, మోలుగురి రాజు, మున్సిపాలిటీ కార్మికులు యశోద, హన్మకొండ మరియా, ఉమా ఎలీషా తదితరులు పాల్గొన్నారు.

9 జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి.

ఈనెల 9 జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి

నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలి.

కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

 

 

కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని జాతీయ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కొరిమి రాజ్ కుమార్, మిరియాల రాజిరెడ్డి, తుమ్మల రాజిరెడ్డి, చక్రపాణి, విశ్వనాధులు డిమాండ్ చేశారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటియుసి కొమురయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలం నుండి 44 కార్మిక చట్టాలను సాధించుకోవడం జరిగిందని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఈ కార్మిక 44 చట్టాలను నాలుగు కోడులుగా విభజించి కార్మిక హక్కులను కాల రాస్తున్నాయని మండిపడ్డారు. ఈ కోడ్ ల విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 9 న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులంతా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెతో కార్మిక శక్తి ఏంటో కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా సింగరేణి సంస్థను పరిరక్షించే విధంగా జాతీయ సంఘాల జేఏసీ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ నాలుగు లేబర్ కోడ్ ల వల్ల కార్మిక సంఘాలు ఉండకూడదని కుట్రతో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం లేబర్ చట్టాలను తెచ్చిందని, కార్పొరేట్ శక్తులకు లాభం చేసే ఈ నాలుగు కోడ్ల అమలు వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని, భూపాలపల్లి ఏరియాలోని అన్ని సంఘాల నాయకులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జేఏసీ సంఘాల నాయకులు మాతంగి రామ్ చందర్, నూకల చంద్రమౌళి, బడి తల సమ్మయ్య, కంపేటి రాజయ్య, గణేష్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.

బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం లక్కీ డ్రా.

బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం లక్కీ డ్రా

భూపాలపల్లి నేటిధాత్రి:

2025 -26 సంవత్సరమునకు గాను బెస్ట్ అవైలబల్ స్కూల్స్ స్కీం పథకం క్రింద 1వ తరగతి 5వ తరగతి లో ప్రవేశము కొరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడిఓసి మీటింగ్ హాల్ లో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి విద్యాశాఖ అధికారి రాజేందర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా స్కీం నిర్వహించడం 1వ తరగతికి (41) సీట్లు గాను (1) అధర్శ హై స్కూల్ కు – 08, (2) వివేకానంద హై స్కూల్ కు – 08, (3) సెయింట్ పీటర్స్ హై స్కూల్ కు- 09, (4) సువిద్యా హై స్కూల్ కు – 08, (5) సి ఎస్ ఐ మెమోరీస్ కు – 08, 5వ తరగతికి (43) సీట్లు గాను (1) అధర్శ హై స్కూల్ కు – 14, (2) వివేకానంద హై స్కూల్ కు 14, (3) సువిద్యా హై స్కూల్ కు -15, సీట్లు లక్కీ డ్రా పద్దతి లో కేటాయించడం జరిగినది. లక్కీ డ్రా స్క్రీన్ కార్యక్రమంలో నందు విజయ లక్ష్మీ జిల్లా అడిషనల్ కలెక్టర్ జయశంకర్ భూపాలపల్లి రాజేందర్ జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి టి డబ్ల్యూ ఆర్ ఎస్ జిల్లా కొ-ఆర్డినేటర్ స్కూల్ ప్రిన్సిపల్స్, విద్యార్ధిని, విద్యార్ధులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

బాలాజీ టెక్నో స్కూల్లో జాతీయ వైద్యుల దినోత్సవం

బాలాజీ టెక్నో స్కూల్లో జాతీయ వైద్యుల దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలంలోని లక్నెపల్లి లోని బాలాజీ టెక్నో స్కూల్ లో నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేషన్ నిర్వహించారు.ముఖ్య అతిథిగా బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. భారతరత్న అవార్డు గ్రహీత పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగా సేవలందించిన డాక్టర్. బిథాయ్ చంద్రరాయ్ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు దేశాలలో ఈ వేడుకలను జరుపుకుంటారన్నారు. ఆరోగ్య సమాజం లక్ష్యంగా ఎంచుకొని అంకిత భావంతో నిస్వార్ధంగా రోగులకు సేవ చేయడమే వైద్యుల గురుతర బాధ్యత. ఆ దిశగా విద్యార్థులు బాగా చదివి, వైద్య వృత్తిలో స్థిరపడి, బడుగు, పేద ,వర్గాల ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని అప్పుడే మంచి గుర్తింపు లభిస్తుందని గుర్తుచేశారు. విద్యార్థులు వైద్యుల వేషధారణతో వచ్చి భవిష్యత్తు లక్ష్యానికి అనుగుణంగా చక్కని ఉపన్యాసం ఇచ్చారు. ప్రదర్శనలు చేశారు.బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ పి. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో వైద్య రంగంలో రాణిస్తూ దేశానికి సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్.సి.సి థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్, ఉపాధ్యాయులు రమేష్, రవీందర్ రెడ్డి, రాజేష్, రాజు , ప్రీతి, అనిత,పూర్ణిమ,రాజ్ కుమార్, సునీత, ప్రద్యుమ్న విద్యార్థులు పాల్గొన్నవారు.

నర్సంపేట పట్టణంలో జాతీయ వైద్యుల దినోత్సవం వేడుకలు..

బాలాజీ విద్యాసంస్థలలో ఒక్కటైన అక్షర ద స్కూల్, ద్వారకపేటలోని గల బాలాజీ
ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్లో జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని డాక్టర్స్ డే ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ
కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు డాక్టర్స్ వేషధారణలతో అందరిని అలరించారు.ఈ కార్యాక్రమానికి బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, టెజరర్
డాక్టర్ వనజ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల సెక్రెటరి డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి ,బాలాజీ
ఇంటిగ్రేటెడ్ ప్రిన్సిపాల్ జ్యోతి గౌడ్ ,అక్షర ద స్కూల్ ప్రిన్సిపాల్ జి. భవాని, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు సన్మానం.

డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు సన్మానం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

 

 

 

మంచిర్యాలలో డాక్టర్ డే ను ఘనంగా మంగళవారం నిర్వహించారు.మంచిర్యాల హెల్త్ కేర్ హాస్పిటల్ డాక్టర్ ఆంజనేయులు,డాక్టర్ భాగ్యలక్ష్మిని మంచిర్యాల ముస్లిం యూత్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు అండ్ నాజ్ ఫౌండేషన్ సభ్యులు శాలువతో ఘనంగా సన్మానించడం జరిగింది.అనంతరం యూత్ కమిటీ ప్రెసిడెంట్ అబ్దుల్ ఖలీద్ మాట్లాడుతూ హెల్త్ కేర్ హాస్పిటల్ డాక్టర్ ఆంజనేయులు పేదవాళ్ళకి తన వంతుగా తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ చేస్తున్నారనీ,పేదవారికి తన వంతు సహాయం అందిస్తున్నారు.గనుక
డాక్టర్స్ డే సందర్భంగా సన్మానం చేయడం ఎంతో ఆనందకరంగా ఉందని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల ముస్లిం యూత్ వెల్ఫేర్ కమిటీ ప్రెసిడెంట్ అబ్దుల్ ఖలీద్ మరియు నాజ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఎం.డి సాదిక్,ఎం.డి మజీద్ తదితరులు పాల్గొన్నారు.

బిటి 3 పత్తి విత్తనాలను నియంత్రించాలి.

బిటి 3 పత్తి విత్తనాలను నియంత్రించాలి

సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ గౌడ్

మరిపెడ నేటిధాత్రి.

మరిపెడ మండలం
లోని రబీ సీజన్ వ్యవసాయ పనులు ప్రారంభమైన వేల మరిపెడ మండలంలోని అమాయకులైన రైతులను ఆసరాగా చేసుకుని బీటీ3పత్తి విత్తనాలను విచ్చలవిడిగా మరిపెడ మండలంలోని వివిధ గ్రామాల్లో విక్రయిస్తున్నారు అదేవిధంగా మరిపెడ మండలంలోని అనుమతి లేని ఫెర్టిలైజర్స్ అనుమతులు ఉండి రెన్యువల్ చేయని చేయని ఫెర్టిలైజర్స్ షాపులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ నిషేధించినటువంటి క్రిమి సహారక రసానిక ఎరువులను అన్ని ఫెర్టిలైజర్ షాపులు నిల్వలు లేకుండా చూడాలని రైతులకు ఎమ్మార్పీ ధరలకు ఎరువుల బస్తాలు క్రిమి సారక మందులను అందించాలని వారు డిమాండ్లతో కూడిన వినపత్రాన్ని మరిపెడ ఏవో గారికి సిపిఐ మరిపెడ మండలం తరపున కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ యాకన్న సత్యం రాజేష్ తదితరులు పాల్గొన్నారు

రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ లో జిల్లాకు రెండు బంగారు పథకాలు.

రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ లో జిల్లాకు రెండు బంగారు పథకాలు

కిక్ బాక్సింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసి శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

 

జూన్ 28, 29 తేదీలలో మహబూబ్ నగర్ లో నిర్వహించిన తెలంగాణ కిక్ బాక్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యార్థులు పాల్గొని పలు విభాగాలలో పతకాలు సాధించినట్లు సీనియర్ మాస్టర్, కిక్ బాక్సింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసి శ్రీనివాస్ ( కరాటే ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మాస్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మ్యూజికల్ క్రియేటివ్ ఫామ్ విభాగంలో టి హరిణి బంగారు పతకం, బి మగ్న నిర్వాన వెండి, టి దృతిపర్ణిక, ఎం విధ్విన్, బి లవణ్ కుమార్, బి ఆరాధ్య లు రజిత పతకాలు సాధించారని తెలిపారు. క్రియేటివ్ వెపన్ విభాగంలో పి అవిక వెండి పతకం, టి హరిణి, కె కౌశిక్ మగ్న నిర్వాన రజిత పతకాలు, చిల్డ్రన్, ఎంగెస్ట్ కేటగిరి పాయింట్ ఫైటింగ్ విభాగంలో బి ఆరాధ్య వెండి పతకం, టి హరిణి రజిత పతకం, బి మాగ్న నిర్వాన, కె హరిణి, టి దృతిపర్ణిక లు వెండి పతకాలు, ఎం విధ్విన్ బంగారు , కె కౌశిక్, ఎం విధిష దేవి రజిత పతకాలు, ఎస్ సంజన బంగారు పతకం సాధించారన్నారు. అదేవిధంగా లైట్ కాంటాక్ట్ ఫైటింగ్ విభాగంలో ఎం విధిష దేవి, ఎస్ సంజన, బి లవణ్ కుమార్ లు బంగారు పతకాలు, కె హరిణి రజిత పతకాలు, సీనియర్ మాస్టర్స్ విభాగంలో క్రియేటివ్ ఫామ్, క్రియేటివ్ వెపన్ విభాగాలలో జి అశోక్ వెండి, రజిత పతకాలు సాధించినట్లు తెలిపారు. పతకాలు సాధించిన తమ విద్యార్థులను తెలంగాణ కిక్ బాక్సింగ్ అధ్యక్షులు రామాంజనేయులు, కార్యదర్శి మహిపాల్ లు ప్రత్యేకంగా అభినందించినట్లు ఈ సందర్భముగా మాస్టర్ శ్రీనివాస్ తెలిపారు.

కిష్టంపేట గ్రామాన్ని సందర్శించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ.

కిష్టంపేట గ్రామాన్ని సందర్శించిన రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ…

చందుర్తి నేటిధాత్రి:

ఈరోజు చందుర్తి మండలం కిష్టంపేట గ్రామాన్ని అడిషనల్ ఎస్పి చంద్రయ్య సందర్శించారు. ఇటీవల గ్రామంలో తేలుకాటుకు గురై సరియైన వైద్యం అందక మరణించిన చిన్నారి విషయంలో, ఆర్ఎంపీ డాక్టర్ పై నమోదైన కేసులో మృతురాలి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యులను మరియు ఇతర సాక్షులను విచారించడం జరిగింది. ఇందులో భాగంగా ఎస్సీ కాలనీ గ్రామస్తులతో మాట్లాడుతూ మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో వ్యవహరించాల్సిన తీరును మరియు మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలపై కాలనీ వాసులకి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరియు ఆపద సమయంలో ప్రజలు ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరు కూడా పోలీస్ సహాయం తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేష్ మరియు సిబ్బంది ఉన్నారు..

కేసముద్రం మండలంలో అనుమతి పొందిన .!

కేసముద్రం మండలంలో అనుమతి పొందిన ప్రైవేటు పాఠశాలలు

ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలి

మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి

కేసముద్రం/ నేటి ధాత్రి :

 

 

కేసముద్రం మున్సిపల్ మండల లోని ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని ప్రభుత్వ నియవ నిబంధనలు ఉల్లంఘిస్తే అలాంటి ప్రైవేట్ పాఠశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేసముద్రం మండల విద్య శాఖ అధికారి కాలేరు యాదగిరి మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ,

 

 

 

 

 

1) ఉప్పరపల్లి గ్రామంలో లాల్ బహదూర్ విద్యాలయం ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు,
2) కేసముద్రం స్టేషన్ లో సమత మోడ్రన్ హైస్కూల్ ఒకటి నుంచి పదవ తరగతి వరకు,
3) శ్రీ వివేకానంద విద్యాలయం ఒకటి నుండి పదవ తరగతి వరకు,
4) లేపాక్షి విద్యాలయం ఒకటి నుండి పదవ తరగతి వరకు హనుమతులు ఉన్నాయని,
5) అమీనాపురంలో కృషి విద్యానికేతన్ ఒకటి నుండి పదవ తరగతి వరకు,
6) లిటిల్ సిటిజెన్ పాఠశాల నర్సరీ నుండి ఏడవ తరగతి వరకు అనుమతులు ఉన్నాయని,
7) కేసముద్రం విలేజ్ లో శ్రీ వివేకవర్ధిని విద్యాలయము నర్సరీ నుండి పదవ తరగతి వరకు మరియు
8) ధన్నసరిలో సెయింట్ జాన్స్ హై స్కూల్ నర్సరీ నుండి పదవ తరగతి వరకు అనుమతులు ఉన్నాయని, అలాగే
9) చెరువు ముందు తండాలో సాక్రెడ్ హార్ట్ స్కూల్ నర్సరీ నుండి పది తరగతి వరకు అనుమతి పొంది ఉన్నదని,
10) పెనుగొండ రామకృష్ణ విద్యాలయం నర్సరీ నుండి ఏడవ తరగతి వరకు అనుమతులు పొందినవని.

 

 

 

 

పైన తెలిపిన పది పాఠశాలలు ప్రభుత్వం ద్వారా అనుమతి కలిగి నడుస్తున్నవి పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

 

 

 

 

ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలకు సూచనలు:-
ఈ ప్రయివేట్ పాఠశాలల్లో అనుమతి లేని తరగతులను నిర్వహించకూడదని.
ఒక సెక్షన్ కు 40 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉండకూడదని.
అనుమతి లేని పాఠశాల పేరు పెట్టుకొని నడిపించరాదని.
పాఠశాల ఆవరణలో పాఠ్యపుస్తకాలుగాని నోటు పుస్తకాలు గానీ అమ్మ కూడదని.
పాఠశాల యొక్క పేరుతో వేరే ప్రాంతంలో పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు అమ్మడం చేయరాదని.
తరగతి వారీగా ఫీజుల వివరాలను నోటీస్ బోర్డ్ పై అందరికీ తెలిసేలా బోర్డు ఏర్పాటు చేయాలని.
తరగతి వారీగా విద్యార్థుల సంఖ్యను నోటీస్ బోర్డ్ పై అంటించాలని,
ఏదైనా పాఠశాలలో విద్యార్థులను తరలించడానికి వాహనాన్ని ఉపయోగించినట్లయితే, ఫిట్ నెస్ కలిగిన వాహనాన్ని, అర్హత కలిగిన, సుశిక్షితులైన డ్రైవర్ చేత

 

 

మాత్రమే వాహనాన్ని నడిపించాలని తెలియజేశారు.

 

 

పైన తెలిపిన సూచనలను అన్ని ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యం తప్పనిసరిగా పాటించవలెను. లేనిచో తగు చర్యలు తీసుకోబడతాయని మండల విద్యాశాఖాధికారి కాలేరు యాదగిరి తెలిపారు.

సీజనల్ వ్యాధుల పై విద్యార్థులకు అవగాహన.

సీజనల్ వ్యాధుల పై విద్యార్థులకు అవగాహన ‌‌

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

 

మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని ఎంజేపి (మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే) పాఠశాలలో మొగుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి గారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా 110 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగినది. విద్యార్థులకు సీజన్ వ్యాధుల గూర్చి అవగాహన కల్పించడం జరిగినది ,వేడి వేడి ఆహార పదార్థాలు తినాలని, కాచి చల్లార్చిన నీరు తాగాలని తెలియజేసినారు . విద్యార్థులకు ఎవరికైనా జ్వరం కానీ, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే మా వైద్య సిబ్బంది తెలియజేయాలని డాక్టర్ నాగరాణి గారు సూచనలు ఇచ్చారు .ఈ కార్యక్రమంలో డాక్టర్ సంధ్య, ప్రిన్సిపల్ శారద ,సూపర్వైజర్ సునీత, ఏఎన్ఎం శ్రీలత ,స్టాఫ్ నర్స్ అశ్ర ఆశా కార్యకర్తలు ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.

పామాయిల్ సాగు రైతును రాజును చేస్తోంది.

పామాయిల్ సాగు రైతును రాజును చేస్తోంది

భద్రాద్రి కొత్తగూడెం హార్టికల్చర్ అధికారి కిషోర్
డివిజన్ అధికారి రాధాకృష్ణ

చర్ల నేటి ధాత్రి:

చర్ల మండలం దానవాయిపేట గ్రామంలో ఆయిల్ ఫెడ్ అధికారుల ఆధ్వర్యంలో పామ్ ఆయిల్ మొక్కల పంపిణీ చేశారు
మెగా ప్లాంటేషన్ డే సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హార్టీ కల్చర్ అధికారి కిశోర్ మరియు డివిజన్ అధికారి రాధాకృష్ణ పిలుపుమేరకు ఆయిల్ ఫెడ్ అధికారులు చర్ల మండలంలోని రైతులకు పూర్తి సబ్సిడీ పై పామ్ ఆయిల్ మొక్కల పంపిణీ మరియు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు చర్ల మండలంలో దాదాపు 300 ఎకరాలు సాగు లో ఉండగా విస్తీర్ణం భారీగా పెంచేందుకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ లను వినియోగించుకోవాలని ఆయిల్ ఫెడ్ అధికారులు పిలుపునిచ్చారు మొక్కలకే కాకుండా డ్రిప్ ఇరిగేషన్ పరికరాల పై కూడా సబ్సిడీ వస్తుందనీ తెలియజేశారు అంతే కాకుండా ఎకరానికి రూ 4200 రూపాయలు చొప్పున ప్రోత్సాహకం ఇవ్వటం జరుగుతుంది అంతర్గత పంటలపై అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ అధికారులు వికాస్ సత్యనారాయణపురం ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఎమ్ శ్రీనివాసరాజు ఆదర్శ రైతు సాగి శ్రీనివాసరాజు మరియు రైతులు చలపతి వెంకటేశ్వర్లు గ్రామస్తులు తదితరులు   పాల్గొన్నారు

సార్ కొంచెం మా ఏరియాను కూడా పట్టించుకోండి.

సార్ కొంచెం మా ఏరియాను కూడా పట్టించుకోండి

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

స్థానిక మందమర్రి అంబేద్కర్ కాలనీ 3వ వార్డు లో రోడ్డు లేవు సరిగ్గా కాలువలు లేవు చెత్త ఎక్కడిది అక్కడే కుడుకపోయి ఉంటుంది లైన్ అంతా చెట్లతో నిండిపోయి కరెంట్ తీగలకు చెట్లు ఆనుకుని ఉన్నాయి పాములతో చాలా భయాందోళనలతో కాలనీవాసులు భయపడుతున్నారు కొంచెం మా ఏరియాను పై దయ చూపండి సారు అని వార్డులోని కాలనీవాసులు వాళ్ళ యొక్క గోడను వెళ్లబుచ్చుకుంటున్నారు సారు ఇది మా ఒక్క వార్డులోని సమస్య మాత్రమే కాదు ప్రతి ఒక్క వర్డ్ లోని కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఒక సమస్య..

కొన్ని కొన్ని వార్డులలో ఇంతకంటే ఘోరంగా ఉన్న పరిస్థితి కూడా ఉంది..

వర్షాకాలం కాబట్టి ఇలాంటి సమస్యల పై మన మీడియా మిత్రులు కొంచెం దృష్టి పెట్టి వార్తలు రాయండి అని కాలనీవాసులు కోరడం జరిగింది

నాల్గవ తరగతి ఉద్యోగుల సర్వసభ్య సమావేశం

నాల్గవ తరగతి ఉద్యోగుల సర్వసభ్య సమావేశం

ఎల్లప్పుడూ ఉద్యోగులకు అండగా ఉంటాం జిల్లా అధ్యక్షులు గీట్ల సుమిత్

మంచిర్యాల జులై 01 నేటి దాత్రి :

 

 

జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం సర్వ సభ్య సమావేశం జిల్లా అధ్యక్షుడు గీట్ల. సుమిత్ అధ్యక్షత న నిర్వహించారు. ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగులు ఎదుర్కొంటున్నా సమస్యల పైన మరియు ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన
బకాయి బిల్లుల మంజూరు ,
ఆరోగ్య కార్డులను పూర్తి స్థాయిలో మంజూరు చేయాలని
నాల్గవ తరగతి ఉద్యోగులకు ప్రతి
2 సంవత్సరాలకు ఒకసారి పదోన్నతులు కల్పించాలనే ప్రభుత్వం జీఓ జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వన్నీ కోరుతూ ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గీట్ల. సుమిత్ మాట్లాడుతూ
జిల్లా లోని మండల స్థాయి అధికారులు కొందరు నాల్గవ తరగతి ఉద్యోగుల పై అనుచిత పదాలు ,దురుసుగా ప్రవర్తిస్తున్నారని ,క్రింది స్థాయి ఉద్యోగులపై ఇలా ప్రవర్తించడం సరైనది కాదని, అలాంటి సందర్భాలు ఎదురైతే
జిల్లా సంఘానికి తెలియజేస్తే పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకొన్ని వెళ్లి న్యాయం జరిగే వరకు తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం ఎల్లపుడు ముందుగా ఉండి పోరాటం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమములో గౌరవ అధ్యక్షులు తిరుపతి, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీలత, కోశాధికారి సుజాత,
సునీత, శేఖర్, ముంతాజ్ అలీ ఖన్,
శ్రీనివాస్, వెంకటేష్, సతీష్, శోభ తదితరులు
పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version