‘డైలాగ్ కింగ్’ అంటే సాయికుమార్..

‘డైలాగ్ కింగ్’ అంటే సాయికుమార్

నటుడు సాయికుమార్ పేరు తలచుకోగానే ఆయన వాచకమే ముందుగా గుర్తుకు వస్తుంది. సాయికుమార్ గళం నుండి జాలువారిన పదాలు ప్రేక్షకుల మదిలో చెరిగిపోని స్థానం సంపాదించాయి.నటుడు సాయికుమార్ పేరు తలచుకోగానే ఆయన వాచకమే ముందుగా గుర్తుకు వస్తుంది. సాయికుమార్ గళం నుండి జాలువారిన పదాలు ప్రేక్షకుల మదిలో చెరిగిపోని స్థానం సంపాదించాయి. అందుకే జనం ఆయనను ‘డైలాగ్ కింగ్’ అన్నారు. 1960 జూలై 27న జన్మించిన సాయికుమార్ తండ్రి పి.జె.శర్మ తెలుగు సినిమారంగంలో నటునిగా సాగారు. తన దరికి చేరిన పాత్రల్లో నటిస్తూ, ఎంతోమంది పరభాషా నటులకు తన వాయిస్ ను అరువిస్తూ శర్మ పయనించారు. అదే తీరున ఆయన పెద్దకొడుకైన సాయికుమార్ సైతం సాగడం విశేషం!

‘దేవుడు చేసిన పెళ్ళి’ (1975) వంటి చిత్రాల్లో బాలనటునిగా నటించిన సాయికుమార్ తరువాత బాపు ‘స్నేహం’ (1977)లో గుర్తుండిపోయే పాత్రలో కనిపించారు. ఆ తరువాత సాయికుమార్ కు పెద్దగా గుర్తుండిపోయే పాత్రలేవీ లభించలేదు. ఓ వైపు నటిస్తూనే మరోవైపు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్ నుండి ఎమ్.ఏ. పట్టా పుచ్చుకున్నారు సాయి. తరువాత మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ లో ఎమ్.ఫిల్ కూడా చేశారు. తెలుగు చిత్రాల్లో లభించిన పాత్రలన్నిటా నటించేవారు. దాంతో కాసింత గుర్తింపు సంపాదించారు. కానీ, సరైన బ్రేక్ లభించలేదు. ఓ వైపు కన్నడ చిత్రాల్లోనూ, మరోవైపు తమిళ సినిమాల్లోనూ నటించారు. కన్నడలో సాయికుమార్ హీరోగా రూపొందిన ‘పోలీస్ స్టోరీ’ (1996) మంచి విజయం సాధించింది. దాంతో అక్కడ వరుసగా పలు సినిమాల్లో పోలీస్ రోల్స్ పోషించి స్టార్ హీరో అయిపోయారు.

తెలుగులోనూ సాయికుమార్ కు కొన్ని సినిమాల్లో హీరోగా నటించే ఛాన్స్ దక్కింది. తన చిన్న తమ్ముడు అయ్యప్ప పి.శర్మ దర్శకత్వంలో ‘ఈశ్వర్ అల్లా’ సినిమా నిర్మించారు సాయి. ఆయన పెద్ద తమ్ముడు రవిశంకర్ కూడా బాలనటునిగా రాణించి, తరువాత అన్నలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అలరించారు. ఆ పై విలన్ కేరెక్టర్స్ లోనూ ఆకట్టుకున్నారు రవిశంకర్.

ప్రస్తుతం సాయికుమార్ కేరెక్టర్ యాక్టర్ గా సాగుతున్నారు. తన దరికి చేరిన ప్రతీ పాత్రకు న్యాయం చేయాలనే తపిస్తున్నారు. ఒకప్పుడు సుమన్, రాజశేఖర్, రజనీకాంత్ వంటి నటులకు తన గాత్రంతో వారి పాత్రలకు వన్నె తీసుకు వచ్చారు సాయికుమార్. తాను నటునిగా బిజీ అయిన తరువాత సాయికుమార్ డబ్బింగ్ అంతగా చెప్పడం లేదు. అయినా ఈ నాటికీ సాయికుమార్ అనగానే తెలుగు ప్రేక్షకులు ‘డైలాగ్ కింగ్’ అంటూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. మధ్యలో రాజకీయాల్లోనూ కొంతకాలం పయనించిన సాయి కుమార్ ప్రస్తుతం పూర్తిగా నటనలోనే సాగుతున్నారు.

సందేశంతో రాజు గాని సవాల్‌..

సందేశంతో రాజు గాని సవాల్‌

లెలిజాల రవీందర్‌ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘రాజు గాని సవాల్‌’. రితికా చక్రవర్తి కథానాయిక. రక్షా బంధన్‌ పండుగ సందర్భంగా..

లెలిజాల రవీందర్‌ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘రాజు గాని సవాల్‌’. రితికా చక్రవర్తి కథానాయిక. రక్షా బంధన్‌ పండుగ సందర్భంగా ఆగస్టు 8న శ్రీ లక్ష్మీ పిక్చర్స్‌ ద్వారా విడుదలకు సిద్ధమవుతోంది. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా లెలిజాల రవీందర్‌ మాట్లాడుతూ ‘నా జీవితంలో జరిగిన కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కల్చరల్‌ ఈవెంట్స్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. ప్రేక్షకులకు వినోదంతో పాటు మంచి సందేశం ఇచ్చే చిత్రమిది’ అని తెలిపారు. నిర్మాత దామోదర ప్రసాద్‌ మాట్లాడుతూ ‘సినిమా టీజర్‌ చూశాం చాలా బావుంది. ఇప్పుడు ట్రైలర్‌ కూడా ఆకట్టుకుంటోంది. రవీందర్‌ కొత్తతరహా కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను అలరిస్తుంది’ అని అన్నారు.

పామాయిల్ సాగు రైతును రాజును చేస్తోంది.

పామాయిల్ సాగు రైతును రాజును చేస్తోంది

భద్రాద్రి కొత్తగూడెం హార్టికల్చర్ అధికారి కిషోర్
డివిజన్ అధికారి రాధాకృష్ణ

చర్ల నేటి ధాత్రి:

చర్ల మండలం దానవాయిపేట గ్రామంలో ఆయిల్ ఫెడ్ అధికారుల ఆధ్వర్యంలో పామ్ ఆయిల్ మొక్కల పంపిణీ చేశారు
మెగా ప్లాంటేషన్ డే సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హార్టీ కల్చర్ అధికారి కిశోర్ మరియు డివిజన్ అధికారి రాధాకృష్ణ పిలుపుమేరకు ఆయిల్ ఫెడ్ అధికారులు చర్ల మండలంలోని రైతులకు పూర్తి సబ్సిడీ పై పామ్ ఆయిల్ మొక్కల పంపిణీ మరియు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు చర్ల మండలంలో దాదాపు 300 ఎకరాలు సాగు లో ఉండగా విస్తీర్ణం భారీగా పెంచేందుకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ లను వినియోగించుకోవాలని ఆయిల్ ఫెడ్ అధికారులు పిలుపునిచ్చారు మొక్కలకే కాకుండా డ్రిప్ ఇరిగేషన్ పరికరాల పై కూడా సబ్సిడీ వస్తుందనీ తెలియజేశారు అంతే కాకుండా ఎకరానికి రూ 4200 రూపాయలు చొప్పున ప్రోత్సాహకం ఇవ్వటం జరుగుతుంది అంతర్గత పంటలపై అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ అధికారులు వికాస్ సత్యనారాయణపురం ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఎమ్ శ్రీనివాసరాజు ఆదర్శ రైతు సాగి శ్రీనివాసరాజు మరియు రైతులు చలపతి వెంకటేశ్వర్లు గ్రామస్తులు తదితరులు   పాల్గొన్నారు

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

◆: జహీరాబాద్ రాష్ట్ర నాయకులు ఉజ్వల్ రెడ్డి…!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

కాంగ్రెస్ అంటేనే రైతుల ప్రభుత్వం అని జహీరాబాద్ రాష్ట్ర నాయకులు ఉజ్వల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని సమయానికి ఎరువులు అందుబాటులో ఉండడం పంటలు వేసే సమయంలో రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయడం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడం అనేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యమని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో 18 నెలలు రైతులకు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని తెలిపారు రైతు రుణమాఫీ ఉచిత విద్యుత్ 200 యూనిట్లు మహిళలకు ఉ చిత బస్సు సౌకర్యం గ్యాస్ సబ్సిడీ రైతు భరోసా బీసీ కమిషనర్ ఏర్పాటు కులగణన రైతు కమీషన్ ఏర్పాటు విద్య కమీషన్ ఏర్పాటు విద్యా కమిషన్ ఏర్పాటు వైశ్య కార్పొరేషన్ రైతు కూలీలకు రైతు భరోసా సన్న వడ్లకు 500 బోనస్ ఇలాంటి అనేక పథకాలు చేపట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని తెలిపారు.

రాజీ మార్గమే రాజా మార్గం…

రాజీ మార్గమే రాజా మార్గం…

నర్సంపేట సబ్ జడ్జి వరూధిని

నర్సంపేట కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

ఎలాంటి సమస్యలకైనా రాజీ మార్గమే రాజా మార్గమని నర్సంపేట తాలూకా లీగల్ సర్వీస్ అతారిటి ఛైర్మన్, కోర్టు సబ్ జడ్జి వరూధిని అన్నారు. నర్సంపేట కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు.ఈ లోక్ అదాలత్ లో తాలూకా లీగల్ సర్వీస్ అతారిటి ఛైర్మన్,సబ్ జడ్జి వరూధిని మాట్లాడుతూ రాజి పడదగిన కేసులలో రాజి పడటం ద్వార కేసుల నుండి పరిష్కారం పొందవచ్చు అని లోక్ అదాలత్ ను కక్షిదారులు
సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కాగా లోక్ అదాలత్ లో
నిర్వహించిన వాటిల్లో 42 క్రిమినల్ కేసులు రాజి పడ్డారు.
4 ఎక్సైజ్ కేసులలో 20 వేలు ఫైన్ కట్టారు.బ్యాంక్ పిఎల్సి కేసులు 15 కాగా 6,69,086 రూపాయలకు సెటిల్ మెంట్ అయ్యారు. ఎస్టిసిలు 3288 కేసుల్లో రూ.8,43,050 ఫైన్ కట్టారు.
ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి బోడివల్లి చేంద్ర ప్రసన్న,సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ లక్ష్మీ నారాయణ, ఏపీపీ,ఎసిపి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోడిదెల సంజయ్ కుమార్,ప్రధాన కార్యదర్శి,లోక్ అదాలత్ మెంబర్ మోటురి రవి,లీగల్ సర్వీస్ అతారిటి న్యాయవాది దొంతి సాంబయ్య,న్యాయవాదులు తండ సారంగపాణి,రహీముద్దీన్,కొమ్ము రమేష్ యాదవ్,పుట్టపాక రవి,అంబటి రాజ్ కుమార్,పొనుగోటీ అజయ్,బొడ్డుపెళ్లి అజయ్,కందకట్ల వీరష్,పండుగ శ్రీనివాస్,అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్సైలు,బ్యాంక్ అధికారులు,కోర్టు సిబ్బంది, పోలీస్ లు , కక్షిదారులు పాల్గొన్నారు.

పెద్దమ్మ . పెద్ద రాజుల.కళ్యాణ మహోత్సవానికి హాజరైన బిజెపి నాయకులు…

పెద్దమ్మ . పెద్ద రాజుల.కళ్యాణ మహోత్సవానికి హాజరైన బిజెపి నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… .

 

 

 

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో పెద్దమ్మ . పెద్ద రాజుల కళ్యాణ మహోత్సవమునకు ప్రత్యేకంగా హాజరైన జిల్లా బిజెపి అధ్యక్షుడు గోపి. జిల్లా బీజేవైఎం. జిల్లా అధ్యక్షులు రావుల రాజిరెడ్డి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో గోపి రాజు రెడ్డి బిజెపి పార్టీ నాయకులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు బిజెపి పార్టీ నాయకులను. ప్రత్యేకంగా శాలువాతో సన్మానించారు ఇట్టి కార్యక్రమంలో. బిజెపి పార్టీ నాయకులు. సుధాకర్. రాజేందర్. నెల్లుట్ల రమేష్. కాజు గంటి రాజు. చిందం నరేష్. సందీప్ జిల్లెల్ల గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్ల మల్లేశం ముదిరాజ్ ఈసా నరసయ్య సంఘం నాయకుడు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version