కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై సమగ్ర న్యాయవిచరణ జరిపించాలి.

కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై సమగ్ర న్యాయవిచరణ జరిపించాలి

ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి వై గీత

వికారాబాద్/ హైదారాబాద్ నేటిధాత్రి:

సంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని పాశం మైలారంలోని సిగా చి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో పదుల సంఖ్యలో కార్మికులు మరణించడం అనేకమంది తీవ్ర క్షతగాత్రులైన సంఘటనపై సమగ్ర న్యాయచారణ జరిపించాలని ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి వై గీత డిమాండ్ చేశారు.ఈ సంఘటనకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని తేల్చి చెప్పారు.ఈ దుర్ఘటనకు ఫ్యాక్టరీలో తగిన రక్షణ చర్యలు చేపట్టకపోవడం, లేబర్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ల ఇన్స్పెక్షన్ లేకపోవడం వలన జరిగిందని ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ అభిప్రాయపడిందన్నారు. మరణించిన క్షతగాత్రులైన కార్మిక కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని తక్షణమే ప్రాసిక్యూట్ చేసి, సెక్షన్ 304 కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, మరణించిన కార్మికులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లిస్తూ కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని ఇవ్వాలని, తీవ్రంగా క్షతగాత్రులైన కార్మికులకు ఒకరికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వివరించారు. కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని ప్రభుత్వ పరివేక్షణలో యాజమాన్యం,ప్రభుత్వం పూర్తిస్థాయిలో వారు( కార్మికులు) సంపూర్ణంగా కోరుకునే వరకు అందించాలని వై గీత డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version