బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం లక్కీ డ్రా.

బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం లక్కీ డ్రా

భూపాలపల్లి నేటిధాత్రి:

2025 -26 సంవత్సరమునకు గాను బెస్ట్ అవైలబల్ స్కూల్స్ స్కీం పథకం క్రింద 1వ తరగతి 5వ తరగతి లో ప్రవేశము కొరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడిఓసి మీటింగ్ హాల్ లో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి విద్యాశాఖ అధికారి రాజేందర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా స్కీం నిర్వహించడం 1వ తరగతికి (41) సీట్లు గాను (1) అధర్శ హై స్కూల్ కు – 08, (2) వివేకానంద హై స్కూల్ కు – 08, (3) సెయింట్ పీటర్స్ హై స్కూల్ కు- 09, (4) సువిద్యా హై స్కూల్ కు – 08, (5) సి ఎస్ ఐ మెమోరీస్ కు – 08, 5వ తరగతికి (43) సీట్లు గాను (1) అధర్శ హై స్కూల్ కు – 14, (2) వివేకానంద హై స్కూల్ కు 14, (3) సువిద్యా హై స్కూల్ కు -15, సీట్లు లక్కీ డ్రా పద్దతి లో కేటాయించడం జరిగినది. లక్కీ డ్రా స్క్రీన్ కార్యక్రమంలో నందు విజయ లక్ష్మీ జిల్లా అడిషనల్ కలెక్టర్ జయశంకర్ భూపాలపల్లి రాజేందర్ జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి టి డబ్ల్యూ ఆర్ ఎస్ జిల్లా కొ-ఆర్డినేటర్ స్కూల్ ప్రిన్సిపల్స్, విద్యార్ధిని, విద్యార్ధులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

స్త్రీగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్న.

స్త్రీగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్న..

స్త్రీ అనుకుంటే ఏదైనా సాధిస్తుంది…

సృజన.ట్రయిని ఎస్సై..

రామాయంపేట మార్చి 8 నేటి ధాత్రి(మెదక్)

స్త్రీగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని ట్రెయిని ఎస్సై సృజన అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా అమే మాట్లాడుతూ నేడు పురుషులతో పాటు అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని అలాగే పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. చాలా రంగాల్లో మహిళలు ముందుంటున్నారని అన్నారు. ప్రస్తుత కాలంలో ఏ రంగాల్లో అయినా మహిళలు రాణిస్తున్నారని అద్భుత విజయాలు సాధిస్తున్నారని అన్నారు. మహిళలు పురుషులకంటే ఆత్మస్థైర్యంగా శక్తివంతంగా తయారయ్యారని తెలిపారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టగానే చిన్నచూపు చూడకుండా వారిని కూడా పురుషులతో సమానంగా పెంచి ఉన్నత చదువులు చదివిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. తొందరపడి ఆడపిల్లలను చదివిన మధ్యలో ఆపేసి పెళ్లిళ్లు చేయడం వల్ల అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. అప్పుడు తిరిగి ఆ సమస్య తల్లిదండ్రుల కు వస్తుందన్నారు. అలా కాకుండా ఆడపిల్లను ఉన్నత చదువులు చదివించి మంచి ఉద్యోగం సంపాదించే వరకు పెంచితే వారికి భవిష్యత్తు ఎంతో ఉంటుందని జీవితాంతం సుఖ సంతోషాలతో మెట్టిన ఇంట్లో కూడా ఉంటుందని అన్నారు. దేశంలో నేడు మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు వస్తున్నాయని ఇది మహిళల యొక్క శక్తి సామర్థ్యాలు గుర్తించడం వల్లనే జరుగుతుందన్నారు. ఆడవారు ఉద్యోగాలనే కాకుండా స్వచ్ఛందంగా పలు వ్యాపార వాణిజ్య సంస్థలు, స్వయం ఉపాధి రంగాల్లో ఎంతో రాణిస్తున్నారని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version