సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన శ్రామిక.

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన శ్రామిక వర్గానికి అభినందనలు

పాలకులు ఇప్పటికైనా శ్రమ దోపిడి విధానాలను మానుకోవాలి

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

వినాశనకర దోపిడీ విధానాలను నిరసిస్తూ చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన కార్మిక కర్షక ఉద్యోగులకు అభినందనలు తెలియజేస్తూ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ విధానాలకు చరమగీతం పాడి శ్రామికులకు అనుకూలంగా పాలన కొనసాగించాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం అయిన సందర్భంగా స్థానిక వరంగల్ పట్టణ ఓంకార్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పెద్దారపు రమేష్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సహజ సంపదను, ఆర్థిక వ్యవస్థను, మానవ శ్రమను పెట్టుబడుదారులకు కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టే విధంగా విధానాల రూపకల్పన చేస్తూ అందుకు అనుకూలంగా చట్టాలను రూపొందించి ఊడిగం చేస్తున్నదని అన్నారు.మరోవైపు నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇలాంటి పరిస్థితుల్లో కార్మిక కర్షక ఐక్య పోరాటాలు రాజకీయాలకతీతంగా ఉధృతం అవుతున్నాయని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని రైతు కార్మిక వ్యతిరేక విధానాలను మానుకొని రైతులు పండించిన పంటకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా మద్దతు ధర చట్టాన్ని రూపొందించాలని తెలిపారు. కార్మికులకు పాత చట్టాలను పునరుద్ధరించి కనీస వేతనం అమలు 26వేల రూపాయలు చేయాలని అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 10 గంటల పని దినం పెంపును ఉపసంహరించుకొని ఎనిమిది గంటల పని విధానాన్ని యధావిధిగా అమలు చేయాలని కోరారు.ఈ సమావేశంలో ఎంసిపిఐ యు జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్,నాయకులు ఎగ్గని మల్లికార్జున్, నలివెల రవి, రాయినేని ఐలయ్య, జటబోయిన నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

సార్వత్రిక సమ్మెకు మద్దతుగా పరకాలలో కార్మికుల ర్యాలీ

సార్వత్రిక సమ్మెకు మద్దతుగా పరకాలలో కార్మికుల ర్యాలీ

పరకాల నేటిధాత్రి
కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని సిపిఎం హనుమకొండ జిల్లా కమిటీ సభ్యులు డి.తిరుపతి డిమాండ్ చేశారు.గురువారం పరకాల పట్టణంలోని దేశవ్యాప్త కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులతో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని,కనీస వేతనం నెలకు 26,000 చెల్లించాలనీ,కాంట్రాక్ట్ కార్మికులను,స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని అన్ని రకాల కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలనీ,ఇ.పి.ఎఫ్ పెన్షన్ కనీసం 9000 చెల్లించాలని,వ్యవసాయ కార్మికులతో సహా అన్ని వర్గాల కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలన్నారు.గిగ్ వర్కర్లు,మత్స్యకారులు,గృహ కార్మికులు,అతిథి కార్మికులు,స్కీమ్ వర్కర్లు, పోర్టర్లు,దుకాణదారులు, మోటారు కార్మికులు,నిర్మాణ కార్మికులు,భద్రతా కార్మికులు, హౌస్ కీపింగ్ కార్మికులు మొదలైన వారికి వైద్య సహాయం,క్రమబద్ధమైన ఆదాయం,పెన్షన్ ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.

బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఎన్నో సంవత్సరాల క్రితం పోరాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను తొలగించే కోసం కుట్ర చేస్తుందని లేబర్ కోడ్ లను అమలు చేయాలని చూస్తుందని,వాటిని వెంటనే రద్దు చేయాలని లేకుంటే దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్,కార్మిక సంఘాల నాయకులు ఐఎన్టియుసి మున్సిపాలిటీ పరకాల పట్టణ అధ్యక్షులు బొచ్చు ఐలయ్య, ఉపాధ్యక్షులు మంద మహేష్,కార్యదర్శి పసుల సారయ్య, గుర్రం సరోజన,హమాలి సంఘం అధ్యక్షులు ఆదాం, బొచ్చు సంపత్,రమేష్, మధ్యాహ్న భోజన కార్మిక సంఘ నాయకులు పోతిరెడ్డి సమ్మక్క,మేకల రాధ,జి. లింగా స్వామి,రాజయ్య
డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి చిరంజీవి,ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు మడికొండ ప్రశాంత్ లు పాల్గొన్నారు.

9 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం.!

9 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి..

*కార్మికులు, కర్షకులను కార్పొరేట్లకు బానిసలను చేసే విధానాలను వ్యతిరేకించండి..

*ఐఎఫ్ టీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపనేని హరికృష్ణ పిలుపు..

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 07:

జూలై 9న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్ టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపనేని హరికృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం నారాయణపురం లోని ఐఎఫ్టీయు కార్యాలయంలో సమ్మె గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ రైతు, కార్మిక వ్యతిరేఖవిధానాలతో కేంద్రంలోని బాజాపా ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంభిస్తోందన్నారు. నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని, నూతన వ్యవసాయమార్కెటింగ్ చట్టాన్ని ఉపసంహరించాలని,కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో కార్మిక, ఉద్యోగ, రైతులు చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడం జరుగుతోందని చెప్పారు. సమ్మె ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామిశెట్టి వెంకయ్య మాట్లాడుతూ దేశ సంపదను కార్పొరేట్, పెట్టుబడిదారులకు రైతులను, కార్మికులను బానిసలుగా చేసే దుర్మార్గపు చర్యలకు కేంద్ర పాల్పడుతోందని దీనికి వ్యతిరేకంగా జరిగే సమ్మెలో రైతులు భాగస్వామ్యం కావాలని కోరారు. ఐఎఫ్టీయు నగర కన్వీనర్ లోకేష్ మాట్లాడుతూ 9వ తేదీ ఉదయం 9.30 గంటలకు అంబెడ్కర్ విగ్రహం వద్ద నుంచి ఐ ఎఫ్
టి యూ, సి ఐటి యూ,
ఏ ఐ టి యూ
సి, ఆధ్వర్యంలో జరుగుతున్న ర్యాలీలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐకే ఎం ఎస్ జిల్లా గౌరవాధ్యక్షులు పి. వెంకటరత్నం, పీ ఓడబ్ల్యు జిల్లా కన్వినర్ అరుణ, అంగన్ వాడీ వర్కర్స్ ఫెడరేషన్ నగర అధ్యక్షురాలు సుజాత, నాయకురాలు గంగాదేవి తదితరులు పాల్గొన్నారు..

కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

మోడీ విధానాలపై సమర శంఖం పూరించాలి.

జులై 9 న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి

రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు

కేసముద్రం/ నేటి ధాత్రి

జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి శివారపు శ్రీధర్, సిఐటియు, మండల కార్యదర్శి జల్లె జయరాజు, ఏఐసిటియు, జిల్లా కార్యదర్శి మరిపెళ్లి మొగిలి లు మాట్లాడుతూ మోడీ అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై సమర శంఖం పూరించాలని శుక్రవారం స్థానిక కేసముద్రం మార్కెట్ యార్డులో

 

 

 

ఐ ఎఫ్ టి యు కేసముద్రం పట్టణ అధ్యక్షులు మిట్టగడుపుల వెంకన్న అధ్యక్షతన కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.వక్తలు మాట్లాడుతూ ఎనిమిది గంటల పని దినాన్ని కార్మికులు పోరాడి సాధించుకుంటే, నరేంద్ర మోడీ ప్రభుత్వం పన్నెండు గంటలు పని చేయాలని నాలుగు లేబర్ కోడ్స్ తీసుకురావడం కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం చేసినట్లేనని విమర్శించారు.

 

 

 

 

 

కార్మికులకు కనీస అవసరాలని కల్పించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయని అన్నారు. స్వతంత్రం వచ్చి 77 ఏళ్లు గడిచిన నేటికీ అనేకమంది కి విద్య, వైద్యం అందకపోవడం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం లేకపోవడం, కనీస వేతనాలు అమలు కాకపోవడం చాలా విడ్డూరంగా ఉందని, ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క అభివృద్ధికి నిదర్శనం అని అన్నారు.

 

 

 

మోడీ ప్రభుత్వం పేద ప్రజల కడుపులో కొట్టి కార్పొరేట్లకు దోచిపెడుతోందని ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమీకరణ కావాలని కోరారు. వ్యవసాయ రంగాన్ని కార్మిక రంగాన్ని తోపాటు అన్ని రంగాలను నష్టపరుస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి అప్పజెప్పడం కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వారు అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో ప్రజలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జిల్లా వ్యాప్తంగా సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

 

 

 

 

జూలై 9న స్థానిక జ్యోతిరావు పూలే సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు జరిగే ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక , రైతు సంఘం తెలంగాణ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు బొబ్బల యాకూబ్ రెడ్డి, నీరుటి జలంధర్, ఏ ఐ సి టి యు జిల్లా నాయకులు జాటోత్ బిచ్చ నాయక్, ఐఎఫ్టియు కేసముద్రం ఏరియా కమిటీ నాయకులు బండి రాజు, తదితరులు పాల్గొన్నారు.

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నర్సంపేట మున్సిపాలిటీ కమిషనర్ కు సమ్మె నోటీసు ఇచ్చారు.సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆరూర్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకు వచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఉన్నటువంటి హక్కులను ఈ నాలుగు లేబర్ కోడ్ వలన కార్మికులకు అన్యాయం జరుగుతుందని ఆదాని అంబానికి మేలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు హన్మకొండ శ్రీధర్, కందికొండ రాజు, నాయకులు ఇప్ప సతీష్, జగన్నాధం కార్తీక్, మోలుగురి రాజు, మున్సిపాలిటీ కార్మికులు యశోద, హన్మకొండ మరియా, ఉమా ఎలీషా తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version