పాక్ క్రికెటర్లు అలాంటి ప్రదేశంలో నడుస్తున్నారేంటి..

అయ్యో.. పాకిస్థాన్ టీమ్‌కు ఎలాంటి గతి పట్టింది.. పాక్ క్రికెటర్లు అలాంటి ప్రదేశంలో నడుస్తున్నారేంటి..

కొలంబోలో మ్యాచ్ ప్రాక్టీస్ అనంతరం తిరిగి హోటల్‌కు వెళ్తున్న పాక్ ఆటగాళ్లకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాక్ జట్టుకు శ్రీలంక క్రికెట్ బోర్డ్ అందిస్తున్న ఆతిథ్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ప్రస్తుతం జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ కోసం శ్రీలంకలో ఉంది. ఈ రోజు (మంగళవారం) సాయంత్రం కొలంబోలో జరగబోయే మ్యాచ్‌లో అమెరికాతో తలపడనుంది. కొలంబోలో మ్యాచ్ ప్రాక్టీస్ అనంతరం తిరిగి హోటల్‌కు వెళ్తున్న పాక్ ఆటగాళ్లకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాక్ జట్టుకు శ్రీలంక క్రికెట్ బోర్డ్ అందిస్తున్న ఆతిథ్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి (Pakistan team in Colombo).
వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. పాక్ ఆటగాళ్లు, సిబ్బంది బస్సు నుంచి దిగి, అపరిశుభ్రంగా కనిపిస్తున్న ప్రాంతం నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. పాక్ ఆటగాళ్లు ప్రాక్టీస్‌ సెషన్ కోసం వెళ్తున్నారా లేదా ప్రాక్టీస్ నుంచి హోటల్‌కు తిరిగి వస్తున్నారా అనే విషయంలో మాత్రం పూర్తి క్లారిటీ లేదు. పాక్ ఆటగాళ్లకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి.. ‘పాక్ క్రికెట్ జట్టుకు కొలంబోలో శ్రీలంక, ఐసీసీ అందించిన ఆతిథ్యం ఇది. వారు సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తోంది’ అని కామెంట్ చేశారు

బిఆర్ఎస్ జెండా తప్పకుండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే…

బిఆర్ఎస్ జెండా తప్పకుండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాణిక్ రావు ,డీసీఎంస్ చైర్మన్ శివ కుమార్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి దేవి ప్రసాద్ మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,మాజి డి ఆర్ యు సి సి మెంబర్ షేక్ ఫరీద్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఆర్ సుభాష్,కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు, నాయకులు మాట్లాడుతూ జహీరాబాద్, కోహిర్ మున్సిపల్ లో బిఆర్ఎస్ జెండా తప్పకుండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు . 37 వార్డులలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులకు బిఆర్ఎస్ టికెట్లు ఇచ్చామని తెలిపారు. 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. మహిళలు, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వకపోవడంతో ప్రజలు మళ్లీ కేసీఆర్ వైపు ఆశగా చూస్తున్నారని అన్నారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో జహీరాబాద్, కోహిర్ లో బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీదే గెలుపు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీదే గెలుపు

మాటేడు ఎంపీటీసీ పరిధి లో
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరవేయాలని బిఆర్ఎస్ తొర్రూర్ మండల పార్టీ ఇన్చార్జ్ శ్రీరామ్ సుధీర్, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు మరియు మాజీ జెడ్పిటిసి జిల్లా ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ గార్లు అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి:

 

గౌరవ శ్రీ మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు* చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుంది
తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు చేసింది ఏమీలేదు అన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలలో కోతలు ఎగవేతలు తప్ప చేసింది ఇచ్చింది శూన్యం అన్నారు..
ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తగిన బుద్ధి చేపటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
రైతు బంధు రెండు పంటలకు ఎగనామం పెట్టారని రైతు రుణమాఫీ 60% రైతులకు కూడా జరగలేదని తెలిపారు.
మహిళలకు తులం బంగారం మరియు 2500 రూపాయలు ఇస్తానని మోసం చేసారు. భూమి లేని పేదలకు 12000 ఇస్తామని ప్రజలను మభ్యపెట్టారని తెలిపారు.
మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మొదలు పెట్టిన అభివృద్ధి పనులు ఎందుకు పూర్తి చేయలేదని స్థానిక ఎంఎల్ఏ ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు..
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు లబ్ధి చేకూరింది.తప్ప పేద ప్రజలకు వచ్చింది శూన్యం అన్నారు…
ఈ కార్యక్రమంలో తొర్రూర్ పట్టణ పార్టీ అధ్యక్షులు బిందు శ్రీనివాస్ ,తొర్రూర్ పట్టణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నలమాస ప్రమోద్ ,తొర్రూర్ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ ఎన్నమనేని శ్రీనివాసరావు, కాలు నాయక్ ప్యాక్స్ డైరెక్టర్ జనార్దన్ రాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు సముద్రాల శీను, బిక్షపతి గ్రామ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ మరియు సోషల్ మీడియా నాయకులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version