డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు సన్మానం
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాలలో డాక్టర్ డే ను ఘనంగా మంగళవారం నిర్వహించారు.మంచిర్యాల హెల్త్ కేర్ హాస్పిటల్ డాక్టర్ ఆంజనేయులు,డాక్టర్ భాగ్యలక్ష్మిని మంచిర్యాల ముస్లిం యూత్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు అండ్ నాజ్ ఫౌండేషన్ సభ్యులు శాలువతో ఘనంగా సన్మానించడం జరిగింది.అనంతరం యూత్ కమిటీ ప్రెసిడెంట్ అబ్దుల్ ఖలీద్ మాట్లాడుతూ హెల్త్ కేర్ హాస్పిటల్ డాక్టర్ ఆంజనేయులు పేదవాళ్ళకి తన వంతుగా తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ చేస్తున్నారనీ,పేదవారికి తన వంతు సహాయం అందిస్తున్నారు.గనుక
డాక్టర్స్ డే సందర్భంగా సన్మానం చేయడం ఎంతో ఆనందకరంగా ఉందని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల ముస్లిం యూత్ వెల్ఫేర్ కమిటీ ప్రెసిడెంట్ అబ్దుల్ ఖలీద్ మరియు నాజ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఎం.డి సాదిక్,ఎం.డి మజీద్ తదితరులు పాల్గొన్నారు.