అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు..

అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T125709.628.wav?_=1

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండల్ హద్నూర్ గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బక్క రెడ్డి పరితపించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు, వారి నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి అండగా ఉంటామని మనోధైర్యాన్ని కల్పించారు.ఎమ్మెల్యే గారితో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ ,మాజి మండల పార్టీ అధ్యక్షులు నరసింహ రెడ్డి ,రాజ్ కుమార్, ప్రవీణ్ ,శ్రీకాంత్ రెడ్డి ,అశోక్ పాటిల్ , మహేష్ తదితరులు ఉన్నారు.

చోరీకి గురైన ద్విచక్ర వాహనం.

చోరీకి గురైన ద్విచక్ర వాహనం.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T124710.328.wav?_=2

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండల పరిధిలోని గంగ్వార్ గ్రామానికి చెందిన నడిమి దొడ్డి అశోక్ అనే రైతు మెట్టలు కుంట గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న తన సొంత పంట పొలం వద్ద తన యొక్క వాహనము టి ఎస్ 15 ఎఫ్ ఎచ్ 8026 నెంబర్ గల వాహనాన్ని పార్క్ చేయగా గుర్తు తెలియని వ్యక్తి దొంగతనం చేశాడని బాధితుడు తెలిపారు.

దీంతో ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హద్నూర్ ఎస్ ఐ తెలిపారు.

ఢిల్లీ యూనివర్సిటీలోకి గ్రామీణ విద్యార్థి ఎంపిక.

ఢిల్లీ యూనివర్సిటీలోకి గ్రామీణ విద్యార్థి ఎంపిక,

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T124034.400.wav?_=3

ఝరాసంగం మండల కమాల్పల్లికి చెందిన బి.నరేశ్ సీయూసెట్-2025లో ఉత్తీర్ణత సాధించి ఢిల్లీ యూనివర్సిటీలో ప్రవేశం పొందాడు. ప్రత్యేక కోచింగ్ లేకుండా కేవలం ఇంటి వద్దనే చదువుకొని ఈ విజయాన్ని సాధించాడు. ప్రాథమిక విద్యను ఝరాసంగం ప్రభుత్వ పాఠశాల, ఇంటర్ను కొండాపూర్ గురుకులంలో పూర్తి చేశాడు. నరేశ్ను గ్రామస్థులు, ఉపాధ్యా యులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.

ఆసుపత్రి ఆవరణలో రోగులపై కొండ ముచ్చుల దాడి..

ఆసుపత్రి ఆవరణలో రోగులపై కొండ ముచ్చుల దాడి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T123430.605.wav?_=4

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో శుక్రవారం మధ్యాహ్నం కొండ ముచ్చులు దాడి చేసి గాయపరిచినట్లు బాధితులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి, రోగులకు రక్షణ కల్పించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. ఆసుపత్రిలో భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు.

ఆగిన వంతెన పనులు పూర్తయ్యేనా?

ఆగిన వంతెన పనులు పూర్తయ్యేనా?

◆:- ఎనిమిదేళ్లుగా అసంపూర్తిగానే మిగిలిన వంతెన

◆:- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T122654.349.wav?_=5

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం తెలంగాణ రా ష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడిచిన, ప్రభుత్వాలు మా 8న కొన్ని పనులు ప్రారంభ దశలోనే ఉండిపోయాయి: మండల పరిధిలోని ఝరాసంగం, చిలపల్లి రహదారిపై నూతన వంతెన గత ఎనిమిది ఏళ్ల క్రితం మంజూరు అప్పట్లో ఆ వంతెన పూర్తయితే పొట్టిపల్లి, బర్దిపూర్, చిల్లపల్లి తాండ, ఎల్గోయి గ్రామాలకు వెళ్లే వాహనదారులు, ప్రజల ఇబ్బందులు తప్పుతాయని అందరూ భావించారు. కానీ అప్పట్లో వంతెన ని ర్మా ణం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు ప్రా రంభించి చేతులు దులుపుకొని వెళ్లి పోవడంతో ఆ వంతెన నిర్మాణ దశలోనే నిలిచిపోయింది.

2017 ఆగస్టు 11న ప్రధానమంత్రి సడక్ యోజన ని ధుల క్రింద సుమారు 55 లక్షలు నిధులతో మంజూరైన ఈవంతెన నిర్మాణ దశలోనే నిలిచిపోవడంతో ఆ యా గ్రామాల ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం బర్దిపూర్,పొట్టిపల్లి చిలపల్లి చిలపల్లి తం డా, ఎల్గోయి గ్రామాల ప్రజలతో పాటు కేతకి సంగమేశ్వ ర స్వామి ఆలయానికి వచ్చే మహారాష్ట్ర, కర్ణాటక భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు.ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన నిర్మా ణానికి అదనపు నిధులను మంజూరు చే యించి అసంపూర్తిగా ఉన్న వంతెనను పూర్తి చేయగలరని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

◆:- వంతెనకు పూర్తి కావాలంటే రూ.70 లక్షల

◆:- నిధులు కావాలి…. (పిఆర్ఎ శశిధర్ రెడ్డి)

అసంపూర్తిగా ఉన్న వంతెన కు పూర్తి చేయాలంటే రూ. 70 లక్షల నిధులు అవసర మవుతాయని వాటిని మం జూరు నిమి త్తం ప్రతిపాద నలు తయారు చేసి పంపిం చడం జరిగింది.

◆:- ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం…. (ఎండి.ఆరిఫ్, చిలపల్లి గ్రామస్థుడు)

రహదారిపై వంతెనలేకపో వడంతో వర్షాకాలంలో తీ వ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నామని అకస్మాత్తుగా గ్రామంలో ఎవరికై నా అనారోగ్యం పాలైతే ఆసు పత్రికి వెళ్లాలంటే కష్టంగా మారిందని త్వరలో వం తెన పూర్తి చేసి ఇబ్బందులు దూరం చేయాలి.

కోహిర్ మండల్ నూతన ఎస్ ఐ కి స్వాగతం పలికిన…

కోహిర్ మండల్ నూతన ఎస్ ఐ కి స్వాగతం పలికిన పైడిగుమ్మల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T121657.839.wav?_=6

జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండల్ కు నూతనంగా ఎస్ ఐ గ బాధ్యతలు తీసుకున్న నరేష్ కు పైడిగుమ్మల్ యువ నాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు శాలువా పూల మాలలతో ఘనంగా సన్మానించారు కోహీర్ మండల్ లోకి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పైడిగుమ్మల్, మాజీ ఎంపీటీసీ జ్ఞనారత్నం నాయకులు దావీదు యేసయ్య రామయ్య లక్ష్మయ్య బాలయ్య నర్సిములు ఆనందం కాంగ్రెస్ యువ నాయకులు మధు శాంసన్ అశోక్ సంపత్ సుమన్ మహేందర్ ప్రేమ్ యూత్ కాంగ్రెస్ నాయకులు బన్నీ రాకేష్ భాస్కర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

నూతన కూరగాయల హోల్ సేల్ రిటైల్ మార్ట్ ను ప్రారంభించిన..

నూతన కూరగాయల హోల్ సేల్ రిటైల్ మార్ట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T120520.991.wav?_=7

జహీరాబాద్ పట్టణం లోని కూరగాయల మార్కెట్ లో నూతనంగా ఏర్పాటు చేయబడిన సంగమేశ్వర కూరగాయల హోల్ సేల్ & రిటైల్ మార్ట్ ను ప్రారంభించి ప్రోప్రెటర్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉద్యమకారుడు అశోక్ రెడ్డి గారిని అభినందించి ,శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు , జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్ ,రాథోడ్ భీమ్ రావు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

పసిడి ప్రియులకు మరో గుడ్ న్యూస్. నేడు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరి హైదరాబాద్ సహా నేడు వివిధ నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాము.

భారత్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (2025 జులై 25) ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్‌ బంగారం ధర స్వల్పంగా తగ్గి రూ.1,00,470కు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్‌ బంగారం కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ.92,090కు చేరుకుంది. ఇక వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,17,000గా ఉంది. ఇక 10 గ్రాముల ప్లాటినం ధర కూడా స్వల్పంగా తగ్గి రూ.38,880కు చేరుకుంది.

దేశంలోని వివిధ నగరాల్లో బంగారం (24కే, 22కే, 18కే) ధరలు

చెన్నై: రూ.1,00,470; రూ.92,090; రూ.75,890

ముంబయి: రూ.1,00,470; రూ.92,090; రూ.75,350

ఢిల్లీ: రూ.1,00,620; రూ.92,240; రూ.75,470

కోల్‌కతా: రూ.1,00,470; రూ.92,090; రూ.75,350

బెంగుళూరు: రూ.1,00,470; రూ.92,090; రూ.75,350

హైదరాబాద్: రూ.1,00,470; రూ.92,090; రూ.75,350

కేరళ: రూ.1,00,470; రూ.92,090; రూ.75,350

పూణె: రూ.1,00,470; రూ.92,090; రూ.75,350

వడోదరా: రూ.1,00,520; రూ.92,140; రూ.75,390

అహ్మదాబాద్: రూ.1,00,520; రూ.92,140; రూ.75,390

వివిధ నగరాల్లో వెండి ధరలు (కిలో)

చెన్నై: రూ.1,27,900

ముంబయి: రూ.1,17,900

ఢిల్లీ: రూ.1,17,900

కోల్‌కతా: రూ.1,17,900

బెంగుళూరు: రూ.1,17,900

హైదరాబాద్: రూ.1,27,900

కేరళ: రూ.1,27,900

పూణె: రూ.1,17,900

వడోదరా: రూ.1,17,900

అహ్మదాబాదు: రూ.1,17,900

మత్తు పదార్థాల నివారణ పట్ల చర్యలు..

మత్తు పదార్థాల నివారణ పట్ల చర్యలు
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ఈస్ట్ జోన్ డీసీపీ,అదనపు కలెక్టర్ లతో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్ సమావేశం

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

మత్తు పదార్థాలను నివారించేందుకు అధికారులతో సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి లతో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్ సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల నియంత్రణ, నశాముక్త భారత్ లో భాగంగా చేపడుతున్న చర్యలపై కలెక్టర్ సమీక్షించారు.పోలీస్, విద్యా, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మత్తు పదార్థాలతో జరిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.ముఖ్యంగా యువతలో చైతన్యం తేవాలని పేర్కొన్నారు.డి అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని,కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులు గంజాయిను వినియోగించకుండా గట్టి నిఘా ఉంచాలన్నారు.ఈ సమీక్షలో జెడ్పి సీఈవో రామిరెడ్డి,డిఇఓ జ్ఞానేశ్వర్,డిడబ్ల్యుఓ రాజమణి, పోలీసు, నార్కోటిక్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

హ్యూమన్‌ వర్షిప్‌..బెస్ట్‌ లీడర్‌ షిప్‌!

`సీఎం. రేవంత్‌ పై రాహుల్‌ ప్రశంసలు.

`సంక్షేమ సారథి రేవంత్‌.

`పట్టుదలకు మారు పేరు రేవంత్‌.

`ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటూ రేవంత్‌ తో రాహుల్‌ ఆలింగనం.

`రేవంత్‌కు అధిష్టానం నుంచి పెద్ద ఎత్తున అభినందనలు.

`ద బెస్ట్‌ లీడర్‌ రేవంత్‌ అని సోనియా కితాబు.

`రేవంత్‌ పై ప్రియాంక పొగడ్తలు.

`డిల్లీ వర్గాలలో లో రేవంత్‌ పాలనపై సానుకూల చర్చలు.

`తెలంగాణలో సంపూర్ణ, సమగ్ర, అర్థిక, సామాజిక, కుల గనణపై రేవంత్‌ చిత్తశుద్ధిపై మెచ్చుకోలు.

`రేవంత్‌ భుజం తట్టి శభాష్‌ అని మెచ్చుకున్న ఖర్గే.

`రేవంత్‌ ప్రభుత్వ పనితీరుపై అధిష్టానం ఖుషీ.

`మోడల్‌ ఆఫ్‌ తెలంగాణ ఈస్‌ ద బెస్ట్‌ అని అందరి కితాబు.

`రాష్ట్ర ప్రభుత్వంపై అధిష్టానం పెద్దల నుంచి సానుకూల స్పందన.

`అధిష్టానానికి రేవంత్‌ దూరమనే వార్తలు పటా పంచెలు.

`త్వరలో రేవంత్‌ బిహార్‌ ఎన్నికల ప్రచార బాధ్యతలు.

`రైజింగ్‌ తెలంగాణతో బీహార్‌లో రేవంత్‌ ప్రచారం.

`అధిష్టానంతో ఎలాంటి గ్యాప్‌ లేదు.

`గాసిబ్స్‌ ప్రచారానికి ఇక తావులేదు.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 డిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పార్టీ అధినేతల నుంచి ప్రశంసలందుకున్నారు. ముఖ్యంగా లోక్‌సభలో ప్రతిపక్షనేత, పార్టీ మాజీ అధ్యక్షుడు, అగ్రనేత రాహుల్‌గాందీ నుంచి సిఎం. రేవంత్‌ రెడ్డి అభినందనలు అందుకున్నారు. సిఎం. రేవంత్‌ రెడ్డి చాలా గొప్పగా పాలన సాగిస్తున్నారు. తన అంచనాలకు మించి పాలన సాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ, ప్రబుత్వం తెలంగాణ ప్రజల సంక్షేమంలో ముందుందని కొనియాడేలా పాలన సాగిస్తున్నారని కొనియాడారు. తెలంగాన ప్రభత్వం నిర్వహించిన సమగ్ర సంపూర్ణ ఆర్దిక, సామాజిక, గణనపై పార్టీ అగ్రనేతలకు సిఎం. రేవంత్‌ రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రసెంటేషన్‌ ఇచ్చారు. సిఎం. రేవంత్‌ ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రసెంటేషన్‌కు ముగ్థులైన పార్టీ అదినేతి సోనియా గాంధీ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యాన్ని తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చడంతోపాటు, తొలి అడుగు వేసింది. దేశానికి ఆదర్శవంతమైన పాలనతోపాటు, సామాజిక గనణపూర్తి చేసంది. దాంతో కాంగ్రెస్‌ పెద్దలు సిఎం. రేవంత్‌ రెడ్డిని అభినందనలతో ముంచెత్తారు. రేవంత్‌రెడ్డి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వివరించారు. తెలంగాణలో కుల గణనతోపాటు చేపట్టిన అన్ని రకాల అంశాలు సుదీర్ఘం వివరించారు. తెలంగాణలో కుల గణన ఎలా చేపట్టారు. ఎంత మంది ఈ కార్యాక్రమంలో వినియోగించారు. కేవలం 60 రోజుల్లో ఎలా పూర్తి చేశారు. సమగ్ర సమాచారాన్ని ఎలా సేకరించారు. అప్పటికీ కొన్ని అభ్యంతరాలు వస్తే, మరో 15 రోజుల గడువుతో పూర్తి స్ధాయి సామాజిక గణన ఎలా పూర్తి చేశారన్న విషయాలను సిఎం. రేవంత్‌ రెడ్డి అదిష్టానానికి చక్కగా వివరించారు. దాంతో రాహుల్‌ గాంధీ మెచ్చుకొని రేవంత్‌ రెడ్డిని లయన్‌ ఆఫ్‌ ది తెలంగాణ అని కీర్తించారు. రేవంత్‌ రెడ్డి పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలనుద్దేశించ రాహుల్‌ గాంధీ ప్రస్తావిస్తూ రేవంత్‌ను సంక్షేమ సారధిగా అభివర్ణించారు. పట్టుదలకు రేవంత్‌ రెడ్డి మారు పేరంటూ కీర్తించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవడంలో రేవంత్‌ రెడ్డిన శ్రమను రాహుల్‌ కొనియాడారు. పార్టీని అదికారంలోకి తేవడంతోపాటు, ఆదర్శవంతమైన పాలన రేవంత్‌ సాగిస్తున్న తీరును అభినందించారు. దేశమంతా తెలంగాణ మోడల్‌ను అనుసరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్‌ పార్టీ ఆది నుంచి డిమాండ్‌ చేస్తున్న బిసి గణనను చేపట్టేందుకు ముందుకు రాలేదు. కాని కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు చేసిన విధానంపై దేశమంతా ఆసక్తికనబర్చింది. దాంతో ప్రజల నుంచి కూడా దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున డిమాండ్‌ ఏర్పడిరది. బిజేపి పాలిత రాష్ట్రాలే కాకుండా ఎన్డీయే పక్ష రాష్ట్రాలు కూడా బిసి గణనపై మొగ్గు చూపాయి. దాంతో కేంద్రం దిగి రాక తప్పలేదు. ఇదంతా కాంగ్రెస్‌ పార్టీ ఘనతే అన్నారు. అయితే అందుకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని రాహుల్‌ గాందీ పేర్కొన్నారు. ఎంతో పట్టుదలతో కుల గణన చేపట్టిన సిఎం. రేవంత్‌ను పట్టుదలకు మారు పేరుగా రాహుల్‌ అభివర్ణించారు. కాంగ్రెస్‌ ఫార్టీ ధ్యేయాం ఒక అడుగు ముందుకు పడేలా చేసిన రేవంత్‌ రెడ్డిని ఆలింగనం చేసుకొని అభినందించారు. సిఎం. రేవంత్‌రెడ్డి ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రెసెంటేషన్‌ నచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. సిఎం. రేవంత్‌ చొరవ వల్లనే ఇదిసాధ్యమైందన్నారు. ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాలు సామాజిక సృహ కల్గి వుంటే బిసిలకు భవిష్యత్తులో పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. బిజేపి ప్రభుత్వాలు కాంగ్రెస్‌ డిమాండ్‌కు తలొగ్గేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక కారణమని, బెస్ట్‌ లీడర్‌ అని రేవంత్‌ రెడ్డిని కొనియాడారు. అనంతరం కాంగ్రెస్‌పార్టీ అగ్ర నాయకురాలు, వాయినాడ్‌ ఎంపి. ప్రియాంకా గాంధీ కూడా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. రేవంత్‌ రెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్చే రేవంత్‌ రెడ్డి భుజం తట్టి శభాష్‌ అని మెచ్చుకున్నారు. ఈ సమయంలో పార్టీ పెద్దలను ప్రశంసలు అందుకున్నతీరును గుర్తు చేస్తూ సోనియా గాందీ మాటలే తనకు నోబెల్‌, ఆస్కార్‌ అవార్డులనుకుంటానన్నారు. ఏద ఏమైనా తెలంగాణలో 42శాతం బిసి రిజర్వేషన్లు అమలు చేసి, రిజర్వేషన్లపై వున్న గీత చెరిపేస్తామన్నారు. బిసి రిజర్వేషన్లకు అడ్డుగావున్న 50శాతం సీజింగ్‌ను బద్దలు కొడతామన్నారు. అయితే కొంత కాలం పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దగ్గర కాలేనంత దూరం ఏర్పడిరదంటూ పెద్దఎత్తున ప్రచారం జరగుతూ వచ్చింది. సిఎం.రేవంత్‌రెడ్డి ఎన్నిసార్లు డిల్లీకి వెళ్లినా రాహుల్‌ గాంధీ అప్పాయింట్‌ మెంటు ఇవ్వడం లేదని పుంకాను పుంకాలుగా వార్తలు వచ్చేవి. ప్రతిపక్షాలు సోషల్‌ మీడియా ద్వారా రకరకాల ప్రచారాలు సాగించింది. రేవంత్‌రెడ్డిని కలవడానికి రాహుల్‌ ఇష్టపడడం లేదని ప్రచారం సాగించారు. రేవంత్‌రెడ్డి రోజుల తరబడి పడిగాపులు కాసినా కనీసం ముఖం చూడడానికి కూడా ఇష్టపడడం లేదంటూ వార్తలు రాశారు. రేవంత్‌ రెడ్డిమీద అదిష్టానం ఎంతో కోపంగా వుందంటూ కూడా పదే పదే అసత్యాలు ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈ రెండు సంవత్సరాలలో కొన్ని సందర్భాలలో రాహుల్‌ గాందీ ఎదురైనా సిఎం.రేవంత్‌రెడ్డితో కనీసం పలకరించలేదంటూ కూడా వార్తలురాశారు. డిల్లీలో మొదట్లో కలిసిన ఫోటోలు తప్ప, ఇప్పటి వరకు కొత్త ఫోటోలు విడుదల చేయలేదని రకరకాల వార్తలు రాశారు. బిఆర్‌ఎస్‌ నాయకులు రేవంత్‌ రెడ్డి మీద నిత్యం అబాండాలు వేస్తున్నారు. వాటన్నింటికీ ఈ ఒక్క సందర్భం అనుమానాలన్నీ పటాంపంచెలు చేసినట్లైంది. రేవంత్‌రెడ్డి పవర్‌పాయింట్‌ ప్రసెంటేషన్‌ ఇస్తున్న సమయంలో రాహుల్‌ గాందీతోపాటు, పార్టీ పెద్దలందరూ ఎంతో ఆసక్తితో గమనించారు. ఆ సమయంలో రేవంత్‌ సర్కారు సాధించిన విజయాన్ని చూస్తూ ఆనందంగా పవర్‌ పాయింట్‌ ప్రెసెంటేషన్‌ తిలకించారు. కొన్ని సందర్బాలలో రాహుల్‌ గాందీ ఎంతో ఆసక్తితో ఆ ప్రెసెంటేషన్‌ విన్నారు. ఆ సమయంలో రాహుల్‌ గాందీ ఎంతో ఉల్లాసంగా కనిపించారు. తర్వాత రేవంత్‌ రెడ్డిని పొగడ్తలతో రాహుల్‌ గాందీ ముంచెత్తారు. అయితే రాహుల్‌ గాందీ వ్యాఖ్యలతో ప్రతిపక్షాల ఆరోపణలన్నీ పటాపంచెలైపోయినట్లే అంటున్నారు. ఇక సిఎం. రేవంత్‌ రెడ్డి మీద మాట్లాడేందుకు బిఆర్‌ఎస్‌కు ఎలాంటి అవకాశం లేకుండాపోయింది. ఓ వైపు సిఎం. రేవంత్‌రెడ్డి పనితీరును ప్రశంసిస్తూనే హ్యూమన్‌ వర్షిప్‌ రాహుల్‌ కొనియాడారు. అంటే పేదల ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే గొప్ప నాయకుడు అన్నారు. ప్రజలను ఆరాదించే పార్టీ కేవలం కాంగ్రెస్‌ పార్టీయే అని రాహుల్‌ అన్నారు. ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసం, దేశ ప్రగతి కోసం, రేపటి తరం కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్‌ అని రాహుల్‌ పేర్కొన్నారు. అలా కాంగ్రెస్‌ భావాలను, ఆచరణలోకి తీసుకెళ్తున్నా రేవంత్‌ రెడ్డిని రాహుల్‌ అభినందించారు. తెలంగాణ మోడల్‌ దేశమంతా ప్రచారం జరగాలని రాహుల్‌ కోరుకున్నారు. తెలంగాణ రైజింగ్‌ దేశమంతా చూస్తుందన్నారు. జిడీపి గ్రోత్‌లో దేశమంతా తెలంగాణను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని, అందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు వస్తేనే సాద్యమౌతాయని అన్నారు. వచ్చే బీహార్‌ ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డికి ప్రచార బాధ్యతలు కాంగ్రెస్‌ పార్టీ అప్పగించనున్నారు. తెలంగాణలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలపై రేవంత్‌రెడ్డి చేత పెద్దఎత్తున ప్రచారం సాగించాలని కాంగ్రెస్‌ పార్టీ అనుకుంటోంది. తెలంగాణలో సక్సెస్‌ పుల్‌గా అమలు జరుగుతున్న ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్‌ ఫార్టీ తరుపున విసృతంగా ప్రచారం చేయడానికి రేవంత్‌కు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అమలు జరుగుతున్న ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు పధకం వల్ల మహిళలకు ఎంత మేలు జరుగుతుందో బిహార్‌ ఎన్నికల్లో చెప్పనున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ రవాణా ఎలా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందో రేవంత్‌ వివరించనున్నారు. ఈ పద్దెనమిది నెలల్లో రెండు వందల కోట్ల ప్రయాణాలను మహిళలు సాగించారు. అంతే కాకుండా ఆర్టీసీ లాబాల పట్టింది. ఉచిత బస్సు పధకం విజయవంతం కావడంతో బిఆర్‌ఎస్‌కు పాలు పోవడం లేదు. ఆర్టీసి మరింత బలోపేతమౌతుంటే బిఆర్‌ఎస్‌ ఆశ్చర్యపోతోంది. తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పధకం గురించి రేవంత్‌ రెడ్డి బిహార్‌లో విసృతంగా ప్రచారం సాగించనున్నారు. దేశంలో ఒక్క తెలంగాణలోనే సన్న బియ్యం ఇస్తున్న తీరు, విధానం గురించి బీహార్‌ ప్రజలకు వివరించనున్నారు. అంతే కాకుండా ఇందిరమ్మ ఇండ్లపై కూడా రేవంత్‌ రెడ్డి ప్రచారం సాగిస్తారు. తెలంగాణ రైజింగ్‌పై ప్రచారం సాగించనున్నారు.

విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు ప్రయోగశాల..

విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు ప్రయోగశాల

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

మామునూర్ పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో సంకల్ప్ ల్యాబ్ ను ప్రారంభించిన కలెక్టర్

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు ప్రయోగశాల ఏర్పాటు చేసినట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.
విద్యార్థులు వారి విద్య విధానాలను అలవర్చుకొని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
శుక్రవారం మామునూర్ పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో పీఎం శ్రీ నిధి ద్వారా 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కృత్తిమ మేధో ఆధునిక సాంకేతిక నైపుణ్యాభివృద్ధి ( సంకల్ప్) ల్యాబ్ ను కలెక్టర్ ప్రారంభించారు.

Collector Dr. Satya Sarada

విద్యాలయానికి ముఖ్య అతిథిగా చేరుకున్న కలెక్టర్ డాక్టర్ సత్య శారదను ప్రిన్సిపల్ పూర్ణిమ,ఎన్సిసి స్కౌట్ గైడ్ విద్యార్థులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిని అందించేందుకు ప్రత్యేకమైన ప్రయోగశాలను పీఎం శ్రీ పాఠశాలల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ల్యాబ్ లో విద్యార్థులు రోబోటిక్స్ ఐ ఓ టి, బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెన్యువల్ ఎనర్జీ సిస్టం వంటి అంశాలను ప్రయోగాత్మకంగా నేర్చుకోవాలని అన్నారు.కలెక్టర్ విద్యార్థులతో స్వయంగా సంభాషించి ఇష్టపూర్వకంగా చదివి భావిభారత పౌరులు కావాలని కోరారు.విద్యార్థులను ఉత్తేజ పరుస్తూ భయాన్ని సంకోచతత్వాన్ని వీడాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.
అనంతరం ఏక్ పేడ్ మాకే నామ్ లో భాగంగా విద్యాలయ ప్రాంగణంలో కలెక్టర్ మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తో పాటు సురేష్ రామలింగయ్య ఉపాధ్యాయులు,విద్యార్థులు
తదితరులు పాల్గొన్నారు.

కింగ్ డమ్ సినిమా ట్రైలర్ ఈవెంట్ కు అనుమతి రద్దుచేయాలి..

*కింగ్ డమ్ సినిమా ట్రైలర్ ఈవెంట్ కు అనుమతి రద్దుచేయాలి..

*గిరిజనులను హేళనగా మాట్లాడిన హీరోను అడ్డుకుంటాం..

*నేత్ర స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు హరిప్రసాద్ నాయక్..

తిరుపతి(నేటి ధాత్రి(;జూలై 25:

విజయదేవర కొండ నటించిన కింగ్డమ్ చిత్రం ట్రైలర్ ఈవెంట్ కు తిరుపతిలో అనుమతి రద్దు చేయాలని నిఘా నేత్ర స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు హరిప్రసాద్ నాయక్ నగర పాలక సంస్థ అధికారులను డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏప్రిల్ 26న హైదరాబాద్ లో నిర్వహించిన హిరో సూర్య రెట్రో చిత్రం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కు హీరో విజయదేవకొండ హాజరయ్యారని, ఈవెంట్ కార్యక్రమంలో అభిమానుల తోపులాటను గుర్తించిన విజయదేవరకొండ గిరిజనులను కించపరిచేలా వ్యాఖ్యానించారని విమర్శించారు. 500 సంవత్సరాల క్రితం గిరిజనులు కొట్టుకుంటున్నట్లు అభిమానులు కొట్టుకుంటున్నారని హేళన చేసి మాట్లాడడం దారుణమన్నారు. వివక్షత లేని సమాజం సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కలిగిన హీరో ఒక జాతిని కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. ఇటీవల ఫల్మాం సంఘటనలో దేశ ప్రజల కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన మురళీ నాయక్ మా జాతి బిడ్డ అని గర్వంగా చెప్పారు. అలాంటి గిరిజన జాతిని హేళనగా మాట్లాడిన దేవరకొండ సినిమా కింగ్డమ్ చిత్రం ఈవెంట్ను తిరుపతిలో అడ్డుకుంటామని హెచ్చరించారుఈ కార్యక్రమంలో నేతలు రవీంద్రనాయక్, శివశంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు బంద్ విజయవంతం..

చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు బంద్ విజయవంతం

రెవెన్యూ డివిజన్ ప్రజల చిరకాల ఆకాంక్ష

ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన జేఏసీ

జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ళ పరమేశ్వర్

చేర్యాల నేటిదాత్రి

చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు ఈప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్చడం కోసం జేఏసీ నిర్వహించిన బంద్ ఎంత బలంగా ఉందో ప్రభుత్వానికి తెలిసి రావాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ అన్నారు. శుక్రవారం జేఏసీ తలపెట్టిన బంద్ తో పట్టణంలో వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బందు పాటించాయి.చేర్యాల,మద్దూరు,కొమురవెల్లి, ధూల్మీట్ట మండల మండల కేంద్రాలతో పాటు మేజర్ గ్రామపంచాయతీలు సైతం ఉదయం నుండే జేఏసీ నాయకులు రోడ్డుపైకి వచ్చి పాదయాత్ర బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ రామగళ్ళ పరమేశ్వర్ మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాటి పీసీసీ అధ్యక్షులు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చిన సందర్భంలో 18 నెలల కాలంలో వారి హామీని నెరవేర్చకపోవడం ఈప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చకపోవడంపై మండిపడ్డారు. ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలే నాయకులై స్వచ్ఛందంగా బందు చేశారని, ఇందుకు నిదర్శనమే రెవెన్యూ డివిజన్ ఆకాంక్ష ప్రజల్లో ఎంత ప్రభలంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఇది ఒక భౌతిక అంశం మాత్రమే కాకుండా ఈప్రాంత ప్రజల ఆకాంక్ష అస్తిత్వం, ఉనికి ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్నదని ఈ బందు ద్వారా ప్రజల ఆకాంక్షను వెలిబుచ్చారు. ఇదే స్ఫూర్తితో రెవెన్యూ డివిజన్ సాధించేవరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేశారు. వ్యాపార వాణిజ్య వర్గాలు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నామన్నారు. త్వరలో విద్యాసంస్థల బంద్, రహదారి దిగ్బంధం, చలో కలెక్టరేట్, వంటావార్పు తదితర అంశాలపై తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు , అందె బీరయ్య, అందే అశోక్ .బుట్టి సత్యనారాయణ, పిల్లి చంద్రం, పోలోజు వెంకటాద్రి, ఎక్కలదేవి సుధాకర్, ఈరి భూమయ్య, సుతారి రమేష్, కత్తుల భాస్కర్ రెడ్డి,పొన్నబోయిన మమత,సనవాల ప్రసాద్, పోషబోయిన పరమశేఖర్, భూమిగారి మధూకర్, పుల్ల ఆంజనేయులు, నంగి కనకయ్య, పోనుగోటి శ్రీనివాస్ రెడ్డి, అరుట్ల లింగం, కడుదూరి పుల్లారెడ్డి, పొన్నబోయిన శ్రీనివాస్, కర్రె నర్సిరెడ్డి, భూర సీతారాముల, పుల్ల కుమార్, ముద్దల్ల యాదయ్య, కత్తుల లక్ష్మరెడ్డి, బింగి పోశయ్య, మురళి, మహేందర్, రాజు,తదితరులు పాల్గొన్నారు.

టీబీజీకేఎస్ నాయకులు అసత్యపు ఆరోపణలు మానుకోవాలి.

టీబీజీకేఎస్ నాయకులు అసత్యపు ఆరోపణలు మానుకోవాలి

*కేంద్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్
జెట్టి శంకర్రావు*

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

గత కొంతకాలం నుండి టీబీజీకేఎస్ నాయకులు చేస్తున్న అసత్యపు ఆరోపణలను మానుకోవాలని ఐఎన్టియుసి కేంద్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ రావు శుక్రవారం ప్రకటనలో హెచ్చరించారు.సింగరేణిలో టీబీజీకేఎస్ ఇంచార్జ్,మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేస్తున్న ఆరోపణలు దయ్యాలు వేదాలు వల్లించడమే తప్ప వాస్తవం కాదని తెలిపారు.మితి మీరిన రాజకీయ జోక్యంతో బిఆర్ఎస్ ప్రభుత్వం బాండ్ల రూపంలో ఉన్న సింగరేణి మిగులు బడ్జెట్‌ను కొల్లగొట్టి సంస్థకు రూ.29 వేల కోట్లపైగా ప్రభుత్వ బకాయిలు ఇవ్వకుండా అజమాయిష్ చేసింది మీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.మీ పరిపాలనలో ఒక్క కొత్త గనిని కూడా తెరవలేని దుస్థితికి సింగరేణిని తీసుకొచ్చారని,సంస్థను ఆర్థికంగా నిర్వీర్యం చేసింది కూడామీ ప్రభుత్వమేనని విమర్శించారు.
మీ టీబీజీకేఎస్ నాయకులను, సంస్థ పాలనా పరంగా చేసిన బదిలీలను రాజకీయ జోక్యంగా చిత్రీకరించడం అసత్యప్రచారం తప్ప మరేమీ కాదన్నారు.అప్పటి గుర్తింపు సంఘం,అధికారంలో మీ పార్టీ ఉండగా జరిగిన ఈ చర్యలు ఇప్పుడు మితిమీరిన జోక్యమని మాట్లాడడం విడ్డురమన్నారు.
2022 లో యాజమాన్యం సంస్థ పాలన పరంగా, సింగరేణి వ్యాప్తంగా 20 మంది యూనియన్ నాయకులను, శ్రీరాంపూర్‌లో ఐదుగురు టీబీజీకేస్ నేతలను బదిలీ చేసింది.అప్పుడు గుర్తింపు సంఘంగా టీబీజీకేస్, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండటాన్ని మరిచి,ఇప్పుడు రాజకీయ జోక్యం గురించి మాట్లాడడం నైతిక విలువలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.మీ రాజకీయ హోదా నిలబెట్టుకోవడం కోసం ప్రభుత్వంపై నీతిమాలిన ఆరోపణలు చేయడం తగదని హితువు పలికారు.నిజం తెలుసుకున్న కార్మికులు తప్పకుండా మీ వాస్తవ రూపాన్ని గ్రహిస్తారని హెచ్చరించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలి…

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలి…

భారతీయ జనతా పార్టీ మద్దూర్ మండలం, అధ్యక్షులు మోకు ఉదయ్ రెడ్డి

మద్దూరు నేటిధాత్రి

జనగామ నియోజకవర్గం మద్దూరు మండలం లో నిర్వహించిన “స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల” లో ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉడుగుల రమేష్, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. బొంగోని సురేష్ గౌడ్ . పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మద్దూరు మండల అధ్యక్షుడు మోకు ఉదయ రెడ్డి అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బిజెపి జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలి. అని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొంగోని సురేష్ గౌడ్ అన్నారు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంత ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తోంది. అన్నారు బిజెపి ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి. అని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు సభ్యుల, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ నుండి, జిల్లా పరిషత్ చైర్మన్ వరకు బిజెపి కైవసం చేసుకోవాలి అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాపాక బుచ్చిరెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబెర్ కూరెళ్ల కిరణ్ గౌడ్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు కొండా నాగమణి, ప్రధాన కార్యదర్శులు బొంగోని బాలు, బియ్య రమేష్,సోగాలా మనోజ్,కృష్ణా రెడ్డి, మేక సుదర్మ, చింతల రాజు, చందు, శ్రీకాంత్, బాలకృష్ణ, రాజు మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

తుంకుంట పంచాయతీ కార్యదర్శి సస్పెండ్..

తుంకుంట పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం తుంకుంట పంచాయతీ కార్యదర్శి బీరప్ప సస్పెండ్ అయినట్లు తెలిసింది వివరాలకు వెళితే తుంకుంట గ్రామం లో కోర్టు పరిధిలో ఉన్న భూమి తప్పదు తీర్మానాలు చేసిన విషయం లో ఆయన సస్పెండ్ అయినట్లు అనుకుంటున్నారు. ఈ సస్పెండ్ గత 17 వ తేదీ న అయినప్పటికీ అధికారులు ఇట్టి విషయం లో అధికారికంగా తెలుపడం లో ఆలస్యం చేస్తుండడడంతో పలు అనుమానాలకు అవకాశం కనిపిస్తుంది. వారం రోజులు గడించిన ఇప్పటివరకు తుంకుంట గ్రామానికి కూడా కనీసం ఇంచార్జి గా పంచాయతీ కార్యదర్శి ని నియమించాకపోవడం ఏమిటని అనుకుంటున్నారు.

పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన..

పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన సంగారెడ్డి కలెక్టర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల హాజరు, పఠన సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి యూనిఫాంలు, పాఠ్యపుస్తకాల విషయాలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. కాంపౌండ్ వాల్, మౌలిక సదుపాయాలపై అధికారులను ఆదేశించారు.

గుణాత్మక విద్య బాధ్యత ఉపాధ్యాయులదే..

గుణాత్మక విద్య బాధ్యత ఉపాధ్యాయులదే-

డిఇఓ. వాసంతి

శాయంపేట నేటిధాత్రి:

ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి డి వాసంతి అన్నారు. 25-7-2025 రోజున జిల్లా పరి షత్ ఉన్నత పాఠశాల పత్తిపాక కాంప్లెక్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొని వచ్చే విధం గా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమకొం డ జిల్లా సమగ్ర శిక్ష గుణాత్మక విద్య కోఆర్డినేటర్ డాక్టర్ మన్మో హన్,మండలవిద్యాశాఖ అధి కారి భిక్షపతి, ఉన్నత పాఠ శాల ఇన్చార్జి ప్రధానోపా ధ్యాయులు అనిత, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయు లు శ్రీనివాస్,ఆర్ పిలు అం జని, నారాయణ, అశోక్, మనోజ్, సురేందర్, పాఠ శాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గం లో ఘనంగా ప్రారంభమైన..

శ్రీకాళహస్తి నియోజకవర్గం లో ఘనంగా ప్రారంభమైన ఏ డే విత్ తుడా చైర్మన్ కార్యక్రమం..

*శ్రీకాళహస్తి శాసనసభ్యులతో కలసి శ్రీకాళహస్తి
నియోజకవర్గం లో పర్యటించిన తుడా చైర్మన్..

*ఎమ్మెల్యే నిధులు తుడా నిధులతో శ్రీకాళహస్తికి మహర్దశ..

*శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి..

*అభివృద్ధి అజెండాగా తుడా పని చేస్తుంది..

*తుడా ఛైర్మెన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 25:

రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏ డే విత్ తూడా చైర్మన్ అనే కార్యక్రమంలో భాగంగా తుడా పరిధిలోని 9 నియోజకవర్గాలలో స్థానిక శాసనసభ్యులతో కలిసి పర్యటించి సమస్యలను గుర్తించి వాటిని అక్కడే పరిష్కరించే విధంగా సరికొత్త కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా మొదటగా శుక్రవారం తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తుడా అధికారులతో కలిసి శ్రీకాళహస్తి నియోజకవర్గం చేరుకున్నారు.అక్కడ స్థానిక శాసనసభ్యులు మున్సిపల్ అధికారులు అందరూ కలిసి నగరంలో సమస్యలను గుర్తించేందుకు పర్యటించారు. ముందుగా ఏపీ సీడ్స్ వద్దకు చేరుకొని అక్కడ ఉన్న పార్కును అభివృద్ధి తుడా నిధులతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.అక్కడే స్వర్ణముఖి ఈట్ ఫుడ్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అనంతరం తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఇరువురు బైక్ పైన నగరంలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. ఇరువురు అక్కడికక్కడే అధికారులను పిలిపించి. డ్రైనేజీ మరమ్మతులు, త్రాగునీటి పైప్లైన్ల కోసం ఎస్టిమేషన్లు తయారుచేసి ప్రతిపాదనలు సిద్ధం చేయమని ఆదేశించారు. అనంతరం శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ కి చేరుకొని అక్కడి మౌలిక వసతుల కల్పన కోసం చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా తుడా నిధులతో ఆస్పత్రి ఆవరణలో గ్రీనరీ ఏర్పాటు చేయాలని తుడా చైర్మన్ అధికారులకు ఆదేశించారు..జయ రామారావు వీధిలో పురాతన డ్రైనేజీ కాలువ ల ను ఆధునికరించి డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికుల ను డ్రైనేజ్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి తుడా అధికారులను సన్మానించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తుడా నిధులతో పట్టణాన్ని ఆకర్షణయంగా చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన జరినామాలు ఉంటాయని హెచ్చరించారుతుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో డ్రైనేజీ కాలువ ల అభివృద్ధికి ఐదు కోట్లు నిధులు మంజూరు చేస్తామని, గ్రీనరీ డెవలప్మెంట్ వివిధ ప్రాంతాల అభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం అందిస్తామని తెలిపారు.

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు…

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు…

నేటి ధాత్రి -గార్ల :-

ఎరువులు అధిక ధరలకు అమ్మినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తీసుకొంటామని ఎంతటి వారైనా ఉపేక్షించ బోమని మహబూబాబాద్ జిల్లా ఇంచార్జ్ వ్యవసాయ అధికారి అజ్మీరా శ్రీనివాస్ రావు ఎరువుల డీలర్లను ను హెచ్చరించారు.శుక్రవారం గార్ల మండల పరిధిలోని పుల్లూరు మరియు గార్ల లో పలు ఎరువుల దుకాణం లను మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు తో కలిసి తనిఖీ చేపట్టారు.స్టాక్ బోర్డు, స్టాక్ రిజిస్టర్,ఇన్వాయిస్ లు, ఈపాస్ మెషిన్స్ క్షుణ్ణంగా పరిశీలించినారు.రైతులను ఇబ్బంది పెట్టకుండా ఎరువులను సాఫీగా పంపిణీ చేయాలని డీలర్స్ ను కోరారు.ఎరువులు జిల్లా లో సరిపడా అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మోతదు కు మించి రసాయన ఎరువులు వాడవద్దని రైతులకు సూచించారు.ఎరువులు అమ్మకం లో అక్రమాలకు పాల్పడితే సంబందించిన ఎరువుల లైసెన్స్ రద్దు చేస్తామని హేచ్చరించినారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version