భూ భారతి పై రెవెన్యూ సిబ్బంది కి అవగాహన.

— భూ భారతి పై రెవెన్యూ సిబ్బంది కి అవగాహన
• జూన్ 2 నుండి భూ భారతి దరఖాస్తుల స్వీకారణ
• అకాల వర్షాలకు రైతులు అప్రమత్తంగా ఉండాలి

మెదక్ ఆర్డీఓ రమాదేవి

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకువచ్చిన భూ భారతి పై రెవెన్యూ సిబ్బందికి మెదక్ ఆర్డీఓ రమాదేవి అవగాహన కల్పించారు. ఈ మేరకు నిజాంపేట మండల తహసీల్దార్ కార్యాలయాన్నీ ఆమె శుక్రవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు.. మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జూన్ 2 న భూ భారతికి సంబంధించి దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుందన్నారు. భూమిలకు సంబంధించిన సమస్యల పై సంబంధిత ధ్రువ పత్రాలను జోడించి దరఖాస్తు ఫామ్ తో కలిపి అధికారులకు అందివాలన్నారు. భూ భారతి లో దరఖాస్తు చేసుకున్న సమస్యలను విచారించి పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. సత్వర సమస్యల పరిష్కారం కోసం భూ భారతి నీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చెయ్యడం జరిగిందన్నారు. అలాగే అకాల వర్షాల దృశ్య కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం అరబోసిన రైతులు టార్పాలిన్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వేగవంతగా కొనుగోలు జరపాలని ఇంచార్జులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యుటీ తహసీల్దార్ రమ్యశ్రీ,సీనియర్ అసిస్టెంట్ రమేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు ప్రీతీ, ఇమాద్, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

పశువులను సంరక్షించేందుకే గోశాలకు తరలింపు…

పశువులను సంరక్షించేందుకే గోశాలకు తరలింపు…

పశువులు వాహనదారుల ప్రమాదాలకు కారణమైతే యజమానులపై చర్యలు..

మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, పట్టణ ఎస్ఐ రాజశేఖర్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని పలు ఏరియాలలో రోడ్లపై సంచరిస్తున్న పశువులను మున్సిపల్ శాఖ,పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో గోశాలలకు తరలించారు.రోడ్లపై సంచరించే పశువులను పశు యజమానులు వాటిని తమ ఇంటికి తీసుకువెళ్లాలని గత ఐదు నెలలుగా పత్రిక ప్రకటనలు ఇచ్చినప్పటికీ కొందరు యజమానులు పశువులను రోడ్లపై వదలడంతో గోశాలలకు తరలిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, ఆర్ కె పి ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మానవాళినీ ఇబ్బందులకు గురి చేసే ఏ జీవులైనా సరే కుక్క, గోవు, పశువు ఏదైనా తరలించే హక్కులు మునిసిపాలిటీ అధికారులకు ఉంటాయని కమీషనర్ గద్దె రాజు తెలిపారు .

Cowshed

 

పశువులను సంరక్షించేందుకే వాటిని గోశాలలకు తరలిస్తున్నామని వారు అన్నారు. పశువులు రోడ్లపై సంచరిస్తూ పాదాచారులకు, వాహనదారులకు, వ్యాపారస్తులకు, కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో పశువులను గోశాలలకు తరలించడం జరిగిందని పేర్కొన్నారు.

Cowshed

 

పశువులను ఇలాగే రోడ్లపైకి వదిలేస్తే వాహనదారులు ప్రమాదానికి గురైనట్లయితే పశు యజమానులపై తగు చర్యలు తీసుకోబడతాయని ఎస్ఐ హెచ్చరించారు. సరైన ఆధారాలతో ఎవరైనా పశువుల యజమానులు వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే పశువులను వాటి యజమానులకు అప్పగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి వెటర్నరీ డాక్టర్ తిరుపతి, మూగజీవుల సేవా సంఘం సభ్యులు, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయ డెంగ్యూ దినోత్సవం.

జాతీయ డెంగ్యూ దినోత్సవం

– డెంగ్యూ డే సందర్భంగా

– ప్రజల కు అవగాహన కల్పించేందుకు ర్యాలీ.

– దోమల వ్యాప్తిని అరికడుదాం.

డాక్టర్ గుగులోతు రవి

మరిపెడ నేటి ధాత్రి:

దోమల వ్యాప్తిని అరికట్టి డెంగ్యూ వ్యాధిని సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల వైద్యాధికారి డాక్టర్ గూగులోతు రవి పేర్కొన్నారు,డెంగ్యూ డే సందర్భంగా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి మరిపెడ పట్టణం కార్గిల్ సెంటర్ మరియు బస్టాండ్ సర్కిల్‌ వరకు అవగాహన ర్యాలీ మరియు మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ ఆర్ధోవైరస్‌ తరగతికి చెందిన నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌ల వల్ల ఈ వ్యాధి సోకుతుందన్నారు.ఇది మనిషి నుండి మనిషికి ఏడిస్‌ ఈజిప్టై దోమలద్వారా సంక్రమిస్తుందన్నారు.ఈ జాతి దోమ పైన నల్లని, తెల్లని చారలు ఉండుటవలన దీనిని టైగర్‌ దోమ అనికూడా పిలుస్తారన్నారు. ఈ దోమలు ఇంటిలోపల, ఆవరణలో ఉండి,పగటిపూట మాత్రమే కుడతాయన్నారు.ఇవి ఎక్కువ దూరం (400 మీటర్లు) ఎగరలేవని, అన్ని రకాల దోమలకంటే ఈ దోమ చాలా బరువైనదగా ఉంటుందన్నారు.డెంగ్యూ వైరస్‌ తో ప్రభావం అయిన దోమలోనే కాకుండా దోమ గుడ్లలో కూడా ఈ వైరస్‌ ఉంటుందన్నారు.కాబట్టి త్వరితగతిన ఎక్కువ మందికి వ్యాధి వ్యాపించే అవకాశం ఉంటుందన్నారు. ఈ దోమ మంచినీటి నిల్వలలో మాత్రమే గుడ్లు పెడుతుందని,ఈ వైరస్‌ వలన ఒకటి కంటే ఎక్కువసార్లు కూడా డెంగీ రావచ్చన్నారు,వ్యాధి లక్షణాలు ముఖ్యం గా
ఆకస్మికంగా తీవ్రమైన జ్వరం, తలనొప్పి,విపరీతమైన కండరాలు,కీళ్ళ నొప్పులు
కళ్ళు నొప్పులు, కంటి కదలిక తగ్గటం,నొప్పి,ఒక్కొక్కసారి శరీరంలో ఎర్రటి దద్దుర్లు ఏర్పడుతాయన్నారు
చిగుళ్ళ నుండి రక్తస్రావం
అధిక దాహం, నోరు ఎండిపోవడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు.
డెంగీ వ్యాధి మూడు రకాలుగా బయటపడవచ్చు..
డెంగీ జ్వరం,డెంగీ హెమరేజ్‌ జ్వరం,డెంగీ షాక్‌ సిండ్రోమ్‌ గా వెల్లడి అవుతుందన్నారు.
నివారణ చర్యలు ముఖ్యం గా ఇంటిలోపల, ఇంటి ఆవరణలో ఎక్కడా మూతలేకుండా కొద్దిగా నీళ్ళుకూడా నిల్వ ఉండకూడదన్నారు
ఉదాహరణకు పూలకుండీల క్రింద, పెంకులు, కొబ్బరిబోండాలు, రుబ్బురోళ్ళు, పనికిరాని వస్తువులు, పాతటైర్లు, తాగి పడేసిన టీ కప్పులు, సీసాలు, , నీటి ట్యాంకులు, సంప్‌ లు, కూలర్లు, నీటి గుంటలుల్లో ఈ దోమ ఉత్పత్తి అవుతుందన్నారు.
దోమలు కుట్టకుండా దోమతెరలు వాడుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ స్వామి, పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ మంగమ్మ, సూపెర్వైసోర్స్ కృష్ణ, ఆచార్యులు, సుదర్శన్, లక్ష్మి కుమారి, మాధవి, పల్లె దవాఖాన సిబ్బంది సాయి శ్రీ, సిరి, సతీష్, ఝాన్సీ, తరణి, హెల్త్ అసిస్టెంట్ వీరయ్య, నర్సయ్య, ఆశ ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

గర్భవతులు పిల్లలు వేసవిలో.!

గర్భవతులు పిల్లలు
వేసవిలో
తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద.

చిట్యాల నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైనుపాక గ్రామంలోని అంగన్వాడి కేంద్రాలను శుక్రవారం రోజున అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేసిన సూపర్వైజర్ జయప్రద ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండాకాలం అయినందున గర్భవతులు బాలింతలు పిల్లలు తీసుకోవలసిన ఆహార ఆరోగ్య వ్యక్తిగత శుభ్రత మంచినీటి ప్రాముఖ్యత గూర్చి వివరించనైనది ముఖ్యంగా ఈ సమయంలో ఫంక్షన్స్ తీర్థయాత్రలు వెళ్లకుండా చల్లటి వాతావరణంలో ఎప్పుడు కూలర్ ఏసివద్ద ఉండకుండా చెట్ల నీడలో ఎక్కువ సమయం గడపాలని మసాలాలతొ కూడిన భోజనము కాకుండా చిరుధాన్యాలతో కూడిన భోజనం తినాలి అని బయట తిను బండారాలు తినకుండా కూల్డ్రింక్స్ కు దూరంగా ఉండాలని చల్లటి మజ్జిగ నిమ్మరసం దోసకాయ వాటర్ మినరల్ లాంటి పానీయాలు తీసుకోవాలని వివరించనైనది అలాగే తల్లులు పిల్లలు ముఖ్యంగా కిశోర బాలికలు మొబైల్ కి దూరంగా ఉండాలని వివరించి గర్భవతులు పిల్లల బరువు ఎత్తు చూసి గర్భవతి బాలింతలకు పాల ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కరుణ సుభద్ర సుజాత ఆయాలు అస్మ సరోజన మహిళలు హాజరైనారు.

గాలి వానకు కొడిశలమిట్ట గ్రామం ఆగమాగం.

గాలి వానకు కొడిశలమిట్ట గ్రామం ఆగమాగం

 

భయాందోళనలో గిరిజనులు

అంధకారంలో పందెం -కోడిశెనపెట్ట గ్రామాలు

కొత్తగూడ నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లోని కొడిశల మిట్ట గ్రామంలో గురువారం మధ్య వీచిన గాలులకు వానకు గ్రామం అంత అతుల కుతులoగా మారింది
ఫోన్ సౌకర్యం కూడా లేని గ్రామం కావడంతో అటువైపు అధికారుల పర్యవేక్షణ కరువైంది వారి బాగోవులను పట్టించుకున్న అధికారులకు ఆ గ్రామాన్ని ఇప్పటి వరకు సందర్శించిన దాకలాలు లేవు
రాత్రి వీచిన గాలి వర్షానికి గ్రామంలో కొన్ని ఇండ్ల పైన పెంకలు. రేకులు కొట్టుకుపోయి రోడ్డుకు ఇరువైపుల చెట్లు పడడంతో ఇబ్బందిగా మారింది
అధికారులు స్పందించీ గ్రామాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు…

బడిబాట ఉల్లాస్ పై పేరెంట్స్ కు అవగాహన కార్యక్రమం.

బడిబాట ఉల్లాస్ పై పేరెంట్స్ కు అవగాహన కార్యక్రమం.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాలజడ్పీహెచ్ పాఠశాలలో పేరెంట్ టీచర్ సమావేశాలు బడిబాట మరియు ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా చిట్యాలలో పేరెంట్ టీచర్ సమావేశాలు జరిగినవి. ఈ సందర్భంగాఎంఇఓ కోడేపాక రఘుపతి మాట్లాడుతూ అందరూ విద్యావంతులైనప్పుడే ఆ సమాజం బాగుంటుందన్నారు. ప్రభుత్వ విద్యా సౌకర్యాలను వినియోగించుకొని ప్రతి పౌరుడు అభివృద్ధి పథంలో కొనసాగాలని కోరారు. 15 సంవత్సరాలు పైబడిన పిల్లలు సైతం ఉల్లాస్ కార్యక్రమం ద్వారా ప్రాథమిక విద్య, వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బైరం కల్పన, ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీరామ్ రఘుపతి, మహిళా సంఘం నాయకురాళ్లు,, అంగన్వాడి టీచర్లు భాగ్యలక్ష్మి,మరియు వివో ఏ చందర్, కోమల ఉపాధ్యాయులు బండారి సదయ్య, గోపగాని భాస్కర్, బొమ్మ.రాజమౌళి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న.

నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గి గ్రామంలో పుసల్పహాడ్ తుకారం గంగమ్మ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి వారితో పాటు మాజీ ఎంపీటీసీ శివ నంద శ్రీపతి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధారెడ్డి యువజన నాయకులు నగేష్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల తల్లిదండ్రుల సమావేశం.

జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల తల్లిదండ్రుల సమావేశం

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

 

 

మండలంలోని వర్షకొండ గ్రామం లోని రైతు వేదిక లో జడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు కలిసి తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి గ్రామ మాజీ సర్పంచ్ దంతుల శ్యామల తూక్కారం మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఆవుల లావణ్య పాల్గొన్నారు, ఈ సంవత్సరం పాఠశాల సాధించిన ఫలితాలను ప్రధానోపాధ్యాయులు రాజేందర్ వివరించారు 527 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన నారే లహరి, 525 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచిన హర్షిని లను సమావేశంలో అభినందించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య దొరుకుతుందని అందరు కూడా మన గ్రామంలో ఉన్న వర్షకొండ జడ్పీ పాఠశాల యందు వారి పిల్లల్ని చేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివకృష్ణ, మహేష్, అనిత, సుజాత గారలు పాల్గొన్నారు. సుమారు వందమంది పేరెంట్స్ పాల్గొన్నారు.

గ్రామపంచాయతీ నూతన భవనానికి మోక్షం కలిగేనా.

గ్రామపంచాయతీ నూతన భవనానికి మోక్షం కలిగేనా!

ఏండ్లు గడుస్తున్న భవన నిర్మాణం కలగానే మిగిలి పోతుందా!

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలో నూతన గ్రామపంచాయతీ భవనానికి మోక్షం ఎప్పుడు అనేది మండల ప్రజలు ఆలో చనలో పడ్డారు. గత ప్రభుత్వం నూతన భవనానికి శంకుస్థాప నలు చేసి పనులు మొదలు పెట్టకపోవడం వల్ల ప్రజాప్రతిని ధులు అధికారుల మీద ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తు న్నారు.మెరుగైన పాలనఅందిం చేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయాలను నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చి భవనాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రణాళిక రూపొందిం చాలి.గత ప్రభుత్వం పంచా యితీ కార్యాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గ్రామాల అభివృ ద్ధి ద్యేయం కాబట్టి స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని నూతన భవన నిర్మాణానికి అవకాశం కల్పించి, త్వరగా నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని ప్రజలు కోరుతు న్నారు.గత ప్రభుత్వం అభి వృద్ధి చేయని ఘనత. ఎక్కడ ఉన్న గొంగడి అక్కడే ఉన్నట్టు అనిపించింది. దీంతో గ్రామపం చాయతీ నూతన భవనానికి మోక్షం కలుగుతుందా!

నూతన గ్రామపంచాయతీ భవనం ఏర్పాటు చేయండి.

నూతన గ్రామపంచాయతీ భవనం ఏర్పాటు చేయండి

ప్రభుత్వమే నిర్మించాలి

నేటిధాత్రి

 

 

 

గ్రామపంచాయతీ కార్యాల యంలో గదులు లేక ఆరు బయటనే సమావేశాలు, వస్తువులను భద్రపరచడం, ప్రజల సమస్యలు పరిష్కారం కోసం, వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడం సాధ్యం కావట్లేదు ఇలాంటి సమస్యలు ఎదురవు తున్నాయి.మండల మేజర్ గ్రామపంచాయతీ కాబట్టి నూతన భవనాన్ని ప్రత్యేక హంగులతో ప్రభుత్వం భవన నిర్మాణం చేపట్టాలి.నూతన భవన నిర్మాణం పూర్తి చేస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుతుంది కాబట్టి భవన నిర్మాణ పనులు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు

హరిహర వీరమల్లు గర్జించేది అప్పుడే…

హరిహర వీరమల్లు గర్జించేది అప్పుడే అభిమానులకు పండగే.

 

నేటి ధాత్రి:

 

 

 

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం  ‘హరి హర వీరమల్లు'(hari hara Veera mallu) . 

ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాలలో ఇదొకటి. 

భారీ అంచనాలు ఉన్న ఏ చిత్రం కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం  ‘హరి హర వీరమల్లు'(hari hara Veera mallu) . 
ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాలలో ఇదొకటి. 
భారీ అంచనాలు ఉన్న ఏ చిత్రం కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మూడవ పాటను ట్రైలర్‌తో పాటు ఆవిష్కరించడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది. ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ తుదిదశకు చేరుకుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. వీఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్, డబ్బింగ్ పనులతో మెరుపు వేగంతో తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ  చిత్రం, జూన్ 12న బాక్సాఫీస్ దగ్గర గర్జించనుంది.  ఈ మేరకు మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు.  జూన్ 12న సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు భాగమయ్యారు. మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ నటిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. (Harihara veeramallu Release Date)

ఆలస్యాల మధ్య పగ్గాలు చేపట్టిన దర్శకుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, కొద్ది నెలలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ప్రతి విభాగాన్ని పర్యవేక్షిస్తూ, వెండితెరపై మునుపెన్నడూ చూడని అద్భుతమైన అనుభూతిని ప్రేక్షకులకు అందించడానికి కృషి చేస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’ గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. చిత్ర బృందం ఎక్కడా రాజీ పడకుండా, ప్రపంచం మెచ్చే గొప్ప చిత్రంగా మలచడానికి కృషి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో భారీ ఎత్తున విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా.. ప్రేక్షకుల హృదయాలను, బాక్సాఫీస్‌ను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది.

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలి.

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలి

ఇబ్రహీంపట్నం నేటి ధాత్రి:

మండలంలోని వర్షకొండ గ్రామంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొల్లెవైన శంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాని కంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పదని తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంటుందని మరియు మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని తొందర తొందరగా కొనుగోలు చేస్తుందని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా జాగ్రత్త పడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంగ ధ్యావత్ విజయ్. మరియు కాంగ్రెస్ నాయకులు రైతులు పాల్గొన్నారు,

18న బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ.

18న బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ.

◆- కరపత్రం విడుదల చేసిన పీఠాధిపతులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ జగద్గురు మహాత్మా బసవేశ్వర విగ్రహావిష్కరణ ఈనెల 18న నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. సంబంధిత కరపత్రాన్ని, గోడపత్రికను శుక్రవారం బర్దిపూర్ శ్రీ దత్తగిరి ఆశ్రమంలో పీఠాధిపతులు మహామండలేశ్వర్ శ్రీశ్రీశ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్, డాక్టర్ మహంత్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ విడుదల చేశారు. వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో హాజరై బసవేశ్వర విగ్రహావిష్కరణను విజయవంతం చేయాలని భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఈ నెల 18న అమోఘ్ లీలా ప్రభుజీ బీదర్ రాక.

ఈ నెల 18న అమోఘ్ లీలా ప్రభుజీ బీదర్ రాక.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్,కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణంలోని జగన్నాథ్ మందిరానికి ఈనెల 18న ప్రముఖ ఆధాత్మిక ప్రవచన కర్త శ్రీ ఆమోఘ్ లీలా ప్రభుజీ దాస్ రానున్నట్లు 11 జగన్నాథ్ మందిరం ప్రతినిధులు డాక్టర్ నీలేష్ ప్రభుజీ తెలిపారు. ఆ రోజు 12 గంటలకు బీదర్ పట్టణంలోని షాపూర్ గేట్ కు చేరుకుంటారని అన్నారు. అక్కడినుండి బైక్ ర్యాలీ తో పాటు కీర్త నలు చేస్తూ శోభా యాత్ర జరుపుతూ మధ్యాహ్నం 2 గంటలకు జగన్నాథ్ మందిరం చేరుకుంటారని వివరించారు. సాయంత్రం 5 గంటలకు ప్రభుజీ ప్రవచనం, మహాప్రసాదం ఉంటుందని తెలిపారు. మరుసటి రోజు 19న ఉదయం ప్రభుజీ బీదర్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రాలైన నర్సింహా స్వామి ఝర్నా, పాపనాశ్ మందిరాలను సందర్శిస్తారన్నారు అనంతరం జగన్నాథ్ మందిరంలో భాగవత్ కథ, భక్తులతో ముఖాముఖి, ఆధ్యాత్మిక విషయాలలో సందేహాలు వాటి నివృత్తి, నరసింహ హారతి కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. జహీరాబాద్ ప్రాంతం నుండి వచ్చే భక్తులకు రెండు రోజుల పాటు మహాప్ర సాదం ఉంటుందని తెలియజేసారు. భక్తులందరూ సాంప్రదాయ వస్త్రధార ణతో ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఘనంగా సంకటహర చతుర్థి వేడుకలు.

న్యాల్కల్: ఘనంగా సంకటహర చతుర్థి వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలం రాజవరంలోని స్వయంభు వరసిద్ధి వినాయక ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వరసిద్ధి గణపతికి అర్చకులు పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. గరికలతో మహా పూజ కార్యక్రమాన్ని చేశారు. గణపతికి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు గణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఆగని నీటి కష్టాలు….

ఆగని నీటి కష్టాలు….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ 12వ వార్డులో గత వారం పది రోజులుగా ప్రజలకు సరిపడా మంచి నీరు బోర్, మంజీరా నీరు రావటం లేదు. ప్రతి ఎండాకాలం వచ్చిందంటే చాలు హౌసింగ్ బోర్డు చివరి కాలనీ లో నీటి సమస్య ప్రతిసారి ఉంటుంది. అంబంధిత అధికారులకు తెలిసిన పటించుకోవడం లేదు. వాటర్ మ్యాన్ డబ్బులు తీసుకొని తెలిసిన వారికి గంటల కొద్ది నీరు వదులుతున్నారు. కాని సామన్య ప్రజలకు మాత్రం కొద్దిసేపు వదిలి ఆఫ్ చేస్తున్నారు. పై స్థాయి అధికారులు స్పందించి కాలనీ వాసులు కొత్త బోర్ వేయించి మంచి నీటి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.

ఎంపీ సురేష్ శెట్కార్ కలిసిన మిషన్ భగీరథ డి. ఈ సృజన్ చక్రవర్తి.

ఎంపీ సురేష్ శెట్కార్ కలిసిన మిషన్ భగీరథ డి. ఈ సృజన్ చక్రవర్తి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

మిషన్ భగీరథ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ జహీరాబాద్ డివిజన్ నూతన డి. ఈ గా నియమితులైన జి. సృజన్ చక్రవర్తి గురువారం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, మాజీ మంత్రి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్లను మర్యాదపూర్వకంగా ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా జహీరాబాద్ డివిజన్లో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల వివరాలను ఎంపీ సురేష్ షెట్కర్, మాజీ మంత్రి చంద్రశేఖర్ లకు డి ఈ సృజన్ చక్రవర్తి వివరించారు.

గ్రామాల అభివృద్ధి చేశాం బిల్లులు విడుదల చేయాలి.

గ్రామాల అభివృద్ధి చేశాం… బిల్లులు విడుదల చేయాలి.

◆- అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు జగదీశ్వర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల్ తాజా మాజీ మండల్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు జగదీశ్వర్ పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ పాలనలో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. 50 సంవత్సరాలలో జరుగని అభివృద్ధి గత ప్రభుత్వ పది సంవత్సరాల పాలనలో జరిగి దేశానికి రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తున్న ఒక్క బిల్లు రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. గ్రామాల అభివృద్ధికి అప్పులు తెచ్చి పనులు చేసామన్నారు. పనులకు సంబందించిన బిల్లులు రాకపోవడంతో కొందరు మాజీ సర్పంచ్లు తెచ్చిన అప్పులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సీఎం రేవంత్రెడ్డికి చలనం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేసి మాజీ సర్పంచ్లను ఆదుకోవాలని కోరారు.

తప్పుడు ప్రచారంతో తప్పుదోవ పట్టించిన చైనా, తుర్కియే

ఈ దేశాల ఎక్స్‌ ఖాతాలను బ్లాక్‌ చేసిన భారత్‌

ప్రపంచ మీడియా, మేధోమదన సంస్థల్లోకి చొచ్చుకెళ్లిన చైనా

అందువల్లనే ఈ తప్పుడు కథనాల ప్రవాహం

ఎంత తప్పుడు ప్రచారం చేసినా అది తాత్కాలికమే

నిజం కచ్చితంగా బయటపడుతుంది

భారత్‌ ముందు చైనా ఆయుధాలు ఎందుకూ కొరగావన్న సత్యం వెల్లడైంది

ప్రపంచ దేశాల చూపు ఇప్పుడు భారత్‌ వైపు

భారత్‌ నెత్తిన పాలుపోసిన పాకిస్తాన్‌

మన రక్షణ ఎగుమతులు మరింతగా పెరిగే అవకాశం

ఆసియా, ఆఫ్రికా దేశాలు చైనాను నమ్మలేని పరిస్థితి

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

భారత్‌ాపాకిస్తాన్‌ల మధ్య సంఘర్షణలు జరుగుతున్న వేళ, చైనా, తుర్కియేలు విపరీతంగా తప్పుడు ప్రచారాన్ని కొనసాగించాయి. జరిగిన వాస్తవానికి పూర్తి భిన్నంగా వీటి ప్రచారం వున్న నేప థ్యంలో, వీటి ఓవర్‌ యాక్షన్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గ్లోబల్‌ టైమ్స్‌కు చెందిన ఎక్స్‌ ఖాతాను బ్లాక్‌ చేయడమేకాదు తుర్కియే బ్రాడ్‌కాస్ట్‌ టీఆర్‌టీపై నిషేధం విధించింది. పహల్గామ్‌ సంఘటన తర్వాత భారత్‌ చేపట్టిన చర్యల నేపథ్యంలో గ్లోబల్‌ టైమ్స్‌ పాక్‌కు అనుకూలంగా వార్తా కథనాలను రాసింది. అంతేకాకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసింది. ఉగ్రవాదుల స్థావరాలను ప్రపంచ దేశాలు సమర్థిస్తుంటే, చైనా మీడియా వీటిపై తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. నిజానికి ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్తాన్‌కు అండగా చైనా, తుర్కియే, అజర్‌బైజాన్‌ లు నిలిచాయి. ఈ ఆపరేషన్‌కు ముందే ఎప్పటినుంచో చైనా తన రక్షణ ఉత్పత్తులను పాక్‌కు ఎగుమతి చేయగా, తుర్కియే ఆపరేషన్‌ సమయంలో కొన్ని వందల డ్రోన్లను పాకిస్తాన్‌కు అందజే సింది. అంతేకాకుండా వాటిని ఉపయోగించే విషయంలో శిక్షణ ఇచ్చేందుకు తన సైనికులను కూడా పంపినట్లు ఇప్పుడిప్పుడే స్పష్టమైన సమాచారం అందుతోంది. ముఖ్యంగా భారత్‌ చేసిన దాడుల్లో ఇద్దరు తుర్కియే సైనికులున్నారన్న సంగతి కూడా బయటపడిరది. తాజాగా చైనా అరుణాచల్‌ ప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల పేర్లను మార్చేసింది. దీంతో భారత్‌ దీనిపై తీవ్ర అభ్యంత రం తెలపడమే కాదు, పేర్లు మార్చినంతమాత్రాన వాస్తవాలు మారిపోవు. అరుణాచల్‌ ప్రదేశ్‌ ముమ్మాటికీ భారత్‌లో భాగమనేనని మన విదేశాంగశాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. 

కాల్పుల విరమణకోసం భారత్‌ కోరిందంటూ ప్రచారం

కాల్పుల విరమణ ప్రకటన వెలువడగానే ఒక్కసారిగా పాశ్చాత్య మీడియా, ఇందుకు భారత్‌ భారత్‌ అభ్యర్థించిందని లేదా అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్‌ నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడం తో ఒప్పుకున్నదంటూ అసత్య ప్రచారం మొదలుపెట్టింది. ఈవిధంగా ఆపరేషన్‌ సింధూర్‌ సందర్భంగా భారత్‌ సాధించిన ఆధిపత్యాన్ని, మరింత బలపడిన నరేంద్రమోదీని బలహీన పరచడానికి ఒక పద్ధతి ప్రకారం మీడియా దుష్ప్రచారం చేసింది. ముఖ్యంగా చైనా ఆయుధసంపత్తి ఎంతోఆధునికమైనది మాత్రమే కాదు శత్రు దుర్భేద్యమంటూ ఊదరకొట్టేశాయి. నిజానికి పాక్‌ ఉపయోగించిన చైనా రక్షణ వ్యవస్థలు, చైనా విమానాలను భారత్‌ తుత్తినియలు చేసింది. జరిగిన ఈ అసలు విషయాన్ని కావాలనే తొక్కిపట్టడం ద్వారా, భారత్‌ సాయుధ సంపత్తి బలాన్ని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తక్కువ చేసి చూపడం ప్రధాన లక్ష్యంగా ఈ మీడియా ప్రచారం కొనసా గింది. ఇదే సమయంలో ఈ ఆపరేషన్‌లో భారత్‌ తీవ్ర నష్టాలను చవిచూస్తున్నదని, పాకిస్తాన్‌ అ ప్రతిహతంగా విజయపథంలో పయనిస్తున్నదంటూ పుంఖానుపుంఖాలుగా కథనాలు వెలువడ్డా యి. పాక్‌కు చైనా సరఫరా చేసిన అత్యాధునిక ఆయుధ సంపత్తి మొత్తం తుక్కుగా మారిపోతున్న తరుణంలో, పాక్‌ విజయాన్ని, చైనా సామర్థ్యాన్ని ఆకాశానికెత్తేస్తూ అంతర్జాతీయ మీడియా రా స్తున్న కథనాల వెనుక అసలు కారణమేంటి?

తప్పుడు కథనాలు

నిజానికి అమెరికా ఒత్తిడి మేరకు పాక్‌ డీజీఎంఓ, మనదేశ డీజీఎంఓకు ఫోన్‌ చేసిన తర్వాత మాత్రమే కాల్పుల విరమణకు కేంద్రం అంగీకరించింది. కానీ పాశ్చాత్య మీడియా కథనాలు భారత్‌ ముందుగా కాల్పుల విమరణ కోరుకున్నదని పేర్కొన్నాయి. అంటే ఓటమి భయంతో భారత్‌ ముందుగానే కాల్పుల విరమణకు ముందుకొచ్చిందన్న రీతిలో వీటి రాతలు కొనసాగాయి. కేవ లం ‘పరస్పర అవగాహనతో’ తీసుకున్న చర్యమాత్రమేనని, కాల్పుల విమరణ కాదని భారత్‌ ఎంతగా చెప్పినా ఈ మీడియా పట్టించుకోలేదు. ఈవిధంగా భారత్‌ నియంత్రణ సామర్థ్యాన్ని, మొ త్తం ఆపరేషన్‌ నిర్వహించిన తీరును తక్కువచేసి చూపడానికే యత్నం జరిగింది. ముఖ్యంగా అ మెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్‌, అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ల ఒత్తిడికి నరేంద్రమోదీ లంగిపోయారని పాశ్చాత్యమీడియా ప్రచారం చేసింది. ఆవిధంగా అంతర్జాతీయంగా ఎంతో దృఢమైన నాయకుడిగా, విస్పష్టవైఖరితో కూడిన దౌత్యాన్ని నెరపుతారని నరేంద్రమోదీ పొందిన గుర్తింపును దెబ్బతీయాలన్న పన్నాగం ఈ రాతల వెనుక సుస్పష్టంగా కనిపించింది. నిజానికి ఈవిధంగా ఒక లక్ష్యంతో వ్యూహం ప్రకారం పనిచేసిన మీడియా కేవలం నరేంద్రమోదీపైన మాత్రమే కాదు డోనాల్డ్‌ ట్రంప్‌ సామర్థ్యంపై కూడా అనుమానాలు కలిగేలా వార్తలు వండివార్చింది. ముఖ్యంగా కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఇది కనీసం రెండున్నర గంటలు కూడా అమల్లో లేదని, తర్వాత కాల్పులు మళ్లీ మొదలయ్యాయంటూ చెప్పడం ద్వారా, ట్రంప్‌ యంత్రాంగం భారత్‌`పాకిస్తాన్‌లను కాల్పుల విరమణను పాటించేలా చేయడంతో విఫలమైందని పేర్కొనడం ద్వారా, ప్రపంచ వ్యాప్తంగా అమెరికా పలుకుబడి క్షీణిస్తున్నదనడానికి దీన్ని ఉదాహరణగా చూపడానికి యత్నించింది.

పాశ్చాత్య మీడియాపై చైనా పలుకుబడి

ఈవిధమైన మీడియా రాతలను పరిశీలిస్తే పశ్చిమదేశాల మీడియా సంస్థలపై చైనా పలుకుబడి ఏవిధంగా వున్నదీ అర్థమవుతుంది. పాశ్చాత్య దేశాల విశ్వవిద్యాలయాలు, పలుకుబడి కలిగిన మేధావులు, మీడియా సంస్థల్లో చైనా పలుకుబడి వేళ్లూనుకొని పోవడంతో, దీన్ని ప్రతి అంశంలోతనకు సానుకూలంగా మలచుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది. ఇంతటి స్థాయిలో బలీయంగా విస్తరించడం వల్ల చైనా అంతర్జాతీయ దృక్కోణాలను తనకు అనుకూలంగా ప్రచారం చేసుకోవ డం లేదా మలచుకోవడం చేస్తున్నది. ఇప్పుడు మనదేశాన్ని వివిధ కోణాల్లో దెబ్బకొట్టడానికి ప్ర యత్నిస్తోంది. ముఖ్యంగా మన వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని బలహీనపరచడం, జాతీయ, అంతర్జాతీయంగా మోదీ నాయకత్వాన్ని అస్థిరం చేయడం, భౌగోళిక రాజకీయంగా ట్రంప్‌ పలుకుబడిని దెబ్బతీయడం వంటి ప్రక్రియల ద్వారా చైనా తన ఆధిపత్యాన్ని మరింత విస్తరించుకోవాలని చూ స్తున్నది.

అంతర్లీన పరిణామాలు

కాల్పుల విరమణపై ట్రంప్‌ చేస్తున్న ప్రకటనలకంటే ఎవ్వరికీ పట్టని అంతర్లీనంగా, ఆకస్మికంగా మనదేశంలో చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలించాలి. మొదటిది రిపబ్లికన్‌ టీవీకి చెందిన అర్నబ్‌ గోస్వామి, జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాలు ఒక్కసారిగా మౌనం వహించడం వెనుక కారణమేంటనేది పరిశీలిస్తే…పాకిస్తాన్‌లోకి డీఓయి విమానం ఎన్‌111ఎస్‌జెడ్‌ (ఎ03191) విమానం పాకిస్తాన్‌కు చేరుకోవడం. అంటే అణు రేడియోధార్మికతకు సంబంధించి ఏదో అత్యవసర పరిస్థితి ఏర్పడిరదన్నమాట. ఇక్కడ భారత్‌, పాకిస్తాన్‌ ప్రభుత్వాలు మౌనం పాటించాయి. పాకిస్తాన్‌లో అణువ్యవస్థలో లీకేజీ సమాచారాన్ని తన ఇంటెలిజన్స్‌ వర్గాలద్వారా తెలుసుకున్న చైనా ఒక్కసారిగా ఉలిక్కిపడిరది. ముందుగా భారత్‌తో వున్న వాస్తవాధీనరేఖ దగ్గరకు తన సైనిక దళాలను పెద్దఎత్తున మోహరించడం ప్రారంభించింది. ఇదే సమయంలో అరుణాచల్‌ ప్రదేశ్‌లో కూడా ఇదేవిధంగా వ్యవహరించింది. చైనా పరిస్థితి భారత్‌ను గందరగోళంలోకి నెట్టేసిందనే చెప్పాలి. 

కాల్పుల విరమణ తర్వాత నగ్రోటా, వైష్ణోదేవి సమీపంలో దాడులు జరిగినట్టు వార్తలు వచ్చాయి.మందుగుండు సామగ్రి, సైనిక పరికరాలకు ఇవి చాలా కీలకం. డ్రోన్‌ దాడుల కారణంగా ఇక్కడ విస్ఫోటనాలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ ఈ దాడులను చైనా`పాకిస్తాన్‌లుఉమ్మడిగా చేసినట్టుగా భావించాలి. కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా అప్పటివరకు పేలుళ్ల గురించి మాట్లాడుతూ, ఒక్కసారిగా సైలెంటయిపోయారు. బహుశా శ్రీనగర్‌కు సమీపంలో జరుగుతున్న దాడులను మన బలగాలు తక్షణమే అడ్డుకొని నిర్వీర్యం చేయడమే కాకుండా భద్రతా కారణాల రీత్యా ఏవిధమైన వ్యాఖ్యలు చేయవద్దని అబ్దుల్లాకు చెప్పివుండవచ్చు. ఇదే సమయంలోఅమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్‌ మన ప్రధానికి ఫోన్‌ చేసి అణులీకేజీ, చైనా మోహరింపుల గురించి సమాచారం అందజేసివుండవచ్చు. ముఖ్యంగా పాకిస్తాన్‌ సార్వభౌమత్వానికి ఇబ్బంది ఏర్పడితే తాను స్వయంగా కలుగజేసుకుంటానని చైనా అంతకుముందు హెచ్చరించడం గమనా ర్హం. ఇదే సమయంలో హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లు కూడా మౌనం పాటించడం వ్యూహాత్మకమే. ఎందుకంటే ప్రతిదాడులకు వ్యూహాలు పన్నుతున్నప్పుడు మాత్రమే ఇటువంటి మౌనం కనిపిస్తుంది. పాకిస్తాన్‌ కూడా ఆకస్మికంగా కాల్పుల విరమణను పాటిం చడానికి అమెరికా ఒత్తిడి, అంతర్గత అనిశ్చితి కారణం కావచ్చు. ఇదే సమయంలో చైనా దన్ను గా రావడంతో, పాకిస్తాన్‌ మళ్లీ రెచ్చిపోవడం మొదలైంది. అయితే చైనా ప్రత్యక్షంగా రంగంలోకి దిగినట్లయితే ఇది ప్రపంచయుద్ధానికి దారితీసివుండేదని కొందరు నిపుణుల అంచనా. చైనా` యుఎస్‌`రష్యాల మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో, భారత్‌పై సైనికచర్యతో పాటు, అమెరికా లక్ష్యాలపై కూడా దాడిచేసే పరిస్థితి ఏర్పడిరది. జె.డి.వాన్స్‌ ముఖ్యంగా సి.ఐ.ఎ. మరియు డి.ఐ.ఎ. హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోదీని అలర్డ్‌ చేసివుండవచ్చు. ఇదే సమయంలో పెద్దఎత్తున చైనా సైనికుల మోహరింపును అమెరికా ఉపగ్రహాలు గుర్తించినట్టు కూడా కొన్ని వార్తలు తెలియజేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అర్నబ్‌ గోస్వామి, ఒమర్‌ అబ్దు ల్లాతో పాటు అత్యున్నతస్థాయి మంత్రులను కూడా మౌనంగా వుండమని మన సైన్యం కోరివుండవచ్చు. మొత్తం మీద చెప్పాలంటే ఆపరేషన్‌ సింధూర్‌లో పాకిస్తాన్‌ కుప్పకూలిపోవడం, చైనాకు ఆగ్రహం కగిలించి తన సైన్యాలను మోహరించాలని భావించవచ్చేమో. 

మొత్తంమీద చెప్పాలంటే ఆపరేషన్‌ సిందూర్‌ కొన్ని వాస్తవాలను ప్రపంచానికి వెల్లడిరచింది. మొదటిది భారత్‌ తిరుగులేని సామర్థ్యాన్ని ప్రపంచం గుర్తించింది. పాకిస్తాన్‌ సంప్రదాయిక రక్షణ సామర్థ్యం కుప్పకూలిపోగా, దాని అణ్వస్త్ర సామర్థ్యంపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. భారత్‌ నిరంతరాయంగా జరిపిన దాడులు, అసలు పాకిస్తాన్‌ బలహీనతలను బట్టబయలు చేశాయి. ముఖ్యంగా చైనా అందించిన అన్ని ఆయుధవ్యవస్థలను భారత్‌ తుత్తినియలు చేయడం పాకిస్తాన్‌ కు పెద్దదెబ్బ. చైనాను అడగలేదు…భారత్‌ను ఎదుర్కొనలేదు. ఇదీ దాని దుస్థితి. ఒకరకంగా చెప్పాలంటే పాక్‌ అణ్వస్త్ర సామర్థ్యాన్ని భారత్‌ నిర్వీర్యం చేసివుండవచ్చు. వ్యూహాత్మకంగా ఇప్పుడు పాక్‌ పూర్తిగా భారత్‌ దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడిరది.

ధనిక రాష్ట్రమా? అప్పుల భారమా!!

`నిజంగానే తెలంగాణ అప్పులలో కూరుకుపోయిందా?

`కొత్త అప్పులు పుట్టే పరిస్థితి లేకుండా పోయిందా?

`తెలంగాణ ఆదాయం తరిగిపోయిందా?

`అప్పులతో సంపాదన తరిగిపోతోందా?

`సంక్షేమ కార్యక్రమాలకు కటకట తప్పదా!

`కేసీఆర్‌ ధనిక రాష్ట్రమని పదే పదే చెప్పారు!

`ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నేతలు కూడా అదే చెప్పారు.

`ఇప్పుడు ప్రభుత్వ పథకాల అమలు కష్టమంటున్నారు!

`లోపం ఎక్కడ జరుగుతోంది?

`ఏడాదిన్నరలోనే ఎందుకు తారుమారైంది?

`కొత్తగా ఇరిగేషన్‌ ప్రాజెక్టులు ఎలా మొదలుపెడుతున్నారు?

`సన్న బియ్యం ఎలా ఇస్తున్నారు!

`రాజీవ్‌ యువ వికాసం ఎలా అమలు చేస్తారు!

`ఇందిరమ్మ ఇండ్లు ఎలా నిర్మిస్తారు!

`ఆదాయంలో సగం అప్పులకే పోతే పథకాల అమలు ఎలా సాధ్యమౌతుంది!

`కడుపు కట్టుకొని పని చేయడం అంటే అర్థమేమిటి!

`దుబారా లేకుండానే ఏడాదిన్నరలో లక్షన్నర కోట్లు అప్పు చేయడమేమిటి!

`అంతా గందరగోళం… ఆగమాగం!

ఏం మాట్లాడినా ఎదుటి వాళ్లు మెచ్చాలని అనేది ఒక సామెత. ఎందుకంటే నోటి నుంచి ఏ మాట వచ్చినా అది అందరూ వినడానికే..ఆ మాట అందంగా వుండాలి. అర్దమయ్యేలా వుండాలి. అర్ధం చేసుకునేలా వుండాలి. అంతే కాని అవతలి వారు ఆశ్చర్యపోయేలా వుండొద్దు. ఆందోళన చెందేలా వుండొద్దు. ఇది మనకు పెద్దలు నేర్పిన పాఠం. కాని రాను రాను రాజకీయాల్లో మాటల హద్దులు లేనట్లే పాలకుల మాటలకు కూడా హద్దులుండాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. నాయకులు అదర్శంగా వుండాలి. పాలకులకు ఇంకా ఆదర్శంగా వుండాలి. అయితే ఇక్కడ తెలంగాణ విషయంలో మాత్రం ఎవరు ఏం చెబుతున్నారో ఎవరికీ అర్దం కావడం లేదు. గతంలో పదేళ్లపాటు పాలించిన కేసిఆర్‌ తెలంగాణ సంపన్న రాష్ట్రం. దేశంలోనే అత్యధిక దనిక రాష్ట్రం అంటూ లెక్కలు చెప్పేవారు. తాను ఎక్కడో వున్న రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లానని లెక్కలు చేప్పేవారు. 90వేల ఆదాయం వున్న రాష్ట్రాన్ని రెండున్నర లక్షల కోట్లక పెంచానని అంటూ వుండేవారు. దేశ జాతీయ వృద్ది రేటుకన్నా, రాష్ట్ర వృద్ది రేటు ఎక్కువ అంటూ లెక్కలు ప్రజల ముందు పెట్టేవారు. ఇక అప్పుల విషయంలో దేశంలో తెలంగాణ కన్నా ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలు ఎన్నో వున్నాయంటుండేవారు. అప్పుల్లో 24 స్దానంలో మాత్రమే వుందనే వారు. ఉత్తరప్రదేశ్‌ లాంటి రాష్ట్రం తెలంగాణకంటే నాలుగు రెట్లు ఎక్కువ అప్పులున్నట్లు ఆర్ధిక సూచీలు ప్రజల ముందు వుంచేవారు. దానికి తోడు తెలంగాణలో పెరిగిన సాగు స్ధిరీకరణ వల్ల తెలంగాణ రైతాంగం ఆదాయం గణనీయంగా పెరిగిందని అంటుండేవారు. ఒకప్పుడు ముప్పై లక్షల ఎకరాల్లో సాగు సాగితే ఇప్పుడు కోటిన్నర ఎకరాల్లో సాగు సాగుతోందని అందరూ ఒప్పుకుంటున్నారు. ఇక పారిశ్రామిక రంగం విషయానికి వస్తే ఐటి రంగంలో ఎంతో పురోగతి సాధించామన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఐటి ఎగుమతులు రూ.30వేల కోట్లు మాత్రమే వుంటే, పదేళ్ల కాలంలో 2లక్షల కోట్లకు పెరిగిందని నిపుణలు కూడా చెబుతున్నారు. మరి ఎక్కడ లోపం జరుగుతోంది. ఏ రంగంలో పురోభివృద్ది జరగక్కపోయినా తెలంగాణలో వ్యవసాయం రంగంలో మాత్రం విప్లవాత్మకమైన మార్పులు వచ్చిన మాట వాస్తవం. అందరూ అంగీకరించాల్సిన సత్యం. తెలంగాణ రాకముందు ఎంత సాగు జరిగేది? తెలంగాణ వచ్చిన రెండు మూడు సంవత్సరాలలోనే ఎంత విస్తీర్ణం పెరిగింది అనేది కూడా స్పష్టమైన లెక్కలున్నాయి. సాగుతో రైతులు సంతోషంగానే వున్నారు. పదేళ్ల కాలంలో ఒక్క ఏడాదిలో కూడా కరువు అనే మాట వినిపడలేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఏ పార్టీ వరి కొయ్యలు పట్టుకొచ్చింది లేదు. పైగా తెలంగాణ సాగు మొత్తం కరంటు మీదనే ఆదారపడి సాగుతుంది. రైతులకు ఉచితకరంటు ఇరవై నాలుగు గంటలు ఉచితంగానే ఇస్తున్నారు. కరంటు లేదన్న మాట ఏ రైతు పదేళ్లలో అడిగింది లేదు. ధర్నాలు, నిరసనలు చేసింది లేదు. అంటే రాష్ట్రంలో ఆర్ధిక పరిపుష్టి అనేది ఏర్పడిరదని చెప్పడానికి ఇదే సంకేతం. కాకపోతే ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ పదే పదే తెలంగాణ దనిక రాష్ట్రం కాదు. అంటూనే వుండేది. ఊపర్‌ షేర్వానీ..అందర్‌ పరేషాని అని ప్రచారం సాగిస్తూనే వుండేది. కేసిఆర్‌ చెప్పేవన్నీ అబద్దాలే అంటూ ప్రజలకు చెబుతుండేవారు. కాని తీరా ఎన్నికల సమయం దగ్గరకు వచ్చే సరికి కాంగ్రెస్‌ పార్టీ కూడా తెలంగాణ ధనిక రాష్ట్రమే అని చెప్పడం మొదలు పెట్టింది. ఎందుకంటే అప్పుల పాలైన రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారంటూ ప్రజలు కూడా ప్రశ్నించారు. దాంతో కాంగ్రెస్‌ తన వాయిస్‌ మార్చేసింది. తెలంగాణ కర్నాటక కంటే ధనిక రాష్ట్రమే అంటూ చెప్పడం మొదలు పెట్టింది. కాని అధికారం చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లంకెబిందెలున్నాయనుకుంటే, మట్టి కుండలు కూడా లేవంటూ చెప్పడం మొదలు పెట్టారు. అంటే ప్రజలను ఆయన తొలి రోజు నుంచే ప్రభుత్వ పధకాల విషయంలో సంసిద్దులను చేసే ప్రయత్నం చేశారు. కాని ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ ఊరుకోలేదు. తరుముతూ వచ్చింది. అయినా పరిగెత్తేందుకు అక్కడ మైదానం లేదు. ఎదురుతిరిగి సమాదానం చెప్పాల్సిన అసవరం లేదు. అందుకే లేదన్న మాట చెబితే చాలు.. రాష్ట్రాన్ని బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని చెప్పుకుంటూ పోతే చాలు అనుకున్నారు. ఏడాదిన్న కాలంగా అదే చెబుతున్నారు. ఇక్కడొక విషయాన్ని మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పధకాలలో ప్రదానమైన పించన్లు అందిస్తున్నారు. అదే రెండు వేలతో సరిపుచ్చుతున్నారు. ఎన్నికల మందు ఇచ్చిన వాగ్ధానం అటకెక్కించారు. రెండు వేలు మాత్రం టంచన్‌గా ఇస్తున్నారు. ఎన్నికల్లో చెప్పినట్లు 4వేల రూపాయలు ఇవ్వమని చెప్పడం లేదు. ఇంకా తమకు సమయం వుందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు మాట మార్చేశారు. ఆరు గ్యారెంటీలలో కేవలం పించన్లు, కళ్యాణ లక్ష్మి చెక్కులు మాత్రం ఎక్కడా ఆపడం లేదు. పించన్లలో 4వేలు మర్చిపొమ్మని చెప్పినట్లే..కళ్యాణ లక్ష్మిలో తులం అడగొద్దన్నట్లు పరోక్షంగా స్పష్టత ఇస్తూ వస్తున్నారు. ఎందుకంటే బంగారం తులం లక్ష దాటిపోయింది. ఇక ఇవ్వడం సాధ్యం కాకుండాపోతోంది. ఇంతకీ తెలంగాణ ధనిక రాష్ట్రమా? అప్పుల భారం మోయలేకుండా వుందా?అన్నది తేలాలి. రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక ప్రవాహం. పార్టీలు మారినా, కొత్త పాలకులు విచ్చినప్పుడు దానిని కొనసాగించడమే ఆనవాయితీ. అంతే గాని, గత పాలకులు అప్పుల కుప్ప చేసిపెట్టారని గెలిచిన తర్వాత చెప్పడం అనేది సరైంది కాదు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇస్తున్న హమీల అమలుకు ఎలాంటి కసరత్తు చేస్తున్నారని మీడియా ప్రశ్నిస్తే, రాష్ట్ర బడ్జెట్‌పై పూర్తి అవగాహన వుందన్నారు. మరి ఇప్పుడు ఆదాయం లేదంటున్నారు. తాజాగా ఉద్యోగులు తమ సమస్యల సాధన కోసం సమ్మెకు దిగుతామంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు కూడా అదే బాటలో నడుస్తామంటున్నారు. ఈ సమయంలో ఉద్యోగులతో సిఎం. రేవంత్‌రెడ్డి సంక్షేమ పధకాలు ఆపమంటారా? వచ్చే రూపాయిని ఉద్యోగ సంఘాల చేతుల్లో పెట్టేస్తా..ఎలా పంచుతారో పంచండి అని బంతిని వారి కోర్టులోకి నెట్టేశారు. పరోక్షంగా తెలంగాణ ఉద్యోగులకు ఇప్పటికే ఎక్కువ జీతాలున్నాయి. ఇంకా గొంతెమ్మ కోరికలు తీర్చే ప్రసక్తి లేదని ఒక రకంగా తేల్చి చెప్పారు. కాని ఎన్నికల ముందు ఉద్యోగుల సమస్యలన్నీ తీర్చేస్తామన్నారు. అమాయకులైన ప్రజలకు ఏం చెప్పినా వింటారు గాని, ఉద్యోగులు ప్రభుత్వాలు చెప్పినట్లు విన్న సందర్బాలు ఎప్పుడూ లేదు. కొంత కాలం ఓపిక పట్టినా, ఎప్పుడో అప్పుడు మళ్లీ నిరసనల రాగం అందుకుంటారు. పెన్‌ డౌన్‌ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు. ఇక్కడే సిఎం. రేవంత్‌రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పించన్లు ఆపమంటారా? ధరలు పెంచమంటారా? అని కూడా ఉద్యోగులను ప్రశ్నించారు. అంటే పరోక్షంగా దరల పెంపునకు ప్రభుత్వం తయారుగా వుందన్న విషయం చెప్పకనే చెప్పేశారు. అటు కరంటు, ఇటు బస్సు చార్జీలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు బారీగా పెంచే యోచన చేసేలా వున్నారు. కాకపోతే స్దానిక సంస్దల ఎన్నికల దాకా ఆగుతున్నారు. నిజంగానే తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందా? అంటే తెలంగాణకంటే ఎక్కువ అప్పులున్న రాష్ట్రాలు దేశంలో మరో 24వున్నాయి. వాటికి లేని ఇబ్బందులు తెలంగాణకే వస్తున్నాయా? కొత్త అప్పులు పుట్టడం లేదా? ఈ మాటను జనం నిజమే అని నమ్ముతారా? ఎందుకంటే మన దేశం రాష్ట్రాల సమాఖ్య. అంటే కేంద్రంతో సమానమైన అదికారాలు రాజ్యాంగం కల్పించబడిరది. కాకపోతే చేసే అప్పుల విషయంలో కేంద్రం కొంత కనికరం చూపాల్సిన అవసరం వుంటుంది. కేంద్ర రాష్ట్రాల మద్య సఖ్యత వున్నా, లేకున్నా తెలంగాణకు రావాల్సిన అప్పులు ఎలాగూ వస్తూనే వుంటాయి. ఒకరిని బ్రతిమిలాడి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కేసిఆర్‌ ఈ విషయంలో ఎన్నడూ అప్పు పట్టుడం లేదన్న మాట చెప్పింది లేదు. కాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదేపదే ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నారు. అన్నదే ఇప్పుడు రకరకాల వాదనలకు దారి తీసింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version