నిమజ్జన సమయాల్లో జాగ్రత్తలు పాటించాలి..
ఎస్సై రాజేష్
నిజాంపేట: నేటి ధాత్రి
వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నిజాంపేట స్థానిక ఎస్సై రాజేష్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా గ్రామాల్లో చెరువులు, కుంటలు అధికంగా నిండాయని నిమజ్జన సమయంలో మండప నిర్వహకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరెంటు వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. చిన్నపిల్లలను చెరువులు కుంటల వద్దకు తీసుకువెళ్లొద్దన్నారు. శాంతియుత వాతావరణం లో పండగలు నిర్వహించుకోవాలని సూచించారు. అత్యవసర సమయంలో 100 కు డయల్ చేయాలన్నారు