దళారులను నమ్మి మోసపోవద్దు.

దళారులను నమ్మి మోసపోవద్దు.
నాణ్యత ప్రమాణాలు పాటించాలి.
డిపిఎం యాదయ్య.

నిజాంపేట: నేటి ధాత్రి

 

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని విక్రయించాలని డిపిఎం యాదయ్య అన్నారు. నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. 48 గంటలలో రైతుల ఖాతాలో డబ్బులు జమవుతాయని పేర్కొన్నారు. అకాల వర్షాలు ఎప్పుడు సంభవిస్తాయో తెలియదు కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఏం అశోక్, సీసీ వెంకటరాజం, రవీందర్, నిర్వాహకులు బురాని మంగమ్మ, వాణి, రజిత రైతులు ఉడేపు మహేష్, అందే స్వామి, పిట్ల రమేష్ తదితరులు ఉన్నారు.

ఉపాధ్యాయుని నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే…

ఉపాధ్యాయుని నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలోని జంగిడిపురం లో ఉపాధ్యాయులు నిరంజన్ గౌడ్ నూతన గృహప్రవేశం సందర్భంగా ఎమ్మెల్యే మెగారెడ్డి హాజరయ్యారు
ఈ సందర్భంగా ఆయన సత్యనారాయణ స్వామి వారి తీర్థప్రసాదాలను స్వీకరించారు
ఎమ్మెల్యే వెంట వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు జయసుధ మధుసూదన్ గౌడ్ బ్రహ్మాoచారి.తదితరులు ఉన్నారు

మెదక్ ఎంపీ సహకారం తో.. కొనుగోలు కేంద్రం ప్రారంభం…

మెదక్ ఎంపీ సహకారం తో.. కొనుగోలు కేంద్రం ప్రారంభం

నిజాంపేట: నేటి ధాత్రి

 

ఎంపీ రఘునందన్ రావు సహకారంతో కొత్త ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు నిజాంపేట మండలం బచ్చురాజ్ పల్లి గ్రామంలో ఇప్పటికే ఐకెపి కొనుగోలు కేంద్రం ఉండగా రైతులకు ఇబ్బందులు కలగకూడదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సొసైటీ ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు కృషి చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో చిన్మనమైన శ్రీనివాస్, దుర్గ రెడ్డి, రాజు, అంజయ్య, తదితరులు ఉన్నారు.

వినాయక నిమజ్జనానికి భద్రతా సూచనలు – ఎస్సై రాజేష్..

నిమజ్జన సమయాల్లో జాగ్రత్తలు పాటించాలి..

ఎస్సై రాజేష్

నిజాంపేట: నేటి ధాత్రి

వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నిజాంపేట స్థానిక ఎస్సై రాజేష్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా గ్రామాల్లో చెరువులు, కుంటలు అధికంగా నిండాయని నిమజ్జన సమయంలో మండప నిర్వహకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరెంటు వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. చిన్నపిల్లలను చెరువులు కుంటల వద్దకు తీసుకువెళ్లొద్దన్నారు. శాంతియుత వాతావరణం లో పండగలు నిర్వహించుకోవాలని సూచించారు. అత్యవసర సమయంలో 100 కు డయల్ చేయాలన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version