ఇసిపేట గ్రామ ఎంఆర్పిఎస్ కమిటీ ఎన్నిక.

ఇసిపేట గ్రామ ఎంఆర్పిఎస్ కమిటీ ఎన్నిక. చింతలపల్లి ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక
నేర్పటి శీను కుమ్మరి శ్రీనాథ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

జయశంకర్ జిల్లా భూపాలపల్లి మొగులపల్లి మండల ఇన్చార్జి MRPS నేరెళ్ల ఓదెలు మాదిగ.కో ఇన్చార్జీలు రేణికుంట్ల సంపత్ మాదిగ. రామ్ రామ్ చందర్ మాదిగ . మొగులపల్లి మండల.ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు అంతడుపుల సారంగపాణి మాదిగ. జీడి సంపత్ మాదిగ ఆధ్వర్యంలోMRPS ముఖ్య కార్యకర్తల సమావేశ నికి ముఖ్య అతిథులుగా మొగులపల్లి మండల ఇన్చార్జ్ నేరెళ్ల ఓదెలు మాదిగ. కో ఇన్చార్జి రేణికుంట్ల సంపత్ మాదిగ లు హాజరై వారు మాట్లాడుతూ ” ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఆవిర్భవించిన తరువాత , పద్మశ్రీ అవార్డు గ్రహీతమంద కృష్ణ మాదిగతన పేరు పక్కన మాదిగ అని చేర్చుకున్న తరువాత మాదిగ సమాజానికి ఎనలేని దైర్యం కలిగింది. ఆ దైర్యంతోనే మాదిగలంతా తమ పేరు పక్కన కులం పేరు చేర్చుకొని ఆత్మ గౌరవాన్ని చాటుకున్నారని అన్నారు.రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన అందక పోవడం వల్లనే మాదిగలు అన్ని రంగాల్లోవెనుకబడిపోయారు.కనుక జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ముప్పై ఏళ్ళు రాజీలేని పోరాటం సాగిందని అన్నారు. ఆ పోరాట ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చట్టం అమలులోకి వచ్చిందని,దాని ద్వారామాదిగలకు 9% రిజర్వేషన్లు దక్కాయి.ఎన్నో త్యాగాల ద్వారా సాధించుకున్న రిజర్వేషన్ ఫలాలు మాదిగ విద్యార్థులు నిరుద్యోగులు అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి రావాలని పిలుపునిచ్చారు.అలాగే ఎస్సీ వర్గీకరణతో పాటు ఆరోగ్యశ్రీ, వికలాంగులు , వృద్దులు, వితంతువుల, ఒంటరి మహిళల పెన్షన్లు, తెలంగాణ అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు , మహిళల భద్రత కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మొదలగునవి ఎమ్మార్పీఎస్ సాధించి అన్ని వర్గాలకు అండగా నిలిచిందని అన్నారు . కనుక దండోరా జెండా సమస్త అణగారిన వర్గాలకు అండగా ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో జూలై 7 న ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా చేసుకోవాలని అన్నారు.ప్రతి గ్రామంలో దండోరా జెండా ఆవిష్కరణలు చేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో సభలు జరిపి ఉద్యమానికి తోడుగా ఉన్న అన్ని కులాల పెద్దలను సత్కరించాలని అన్నారు.
ఇసిపేట గ్రామ కమిటీ ఎన్నిక చేయడం జరిగింది
గౌరవ అధ్యక్షులుగా. జన్నె సదయ్య.మాదిగ
అధ్యక్షులు : నేర్పట్టి శీను మాదిగ
ఉపాధ్యక్షులు : జన్నె క్రాంతి మాదిగఅధికార ప్రతినిధిగా. బొచ్చు రాకేష్ ముఖ్య సలహాదారులుగా. నేర్పాటి శ్రీను మాదిగ. జన్నెమొగిలి మాదిగ ప్రధాన కార్యదర్శి : బొచ్చు రాజు మాదిగ కార్యదర్శి : నేర్పట్టి అశోక్ మాదిగ కోశాధికారిక. గడ్డం చిరంజీవి మాదిగ.
ప్రచార కార్యదర్శిగా నేర్పటి రాజయ్య మాదిగ
సంయుక్త కార్యదర్శిగా. గడ్డం
రాజు. మాదిగ లను
చింతలపల్లి ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక.అధ్యక్షులుగా. కుమ్మరి శ్రీనాథ్ఉపాధ్యక్షులుగా. శ్రావణ్అధికార ప్రతినిధిగా. అజయ్ ప్రధాన కార్యదర్శిగా. ప్రభాస్కార్యదర్శిగా. రాంబాబు
కోశాధికారిగా. అంతడుపుల రాజు
ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు అంతడుపుల సారంగపాణి జీడి సంపత్. రొంటాల రాజ్ కుమార్. జంపయ్య తదితరులు పాల్గొన్నారు

కార్మికులకు ప్రయోజనాలు కల్పించడంలో నిర్లక్ష్యం.

కార్మికులకు ప్రయోజనాలు కల్పించడంలో నిర్లక్ష్యం

కేసముద్రం వ్యవసాయ మార్కెట్ అధికారుల తీరు అసంతృప్తికరం

సి ఐ టి యు జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

 

 

 

కేసముద్రం మండలం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో కార్మికుల ను ఉద్దేశించి ఏఐసిటియు జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ ఆదాయము సంవత్సరమునకు సుమారు 8 కోట్ల రూపాయలని కానీ కార్మికులకు ఓ నగూరింది ఏమీ లేదని ఆయన అన్నారు. ఈ మార్కెట్ ప్రధానమంత్రి ఎక్స్లెన్స్ అవార్డు పొందిన మార్కెట్ అని కార్మికులకు మాత్రం మార్కెట్ అధికారులు మార్కెట్ ఆదాయం నుండి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కట్టడం లోపల నిర్లక్ష్యం చేస్తున్నారని కార్మిక ప్రయోజనాలు పట్టింపు లేనట్టు మార్కెట్ అధికారులు వ్యవహరిస్తున్నారని ఇది సమంజసం కాదని ఆయన అన్నారు. అదేవిధంగా పాలకులు అసంఘటితరగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఏమి పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా అసంఘటితరంగా కార్మికులకు సమగ్ర చట్టం చేయకపోవడం మూలంగా కార్మికులకు వారి యొక్క హక్కులు లేకుండా పోవుచున్నావని నిరంతరం ఎన్నో ప్రమాదాల మధ్య కార్మికులు తమ పనిని చేయుచున్నారని కానీ పాలకులకు మాత్రం కార్మికులైన వీరికి ప్రయోజనాలు కల్పించడంలో నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారని వీటి సాధన కొరకు ఉద్యమాలే శరణ్యం అని కార్మికులందరూ పోరాటాలకు సంసిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనాటి ఈ సమావేశంలో పాల్గొన్న వారు వేల్పుల వెంకన్న, గుగులోతు రాజు,రమణ బోయిన సురేష్, గద్దల సాలయ్య,బోడ వీరన్న నాయక్, ధారావత్ వీరన్న నాయక్ ,గుగులోతు లక్ష్మణ్,నేరడ వీరస్వామి,అందే భాస్కర, పుల్లన్న,మురళి తదితరులు పాల్గొన్నారు.

మెట్ పల్లి లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

మెట్ పల్లి లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

మెట్ పల్లి జూన్ 19 నేటి ధాత్రి:

 

మెట్ పల్లి లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు ఆదేశాల మేరకు వారి నివాసములో లోక్ సభ పతి పక్షనేత,ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన కేకును మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ కట్ చేశారు
ఈ కార్యక్రమంలో మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబోదీన్ పాషా,రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి,ఇబ్రహీంపట్నం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నల్లూరి సాగర్,మాజీ ఎంపిటిసి సిగారపు అశోక్,మాజీ ఉప సర్పంచ్ సల్ల సునీల్,కల్లెడ గంగాధర్,ఎండి జాఫర్,ఇప్పపెల్లి గణేశ్,బైండ్ల శ్రీకాంత్,కోరే రాజ్ కుమార్,కనక దినేశ్,మహేష్ కాంగ్రెస్ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విత్తన ఎరువుల షాపులను తనిఖీ.

విత్తన ఎరువుల షాపులను తనిఖీ
జిల్లా వ్యవసాయ అధికారి నునావత్ వీరు నాయక్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో నునావత్ వీరు నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ.. ఎన్. రమేశ్, ADA, భూపాలపల్లి మొగుళ్ళపల్లి మండల పరిధిలోని మొగుళ్ళపల్లి గ్రామానికి చెందిన విత్తన, ఎరువుల మరియు పురుగు మందుల విక్రయదారుల షాప్లను తానిఖీ చేయడం జరిగింది. తానిఖీలో భాగంగా పత్తి విత్తనాల లభ్యత & నిల్వలు, ఎరువుల లభ్యత & నిల్వలు లైసెన్స్ వివరాలు, కొనుగోలు రశీదులు, అమ్మకపు బిల్లులు, స్టాక్ రిజిస్టర్లు, స్టాక్, ధరల పట్టికలు మొదలగునవి పరిశీలించి తానిఖీ చేయడం జరిగింది. అలాగే ప్రతి విత్తన, ఎరువుల మరియు పురుగు మందుల డీలర్లు సూచించబడిన చట్టలకు లోబడి విక్రయాలు జరపవాల్సిందిగా కోరడమైనది, లేని ఎడల సదరు చట్టలలో పొందపరిచిన నియమాలనుసారంగా చట్టరీత్యా చర్యలు తీసుకొనబడుతాయని తెలియపర్చడం జరిగింది.
డీలర్లు విధిగా పాటించవల్సిన నియమాలు: డీలర్లు తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉండాలి మరియు అందరికి కనిపించే విధముగా ఎదురుగాపెట్టాలి. స్టాక్ రిజిస్టర్ మరియు బిల్లు బుక్కులపై వ్యవసాయ అధికారితో సర్టిపై చేయించుకోవాలి.డీలర్లు తప్పనిసరిగా మరియు విధిగా రైతు కొనుగోలు చేసిన సరుకులకు బిల్లులు/రశీదు ఇవ్వాలి. బిల్లులపై తప్పనిసరిగా డీలర్ యొక్క లైసెన్సు నెంబర్ వేయాలి. స్టాక్ బోర్డు అందరికి కనిపించే విధముగా ఎదురుగాపెట్టాలి, రోజువారీగా నిల్వల వివరాలు స్టాక్
బోర్డుపై రాయాలిబ్లాక్ మార్కెటింగ్, ఎక్కువ ఏం.ఆర్.పి (MRP) కి అమ్మినచో లైసెన్సు రద్దుపరచబడును.
లైసెన్సు లో పేర్కొన్న గోడౌన్లో మాత్రమే సరుకును నిల్వ చేయాలి లేని ఎడల అనధికారికంగా
పేర్కొని స్వాధీనం చేసుకోవడం/సీజ్ చేయడం జరుగుతుంది. సరుకు లెక్కపెట్టే విధముగా
నిల్వచేయాలి. డీలర్లు సరుకులను ఫ్యాకెట్ రూపంలో మాత్రమే అమ్మకం చేయాలి, లూసుగా అమ్మకం జరపరాదు లైసెన్సులో పేర్కొన్న అడ్రెస్ లో మాత్రమే అమ్మకంగాని, నిల్వలుగాని చేయాలిడీలర్లు చట్టంలో పొందపరిచిన విధముగా రికార్ద్లు , రిజిస్టర్లు ,బిల్లులు విధిగా పాటించాలి.

ఇట్టి తానిఖీలో స్థానిక మండల వ్యవసాయ అధికారి, పి. సురేందర్ రెడ్డి పాల్గొనడం జరిగింది.

బదిలీపై వెళ్తున్నా పోలీస్ లకు ఘనంగా సన్మానం.

బదిలీపై వెళ్తున్నా పోలీస్ లకు ఘనంగా సన్మానం.

ఆమనగల్ / నేటిధాత్రి:

 

 

 

నాగర్ కర్నూల్ జిల్లా ఆమనగల్లు మండలం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, బాల్ రెడ్డి సార్ ఉద్యోగ బదిలీ అవుతున్న సందర్భంగా పోలీస్ స్టేషన్ కి ఉత్తమ సేవలందించినందుకు చిరు సత్కారం చేసి వారిని అభినందించారు.వారికి శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమనగల్ మండలం ఎస్సై వెంకటేష్, కానిస్టేబుల్ మల్లేష్,ఆమనగల్ మండల బిజెపి పార్టీ అధ్యక్షులు ఎర్రవోలు శ్రీనివాస్,
వెంకటేష్, జగన్,నాగిల్ల, బిజెపి సీనియర్ నాయకులు సీతారాం నాయక్,బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్సిఓకు వినతి పత్రం ఎస్ఎఫ్ఐ నాయకులు.

ఆర్సిఓకు వినతి పత్రం ఎస్ఎఫ్ఐ నాయకులు

ఎంజెపి గురుకులాల సమస్యలు పరిష్కరించాలని వినతి

పరకాల నేటిధాత్రి:

ఎంజెపి గురుకులాల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులుబొచ్చు కళ్యాణ్ అన్నారు.ఆర్సిఓకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి బీసీ హాస్టల్స్ మరియు కాలేజీ సమస్యలు పరిష్కరించాలని,అలాగే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అద్దె భవనంలో ఉంటున్నటి విద్యార్థులకు వాటర్ మరియు బాత్రూం సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అద్దె భవనంలో కొనసాగుతున్న హాస్టల్ కు సొంతభవనాలు ఏర్పాటు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు మడికొండ ప్రశాంత్ పాల్గొన్నారు.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు.!

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

కాంగ్రెస్ ద్వారానే దేశంలో విద్యా, ఉపాధి అవకాశాలు పెరుగుతాయాని జహీరాబాద్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి పేర్కొన్నారు.గురువారము రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ…2004,2009 రెండు పర్యాయాలు ప్రధాని పదవిని త్యాగం చేసిన ఘనత రాహుల్ గాంధీకి దక్కుతుందన్నారు.దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా దేశ వ్యాప్తంగా ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు “భారత్ జోడో యాత్ర” పేరుతో పాదయాత్ర చేసిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమే నన్నారు.భారత దేశ ప్రజలను ఏకం చేయడం వారి సమస్యలను వినడం లక్ష్యంగా పెట్టుకొని యాత్రను విజయవంతం చేసుకుని,కోట్ల మంది గుండెల్లో ధైర్యం అనే జెండాను నాటి అండగా నిలుస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు,యువ కిశోరుడు,రాహుల్ గాంధీ మాత్రమే అని అన్నారు.ఈ దేశంలోని చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగం,రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు.

మిత్ర ఫౌండేషన్ ద్వారా విద్య భరోసా.

మిత్ర ఫౌండేషన్ ద్వారా విద్య భరోసా.

కల్వకుర్తి నేటి ధాత్రి :

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో సామాజిక సేవలో ముందుంటున్న మిత్ర ఫౌండేషన్ మరో కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన కల్వకుర్తి పట్టణానికి చెందిన అరవింద్ చారి యొక్క ఇద్దరు పిల్లలను శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయం లో పదవ తరగతి చదివే వరకు వారి విద్యకు సంబంధించిన అన్ని ఖర్చులను మిత్ర ఫౌండేషన్ భరిస్తుందని పాఠశాల యాజమాన్యానికి తెలియజేశారు.విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని మరింత ఉత్తమంగా తీర్చిదిద్దే దిశగా మిత్ర ఫౌండేషన్ విద్యా భరోసా కృషి చేస్తుంది.ఈ కార్యక్రమంలో ఫౌండర్ చంద్రకాంత్ రెడ్డి, అధ్యక్షులు రసూల్ ఖాన్, పాఠశాల యాజమాన్యం, మిత్ర సభ్యులు శ్రీకాంత్ నేత, నరేష్, శ్రీనేష్, కార్తీక్, హలీం ,తరుణ్, మహేష్ ,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు గురువారం కోహిర్ మండల పోతిరెడ్డిపల్లి గ్రామ చౌరస్తా వద్ద 11వ వార్డు మాజీ కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున యువకులు పాల్గొని కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడని పొన్న రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.

25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వెలుగు ప్రాజెక్ట్.

25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వెలుగు ప్రాజెక్ట్

గణపురం నేటి ధాత్రి:

 

గణపురం మండల కేంద్రంలో వెలుగు ప్రాజెక్టు ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి ఐన సందర్బంగా స్వర్ణభారతి మండల సమాఖ్య వ్యవస్థాపక పాలక వర్గం అధ్యక్షులు చెలమల్ల సంధ్యారాణి కార్యదర్శి ఎండీ రజియా కోశాధికారి సంపెల్లి సరస్వతి గారలను శాలువ షీల్డ్ తో సన్మానం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో డి ఆర్ డి ఓ బాలకృష్ణ డీపీఎం సోమయ్య సీసీ లు ఇమామ్ బాబా మండలం లో ని అన్ని గ్రామ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణ భారతి మండల సమైక్య పాలకవర్గం కృతజ్ఞతలు తెలియజేశారు.

బైక్ యాక్సిడెంట్ బాధితులకు ఆర్థిక సహాయం.

బైక్ యాక్సిడెంట్ బాధితులకు ఆర్థిక సహాయం

ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం మైలారం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన దసరాపు భద్రయ్య కు ముత్యాల సంపత్ కు ఇటీవల బైక్ ఆక్సిడెంట్ కావడం జరిగింది దీనితో వారికి తలకు బాడీకి తీవ్రమైన దెబ్బలు తగలడంతో హైదరాబాదులోని హాస్పిటల్ తీసుకువెళ్లడం జరిగింది వారిది నిరుపేద కుటుంబం కావడంతో వారి కుటుంబం దాతల సహకారం కోరగా విషయం తెలుసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్నికి మనోధైర్యం కల్పించి వారి వైద్యానికి 5,000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది అలాగే వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటారని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఇంచార్జ్ ఆకుల ప్రతాప్,మొర్రి గణేష్, తది ఇతర సభ్యులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని గాంధీ చౌక్ లో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ నా వేడుకలు భాగంగా
ఈరోజు సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత బడుగు బలహీన వర్గాల నేత, రాహుల్ గాంధీ 55వ జన్మదినం సందర్భంగా గాంధీ చౌక్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించడం జరిగింది అంతేకాకుండా రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర చేపట్టి, పేద ప్రజల మన్ననలు పొందిన వ్యక్తిగా, ప్రజా నాయకుడిగా శక్తిగా ఎదిగిన రాహుల్ గాంధీ ఎల్లవేళలా ఆరు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. గ్రంధాలయ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ లోని కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన వ్యవస్థగా పేద ప్రజలకు అండగా ముందుకు సాగుతుందని రాహుల్ గాంధీ లాంటి నాయకుడు మా అందరికీ ముందుండి నడిపిస్తాడని ఆశిస్తున్నాను అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు సంగీతం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎనమల తిరుపతి రెడ్డి స్వరూప, జిల్లా మహిళా అధ్యక్షురాలు కామూని వనిత నలినీకాంత్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సూర దేవరాజు , గడ్డం నరసయ్య వైద్య శివప్రసాద్, తదితర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

వరంగల్ జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్.

వరంగల్ జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు:-

వరంగల్ హన్మకొండ నేటిధాత్రి (లీగల్):

 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను శివనగర్ అంగన్వాడీ (అండర్ బ్రిడ్జి )కేంద్రంలో కాంగ్రెస్ లీగల్ సెల్ వరంగల్ జిల్లా చైర్మన్ శామంతుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా పిల్లలు గర్భిణీల మధ్య కేక్ కట్ చేసి, పండ్లు పంపిణి చేసారు. ఈ కార్యక్రమం లో జిల్లా మహిళా నాయకురాలు రావుల విజయ రాంచందర్, రాధిక,నాయకులు పట్టూరి సుధాకర్, తిరునగిరి వెంకన్న, తొగరు కృష్ణ, రాజు, శ్రీధర్, మధు, అంగన్వాడీ కేంద్రం నిర్వాహకులు వాణిశ్రీ, ఉమాదేవి,నిర్మల,అనూష,ఇశ్రాల్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

ఘనంగా అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

కరకగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి:

 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, బావి భారత ప్రధాని అగ్రనేత పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
భారతదేశంలో కులమతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వాలకు పార్టీలకు బుద్ధి చెప్పడం కోసం పేద ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడం కోసం భారత్ జోడో యాత్ర ప్రారంభించి 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశ ప్రజలందరినీ ఒకే తాటిపై నడిపించిన ప్రజా నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు..
రాహుల్ గాంధీ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండి ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో
మాజీ సర్పంచ్ నాయకులు పోలేబోయిన తిరుపతయ్య, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్, మండల నాయకులు పూజారి వెంకన్న , వగలబోయిన శ్రీను, దంచనాల రాజేంద్రప్రసాద్, గాంధర్ల రామనాథం, గోగు కిరణ్ కుమార్, మేడి శ్రీను, అశ్రపునిస, పోలేబోయిన సుజాత,కార్యకర్తలు, మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు..

వలస ఆదివాసి గ్రామంలో వాలీబాల్ కిట్లు పలకలు అందజేసిన కరకగూడెం పోలీసులు.

వలస ఆదివాసి గ్రామంలో వాలీబాల్ కిట్లు పలకలు అందజేసిన కరకగూడెం పోలీసులు

 

కరకగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి:

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు వలస ఆదివాసి నిమ్మలగూడెం, నీలాద్రి పేట, గండి గ్రామాలలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి ఆదివాసి ప్రజలు మావోయిస్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించద్దని తెలిపారు ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తూ అభివృద్ధి దిశగా ప్రయాణించాలని అభివృద్ధిని అడ్డుకునే మావోయిస్టులకు సహకరించరాదని తెలిపారు. మావోయిస్టులని కాలం చెల్లిన సిద్ధాంతాలని యువత పిల్లలు విద్య ద్వారానే ఉన్నంత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు అసంఘిక శక్తులకు సహకరించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ అనవసరంగా జైలు పాలై కేసులు పాలు కావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడుల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై పివి నాగేశ్వరరావు, మరియు స్పెషల్ పార్టీ టి జి ఎస్ పి సిబ్బంది పాల్గొన్నారు.

కళా బృందానికి విరాళాన్ని అందజేసిన వనపర్తి జిల్లా ఎస్పీ.

కళా బృందానికి విరాళాన్ని అందజేసిన వనపర్తి జిల్లా ఎస్పీ
వనపర్తి నెటిదాత్రి :
మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలైన ప్రాచీన రంగస్థల కళలలను బ్రతికించుకోవాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
గురువారం శ్రీరంగాపురం మండలం వెంకటాపురం గ్రామంలో మూడు రోజులుగా ప్రదర్శిస్తున్న శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర జీవ సమాధి ఘట్టంచివరి రోజు నాటక ప్రదర్శనకు వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ముఖ్య అతిథిగా పాల్గొని కళాకారుల నాటక ప్రదర్శనను చూసి సంతోషం వ్యక్తం చేశారు
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కళలు మానసిక ఆనందాన్ని ఇవ్వడమే అని అన్నారు సంస్కారాన్ని ప్రబోధిస్తాయని చెప్పారు. సినిమాలు,టీవీలు,సెల్ ఫోన్లు వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పెంపొంది ఎంత కాలక్షేపాన్ని అందించినా నాటక రంగం యొక్క గొప్పదనం దానిదేనని వివరించారు.గ్రామాలలో నాటక కళ ఆదరింపబడుతూ ఉందంటే అది పల్లె ప్రజల ఔదార్యానికి నిదర్శనమని కొనియాడారు. భావితరానికి రంగస్థల కళలలను పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీపై ఉందని ఆయన సూచించారు. చిన్ననాడు తాను చూసిన నాటకాలను ఎస్పీ గుర్తు చేసుకున్నారు ఎస్పీ రావుల గిరిధర్ గారు నాటకంలో పాల్గొన్న పాత్రధారుల అభినయాన్ని ప్రశంసిస్తూ శాలువా పూలమాలలతో సన్మానించారు అంతేగాక నాటక సమాజం వారికి విరాళాన్ని అందజేశారు అనంతరం గ్రామస్తులు కళాబృందం వారు ఎస్పీ ని శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి ఎక్సైజ్ సీఐ,వెంకట్ రెడ్డి, శ్రీరంగాపూర్ ఎస్సై, రామకృష్ణ, గ్రామ పెద్దలు, యువకులు, కళాకారులు,ఇతర గ్రామాల నుండి వచ్చిన కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

నిన్నటి త్యాగాలకు వారసుడు రేపటి తరానికి మార్గదర్శకుడు.

నిన్నటి త్యాగాలకు వారసుడు రేపటి తరానికి మార్గదర్శకుడు…

గార్ల నేటి ధాత్రి:

 

భారతదేశాన్ని ప్రగతిశీల భవిష్యత్తు వైపు నడిపించగలిగే ఏకైక వ్యక్తి అధికారానికి నిజం చెప్పే నిర్భయ నాయకుడు నిన్నటి త్యాగాలకు వారసుడు రేపటి తరానికి మార్గదర్శకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఇల్లెందు శాసనసభ్యులు కోరం కనకయ్య ఆదేశానుసారం గార్ల సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.అనంతరం మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక పాఠశాలలో 50 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, గొంతు లేని వారిని శక్తివంతం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ ప్రయాణం కొనసాగాలని సామాజిక న్యాయం, సమానత్వం మరియు హక్కుల కోసం నిర్భయంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి కోట్లాదిమంది అణగారిన యువత, శ్రామిక ప్రజలకు ఆశా కిరణంగా ఉండాలని కోరారు. 

జూడో యాత్ర చేపట్టి దేశం మొత్తం పర్యటించి ఇండియా కూటమిని అత్యధిక సీట్లు సాధించేందుకు కృషి చేశారని, భవిష్యత్తులో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి దేశంలో అధికార పగ్గాలు చేపడుతుందని,దీంతో దేశంలో పేదరికం మతసామరస్యం అభివృద్ధి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశ భావం వ్యక్తం చేశారు. దేశం పట్ల తపన, ప్రజల పట్ల ప్రేమ, సత్యం పట్ల నిబద్ధత, విలువల పట్ల విధేయత, ప్రజాస్వామ్యం అంటే ఎనలేని నమ్మకం, భారత రాజ్యాంగంపై అపారమైన గౌరవం ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ అని కొనియాడారు. సమైక్య భారత స్వాప్నికుడు, భావిభారత ప్రధాని రాహుల్ గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాకూబ్ పాషా,భూక్యా నాగేశ్వరావు, చింతల కోటేష్, కట్ట శ్రీను, కోళ్ల కుమార్ గౌడ్, లెనిన్, జాటోత్ రమేష్,భూక్యా రామ్ సింగ్,ఎం. సురేష్, బోడ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

 ఓటీటీలో మాధవన్ మూవీ ఎప్పటి నుండంటే…

 ఓటీటీలో మాధవన్ మూవీ ఎప్పటి నుండంటే…

 

 

 


వైవిధ్యమైన పాత్రలు చేస్తూ నటుడిగా గుర్తింపు తెచ్చకున్న మాధవన్ చాలా కాలం తర్వాత మరోసారి రొమాంటిక్ మూవీ చేస్తున్నాడు.

 

ఫాతిమా సనా షేక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

 

ప్రముఖ నటుడు మాధవన్ (Madhava) కు గతంలో రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉండేది.

కానీ కొంతకాలంగా అందుకు భిన్నమైన పాత్రలను చేస్తున్నాడు.

కొన్ని హిందీ సినిమాలలో ప్రతినాయకుడి పాత్రలు చేయడానికి కూడా మాధవన్ వెనుకాడలేదు.

 

తెలుగులో ఆ మధ్య వచ్చిన అనుష్క ‘నిశ్శబ్దం’ (Nishabdham) లో అలాంటి భిన్నమైన పాత్రనే మాధవన్ చేశాడు.

సైంటిస్ట్ నంబి నారాయణన్ బయోపిక్ ‘రాకెట్రీ’ (Rocketry) తో మాధవన్ దర్శకుడిగానూ మారిపోయాడు.

ఆ బయోపిక్ అతనికి నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

అలానే గత యేడాది మాధవన్ నటించిన ‘సైతాన్’ (Saitaan) కూడా కమర్షియల్ హిట్ అయ్యి, మాధవన్ లోని నటుడిని వెలికి తీసింది.

ఈ యేడాది ఇప్పటికే మాధవన్ నటించిన ‘హిసాబ్ బరాబర్,’ ‘టెస్ట్’ చిత్రాలు వచ్చాయి.

అయితే ఈ రెండు కూడా ఓటీటీలోనే విడుదల కావడం విశేషం.

ఇక అక్షయ్ కుమార్ తో కలిసి మాధవన్ నటించిన కోర్ట్ డ్రామా ‘కేసరి చాప్టర్ 2’ థియేటర్లలో సందడి చేసింది.

తాజాగా మాధవన్ నటించి మరో చిత్రం ‘ఆప్ జైసా కోయి’ మూవీ సైతం ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమాలో మాధవన్ సరసన ఫాతిమా సనా షేక్ నటిస్తోంది.

మాధవన్ ఈ రొమాంటిక్ లవ్ డ్రామాలో సంస్కృతం లెక్చరర్ గా నటిస్తుంటే, సనా ఫ్రెంచ్ టీచర్ పాత్రను పోషిస్తోంది.

రెండు భిన్న ధృవాలకు చెందిన వీరిద్దరూ కలిసి జీవితం సాగించాల్సి వచ్చినప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నదే ‘ఆప్ జైసా కోయీ’ సినిమా.

 

ధర్మా ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాను వివేక్ సోని డైరెక్ట్ చేశారు.

 

ఇది జూలై 11 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

పాడైన రోడ్డు పట్టించుకోని ప్రభుత్వం.

పాడైన రోడ్డు పట్టించుకోని ప్రభుత్వం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్- బడం పేట్ మార్గమధ్యలో గల రోడ్డు కోత్తూర్, ఖానాపూర్ సమీపంలో పూర్తిగా పాడైపోయిన కారణంగా ఆసుపత్రి, పాఠశాలకు మండల కేంద్రమైన కోహీర్ కు రాకపోకలు సాగించడానికి తీవ్ర అవస్థకు గురౌతున్నామని, కోత్తూర్, ఖానాపూర్ గ్రామాలకు చెందిన పలువురు స్థానికులు శనివారం సాయంత్రం విడుదల చేసిన
సంయుక్త పత్రికా ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుత్ షాక్ తో 3 ఆవుల మృతి.

విద్యుత్ షాక్ తో 3 ఆవుల మృతి

భూపాలపల్లి నేటిధాత్రి:

 

భూపాలపల్లి రూరల్ మండలం శ్యాంనగర్ గ్రామం లో ఇంచర్ల. కోటయ్య చెందిన 2 ఎడ్లు, 1ఆవు కౌటం.కమలాకర్ చెందిన 1 ఆవు కరెంట్ షాక్ కు గురిఐ మృతి చెందినవి. వీటి విలువ మూడు లక్షల వరకు ఉందని వీరి కుటుంబాలను ఆదుకోవాలని గ్రామమాజీ సర్పంచ్ తిరుపతిరావు, గ్రామకాంగ్రెస్ నాయకులు ఓరుగంటి బాబురావు కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version