సీఎంఆర్ చెక్కు అందజేత.

సీఎంఆర్ చెక్కు అందజేత..

రామాయంపేట మే 17 నేటి ధాత్రి (మెదక్):

రామయంపేట: కాట్రియాల గ్రామానికి చెందిన గొల్ల అంజయ్య కు వచ్చిన సిఎంఆర్ఎఫ్ చెక్కును గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అంజయ్యకు అందజేయడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది నిరుపేదలకు ఒక వరం అని, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని వారు అన్నాను.పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులు అందిస్తు నిరుపేదలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మెదక్ నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారికి కాట్రియాల గ్రామ కాంగ్రెస్ నాయకులు మరియు లబ్ధిదారుడు అంజయ్య కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కమ్మరి రమేష్ చారి మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి,నాయకులు చింతం సత్యం,కొప్పుల హనుమండ్లు,కుమార్,లింగం,బాలయ్య,కట్ట రాజు తదితరులు పాల్గొన్నారు

ఇంటర్ పరీక్ష కేంద్రాలు తనిఖీ.!

ఇంటర్ పరీక్ష కేంద్రాలు తనిఖీ

సిరిసిల్ల(నేటి ధాత్రి):

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో గురువారం సిరిసిల్ల పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ లు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ముందుగా సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలోని అన్ని గదులను సందర్శించి, పరీక్షలు జరుగుతున్న సరళిని పరిశీలించారు. ఎంత మంది హాజరు.. గైర్హాజరు అయ్యారు అనే వివరాలను కలెక్టర్ ఆరా తీశారు.

అనంతరం సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ లు కలిసి తనిఖీ చేశారు. ప్రతీ గదిని సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.

లక్ష రూపాయల చెక్కు అందించిన.!

లక్ష రూపాయల చెక్కు అందించిన సామాజిక కార్యకర్త ఇమ్రాన్ మోహియోద్దీన్

జహీరాబాద్. నేటి ధాత్రి:

మజ్లిస్ మాజీ స్పీకర్ మరియు హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు దివంగత శ్రీ సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ జ్ఞాపకార్థం, ప్రముఖ సామాజిక కార్యకర్త ఇమ్రాన్ మొహియుద్దీన్, సామాజిక కార్యకర్త మొహమ్మద్ సమీర్ అబ్దుల్ లతీఫ్ కలిసి కోహిర్ మండల్ మద్రి గ్రామానికి చెందిన 6 రోజుల కుమార్తెకు చికిత్స పొందుతూ మరణించిన మృతురాలి భర్త మంగళై నవీన్ కుమార్ కు లక్ష రూపాయల చెక్కును విరాళంగా అందించారు. ఈ సందర్భంగా,ఏఐఎంఐఎం ప్రధాన కార్యదర్శి జహీరాబాద్ టౌన్ ముహమ్మద్ రఫీ ముహమ్మద్ వాజిద్, ఏఐఎంఐఎం గ్రామ పంచాయతీ అధ్యక్షుడు దగ్వాల్, షేక్ ఇలియాస్ జాయింట్ సెక్రటరీ జహీరాబాద్, ముహమ్మద్ యూనస్ రజా ఏఐఎంఐఎం అధ్యక్షుడు కృష్ణపూర్, ఇమ్రాన్ అబ్దుల్ గఫర్, అజీమ్ పటేల్, మల్లేష్ ముహమ్మద్ అన్వర్ మరియు మాద్రి గ్రామ పంచాయతీ నివాసితులు తదితరులు పాల్గొన్నారు.

ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

మరిపెడ పోలీస్ స్టేషన్ మరియు సర్కిల్ ఆఫీస్ ను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపిఎస్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు.

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ ఉండాలి

అక్రమ ఇసుక రవాణాకు నో ఛాన్స్

ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపీఎస్

మరిపెడ నేటిధాత్రి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని పోలీస్ స్టేషన్ ను ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపిఎస్ మరిపెడ సర్కిల్ మరియు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను స్టేషన్ లోపల 5S విధానాన్ని పరిశీలించారు.అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు.అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు, పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లా ప్రజలను ఎప్పటికప్పుడు విస్తృతస్థాయిలో ప్రచారం చేయాలని తెలిపారు,ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠినంగా వ్యవహారించాలని అన్నారు, ఈ కార్యక్రమంలో మరిపెడ సీఐ రాజ్ కుమార్ గౌడ్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్.ఐ సతీష్ గౌడ్,మరియు ఎస్.ఐ సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version