నిన్నటి త్యాగాలకు వారసుడు రేపటి తరానికి మార్గదర్శకుడు.

నిన్నటి త్యాగాలకు వారసుడు రేపటి తరానికి మార్గదర్శకుడు…

గార్ల నేటి ధాత్రి:

 

భారతదేశాన్ని ప్రగతిశీల భవిష్యత్తు వైపు నడిపించగలిగే ఏకైక వ్యక్తి అధికారానికి నిజం చెప్పే నిర్భయ నాయకుడు నిన్నటి త్యాగాలకు వారసుడు రేపటి తరానికి మార్గదర్శకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఇల్లెందు శాసనసభ్యులు కోరం కనకయ్య ఆదేశానుసారం గార్ల సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.అనంతరం మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక పాఠశాలలో 50 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, గొంతు లేని వారిని శక్తివంతం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ ప్రయాణం కొనసాగాలని సామాజిక న్యాయం, సమానత్వం మరియు హక్కుల కోసం నిర్భయంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి కోట్లాదిమంది అణగారిన యువత, శ్రామిక ప్రజలకు ఆశా కిరణంగా ఉండాలని కోరారు. 

జూడో యాత్ర చేపట్టి దేశం మొత్తం పర్యటించి ఇండియా కూటమిని అత్యధిక సీట్లు సాధించేందుకు కృషి చేశారని, భవిష్యత్తులో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి దేశంలో అధికార పగ్గాలు చేపడుతుందని,దీంతో దేశంలో పేదరికం మతసామరస్యం అభివృద్ధి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశ భావం వ్యక్తం చేశారు. దేశం పట్ల తపన, ప్రజల పట్ల ప్రేమ, సత్యం పట్ల నిబద్ధత, విలువల పట్ల విధేయత, ప్రజాస్వామ్యం అంటే ఎనలేని నమ్మకం, భారత రాజ్యాంగంపై అపారమైన గౌరవం ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ అని కొనియాడారు. సమైక్య భారత స్వాప్నికుడు, భావిభారత ప్రధాని రాహుల్ గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాకూబ్ పాషా,భూక్యా నాగేశ్వరావు, చింతల కోటేష్, కట్ట శ్రీను, కోళ్ల కుమార్ గౌడ్, లెనిన్, జాటోత్ రమేష్,భూక్యా రామ్ సింగ్,ఎం. సురేష్, బోడ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version