జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి బదిలీ.

జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి బదిలీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సోమవారం జరిగిన డీఎస్పీల బదిలీలో భాగంగా జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డిని బదిలీ చేస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నల్గొండ డీసీఆర్బీ డీఎస్పీగా పనిచేస్తున్న సైదాను జహీరాబాద్ డీఎస్పీగా బదిలీ చేశారు.

ఎస్టిపిపిలో ఉద్యోగులను బదిలీ చేయాలి.

ఎస్టిపిపిలో ఉద్యోగులను బదిలీ చేయాలి

నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో గల ఎస్టిపిపి లో అనేక ప్రభుత్వ శాఖలలో ముఖ్యంగా సింగరేణి శాఖలో గత పది సంవత్సరాల కు పైబడి ఒకే దగ్గర ఒకే హోదాలో విధులు నిర్వహిస్తున్న అనేకమంది ఉద్యోగులను వెంటనే బదిలీ చేయాలని కోరుతూ సింగరేణి సంస్థ చైర్మన్ బలరాం నాయక్ కి బిఏంఎస్ యూనియన్ తరపున యాదగిరి సత్తయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు సత్తయ్య మాట్లాడుతూ ఎస్టిపిపి లో దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న అటెండర్ నుండి ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నా వారందరూ ఒకే సంస్థలో ఒకే దగ్గర ఒకే విధంగా విధులు నిర్వహిస్తున్న వారిని వెంటనే గుర్తించి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.గతంలో ఒకే దగ్గర పది సంవత్సరాల కు పైబడి విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేసే జీవో ఉందని ఆ జీవోను మళ్లీ సమీకరించి ఐదు సంవత్సరాలకు పైబడిన వారిని కూడా బదిలీ చేసే విధంగా ఒక కొత్త జీవోను తీసుకురావాలని బలరాం నాయక్ ని కోరారు.సంస్థలలో ఒకే దగ్గర విధులు నిర్వహించడం వల్ల సింగరేణి పవర్ ప్లాంట్ లో భూ నిర్వాసితులకు న్యాయం జరగడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిఎంఎస్ యూనియన్ నాయకులు బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ లక్ష్మారెడ్డి,ప్రధాన కార్యదర్శి దుస్సా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దార్ అరెస్టు.జైలుకు తరలింపు.

“నేటిధాత్రి” ఎఫెక్ట్

తహసీల్దార్ అరెస్టు.జైలుకు తరలింపు.

హైదారాబాద్ ,నేటిధాత్రి

నేటిధాత్రి దినపత్రిక కథనంతో సూర్యాపేట జిల్లాలో తహసీల్దార్, ఆర్ఐ లు అరెస్టు అయ్యారు.ఈ నేపథ్యంలో వారిని నల్గొండ జైలుకు తరలించారు. జిల్లా రెవిన్యూ శాఖలో సంచలనం రేపిన పైల్స్ ట్యాంపరింగ్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తుంది.మోతే మండల రెవిన్యూ ఆఫీస్ లో పహాణిలను టాంపరింగ్ చేసిన కేసులో జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ సిరియస్ గా ఫోకస్ చేయడంతో.. గత కొంత కాలంగా లోతైన విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటికే సస్పెండ్ అయిన తహశీల్దార్,ఇద్దరు ఆర్ఐ లు, కంప్యూటర్ ఆపరేటర్, మీ సేవా నిర్వాహకులతో సహా మొత్తం ఏడుగురిని పోలీసులు ఆదివారం జడ్జి ముందు ప్రవేశపెట్టారు. వీరికి జిల్లా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. గతంలో సస్పెండ్ అయిన తహసిల్దార్, సంఘమిత్ర ,మహిళా ఆర్ఐ నిర్మలాదేవిని నల్గొండ సబ్ జైలు తరలించారు. మీసేవ నిర్వాహకుడితో సహా మిగతా ఐదుగురిని సూర్యాపేట సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో వీరితోపాటు మరో 21 మందిని గుర్తించినట్లు దర్యాప్తులో తేలినట్లు గా సమాచారం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version