బదిలీపై వెళ్తున్నా పోలీస్ లకు ఘనంగా సన్మానం.
ఆమనగల్ / నేటిధాత్రి:
నాగర్ కర్నూల్ జిల్లా ఆమనగల్లు మండలం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, బాల్ రెడ్డి సార్ ఉద్యోగ బదిలీ అవుతున్న సందర్భంగా పోలీస్ స్టేషన్ కి ఉత్తమ సేవలందించినందుకు చిరు సత్కారం చేసి వారిని అభినందించారు.వారికి శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమనగల్ మండలం ఎస్సై వెంకటేష్, కానిస్టేబుల్ మల్లేష్,ఆమనగల్ మండల బిజెపి పార్టీ అధ్యక్షులు ఎర్రవోలు శ్రీనివాస్,
వెంకటేష్, జగన్,నాగిల్ల, బిజెపి సీనియర్ నాయకులు సీతారాం నాయక్,బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.