అడ్మిషన్ల కోసం ఇంటింటి ప్రచారం మెట్ పల్లి.

అడ్మిషన్ల కోసం ఇంటింటి ప్రచారం మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల “సిబ్బంది” ఆచారం

మెట్ పల్లి ఏప్రిల్ 26 నేటి దాత్రి

 

 

 

“దోస్ట్” ద్వారా మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ లు చేసుకోవాలని కోరుతూ ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వేంకయ్య ఆధ్వర్యంలో శనివారం రోజున ఆ కళాశాల సిబ్బంది సంయుక్తంగా వెంకట్రావుపేట గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు.

వెంకట్రావుపేట ప్రధాన రహదారి, గ్రామ పంచాయితీ కార్యాలయం, హనుమాన్ దేవాలయం తదితర ప్రాంతాల్లో గల ఇండ్లలోనికి నేరుగా వెళ్ళి,మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025 -2026 విద్యా సంవత్సరంలో బీ ఏ; బీ కాం (కంప్యూటర్) ప్రథమ సంవత్సరం కోర్సులలో చేరాలని సిబ్బంది ప్రజలకు సూచించారు.

ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు, వొకేషనల్ కోర్సులో ఉత్తీర్ణులైన వారు,ఇంటర్మీడియెట్ డ్రాప్ అవుట్స్ వంటి విద్యార్థులు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఉంటే మాత్రం మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని సూచించారు.

ఈ కళాశాలలో చేరిన విద్యార్థులకు ఎలాంటి ఫీజులు ఉండవని, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, క్రీడలు, ఉపకార వేతనాల మంజూరు,సాధారణ విజ్ఞాన పరీక్షల నిర్వహణ వంటి సౌకర్యాలతో పాటు అనుభవం మరియు నెట్ , సెట్, స్లెట్, పీ హెచ్ డి వంటి అధిక విద్యార్హతలు గల బోధకులు ఉన్నారని,

ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో కళాశాల సిబ్బంది “దోస్త్” ద్వారా అడ్మిషన్ ల కోసం ఇంటింటి ప్రచారం చేయటం ఆనవాయితీగా వస్తోంది.

ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వేంకయ్య, వైస్ ప్రిన్సిపాల్ తొంటి దేవన్న, కళాశాల కామర్స్ హెచ్ ఓ డి ఏ.మనోజ్ కుమార్, లెక్చరర్లు గట్టయ్య, అంజయ్య, సత్తయ్య, రికార్డు అసిస్టంట్ వై.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వెంకట్రావు పేట గ్రామంలో “దోస్త్” ద్వారా అడ్మిషన్ల ల కోసం చేసిన ఇంటింటి ప్రచార కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని ప్రిన్సిపల్ కే వెంకయ్య తెలిపారు.

మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో.!

మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో


మెట్ పల్లి మార్చి 20 నేటి దాత్రి

మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఇంటి పన్ను బకాయిలు చెల్లించాలని మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని. అలాగే బకాయిలు చెల్లించి వచ్చే వార్షిక సంవత్సరం2025-2026 ఇంటి పన్ను పై ఐదు శాతం రిబేటును సద్వినియోగం చేసుకొని లబ్ది పొందాలని అన్నారు.

డిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం

డిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల మెట్టుపల్లి పట్టణంలో సంబరాలు…

మెట్ పల్లి ఫిబ్రవరి 8 నేటి ధాత్రి

డిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల సంబరాలు మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు బోడ్ల రమేష్ ఆధ్వర్యంలో టాపసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు పాల్గొని వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో డిల్లీలో ఘనవిజయం సాధించిందని అత్యధిక మెజార్టీతో బిజెపి అభ్యర్థులను గెలిపించినoదుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఢిల్లీ ప్రజలు ప్రజాస్వామ్య బద్ధమైన పాలనను కోరుకున్నారు అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు వద్దని నిశ్చయించుకున్నారని అని అన్నారు మన ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గంలో 14 వేల పై చిలుకు ఓట్లు సాధించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపడం జరుగుతుంది ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అని అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ గుంటుక సదాశివ్ వడ్డపెల్లి శ్రీనివాస్ దొనికెళ్ళ నవీన్ బాయ్ లింగారెడ్డి సుంకేటి విజయ్ తోకల సత్యనారాయణ మధ్యల లావణ్య సునీత కోయల్కా లింగేశ్వర్ కొల్లేపు శ్రీనివాస్ బోడ్ల నరేష్ కుడుకల రఘు లోలపు అనిల్ శ్రీరామ్ శివ కలిగుట శ్రీకాంత్ నరసింహారెడ్డి బిమనతి విజయ్ జెట్టి రూపేష్ జలంధర్ భోగ దత్తు హనుమాన్లు అంబాల జగన్ నరేష్ రణధీర్ నరసయ్య నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version