పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత…

పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత

 

జగన్ హయాంలో ప్రజా సమస్యలను పరిష్కరించకుండా గాలికొదిలేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లోగా డబ్బులు జమ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anita) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి పోయిన తర్వాత ఏపీలో జగన్ ఎన్ని రోజులు ఉన్నారో చెప్పాలని అన్నారు. ఆయన తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని సవాల్ విసిరారు. ఇవాళ(గురువారం) విజయనగరంలో హోంమంత్రి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు హోంమంత్రి అనిత.
జగన్ హయాంలో ప్రజా సమస్యలను పరిష్కరించకుండా గాలికొదిలేశారని మండిపడ్డారు. ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లోగా డబ్బులు జమ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు. టిడ్కో ఇళ్లు పేదలకు అందకుండా చేసిన పాపం జగన్‌దని.. లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని తెలిపారు. ఆయుధాలు విడిచిపెట్టి మావోయిస్టులను లొంగిపొవాలని కోరుతున్నామని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోలేమని… ఆపదలో ఉన్న వారిని సకాలంలో ఆదుకుంటామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

విశ్రాంత అధికారి పాఠాలు: విద్యార్థులకు ఆనందం, దేశానికి ఉత్తమ పౌరులు…

విశ్రాంత అధికారి పాఠాలు: విద్యార్థులకు ఆనందం, దేశానికి ఉత్తమ పౌరులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి మండలంలోని నాగారం ప్రాథమిక పాఠశాలలో విశ్రాంత మండల విద్యాధికారి, అడ్వకేట్ డి. అంజయ్య విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఉపాధ్యాయులుగా బోధించడం వల్ల మానసిక ఆనందం కలుగుతుందని, సమయం దొరికినప్పుడల్లా విద్యార్థులతో గడపడం సంతోషాన్నిస్తుందని ఆయన తెలిపారు. విశ్రాంత ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు తమకు దగ్గరలోని పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు బోధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పిల్లలతో సమయం గడపడం దేశానికి ఉత్తమ పౌరులను తయారు చేయడానికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ప్రధానోపాధ్యాయులను లేదా మండల విద్యాధికారిని సంప్రదిస్తే బోధించడానికి అనుమతి లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనిత పాల్గొన్నారు.

మున్సిపల్ కమిషనర్ ని సన్మానించిన నాయకులు…

మున్సిపల్ కమిషనర్ ని సన్మానించిన నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ గా ఉదయ్ కుమార్ ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేసిన తెలంగాణ నేతకాని మహర్ కుల సంఘం స్టేట్ యూత్ ప్రెసిడెంట్ గజ్జె రాజ్ కుమార్ స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్ బౌత్ విజయ్ కుమార్ జిల్లా యూత్ నాయకులు దుర్గం అనిల్ తదితరులు పాల్గొన్నారు

వరంగల్–హన్మకొండలో న్యాయవాద దినోత్సవం…

ఉభయ వరంగల్, హన్మకొండ జిల్లా కోర్టు ఆవరణంలో ఘనంగా జరిగిన న్యాయవాద దినోత్సవం:-

హన్మకొండ నేటిధాత్రి

 

 

డిసెంబర్ 3వ తేదీన భారత దేశ తొలి రాష్ట్రపతి మరియు రాజ్యాంగ సభ అధ్యక్షులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకొని న్యాయవాద దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇట్టి సందర్భంగా హన్మకొండ మరియు వరంగల్ బార్ అసోసియేషన్ల ఆద్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు డాక్టర్ బి. ఆర్  అంబేద్కర్ హాలులలో న్యాయవాద 
దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమం వరంగల్ మరియు హన్మకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులైన వి. సుధీర్, పి. సత్యనారాయణ అధ్యక్షతన జరిగినది. ఇట్టి సందర్భంగా వారు మాట్లాడుతూ వృత్తి పరమైన విలువలు, న్యాయవాదుల సేవాభావం మరియు ప్రజాస్వామ్యానికి న్యాయ వ్యవస్థ అందించే బలాన్ని గుర్తు చేసుకునే రోజు అని అన్నారు.

ఇట్టి కార్యక్రమం లో ఇరు బార్ అసోసియేషన్ల ప్రధాన కార్యదర్శులు డి. రమాకాంత్, కె. రవి మరియు కమిటి మెంబెర్స్ సీనియర్, జూనియర్ న్యాయవాదులు మరియు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ ని కలిసిన జర్నలిస్ట్ పూరి సురేష్..

జిల్లా ఎస్పీ ని కలిసిన జర్నలిస్ట్ పూరి సురేష్
వనపర్తి నేటిదాత్రి

.జిల్లా ఎస్పీ సునిత రెడ్డిని జర్నలిస్ట్ పూరి సురేష్ శెట్టి కలిశారు

ఈసందర్భంగా పూరి మాట్లాడుతూ ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసి ఫోటో ఇచ్చామని చెప్పారు శ్రీ వాసవి సేవాసమితి ద్వారా కార్యక్రమాలకు పాల్గొనాలని కోరామని పూరి తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీవాసవి మాత సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ప్రశంసలు అందుకున్న బ్రాహ్మణపల్లి యూత్…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T161004.738.wav?_=1

 

ప్రశంసలు అందుకున్న బ్రాహ్మణపల్లి యూత్

మంగపేట నేటిధాత్రి

 

బ్రాహ్మణపల్లి చెక్ పోస్ట్ దగ్గర ఆర్ & బి రోడ్ కి ఇరువైపుల గుంతలు పడటం తో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి అని గ్రామంలోని యువకులు తలా ఓ చేయి వేసి గుంతలు పూడ్చడం జరిగింది

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బ్రాహ్మణ పల్లి యూత్ అధ్యక్షులు బాడిశ ఆదినారాయణ గ్రామం లోని యూత్ కొమురం శ్రీ రామ్ మూర్తి మున్నా నిరంజన్ ఆనంద్ గంట నరేష్ థశరథం బొబ్బ సూర్య ప్రకాష్ కొమురం జగన్నాథం పాల్గొన్నారు

వనపర్తి డి ఎస్ ఓ పై లోకాయుక్తలో రాచాల ఫిర్యాదు…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T160559.882.wav?_=2

 

వనపర్తి డి ఎస్ ఓ పై లోకాయుక్తలో రాచాల ఫిర్యాదు
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా సివిల్ సప్లయ్ అధికారి కాశీ విశ్వనాధ్ పై రాష్ట్ర లోకాయుక్తలో బీసీ పొలిటికల్ జెఎసి రాష్ట్ర చైర్మైన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. మంగళవారం బషీర్ బాగ్ లోని లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన అనంతరం రాచాల యుగంధర్ గౌడ్ విలేకరుల తో మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న డి ఎస్ ఓ పై ఆధారాలతో లోకాయుక్త లో ఫిర్యాదు చేశామని రాచాల తెలిపారు. రైస్ మిల్లు కు సంబంధించి మిషన్లు మోటర్లు,ప్రభుత్వ విద్యుత్ కనెక్షన్ లేని రైస్ మిల్లులకు బియ్యాన్ని కేటాయించడంతో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి కాశీ విశ్వనాధ్ పై ఏప్రిల్ నెలలో జిల్లా కలెక్టర్ , విజిలెన్స్ డిజి , సివిల్ సప్లయ్ కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు.
తనకు అనుకూలంగా ఉండే మిల్లర్లకు మాత్రమే డి ఎస్ ఓ ధాన్యం కేటాయిస్తూ.ప్రభుత్వ.రూల్స్ పాటిస్తున్న మిల్లులకు బియ్యం కేటాయించకుండా కక్ష చూపుతున్నారని ఆరోపించారు.

కొంత మంది అధికారుల చర్యల కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న అలాంటి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని రాచాల కోరారు.
ఫిర్యాదు చేసిన వారిలో నాయకులు గాలిగల్ల సాయిబాబా, చింటు తదితరులు ఉన్నారు.

అక్రమ మద్యం కేసు నమోదు

అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండల పరిధిలోని మిర్జాపూర్ గ్రామంలో అనుమతులు లేకుండా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న తెలుగు అంజన్న అనే వ్యక్తిపై హద్నూర్ ఎస్ఐ దోమ. సుజిత్ కేసు నమోదు చేశారు. అతని వద్ద నుంచి వివిధ బ్రాండ్లకు చెందిన 20 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డుకు పుల్ల ప్రతాప్ ఎంపిక

జాతీయ అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డుకు
పుల్ల ప్రతాప్ ఎంపిక.

చిట్యాల, నేటిదాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన పుల్ల రాజేశ్వరి సాంబయ్య గార్ల కుమారుడు పుల్ల ప్రతాప్ అంబేద్కర్ ఫెలోషిప్ నేషనల్ అవార్డ్ కు ఎంపికైనట్లు కాకతీయ దళిత సాహిత్య అకాడమీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జితేందర్ మను తెలిపారు. గత 15 సంవత్సరాలుగా పుల్ల ప్రతాప్ అంబేద్కర్ ఆశయాల కొరకు కృషి చేస్తూ , కళారంగాల్లో గాయకుడిగా రచయితగా సమాజంలో జరుగుతున్న అనేక విషయాలపై ప్రత్యేక కృషి చేస్తు విశిష్ట సేవలు అందిస్తున్న పుల్ల ప్రతాప్ సేవలను గుర్తించి కాకతీయ దళిత సాహిత్య అకాడమీ ఢిల్లీ వారు ఎంపిక చేయడం జరిగిందనీ అన్నారు. ఢిల్లీలో పంచశీల ఆశ్రమంలో జరగబోయే 41 వ జాతీయ అంతర్జాతీయ సదస్సులో డిసెంబర్ 12న జాతీయ అంతర్జాతీయ ప్రముఖులచే ఈ అవార్డును అందిస్తున్నట్లు డాక్టర్ జితేందర్ మను తెలిపారు. పుల్ల ప్రతాప్ మాట్లాడుతూ నేను చేస్తున్న నా సేవలను గుర్తించి అంబేద్కర్ ఫెలోషిప్ జాతీయ అవార్డుకు ఎంపిక చేసినందుకు కాకతీయ దళిత సాహిత్య అకాడమీ తెలంగాణ రాష్ట్ర ఆధ్యక్షులు డాక్టర్ జితేందర్ మను కు అలాగే నాకు సహకరించిన అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు దొడ్డి కిష్టయ్య, దబ్బెట రమేష్ జిల్లా అధ్యక్షులు పుల్ల ప్రేమ్ సాగర్ మండల అధ్యక్షులు అధ్యక్షులు జన్నే యుగేందర్ మాజీ అధ్యక్షులు బొడ్డు ప్రభాకర్ సరిగొమ్ముల రాజేందర్ మండల నాయకులు గుర్రపు రాజమౌళి గురుకుంట్ల కిరణ్ గుర్రపు రాజేందర్, కట్కూరి శ్రీనివాస్, కట్కూరి రమేష్ గుర్రపు తిరుపతి ల కు ప్రత్యేకంగా కృతజ్ఞతలుతెలియజేశారు.

వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

పట్టణంలోని శుభం కన్వెన్షన్ హాల్ లో జరిగిన జహీరాబాద్ మండలం మల్చెల్మ గ్రామానికి చెందిన బస్వరాజ్ పటేల్ సోదరుడి కూతురి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు మాజి మున్సిపల్ చైర్మన్ అల్లాడి నర్సింలు , మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,విజేందర్ రెడ్డి,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,ఇస్మాయిల్, శశి వర్ధన్ రెడ్డి , తదితరులు.

రాహుల్ సిప్లిగంజ్ వివాహం

గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ వివాహం: బీజేపీ నేత శుభాకాంక్షలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ప్రముఖ గాయకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత రాహుల్ సిప్లిగంజ్ హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తన ప్రియురాలు హరిణ్య రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ పట్టణ అధ్యక్షులు పూల సంతోష్ హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంఘటన రాహుల్ సిప్లిగంజ్ వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది.

బిజెపి పోరాటంతో తగ్గిన ఇసుక ఛార్జీలు

ఫలించిన బిజెపి పోరాటం
ఇసుక క్వారీల్లో తగ్గిన లోడింగ్ చార్జీలు
హర్షం వ్యక్తం చేస్తున్న ఇసుక లారీ ఓనర్స్

మహాదేవపూర్ నవంబర్ 27 నేటి ధాత్రి *

 

మహాదేవపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ అధ్యక్షతన మహాదేవపూర్ మండల కేంద్రంలో నడుస్తున్న ఇసుక క్వారీలలో అధిక లోడింగ్ చార్జీలు వాసులు చేస్తున్నారనే లారీ డ్రైవర్ల సమాచారం మేరకు గత వారం రోజుల క్రితం ఇసుక క్వారీలను సందర్శించి,ఇసుక అధిక లోడింగ్ చార్జీలపై క్వారీ యాజమాన్యన్ని ప్రశ్నించడం జరిగింది వారు దొర్జన్యంగా మేము ఇలాగే వసూల్ చేస్తాం అని వారు మమ్మల్ని బెదిరియ్యడం జరిగింది, వారిపై మొదటగా ప్రాజెక్ట్ ఆఫీసర్ చర్యలు తీసుకోవాలని తెలుపగా వారు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారికే వత్తస్ పలికేలా మాట్లాడరు,
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కాళేశ్వరం పర్యటన కి వచ్చిన్నపుడు వారికీ సరి అయినా ఆధారాలతో వినతి పత్రం ఇవ్వడం జరిగింది, వెంటనే స్పందించిన అధికర యంత్రాంగం ఇసుక లోడింగ్ ఛార్జిలను తగ్గించడం జరిగింది,4100 ఉన్న ఇసుక లోడింగ్ ఛార్జ్ ని 2500 తగ్గించడం జరిగింది,గవర్నమెంట్ అడర్స్ ప్రకారం అసలు లోడింగ్ ఛార్జ్ కి డబ్బులు చెల్లించవాల్సిన అవసరం లేదు కానీ క్వారీ కాంట్రాక్టర్లు సంబంధిత అధికారులు కుమ్మకై మీకు ఇంత మాకు ఇంత అని పంచుకుంటున్నారు, గవర్నమెంట్ అడర్స్ కంటే ఒక రూపాయి ఎక్కో తీసుకున్న కూడా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమలు చేసి మా ప్రాంత లో అక్రమాలకు తావు లేకుండా చేస్తామని అన్నారు, అలాగే అవినీతి గురించి తెలుపుగనే స్పందించి చర్యలు తీసుకున్న భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కు వారు ధన్యవాదములు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది

పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

మూడు విడతల్లో పంచాయితీ ఎన్నికలు

బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి..నోడల్ అధికారులకు ఆదేశాలు

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా, నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.బుధవారం వరంగల్ కలెక్టరేట్ లో కలెక్టర్ డాక్టర్ సత్య శారద
గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణ పై అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిపిఓ కల్పన లతో కలసి ఆర్డీఓ లు, ప్రత్యేక అధికారులు, నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదలైనందున జిల్లాలోని 11 మండలాల్లోని 317 గ్రామ పంచాయతీ సర్పంచ్ లు, 2754 వార్డు సభ్యుల ఎన్నికలకు 3 విడతల్లో ఈ నెల 27, 30 మరియు డిసెంబర్ 3 తేదీల్లో నామినేషన్ స్వీకరణ ఉంటుందని, నామినేషన్ పత్రాల స్వీకరణ నుంచి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల హ్యాండ్ బుక్ లోని ప్రతి అంశంపై సంపూర్ణ అవగాహన తెచ్చుకోవాలన్నారు. పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని.. అనుమానాలు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

Panchayat Elections

ఎన్నికల విధులు ఎంతో కీలకమైనవని, ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకుండా అన్ని జాగ్రత్తలతో సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా నగదు, మద్యం, పంపిణీపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఇతర వస్తువుల సీజ్ చేసిన సందర్భాలలో అన్ని బృందాలు సమన్వయం చేసుకోవాలని సూచించినారు. , జిల్లాలోని చెక్ పోస్టులలో వాహనాల తనిఖీలు నిష్పక్షపాతంగా, పకడ్బంధీగా జరిగేలా చూడాలని అన్నారు. నోడల్ అధికారులు ప్రతి రోజు రిపోర్ట్ లు నిర్ణిత ఫార్మాట్ లో సమర్పిచాలని తెలిపారు.జిల్లాలో మాన్ పవర్ మేనేజ్మెంట్, బ్యాలెట్ బాక్సుల మేనేజ్మెంట్, ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్మెంట్, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, మెటీరియల్ మేనేజ్మెంట్, ఎక్స్‌పెండిచర్ మానిటరింగ్, మీడియా కమ్యూనికేషన్, హెల్ప్‌లైన్ & కంప్లైంట్స్ రెడ్రెస్సల్, తదితర విభాగాల వారీగా నోడల్ అధికారులను నియమించామని,జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా,నిష్పక్షపాతంగా ఎలాంటి అంతరాయం లేకుండా జరిగేందుకు నోడల్ అధికారులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా ఎన్నికల నిర్వహణ జరగాలి. శాంతియుత, స్వేచ్ఛాత్మక మరియు పారదర్శక ఎన్నికలకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్పష్టం చేశారు.మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున అందరూ పాటించాల్సిన నిబంధనలను గుర్తుచేశారు.అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగుతూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. జిల్లా ప్రజలందరూ ఎన్నికల నియమావళిని పాటించి, శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించు కోవాలని అన్నారు.ఈ సమావేశం లో ఆర్డీఓలు సుమా రెడ్డి, ఉమారాణి, ఎన్నికల ప్రత్యేక అధికారులు,నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు ఎంపిడివోలు, ఎంపిఓ లు తదితరులు పాల్గొన్నారు.

కార్తీక్ వైద్యం కోసం లక్ష రూపాయల సహాయం

కార్తీక్ వైద్య ఖర్చులకు లక్ష అందజేత

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రుద్రారం గ్రామానికి చెందిన పేద యువకుడు కార్తీక్ అనారోగ్యం పాలవగా, మెరుగైన వైద్యం కోసం సుమారు ఐదు లక్షలు అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో కార్తీక్ కుటుంబం తమ నిరుపేద ఆర్థిక పరిస్థితి కారణంగా ఆందోళన చెందారు.​ ఈవిషయాన్ని కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న స్థానిక తాజా మాజీ ఎంపిటిసి గుర్రం దేవిక రాజశేఖర్ తక్షణమే స్పందించి, కార్తీక్‌కు సహాయం అందించడానికి దాతల సహకారం కోరారు. ​గుర్రం దేవిక రాజశేఖర్ చేసిన విజ్ఞప్తికి స్థానిక దాతలు, ప్రజలు ఉదారంగా స్పందించి తమ వంతు సహాయం అందించారు. ​దాతల నుంచి మొత్తంగా ఒక్క లక్ష రూపాయాలు విరాళంగా సమకూరింది.​ ఈవిరాళాన్ని రామడుగు మండల విద్యాశాఖాధికారి రంగనాథ శర్మ చేతుల మీదుగా కార్తీక్ కుటుంబసభ్యులకు అందజేశారు.​ ఈసందర్భంగా మాజీ ఏంపిటిసి గుర్రం దేవిక రాజశేఖర్ మాట్లాడుతూ మానవత్వంతో స్పందించి కార్తీక్ వైద్య ఖర్చుల కోసం విరాళాలు అందించిన దాతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈసహాయం కార్తీక్ త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో రమేష్, పి.డి,అనపురం తిరుపతి, తడగొండ రాజు, నాగం చంద్రమోహన్, చిలుముల శ్రీను, లక్ష్మణ్, నరసింహచారి, రాజమల్లయ్య, జనార్ధన్, సాయిలు, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

బాలాజీ స్కూల్‌లో సంవిధాన్ దివస్

బాలాజీ టెక్నో స్కూల్ లో సంవిధాన్ దివస్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలోని బాలాజీ టెక్నో స్కూల్ (సీబీఎస్ఈ )లో సంవిధాన్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు అంబేద్కర్ వేషధారణతో వచ్చి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు- ప్రజల బాధ్యత గురించి చక్కని ఉపన్యాసాలు ఇచ్చారు.బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ .రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం దేశ పౌరులకు అనుగుణంగా సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో 26 నవంబర్ 1949 భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిందన్నారు. ప్రజలందరికీ న్యాయం ,స్వేచ్ఛ ,సమానత్వం ,సౌబ్రాతృత్వం అందించాలనే రాజ్యాంగ స్ఫూర్తిని ప్రోత్సహించడం నేడు ప్రత్యేకతని ,భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను మరియు దాని రూపశిల్పి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చేసిన కృషిని గుర్తు చేస్తుందని తెలిపారు. భారతదేశ ప్రజాస్వామ్య గణతంత్రరాజ్యాంగా మారడానికి పునాదయిందని రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, విలువలు, బాధ్యతలపై ప్రజలలో అవగాహన పెంచడం లక్ష్యంగా తోడ్పడుతుందని గుర్తు చేశారు.స్కూల్( సీబీఎస్ఈ) ప్రిన్సిపాల్ పి .రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం 19 నవంబర్ 2015 ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ 26ని అధికారికంగా రాజ్యాంగ దినోత్సవం గా ప్రకటించారన్నారు.అనంతరం ఎన్.సి.సి పదవ బెటాలియన్ థర్డ్ ఆఫీసర్ ఎం. డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం- ప్రజల బాధ్యత పై విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించినారు.ఈకార్యక్రమంలో ఎన్.సి.సి క్యాడెట్లు మరియు ఉపాధ్యాయులు క్రాంతి కుమార్, అనిల్ కుమార్ ,సతీష్ ,అర్లయ్య, చందు, కవిత, సంగీత తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదం.. 16 మేకలు ఒక్కసారిగా మృత్యువాత…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-25T132049.228.wav?_=3

 

ప్రమాదం.. 16 మేకలు ఒక్కసారిగా మృత్యువాత

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండల్ మొల్కల్పాడు గ్రామంలో సోమవారం ఉదయం ఊహించని ఘోర ప్రమాదం సంభవించింది. రైతు మేతరి సంజీవ్ తన 16 మేకలను మేతకు తీసుకెళ్లగా, అవి పొలంలోని పత్తి పంటలో మేస్తూ ఒక్కొక్కటిగా కిందపడి మృతి చెందాయి. ఈ ఘటనలో రైతుకు సుమారు రూ.2.5 లక్షల నష్టం వాటిల్లింది. మేకలు ఆకస్మికంగా ఎందుకు చనిపోయాయో తెలియాల్సి ఉంది. సంఘటన స్థలాన్ని రెవెన్యూ అధికారులు సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

దాహం వేయకపోయినా నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి…

దాహం వేయకపోయినా నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి.!

 

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు చాలా అవసరం. కానీ, అవసరానికి మించి నీరు తాగడం కూడా శరీరానికి మంచిది కాదని మీకు తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: శరీరం ఆరోగ్యంగా ఉండటానికి నీరు చాలా అవసరం, ఎందుకంటే ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో, శరీరంలోని ప్రతి కణం సరైన పనితీరుకు సహాయపడుతుంది. నిర్జలీకరణం మలబద్ధకం, మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తుంది. కాబట్టి, దాహం వేయకపోయినా రోజంతా తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. అయితే, అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగడం శరీరానికి హానికరం. కొన్నిసార్లు శరీరంలో నీటి శాతం తగ్గకూడదని మనం అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగుతాము. ఈ అలవాటు మనకు తెలియకుండానే మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి, ఒక వ్యక్తి రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? దాహం లేకపోయినా నీరు తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
దాహం వేయకపోయినా నీళ్లు తాగవచ్చా?

దాహం లేకపోయినా నీరు తాగడం వల్ల శరీరానికి హాని ఉండదు, పైగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. అయితే, అతిగా నీళ్లు తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వంటి సమస్యలు రావచ్చు, కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల కొంతమందికి తలనొప్పి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.దాహం శరీరం డీహైడ్రేషన్‌కు గురైందని సూచించిస్తుంది, ఈ సంకేతం కనిపించే ముందు నీరు తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవచ్చు. వేడి వాతావరణంలో లేదా ఎక్కువ వ్యాయామం చేసిన తర్వాత ఎక్కువ నీరు తాగడం మంచిది. శరీరం హైడ్రేట్‌గా ఉందో లేదో తెలుసుకోవడానికి, మీ మూత్రం రంగును చూడండి. అది లేత రంగులో ఉంటే, మీరు బాగా హైడ్రేట్ అయ్యారని అర్థం.

రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి?

రోజుకు ఎంత నీరు తాగాలి అనేది వ్యక్తుల లింగం, వయస్సు, బరువు, శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, ప్రతి వ్యక్తి రోజుకు 2.5 నుండి 3 లీటర్ల నీరు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, మీకు ఎక్కువగా చెమట పడుతుంటే, దీని కంటే కొంచెం ఎక్కువ నీరు తాగడం మీకు మంచిది.

బిడ్డా.. నేనూ వస్తా.. గర్భశోకం తట్టుకోలేక తల్లి మృతి..

బిడ్డా.. నేనూ వస్తా.. గర్భశోకం తట్టుకోలేక తల్లి మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: నవమాసాలు మోసి, ప్రేమగా
పెంచుకున్న బిడ్డ మరణాన్ని తట్టుకోలేక, “బిడ్డా నువ్వు లేని ఈ జీవితాన్ని నేను భరించలేను జీవించలేను..” అంటూ విలపిస్తూ తీవ్ర మనోవేదనకు గురైన తల్లి, చివరికి ఆ వేదనను తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకున్న హృదయ విదారక సంఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఎల్లోయ్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన బోయిని వెంకట్-లావణ్యలకు వైష్ణవి (6) అనే ఒకే పాప ఉంది. అయితే ఆ పాప అనారోగ్యంతో బాధపడుతుండగా మొదట జహీరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స ఫలించకపోవడంతో మెరుగైన వైద్యం కోసం రెండు రోజుల క్రితం హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు నిమోనియా నిర్ధారించారు. ఇక పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ చిన్నారి వైష్ణవి శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. చిన్నారి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కూతురు మృతిని భరించలేక తల్లి లావణ్య తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చివరకు ఆ దుఃఖాన్ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఒకేరోజు తల్లి-బిడ్డ మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు వర్ణించలేని రీతిలో విలపిస్తున్నారు. కాగా గత రాత్రి ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఝరాసంగం ఎస్సె క్రాంతి కుమార్ తెలిపారు.

సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించిన…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-22T132741.688.wav?_=4

 

 

సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించిన

◆:- ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామంలో కామి రెడ్డి తండ్రి సాయి రెడ్డి & సరోజా రఘుల్ రెడ్డి ఇల్లు షాక్ సర్క్యూట్ కారణంగా కాలిపోవడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు.బాధితులకు అందాల్సిన నష్ట పరిహారం విషయంలో సంబంధిత అధికారులతో మాట్లాడి అండగా ఉంటాం అని బాధితులకు మనోధైర్యని కల్పించారు.

పార్థివదేహానికి నివాళాలు అర్పించిన ఎమ్మెల్యే…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-19T125229.536.wav?_=5

 

పార్థివదేహానికి నివాళాలు అర్పించిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ హోతి బి గ్రామానికి చెందిన నసీర్ మొయినుద్దీన్ మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు వారి నివాసానికి చేరుకొని పార్థివదేహానికి నివాళాలు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఎమ్మెల్యే గారితో పాటుగా జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ పాక్స్ చైర్మన్ మచ్చెందర్ పార్టీ అధ్యక్షులు పర్వేజ్ చిన్న రెడ్డి తదితరులు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version