నాగర్ కర్నూల్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు…

నాగర్ కర్నూల్ పట్టణంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ గారు

నేటి దాత్రి నాగర్ కర్నూలు జిల్లా

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ సంతోష్ గారు అదనపు ఎస్పి వెంకటేశ్వర్ గారు పూలమాలలు వేసి జయంతి వేడుకలు ప్రారంభించారు
అనంతరం ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు మాట్లాడుతూ అంబేద్కర్ మహానీయుడని వంద సంవత్సరాల క్రితమే భారతదేశం ఎలా ఉండాలని బడుగు బలహీనుల వర్గాల అభ్యున్నతికి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బాటలు వేశారని కొనియాడారు ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదువుకోవాలని బడుగు బలహీన వర్గాల పేద పిల్లలు బాగా చదువుకోవాలని సమాజంలో ఉన్నత శిఖరాలను అందుకోవడమే అంబేద్కర్ ఆశయ సాధన అని గుర్తు చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ సంతోష్ గారు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ చేసిన సేవలు అమూల్యమైనవని రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికి ఆదర్శం అని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సునీంద్ర వైస్ చైర్మన్ రమేష్ కౌన్సిలర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు

భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు.

భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క భారతీయుడు ముందుకు సాగాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చిట్యాల తిరుపతిరెడ్డి అన్నారు. మంగళవారం అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోతు చరణ్ సింగ్ ఆధ్వర్యంలో జరగగా తిరుపతి రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఉన్న విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప మహనీయుడు. ఆయన దేశానికి యువతకు స్ఫూర్తిగా నిలిచి వారి గుండెల్లో గూడు కట్టుకున్న మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. ఆయన ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోతు రమేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇస్తారు శేఖర్ గౌడ్, వైనాల అశోక్, నాయకులు కదురూ కట్టయ్య, ఎర్రబెల్లి రఘుపతిరావు, జిల్లా మునిందర్, జెట్టి రామ్మూర్తి, పురుషోత్తం సురేష్, సంపత్ రెడ్డి, బత్తిని మహేష్, రఘుపతి, జంగిలి మోహన్, వెంగళ దాసు రమేష్, వల్లే పైడి, చిట్యాల ఉపేందర్ రెడ్డి, ఎరుకలి రవీందర్, విఎఫ్ జి చైర్మన్ శ్రీనివాస్, సర్పంచులు భూక్య భాస్కర్, సిద్ధ సంతోష్, పోషాలు, మాసంపల్లి అఖిల్, శివకోటి, బోళ్ల సర్వేశం, గాజర్ల రాజు, కొలిపాక రఘుపతి, పవన్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు…

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

మంచిర్యాల,నేటి ధాత్రి:

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సహప్రాంత ప్రచారక్ ప్రభు కుమార్ పాల్గొని, డా. బి.ఆర్. అంబేద్కర్ చూపిన మార్గంలో అందరూ నడవాలని సూచించారు.రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ,అందులో భాగమైన పౌరులుగా మనం పాటించవలసిన కర్తవ్యాలను తప్పనిసరిగా అనుసరించాలని ఆయన తెలిపారు.దేశాన్ని ఒక నాగరిక సమాజంగా రూపుదిద్దడంలో ప్రతి పౌరుడు ముందుండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవాహ కృష్ణ భాస్కర్, సహకార్యవాహ శ్రీనివాస్,జిల్లా ప్రచారక్ నాగరాజు,రామకృష్ణ, రాజేశ్వర్ ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీ కార్యాలయం లో అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు….

గ్రామ పంచాయతీ కార్యాలయం లో అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు.

కోదాడ, నేటి ధాత్రి:

https://youtu.be/iVSPrhfij-c?si=_xQ8CgKmb590KGDW

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను మంగళవారం కోదాడ మండలం తొగర్రాయి గ్రామ గ్రామపంచాయతీ కార్యాలయం నందు గ్రామ సర్పంచ్ లిక్కీ గురవమ్మ వెంకటయ్య, ఉపసర్పంచ్ ఉమామహేశ్వరి శీను లు బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మనదేశంలో పుట్టడం మన అందరి అదృష్టం అన్నారు. ప్రపంచంలోని మహనీయుల జాబితాలో అగ్రగణన్యుడుగా అంబేద్కర్ ఉన్నారన్నారు. అంబేద్కర్ ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా సమ సమాజ స్థాపనకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కులాలకు అతీతంగా మహనీయులను స్మరించుకోవాలని అది మనందరి బాధ్యతనీ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అవినాష్, వార్డ్ నెంబర్ పులి సంధ్య, నాగమ్మ వీరయ్య , నరేష్, దేవాలయం కమిటీ చైర్ పర్సన్ సరస్వతి మదన్ మోహన్, ఎస్సి సెల్ అధ్యక్షులు పులి సులోచన రావు, వెంకయ్య, మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు, ఆదం నాగరాజు, ఏడుకొండలు, సునీత, గ్రామపంచాయతీ సిబ్బంది యువకులు మహిళలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ జయంతి వేడుకలలో తెలుగుదేశం పార్టీ నేతలు…

అంబేద్కర్ జయంతి వేడుకలలో తెలుగుదేశం పార్టీ నేతలు

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా తెలుగుదేశం పార్టీ అద్యరములో డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలలో తెలుగుదేశం పార్టీనేతలు పాల్గొన్నారు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన o గా నివాళులర్పించారు
ఈసందర్భంగా తెలుగుదేశం పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ కన్వీనర్ రాములు మాట్లాడుతూ సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ఒక కులానికి లీడర్ కాదు ,ప్రతి మహిళ సమస్య కోసం పోరాటం ,కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుడు.
ఆ మహనీయుని ఆశయాలను కొనసా గి నా oచాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వనపర్తి పట్టణ అధ్యక్షులు లక్ష్మయ్య , షాకీర్ హుస్సేన్ ,ఆవుల శ్రీను, గంధం ట్రాక్టర్ బాలయ్య చిన్నయ్య,అప్పాయిపల్లి బాలయ్య , జి లక్ష్మయ్య,జి కృష్ణయ్య, శేఖర్, రాజు మేస్త్రి, దాసు, కొత్తగొల్ల శంకర్ ద్యారపోగు బాలరాజు తదితరులు పాల్గొన్నారు

దేశ రెండవ రాజధానిగా హైదరాబాదును ఏర్పాటు చేయాలి..

దేశ రెండవ రాజధానిగా హైదరాబాదును ఏర్పాటు చేయాలి

ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.నర్సింగ్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్ ను ఏర్పాటు చేయాలని ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.నర్సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఎస్సీ సంక్షేమ సంఘం మంచిర్యాల కార్పొరేషన్ ముఖ్య నాయకుల సమావేశం శ్రీరాంపూర్ లోని ఆర్కే సిక్స్ ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించారు.ఈ సమావేశానికి మంచిర్యాల నియోజకవర్గం అధ్యక్షులు గుమ్మడి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపల్లి నర్సింగ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నర్సింగ్ మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధించడం కోసం సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయాలని కోరారు.మహానీయుల సిద్ధాంతాలను పోరాటపటివను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని,భూ భౌగోళికంగా అన్ని సౌకర్యాలు కలిగిన హైదరాబాద్ ను రెండవ రాజధానిగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.త్యాగానికి నిలువెత్తు నిదర్శనం భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను పార్టీ పుస్తకాలలో చేర్చి ఎస్సీ సంక్షేమం కోసం ప్రత్యేక ఎస్సీ కార్పొరేషన్ బోర్డు ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.నిరుద్యోగులైన యువతి,యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడం కొరకు శిక్షణ ఇచ్చి ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు లోన్ ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎస్సీల సంక్షేమ కోసం సంక్షేమ భవనం కొరకు స్థలం ఏర్పాటు చేయాలన్నారు.ఎమ్మెల్యేల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వారి సమస్యలను తీసుకెళ్తూ సమస్యలు పరిష్కారం అయ్యేలా నియోజవర్గంలోని గ్రామ కమిటీలు,మండల కమిటీలు త్వరగా పూర్తిచేసి జిల్లా కమిటీని పటిష్టం చేస్తామని తెలిపారు.

సంఘం యొక్క తీర్మానాలు

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అన్నారు.ప్రభుత్వ హాస్టల్ పాఠశాల విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పాటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తదితర అంశాల పైన తీర్మానం చేశారు. సంఘం యొక్క తీర్మానాలను సభ్యులందరి ఆమోదంతో జిల్లా యూత్ అధ్యక్షులు బింగి సదానందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.అలాగే మంచిర్యాల కార్పొరేషన్ అధ్యక్షులుగా శ్రీరాంపూర్ హిమాయత్ నగర్ ప్రాంతానికి చెందిన జక్కే మొగిలి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపాలిటీ ఏరియా అధ్యక్షులు పార్లపెల్లి సారయ్య,శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు పుట్ట రవి, మద్దెల స్వామి దొంత మురళి, వార్డ్ ఇన్చార్జి కౌటం కృష్ణ, నూకల రాజయ్య, అరుణక్కనగర్ ఏరియా ప్రధాన కార్యదర్శి భోగ శంకర్, నాయకులు బవండ్లపల్లి నరసయ్య,సొల్లు కొమరయ్య, జక్కే మొగిలి,చేవుల వాసు, బేతే రాజశేఖర్,కనుమల్ల అనిల్ కుమార్,వేముల మల్లమ్మ,కావటం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డుకు పుల్ల ప్రతాప్ ఎంపిక

జాతీయ అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డుకు
పుల్ల ప్రతాప్ ఎంపిక.

చిట్యాల, నేటిదాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన పుల్ల రాజేశ్వరి సాంబయ్య గార్ల కుమారుడు పుల్ల ప్రతాప్ అంబేద్కర్ ఫెలోషిప్ నేషనల్ అవార్డ్ కు ఎంపికైనట్లు కాకతీయ దళిత సాహిత్య అకాడమీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జితేందర్ మను తెలిపారు. గత 15 సంవత్సరాలుగా పుల్ల ప్రతాప్ అంబేద్కర్ ఆశయాల కొరకు కృషి చేస్తూ , కళారంగాల్లో గాయకుడిగా రచయితగా సమాజంలో జరుగుతున్న అనేక విషయాలపై ప్రత్యేక కృషి చేస్తు విశిష్ట సేవలు అందిస్తున్న పుల్ల ప్రతాప్ సేవలను గుర్తించి కాకతీయ దళిత సాహిత్య అకాడమీ ఢిల్లీ వారు ఎంపిక చేయడం జరిగిందనీ అన్నారు. ఢిల్లీలో పంచశీల ఆశ్రమంలో జరగబోయే 41 వ జాతీయ అంతర్జాతీయ సదస్సులో డిసెంబర్ 12న జాతీయ అంతర్జాతీయ ప్రముఖులచే ఈ అవార్డును అందిస్తున్నట్లు డాక్టర్ జితేందర్ మను తెలిపారు. పుల్ల ప్రతాప్ మాట్లాడుతూ నేను చేస్తున్న నా సేవలను గుర్తించి అంబేద్కర్ ఫెలోషిప్ జాతీయ అవార్డుకు ఎంపిక చేసినందుకు కాకతీయ దళిత సాహిత్య అకాడమీ తెలంగాణ రాష్ట్ర ఆధ్యక్షులు డాక్టర్ జితేందర్ మను కు అలాగే నాకు సహకరించిన అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు దొడ్డి కిష్టయ్య, దబ్బెట రమేష్ జిల్లా అధ్యక్షులు పుల్ల ప్రేమ్ సాగర్ మండల అధ్యక్షులు అధ్యక్షులు జన్నే యుగేందర్ మాజీ అధ్యక్షులు బొడ్డు ప్రభాకర్ సరిగొమ్ముల రాజేందర్ మండల నాయకులు గుర్రపు రాజమౌళి గురుకుంట్ల కిరణ్ గుర్రపు రాజేందర్, కట్కూరి శ్రీనివాస్, కట్కూరి రమేష్ గుర్రపు తిరుపతి ల కు ప్రత్యేకంగా కృతజ్ఞతలుతెలియజేశారు.

బుద్దుడి చూపిన అంబేద్కర్ ఆశయాలను నేటి యువత సాధించాలి….

బుద్దుడి చూపిన అంబేద్కర్ ఆశయాలను నేటి యువత సాధించాలి.

చిట్యాల, నేటి ధాత్రి:

 

చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జన్నె యుగేందర్ ఆద్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ రచయిత ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు భౌద్ధమతం స్వీకరించిన రోజును పురస్కరించుకుని ముందుగా గౌతమ బుద్ధుడి చిత్రపటానికి పూలు వేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య* విచ్చేసి మాట్లాడుతూ .. ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు హిందువుగా పుట్టి హిందువుగా మరణించనని భారత దేశంలో ఉన్న అన్ని మతాల గురించి తెలుసుకొని చివరకు గౌతమ బుద్ధుడి బోధనలు సూక్తులు సిద్ధాంతాలు నచ్చి బౌద్ధమతాన్ని 14 ఆక్టోబర్ 1956న 5లక్షల మందితో మహారాష్ట్రలోని నాగపూర్ లో బౌద్ధ మతాన్ని స్వీకరించాడని తెలిపారు. నేటితో ఆది 69 సంవత్సరాలు అన్నారు . ఈ ఆధునిక ప్రపంచానికి సరిపోయేది భౌద్ధ మతమే అని , ఈ ప్రపంచాన్ని రక్షించ గల శక్తి ఓక భౌద్ధ మతానికి మాత్రమె ఆన్నారు. మానవతా విలువల వైపు నడిపించేధి భౌద్ధం మాత్రమే అని బోధిసత్వ డా బి ఆర్ అంబేద్కర్ గారు తెలిపారని అని చెప్పారు. ఈ ప్రపంచంలో గౌతమా బుద్ధుడు పుట్టిన తర్వాత మానవ పరివర్తన కోసం మొట్ట మొదటి సారిగా ప్రెమ దయ జాలి ఆకరుణ దానం శీలం ప్రజ్ఞ సమత వంటి గొప్ప సిద్ధాంతమే కాక మైత్రి ధ్యానం మానవ కళ్యాణం కోసం త్రిచరణములను పంచ శిలాలను ఆస్టాంగా మార్గాలను 11 పారమిధులను 24 మానవ జీవన సూత్రాలను మనషి పకృతి జీవనాధారంలో బుధుడు కనుక్కొని ఇతరులకు వర్తించే విధంగా శ్వాసపైనా ధ్యాస మనసు శరీరానికి ఉన్న సమతా భావాలు సామాజిక శాస్త్ర విజ్ఞానము జ్ఞానంతో. భారత దేశం దేశంలో బుధుడు 45 సంవత్సరాల పాటు కాలి నడకన ప్రయాణిస్తూ తాను దమ్మ జ్ఞానాన్ని ప్రజలకు బోధించాడని అన్నారు. బుధుడు చూపిన మార్గంలో నడుస్తూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించుటకు నేటి యువతీ యువకులు ముందుకు రావాలన్నారు*
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు గడ్డం సదానందం కట్కూరి మొగిలి చందర్ మొగిలి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version