మొగుళ్ళపల్లి మండలంలో ఉచిత వైద్య శిబిరాలు

ఉచిత వైద్య శిబిరం.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మొగుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ములకలపల్లి, రంగాపూర్ ,ఇప్పలపల్లి గ్రామాలలో మొగుళ్ల పెళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఇప్పలపల్లిలో డాక్టర్ సరళ ,రంగాపూర్ లో డాక్టర్ వాణి క్యాంపు నిర్వహించినారు .ఈ సందర్భంగా డాక్టర్ నాగరాణి మాట్లాడుతూ వర్షాలు అధికంగా పడటం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ,కాచి చల్లార్చిన నీరు తాగాలని ,వేడివేడి ఆహార పదార్థాలు తినాలని ,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు కుట్టకుండా పుట్టకుండా చూసుకోవాలని, దోమలు కుట్టడం వల్ల మలేరియా ,చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ,జ్వరాలు ఉన్నట్లయితే మా వైద్య సిబ్బంది తెలియజేయాలని తెలిపారు ములకలపల్లి లో 71 మందికి రంగాపూర్ లో 66, ఇప్పలపల్లిలో 56, మందికి వైద్య పరీక్షలు చేసి 5 రక్తనాళాలు తీసి ల్యాబ్ కు పంపినారు .ఈ కార్యక్రమంలో కమిటీ హెల్త్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్, హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి ,ఏఎన్ఎమ్స్ శ్రీలత ,భారతి, సువర్ణ ,సబిదా ఆశా కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

మళ్లీ నోరు పారేసుకున్న రాజేంద్ర ప్రసాద్..

 

మళ్లీ నోరు పారేసుకున్న రాజేంద్ర ప్రసాద్..

నట కిరీటిగా పేరుగాంచిన రాజేంద్ర ప్రసాద్.. వయసు మీద పడ్డాక విమర్శలు ఎదుర్కొంటున్నారు. పలు సినిమా ఈవెంట్స్లో మాటలు నోరు జారి అనవసరంగా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణా రెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో నోరు పారేసుకున్న వీడియోలు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే లం*కొడుక అలీ అంటున్న వీడియోతో బూతులు తిట్టించుకున్న రాజేంద్ర ప్రసాద్.. ఇదే ఫంక్షన్లో హీరోయిన్ రవళిని బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడిన మాటలపై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. పెద్ద గుండ్రాయిలాగా ఉందంటూ రవళిని స్టేజ్పైనే అవమానించాడు. సరదాగా అన్నానంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఇలాంటివి అసలు క్షమించొద్దంటున్నారు నెటిజన్లు. అసలు సిగ్గుందా ఆయనకు.. ఫంక్షన్స్కు ఎందుకు పిలుస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version