పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత…

పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత

 

జగన్ హయాంలో ప్రజా సమస్యలను పరిష్కరించకుండా గాలికొదిలేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లోగా డబ్బులు జమ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anita) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి పోయిన తర్వాత ఏపీలో జగన్ ఎన్ని రోజులు ఉన్నారో చెప్పాలని అన్నారు. ఆయన తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని సవాల్ విసిరారు. ఇవాళ(గురువారం) విజయనగరంలో హోంమంత్రి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు హోంమంత్రి అనిత.
జగన్ హయాంలో ప్రజా సమస్యలను పరిష్కరించకుండా గాలికొదిలేశారని మండిపడ్డారు. ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లోగా డబ్బులు జమ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు. టిడ్కో ఇళ్లు పేదలకు అందకుండా చేసిన పాపం జగన్‌దని.. లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని తెలిపారు. ఆయుధాలు విడిచిపెట్టి మావోయిస్టులను లొంగిపొవాలని కోరుతున్నామని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోలేమని… ఆపదలో ఉన్న వారిని సకాలంలో ఆదుకుంటామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

అంతా రాజకీయాల కోసమే.. పరకామణి కేసుపై జగన్ కీలక వ్యాఖ్యలు…

అంతా రాజకీయాల కోసమే.. పరకామణి కేసుపై జగన్ కీలక వ్యాఖ్యలు

 

పరకామణి వివాదం ఆశ్చర్యం కలిగించే కేసు అని మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో పారదర్శక వ్యవస్థ సృష్టిస్తే తమపై నిందలా అంటూ మండిపడ్డారు.

 పరకామణి వివాదం ఆశ్చర్యం కలిగించే కేసు అని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పరకామణి కేసులో దొరికింది 9 డాలర్లు అని.. ప్రాయశ్చిత్తంగా రూ.14 కోట్ల ఆస్తులను టీటీడీకి ఇచ్చారని తెలిపారు. దొంగ దొరకగానే కేసు నమోదైందని.. తిరుపతి కోర్టులో చార్జ్‌షీట్ వేశారని తెలిపారు. మెగా లోక్ అదాలత్‌లో కేసును పరిష్కరించారని అన్నారు. జ్యుడిషియల్ విచారణ జరిగాక.. మళ్లీ కేసును తెరపైకి తెచ్చారని మండిపడ్డారు.

సేవ్ ఆంధ్రప్రదేశ్ అనేలా రాష్ట్రంలో పాలన ఉందని ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో వ్యవసాయాన్ని పండగ చేశామని.. పండగలా ఉన్న వ్యవసాయాన్ని దండగలా ఈ ప్రభుత్వం మార్చిందని మండిపడ్డారు. 19 నెలల చంద్రబాబు పాలనలో 17 సార్లు ప్రకృతి వైఫరిత్యాలు వచ్చాయన్నారు. తుఫానుతో నష్టపోయిన రైతులకు ఒక్క పైసా రాలేదని అన్నారు. తుఫాను కంటే ముందే కొనాల్సిన పంటల కొనుగోలు చేయలేదని ఫైరయ్యారు. రూ.1,100 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు ఇవ్వలేదని ఆరోపించారు.రైతులకు హక్కుగా ఉన్న పంట బీమా పథకాన్ని రద్దు చేశారని.. కేజీ అరటిపండ్లు అర్ధ రూపాయంటే రైతులు ఎలా బతకాలని ప్రశ్నించారు. తమ హయాంలో అరటి, చీని రైతుల కోసం ప్రత్యేక రైళ్లు నడిపామని.. ఏపీ నుంచి ఢిల్లీ, ముంబైకి రైళ్లలో 3లక్షల టన్నులు ఎక్స్‌పోర్ట్ చేశామని చెప్పుకొచ్చారు. రైతులకు ఏ పంటకూ మద్దతు ధర వచ్చే పరిస్థితి లేదన్నారు. తమ హయాంలో ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజీలను మూసేశారని.. ఈక్రాప్ వ్యవస్థను చంద్రబాబు భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు.

 తొమ్మిది రోజుల తర్వాత పరామర్శలా…

 తొమ్మిది రోజుల తర్వాత పరామర్శలా… జగన్‌పై కొల్లు రవీంద్ర సీరియస్

 

జగన్ మాట్లాడిన మాటల్లో ఒక్క నిజం కూడా లేదని… కేవలం ప్రభుత్వం మీద బురదజల్లేందుకే జగన్ ప్రయత్నించారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. జగన్ దిగిన పొలాల్లో ఎక్కడా కూడా వర్షపు నీరు నిలిచిలేదని అన్నారు.

కృష్ణా జిల్లా, నవంబర్ 5: మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) కృష్ణా జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పర్యటనలో ఎక్కడా కూడా రైతులు కనిపించలేదన్నారు. తాను పర్యటిస్తున్న ప్రాంతాల్లో రైతులు లేక పక్క గ్రామాల నుంచి రైతులను తెప్పించుకుని జగన్ పబ్లిసిటీ స్టంట్లు చేశారని విమర్శించారు. పొలం గట్ల మీద నడిచి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారని కామెంట్స్ చేశారు. తుఫాను తీరం దాటిన తొమ్మిది రోజుల తర్వాత పరామర్శ పేరుతో జగన్‌ రాజకీయ డ్రామా సృష్టించారని వ్యాఖ్యలు చేశారు. జగన్ పర్యటన ఆద్యంతం పచ్చి అబద్ధాలతో సాగిందని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వానికి భయపడి ప్యాలెస్‌కే జగన్ పరిమితం..

కూటమి ప్రభుత్వానికి భయపడి ప్యాలెస్‌కే జగన్ పరిమితం..

ప్యాలెస్‌లో కూర్చొని కలలు కంటూ ఉండటమే జగన్‌కి తెలుసు అని ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఇప్పటికే వైసీపీకి తగిన గుణపాఠం రాష్ట్ర ప్రజలు చెప్పారని గుర్తుచేశారు. జగన్‌కి మానసిక పరిస్థితి బాలేదని మంత్రి సత్య కుమార్ యాదవ్ విమర్శించారు.

 వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై, వైసీపీ డిజిటల్ బుక్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ (Minister Satya Kumar Yadav) షాకింగ్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వానికి భయపడి ప్యాలెస్‌కే జగన్ పరిమితమయ్యారని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం సంబంధం లేకుండా రాజకీయ లబ్ధి కోసమే దండయాత్ర చేయడం జగన్ నైజమని ఫైర్ అయ్యారు. ఇవాళ(ఆదివారం) అనంతపురంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మంత్రి సత్య కుమార్.
ప్రజలపై దాడులు చేయడం తలకాయలు నరకడం, తలకాయలు తొక్కించటం, రప్ప రప్ప అనటం.. ఇలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడటమే జగన్ వ్యక్తిత్వమని ధ్వజమెత్తారు. విష సంస్కృతిని అలవరుచుకున్న పార్టీ వైసీపీ అని ఆక్షేపించారు. వైసీపీ నేతలు బెదిరిస్తే ప్రజలు భయపడే వారు ఎవరూ లేరని హెచ్చరించారు. ప్రజలు ఓట్లు వేయలేదు కాబట్టే అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తాం అంటూ బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదని ఎద్దేవా చేశారు మంత్రి సత్య కుమార్.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version