రిజర్వేషన్లు 42% లేకుంటే యుద్ధమే…

రిజర్వేషన్లు 42% లేకుంటే యుద్ధమే

మందమర్రి నేటి ధాత్రి

 

42శాతం రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలునిర్వహిస్తే ప్రభుత్వం పై యుద్దమే…

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ *బిల్లు సత్వరమే ప్రవేశపెట్టాలి….

ఈరోజు మందమర్రి పట్టణంలో సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో నరెడ్ల శ్రీనివాస్ బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు అన్నారు. వివిధ బీసీ కుల సంఘాలతో మాట్లాడి బీసీలకు న్యాయం గా రావాల్సిన హక్కుల గూర్చి చర్చించడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ బిల్లు రాజ్యాంగ సవరణ కోసం పార్లమెంట్లో ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ చేసి 42% రిజర్వేషన్ల కు రాజ్యాంగం బద్దంగా చేయాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ. నరెడ్ల ‌శ్రీనివాస మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 130 సార్లు రాజ్యాంగ సవరణలు చేశారు అలాగే ఏ ఉద్యమం లేకుండానే అగ్రకులాలకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 103ను ఐదు రోజుల్లో సవరణ చేసి 10% ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు కల్పించిన కేంద్ర ప్రభుత్వం 40 సంవత్సరాలుగా బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాలు చేస్తున్న బీసీలకు ప్రజాస్వామ్య వాటా ఇవ్వకపోవడం బాధాకరం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్ ను గుర్తించి 42 శాతం రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ చేసి కేంద్ర ప్రభుత్వం బీసీల పక్షాన నిలబడాలని కోరుకుంటున్నాం లేనిపక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నా మన్నారు.
ఈ కార్యక్రమంలో కార్మిక నాయకుడు సేలంద్ర సత్యనారాయణ
మైనార్టీ నాయకులు ఎండి ఎండి అబ్బాస్
సగర సంగం జిల్లా అధ్యక్షులు బర్ల సదానందం‌‌ పద్మశాలి సంఘ జిల్లా అధ్యక్షుడు చిలగాని సుదర్శన్ ‌మరియు నాయకులు
ఒజ్జా సాగర్ బాబు దూడపాక రాజేందర్
శనిగారపు జనార్ధన్ బిసి సమాజ్ నాయకులు వెన్నంపల్లి రవీందర్ అంకం సాగర్
శీలం మహేందర్
డాక్టర్ పోషం
కంది తిరుపతి
నస్పూరి తిరుపతి
పిల్లి మల్లేష్
బర్ల శేఖర్
శేఖర్ సార్ బీసీ కుల సంఘాల నాయకులు స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version