మంత్రి పొంగులేటి ఫై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం
వ్యక్తిగత విమర్శలు కాదు ప్రజాస్వామాలపై మాట్లాడండి
దళిత నాయకుడు కడియం శ్రీహరి అనుచిత వ్యాఖ్యలు అసహ్యం
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరపగూడెం మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు ప్రజానాయకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ సమావేశం నిర్వహించిన కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాసేవకు అంకితమైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ దౌర్భాగ్యం అన్నారు ప్రజా ప్రతినిధులను రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం నీచ రాజకీయాలను నిదర్శనం అని మండిపడ్డారు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవాల్సిన ప్రతిక్షణం చట్టసభల్లో విమర్శలకు దిగడం సిగ్గుచేటు చర్య అని విమర్శించారు అదేవిధంగా దళిత సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు వెంకటపురం సర్పంచ్ కేశవరావు, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల నాయకులు, ఏరా సురేష్, గోగ్గలి రవి, భూక్యరాందాస్, షేక్ రఫీ, కొమరం వెంకటేశ్వర్లు, వార్డు మెంబర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
