మోకిలా తాండ గ్రామ సర్పంచ్గా వర్త్య శాంతమ్మ రీజాయినింగ్

మోకిలా తాండ గ్రామ సర్పంచ్గా వర్త్య శాంతమ్మ రీజాయినింగ్

బాధ్యతలు అప్పగించాలంటూ అధికారులకు కోర్టు ఉత్తర్వులు

బూటకపు ఆరోపణలతో సస్పెండ్ చేయించారు : శాంతమ్మ

శంకరపల్లి, నేటిధాత్రి:

ఆరోపణలతో అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేదని మరోసారి రుజువైందంటూ మోకిలా తాండ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఓటమిని జీర్ణించుకోలేని కొంతమంది చేసిన పనులకు తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు వేసింది. తిరిగి వర్య శాంతమ్మను పదవిలో కొనసాగాలని కోర్టు జిల్లా కలెక్టర్కు ఉత్తర్వులు జారీ చేసింది. నిజ నిజాలు ప్రజలు గ్రహిస్తూనే ఉంటారని, బెదిరింపులు అసత్య ఆరోపణలతో ఏం చేయలేరని గ్రామస్తులు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల తండా గ్రామపంచాయతీ సర్పంచ్గా వర్త్య శాంతమ్మను తిరిగి పదవిలో కొనసాగాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వాస్తులకు నష్టం కలిగించడం, పంచాయతీ స్థలంలో మొక్కలను ధ్వంసం చేయడం వంటి ఆరోపణలతో సస్పెండ్ కాబడిన శాంతమ్మ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు పెండింగ్ విచారణ కొనసాగుతున్నప్పటికీ ఆమెను సర్పంచిగా బాధ్యతలు స్వీకరించాలని వెంటనే ఉపసర్పంచ్ నుంచి శాంతమ్మ సర్పంచ్ బాధ్యతలను తీసుకోవాలని కోర్టు సూచించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని జిల్లా, మండల, గ్రామ అధికారులకు కోర్టు సూచించింది. ఈ సందర్భంగా శాంతమ్మ మాట్లాడుతూ నిజం ఎప్పటికైనా గెలుస్తుందని ఎల్లప్పుడూ తనను గెలిపించిన ప్రజల కోసం సేవ చేసేందుకు ముంటానన్నారు. గ్రామ ప్రజల తీర్పుతో గెలిచామని, వారి అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతానన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version