కబ్జాకు గురవుతున్న డిబిఎం 38 కెనాల్ భూమి..

కబ్జాకు గురవుతున్న డిబిఎం 38 కెనాల్ భూమి.

#చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు.

#భూమి ఆక్రమించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంబడి ఉన్న డిబిఎం 38 కెనాల్ భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకతీయ కెనాల్ ఇరువైపుల ఎడమవైపు 120 మీటర్లు, కుడి వైపు 100 లీటర్లు వదిలివేసి నిర్మాణాలు చేసుకోవాలని గతంలో సంబంధిత అధికారులు సూచించారు. గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మండల నాయకులు ఇష్ట రాజ్యాంగ కెనాల్ భూమిని ఆక్రమించుకొని అమాయకులకు అధిక రేటులకు అమ్ముకోవడం జరిగింది. నిర్మాణాలు చేపట్టే క్రమంలో అధికారులు నిబంధనలకు మించి ఇండ్ల నిర్మాణాలు చేపడితే తక్షణమే తొలగించబడతాయని హెచ్చరించిన కూడా కొందరు భూమి కొనుగోలు చేశారని . పూర్తిగా విషయం తెలుసుకున్న తర్వాత కొనుగోలు దారులు లబోదిబోమంటూ భూమి అమ్మిన నాయకులను ఆశ్రయించగా మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు మేము చూసుకుంటామని భరోసా ఇవ్వడంతో నిర్మాణాలు ఇష్ట రాజ్యాంగ చేస్తున్నారు. నల్లబెల్లి మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని కబ్జాకు గురవుతున్న భూమిని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

భూ కబ్జా కోరల్లో ప్రభుత్వ భూములు..

 

భూ కబ్జా కోరల్లో ప్రభుత్వ భూములు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో. భూ కబ్జాదారులు రాత్రికి రాత్రి చెట్లు నాటుతూ పనులు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మండపల్లి గ్రామస్తుల కథనం ప్రకారం. మండపల్లి గ్రామంలోని సర్వే నెంబర్లు. 337. నంబర్లో 360 ఎకరాల. ప్రభుత్వ భూమి ఉన్నది. దీనిపై కన్నేసిన భూకబ్జాదారులు రాత్రిపూట దున్నటం భూమిలో రాత్రికి రాత్రి చెట్లు నాటడంతో గ్రామంలోని గ్రామస్తులు శనివారం రోజున రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా ఆర్ ఐ. దినేష్. జిపిఓ. రెవెన్యూ సిబ్బంది శనివారం రోజున. మండే పల్లి గ్రామానికి వెళ్లి భూములను పరిశీలించారు. గ్రామస్తులు అభిప్రాయం ప్రకారం భూమి రెవెన్యూకి చెందాలి లేకుంటే గ్రామ అభివృద్ధికి చెందాలి. అని అధికారులకు వివరిస్తూ భూమికి సంబంధించిన పత్రాలు ఉంటే రాత్రిపూట దున్నించడఏమిటి అని రాత్రిపూట చెట్లు పెట్టించడం ఏమిటని ఆరోపించారు ఇప్పటికే . గ్రామంలో భూమిని భూకబ్జాదారుల. ఆక్రమణకు గురవడంతో. గ్రామంలోని గ్రామపంచాయతీకి గాని పశువులు మేకలుమేయడానికి గాని. ఉపయోగించడానికి. వీలుగా ఉండేలా చర్యలు తీసుకుంటూ. గ్రామంలో పిల్లలను విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు లో క్రీడా ప్రాంగణానికి ఉపయోగపడేలా సంబంధిత అధికారులు రెవెన్యూ సిబ్బంది భూకబ్జాదారులపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ భూములను కాపాడి ప్రతి గ్రామంలో ప్రజలకు మేలు కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామంలో రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version