తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండిస్తున్నాం…

తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

ఎండి.జాఫర్ రిజ్వి కాంగ్రెస్ సీనియర్ నాయకులు

పరకాల,నేటిధాత్రి

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజనను భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చిన కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎండీ రిజ్వి జాఫర్ తీవ్రంగా ఖండించారు.ఆయన మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దీర్ఘకాల ప్రజా ఉద్యమం,త్యాగాలు కారణమనిగుర్తుచేశారు.అలాంటి చారిత్రక ప్రక్రియను దేశ విభజనతో పోల్చడం సరైంది కాదని స్పష్టం చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఇలాంటి వ్యాఖ్యలపై స్పందించకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.ప్రజల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని,అలాంటి సందర్భాల్లో మౌనం అనర్హమని పేర్కొన్నారు.తెలుగు రాష్ట్రాల గౌరవాన్ని కాపాడే బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందని పేర్కొన్న ఆయన, బీజేపీ నాయకత్వం ఈ అంశంపై స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేశారు

అసత్య ఆరోపణలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్న బిఆర్ ఎస్ పార్టీ…

అసత్య ఆరోపణలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్న బిఆర్ ఎస్ పార్టీ

సిరిగిరి సురేష్
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్

కొత్తగూడ,నేటిధాత్రి:

గత కొన్ని రోజులుగా ప్రభుత్వంపై, ముఖ్యంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మహాత్యులు ధనసరి అనసూయ సీతక్క గారి పై వస్తున్న అవినీతి ఆరోపణలు కేవలం రాజకీయ ఉద్దేశంతో కూడుకున్నవని
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్ కొట్టిపారేశారు. పారదర్శకమైన పాలన అందిస్తుంటే, ఓర్వలేక ప్రతిపక్షాలు మరియు బిఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం నాయకులు స్వార్థ ప్రయోజన శక్తులు పనిగట్టుకొని మంత్రి సీతక్క పై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని వారు మండిపడ్డారు.
వాస్తవాలు ఇవే..నిరాధారమైన ఆరోపణలు: ఏ ఒక్క ఆధారమూ లేకుండా కేవలం మాటలతో నైతిక ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది.పారదర్శక టెండర్లు ప్రభుత్వంలో ప్రతి పైసా ఖర్చు డిజిటల్ రూపంలో, పారదర్శకమైన టెండర్ల ప్రక్రియ ద్వారానే జరుగుతోంది. ఇందులో అవినీతికి తావులేదు.ప్రజల మద్దతు క్షేత్రస్థాయిలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరుతున్నాయి. ఈ విజయాలను చూసి భయపడే ఇలాంటి తప్పుడు కథనాలుసృష్టిస్తున్నారు.చట్టపరమైన చర్యలు తప్పవు ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, మంత్రి సీతక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం
అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే శక్తులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.మేము చేసే ప్రతి పని ప్రజల సాక్షిగా, చట్టబద్ధంగానే జరుగుతోంది. ఇలాంటి గాలి వార్తలను ప్రజలు ఎవర నమ్మరని బిఆర్ ఎస్ పార్టీ నాయకులు ఇకనైనా బుద్ది మర్చికొని అభివృద్ధి లో భాగం కావాలని లేని యెడల ప్రజలే వచ్చే ఎన్నికలో తగిన బుద్ది చెప్తారని ఆయన హెచ్చరించారు…..

మళ్లీ టిఆర్‌ఎస్‌గా..! కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు…

మళ్లీ టిఆర్‌ఎస్‌గా..! కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

మంచిర్యాల,నేటి ధాత్రి:

బీఆర్‌ఎస్‌ను మళ్లీ టిఆర్‌ఎస్‌గా మార్పు గురించి పరిశీలిస్తామని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మీడియాతో ఆయన చిట్‌చాట్‌ నిర్వహించారు.తమకు పొత్తులతో కలిసిరాదని,అటువంటివి కుదరవని వ్యాఖ్యానించారు. గతంలో తాము కూడా కొన్ని తప్పులు చేశామని,లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు.అన్ని పథకాల్లో కాంగ్రెస్‌ విఫలమైందని విమర్శించారు. ఈసారి తామే అధికారంలోకి వస్తామని,కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

ప్రధాని కలలు కంటున్నారు, రెండు చోట్లా గెలుపు మాదే: మల్లికార్జున్ ఖర్గే…

ప్రధాని కలలు కంటున్నారు, రెండు చోట్లా గెలుపు మాదే: మల్లికార్జున్ ఖర్గే

తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఎన్నికల్లో తమ విజయావకాశాలు చాలా బాగున్నాయని చెప్పారు.

పుదుచ్చేరి: తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. ఎన్నికల్లో తమ విజయావకాశాలు చాలా బాగున్నాయని చెప్పారు. శనివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రజలు డీఎంకే, కాంగ్రెస్‌తో ఉన్నారని, బీజేపీతో కాదని అన్నారు.

 

అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్

కుట్టు దహీ భల్లా.. దీని రుచే వేరుగా..

బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చను: ఈటల

జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారు: మంత్రి కొలుసు పార్థ

డయాబెటిస్ ఉందా? ఇదిగో సూపర్ డైట్ ప్లాన్..

బాదం పూరీ.. ఇలా తయారు చేస్తే.. ఇక మీరు..

ప్రాణం తీసిన చేప.. యువకుడు నోటిలో పెట్టుకోగానే..

మైదాపిండికి ప్రత్యామ్నాయం

షాకింగ్ వీడియో.. రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగు

చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్.. రెండో పైలట్‌‌ను రక్ష

ఆఫర్లున్నా కదలరు…ఉద్యోగం వదలరు!

స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌ తెరవడంపై రేపటితో ముగియనున్న డెడ్ లైన్

పిచ్చి కుక్క బీభత్సం.. 15 సెకన్లలో నలుగురిని కొరికేసింది..

అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్

కుట్టు దహీ భల్లా.. దీని రుచే వేరుగా..

బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చను: ఈటల

జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారు: మంత్రి కొలుసు పార్థ

డయాబెటిస్ ఉందా? ఇదిగో సూపర్ డైట్ ప్లాన్..

బాదం పూరీ.. ఇలా తయారు చేస్తే.. ఇక మీరు..

ప్రాణం తీసిన చేప.. యువకుడు నోటిలో పెట్టుకోగానే..

మైదాపిండికి ప్రత్యామ్నాయం

షాకింగ్ వీడియో.. రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగు

చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్.. రెండో పైలట్‌‌ను రక్ష

ఆఫర్లున్నా కదలరు…ఉద్యోగం వదలరు!

స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌ తెరవడంపై రేపటితో ముగియనున్న డెడ్ లైన్

పిచ్చి కుక్క బీభత్సం.. 15 సెకన్లలో నలుగురిని కొరికేసింది.

‘కాంగ్రెస్, డీఎంకే కూటమి పాండిచ్చేరిలో గెలుపు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్‌దే ఎప్పుడూ విజయం. మా రికార్డు చాలా బాగుంది. ప్రధానమంత్రి కలలు కంటున్నారు. మేము మాత్రం కలగనడం లేదు. ప్రజలు మాతో ఉన్నారు, ప్రధాని మోదీతో కాదు. ఎన్నికల్లో మాకు విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి’ అని ఖర్గే చెప్పారు. దీనికి ముందు ఆయన పాండిచ్చేరిలో జరిగిన ప్రచార సభలో పాల్గొన్నారు.

పుదుచ్చేరిని లూటీ చేసిన కూటమి ప్రభుత్వం

పుదుచ్చేరిలోని అధికార ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్‌ఆర్‌సీ), భాగస్వామ్య పార్టీ బీజేపీ కలిసి పుదుచ్చేరిని లూటీ చేసిందని ఖర్గే ఆరోపించారు. పుదుచ్చేరికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘పుదుచ్చేరికి పూర్తి స్థాయిు హోదా ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వ ప్రక్రియలో లెప్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారు. పుదుచ్చేరిలో 30 శాతం కమిషన్ వ్యవహారం నడుస్తోంది. ఎన్ఆర్, బీజేపీ కలిసి పుదుచ్చేరిని లూటీ చేస్తున్నారు. అన్నిచోట్లా అవీనీతి జరుగుతోంది. అవినీతి అస్సలు లేదని మోదీ చెబుతున్నారే కానీ ప్రతీదీ లూటీ చేసి అదానీకి కట్టబెడుతున్నారు’ అని ఖర్గే విమర్శించారు. పుదుచ్చేరిలో ఎన్‌ఆర్ బీజేపీ ప్రభుత్వం 450 లిక్కర్ షాపులు తెరవడాన్ని, డ్రగ్స్ కేసులు పెరగడాన్ని ఆయన ప్రశ్నించారు.

గత ఎన్నికల్లో..

పుదుచ్చేరిలో జరిగిన 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎన్ఆర్‌సీ 10 సీట్లు గెలుచుకుని ఏకైక పెద్దపార్టీగా నిలిచింది. డీఎంకే 6 సీట్లు గెలుచుకుంది. బీజేపీ, కాంగ్రెస్ చెరో 6 సీట్లు దక్కించుకున్నాయి. 84.8 శాతం పోలింగ్ జరిగింది. దీనికి ముందు 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ 15 సీట్లతో మెజారిటీ సాధించగా, ఏఐఎన్ఆర్‌సీ 8 సీట్లు, అన్నాడీఎంకే 4 సీట్లు, డీఎంకే 2 సీట్లు గెలుచుకున్నాయి. 83.6 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, 2026 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 9న జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి. పుదుచ్చేరి ప్రస్తుతం అసెంబ్లీ గడువు జూన్ 15వ తేదీతో ముగియనుంది.

మంత్రి పొంగులేటి ఫై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం…

మంత్రి పొంగులేటి ఫై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం

వ్యక్తిగత విమర్శలు కాదు ప్రజాస్వామాలపై మాట్లాడండి

దళిత నాయకుడు కడియం శ్రీహరి అనుచిత వ్యాఖ్యలు అసహ్యం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి..

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరపగూడెం మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు ప్రజానాయకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ సమావేశం నిర్వహించిన కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాసేవకు అంకితమైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ దౌర్భాగ్యం అన్నారు ప్రజా ప్రతినిధులను రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం నీచ రాజకీయాలను నిదర్శనం అని మండిపడ్డారు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవాల్సిన ప్రతిక్షణం చట్టసభల్లో విమర్శలకు దిగడం సిగ్గుచేటు చర్య అని విమర్శించారు అదేవిధంగా దళిత సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు వెంకటపురం సర్పంచ్ కేశవరావు, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల నాయకులు, ఏరా సురేష్, గోగ్గలి రవి, భూక్యరాందాస్, షేక్ రఫీ, కొమరం వెంకటేశ్వర్లు, వార్డు మెంబర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

స్టాలిన్‌ సార్‌కు ఇవే చివరి ఎన్నికలు…

స్టాలిన్‌ సార్‌కు ఇవే చివరి ఎన్నికలు

 

డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఇవే చివరి ఎన్నికలని, ఆయన్ని ఇంటికి సాగనంపాలని ప్రజలు నిర్ణయించారని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ పేర్కొన్నారు.

ప్రచారంలో విజయ్‌

 

LATEST

ప్రబలిన డయేరియా.. వారం రోజులు మాంసం విక్రయాలపై నిషేధం

స్టాలిన్‌ సార్‌కు ఇవే చివరి ఎన్నికలు

అదృష్టం కోసం ఏ కలర్ బ్యాగ్ లేదా పర్సు వాడాలో తెలుసా?

పొట్ట ఉంటేనే పట్టం.. ఇథియోపియా అమ్మాయిలకు బొజ్జ ఉన్నవాళ్లే ఇ

షాకింగ్ వీడియో.. పారాసైలింగ్ చేస్తుండగా గాల్లోనే ఏం జరిగిందో

హైదరాబాద్‌లోని జయలలిత నివాసం సీజ్

ప్రేమ వివాహం.. విషాదాంతం

రేపటి నుంచే మార్పులు.. మీ పాకెట్ పై ప్రభావం చూపించే అంశాలు!

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం..

TVK పార్టీ అధ్యక్షుడు విజయ్‌పై కేసు నమోదు

అదే మా ఓటమికి కారణం.. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్

బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి..

నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్‌ ట్రైన్.. నిలిచిన రా

ప్రబలిన డయేరియా.. వారం రోజులు మాంసం విక్రయాలపై నిషేధం

స్టాలిన్‌ సార్‌కు ఇవే చివరి ఎన్నికలు

అదృష్టం కోసం ఏ కలర్ బ్యాగ్ లేదా పర్సు వాడాలో తెలుసా?

పొట్ట ఉంటేనే పట్టం.. ఇథియోపియా అమ్మాయిలకు బొజ్జ ఉన్నవాళ్లే ఇ

షాకింగ్ వీడియో.. పారాసైలింగ్ చేస్తుండగా గాల్లోనే ఏం జరిగిందో

హైదరాబాద్‌లోని జయలలిత నివాసం సీజ్

ప్రేమ వివాహం.. విషాదాంతం

రేపటి నుంచే మార్పులు.. మీ పాకెట్ పై ప్రభావం చూపించే అంశాలు!

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం..

TVK పార్టీ అధ్యక్షుడు విజయ్‌పై కేసు నమోదు

అదే మా ఓటమికి కారణం.. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్

బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి..

నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్‌ ట్రైన్.. నిలిచిన రా

చెన్నై: డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఇవే చివరి ఎన్నికలని, ఆయన్ని ఇంటికి సాగనంపాలని ప్రజలు నిర్ణయించారని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ పేర్కొన్నారు. ఏప్రిల్‌ 23న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, టీవీకే తరుఫున 234 నియోజకవర్గాల్లో ‘విజిల్‌’ గుర్తుపై టీవీకే ఒంటరిగా పోటీచేయనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుచ్చి (ఈస్ట్‌), పెరంబూరు నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు నిర్ణయించిన విజయ్‌ సోమవారం పెరంబూరు నియోజకవర్గంలో పోటీచేసేందుకు వ్యాసర్పాడి ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో రిటర్నింగ్‌ అధికారికి తన నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

ఆయన నామినేషన్‌ పత్రాల్లో సి.జోసెఫ్‌ విజయ్‌ అని ఉండటం గమనార్హం. ఆ తర్వాత ఆయన తన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పెద్దసంఖ్యలో గుమిగూడిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజల మధ్య విజయ్‌ మాట్లాడుతూ.. పెరంబూరు ప్రాంతం తనకు తల్లిలాంటిదని, తనను అభిమానంగా ప్రేమించే వారు నివసిస్తున్న ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం శుభ సూచికమన్నారు. ఉత్తర చెన్నైకి మంచి గుర్తింపు తీసుకొచ్చిన సెయింట్‌ లూర్థు చర్చి, పురాతన ఆలయాలు, మసీదులున్న ఈ ప్రాంతం నుంచే ప్రచారం ప్రారంభించాలని తన మనసుకు తోచిందన్నారు.

జగన్ హయాంలో ఏపీ అభివృద్ధి అస్తవ్యస్తంగా మారింది..

జగన్ హయాంలో ఏపీ అభివృద్ధి అస్తవ్యస్తంగా మారింది.. పరిటాల సునీత ఫైర్

 

ఏపీ వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతం నీళ్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వ్యాఖ్యానించారు. చెరువులు జలకళను సంతరించుకోవడంతో గ్రామస్తులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

 వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత (Paritala Sunitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఏపీ అభివృద్ధి అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. ఇవాళ(ఆదివారం) రాప్తాడు నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని కక్కలపల్లి గ్రామ చెరువుకి జలహారతి ఇచ్చారు పరిటాల సునీత. గ్రామస్తులతో కలిసి చెరువు వద్ద బోనాలతో పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు పరిటాల సునీత.
ఏపీ వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతం నీళ్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతోందని తెలిపారు. చెరువులు జలకళను సంతరించుకోవడంతో గ్రామస్తులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు పాలనతోనే గ్రామాలు సస్యశ్యామలం అవుతున్నాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతోందని పరిటాల సునీత పేర్కొన్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version