మంత్రి పొంగులేటి ఫై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం…

మంత్రి పొంగులేటి ఫై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం

వ్యక్తిగత విమర్శలు కాదు ప్రజాస్వామాలపై మాట్లాడండి

దళిత నాయకుడు కడియం శ్రీహరి అనుచిత వ్యాఖ్యలు అసహ్యం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి..

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరపగూడెం మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు ప్రజానాయకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ సమావేశం నిర్వహించిన కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాసేవకు అంకితమైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ దౌర్భాగ్యం అన్నారు ప్రజా ప్రతినిధులను రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం నీచ రాజకీయాలను నిదర్శనం అని మండిపడ్డారు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవాల్సిన ప్రతిక్షణం చట్టసభల్లో విమర్శలకు దిగడం సిగ్గుచేటు చర్య అని విమర్శించారు అదేవిధంగా దళిత సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు వెంకటపురం సర్పంచ్ కేశవరావు, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల నాయకులు, ఏరా సురేష్, గోగ్గలి రవి, భూక్యరాందాస్, షేక్ రఫీ, కొమరం వెంకటేశ్వర్లు, వార్డు మెంబర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం…

పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం

నూతన భవననిర్మాణానికి శంకుస్థాపన

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

నేటిదాత్రి చర్ల

 

చర్ల మండల కేంద్రంలో ఆదివారం నాడు రాష్ట్ర రెవిన్యూ గృహానిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం నూతన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన చేశారు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు జిల్లా కలెక్టర్ అంకిత్ ఐటీడీఏ పీవో రాహుల్ తో కలిసి మంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సుమారు 10 కోట్ల 70 లక్షల రూపాయల స్టేట్ గవర్నమెంట్ ఫండ్ టీజీఎంసీడీసీ నిధులతో ఈ అత్యాధునిక ఆసుపత్రి భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు
శంకుస్థాపన అనంతరం ఆసుపత్రిలో అంకితభావంతో పనిచేస్తున్న వైద్యులను సిబ్బందిని మంత్రి పొంగులేటి ప్రత్యేకంగా అభినందించారు ఏజెన్సీ ప్రాంత ప్రజలకు వారు అందిస్తున్న నిస్వార్థ సేవలను కొనియాడుతూ వారికి ప్రభుత్వం తరపున ప్రశంసా పత్రాలను అందజేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ చర్ల మండలంలోని మారుమూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు వైద్యులు సిబ్బంది చేస్తున్న కృషి గర్వించదగ్గదని భవిష్యత్తులో ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా నాణ్యమైన చికిత్స అందించాలని మంత్రి ఈ సందర్భంగా వైద్యులకు సూచించారు

జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేసిందని తెలిపారు భవన నిర్మాణ పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఆసుపత్రి అందుబాటులోకి వస్తే మారుమూల గ్రామాల ప్రజలకు మెరుగైన అత్యవసర వైద్య సేవలు స్థానికంగానే లభిస్తాయని ఆయన అన్నారు
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ నూతన భవనం అందుబాటులోకి వస్తే స్థానిక గిరిజనులకు మరియు ప్రజలకు పెద్ద ఊరట లభిస్తుందని ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపారు
ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఓ రవి బాబు స్థానిక సర్పంచ్ పూజారి సామ్రాజ్యం అన్ని శాఖల జిల్లా అధికారులు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version