తిరుపతిలో కల్తీ లడ్డుపై టిడిపి ఆగ్రహం, భక్తులను రక్షించాలి

*తిరుపతిని,దేవుడిని అప పవిత్రం చేయకండి…

*టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం..

తిరుపతి( నేటి ధాత్రి:

తిరుమల ఆధ్యాత్మిక ధర్మక్షేత్రం, హిందువుల మనోభావాలకు, భక్తులకు నిలువెత్తు నిదర్శనం శ్రీ వెంకటేశ్వర స్వామి అని, అటువంటి స్వామిని, టిటిడిని గత ప్రభుత్వ వైసిపి పాలనలో టీటీడీ బోర్డు చైర్మన్,ఈవో, సభ్యులు ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడ్డారని, లడ్డులో నెయ్యి బదులు మోనో లేజర్ లైట్ కెమికల్ రసాయన పదార్థం జంతువుల కొవ్వు నుండి వస్తుందని ఉన్నారు. అటువంటి రసాయనాన్ని లడ్డు కల్తీలో వాడారని, తిరుపతిని, దేవుడిని అప పవిత్రం చేయకుండని శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం అన్నారు. లడ్డు నాణ్యతను, కల్తీ విసయాన్ని కుటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ వేశారన్నారు. భక్తులు కల్తీ లడ్డును తినడం ద్వారా 50% క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఆరోపించారు. భక్తి భావం, సేవ పదాలకు అర్థం తెలియని మూర్ఖులు ఉజ్జయిని, ఇతర రాష్ట్రాల శివాలయాలు తిరిగి, ఇప్పుడు హోమాలు నిర్వహిస్తే చేసిన తప్పులు చెరిగిపోవున్నారు. ఇంకా ఐదేళ్ల పాలన ప్రజలు వైసీపీకి ఇచ్చి ఉంటే వెంకటేశ్వర స్వామి పక్కన జగన్ ఫోటో, లడ్డు కవర్ల పైన జగన్ ఫోటో పెట్టాలని టిటిడి బోర్డు లో తీర్మానం చేసే వాళ్ళని అన్నారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి బుల్లెట్ రమణ, టిడిపి బీసీ సెల్ నాయకులు కృష్ణ యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి మధుబాబు,టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ వెంకట పుష్పావతి యాదవ్, హేమంత్, విశ్వనాథం, నంద, హైమావతి తదితరులు పాల్గొన్నారు..

పథకం ప్రకారమే తిరుమల ప్రతిష్టను దిగజార్చారు: టీటీడీ చైర్మన్…

పథకం ప్రకారమే తిరుమల ప్రతిష్టను దిగజార్చారు: టీటీడీ చైర్మన్

 

కల్తీ నెయ్యి వ్యవహారంలో గత ప్రభుత్వంపై టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమలలో జరిగిన అపచారానికి వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు..

తిరుపతి, జనవరి 30: కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు (TTD Chairman BR Naidu) స్పందించారు. కల్తీ నెయ్యి కేసులో సిట్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని సిగ్గు లేకుండా చెప్పుకొంటున్నారని మండిపడ్డారు. శుక్రవారం టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ… కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. గత పాలకమండలిలో అనేక అవకతవకలు జరిగాయని, నిబంధనలు ఏమాత్రం పాటించలేదని ఆరోపించారు. ఎన్నో అరాచకాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని విరుచుకుపడ్డారు. ఒకరిద్దరికి లాభం చేకూర్చడం కోసం నిబంధనలు మార్చారని తెలిపారు. సామర్థ్యం లేని డెయిరీకి 60 లక్షల కేజీల నెయ్యి కాంట్రాక్ట్‌ ఇచ్చి.. రూ.250 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు.
అది మహాపాపం…

చుక్క పాలు లేకుండానే లక్షల కిలోల నెయ్యి ఎలా వచ్చిందని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ప్రశ్నించారు. ప్రాణాంతకమైన కెమికల్స్‌తో నెయ్యి తయారు చేశారని.. గత పాలకులు చేసింది మహా పాపమని అన్నారు. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారన్నారు. నెయ్యిలో యానిమల్‌ ఫ్యాట్‌ ఉందని ఎన్‌డీడీబీ (NDDB) నివేదిక ఇచ్చిందని.. సిట్‌ నివేదికలో కూడా ఇదే ఉందన్నారు. గత పాలకమండలి చేసిన ఒత్తిళ్లకు సంబంధించిన ఈ-మెయిళ్లు కూడా సిట్‌ నివేదికలో పెట్టారని తెలిపారు. తిరుమలలో జరిగిన అపచారానికి వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అంతా పథకం ప్రకారమే..

వైవీ సుబ్బారెడ్డి దంపతులు సీబీఐకి బ్యాంక్‌ ఖాతాలు ఇచ్చేందుకు నిరాకరించారని.. పథకం ప్రకారమే తిరుమల ప్రతిష్ట దిగజార్చారని టీటీడీ చైర్మన్ మండిపడ్డారు. కల్తీ నెయ్యి అంటే ఒకరకంగా స్లో పాయిజన్ అని చెప్పారు. కాసుల కోసం కక్కుర్తి పడి భోలే బాబా డెయిరీని ఎంచుకున్నారన్నారు. తనిఖీల్లో భోలేబాబా డెయిరీకి ఒక్క ఆవు కూడా లేదని తేల్చారని తెలిపారు. చినప్పన్న ఎవరు?.. వైవీ సుబ్బారెడ్డి పీఏ కాదా? అని నిలదీశారు. అన్య మతస్తులు టీటీడీ ప్రతిష్టను దిగజార్చాలని చూశారని.. వైసీపీ పెద్దల సహకారం లేకుండా ఇదంతా ఎలా చేస్తారని అడిగారు. హిందూ సమాజానికి జగన్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పులు చేసి ఇప్పుడు యాగాలు చేస్తే సరిపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి వచ్చిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version