ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81 వ జయంతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T152429.801-1.wav?_=1

 

ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81 వ జయంతి

గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్
ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో
మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్కూరు శ్రీనివాస్,
మండల అధికార ప్రతినిధి మామిండ్ల మల్లికార్జున గౌడ్,
గ్రామ కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ,
మాజీ సర్పంచ్ నారగని దేవేందర్ గౌడ్, గుర్రం తిరుపతి గౌడ్, గుర్రం సదానందం యువజన నాయకులు దూడపాక పున్నం, సీనియర్ నాయకులు, ఇమ్మడి వెంకటేశ్వర్లు, రామగిరి సంపత్, సుధాకర్ రెడ్డి, ఆలూరి మొగిలయ్య, ఎస్ కే జానీ. మోషే. గణేష్. తదితరులు పాల్గొన్నారు

వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T143106.483-1.wav?_=2

 

వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

పి ఎ సి ఎస్ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొరంచ వెంబడి నీట మునిగిన వరి పొలాలను అంచనవేసి రైతులకు నష్టపరిహారం అందించాలని గణపురం మాజీ సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు.
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి పంట పూర్తిగా దెబ్బతిందని పొలాల్లో ఇసుక దిబ్బలు పెరికపోయాయని, పత్తి పంట నష్టం జరిగిందని పంట నష్టం విషయంలో ప్రభుత్వం స్పందించి వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నష్టం అంచనా వేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు పూర్ణచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రామపంచాయతీలో పాలకవర్గాలు లేక వర్షాల కారణంగా దోమల నివారణలో జాప్యం జరుగుతుందని అధికారులు వెంటనేc స్పందించి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని కోరారు.

ఓసీ త్రీ మట్టిని ఉంచితంగా అందించాలి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-54-2.wav?_=3

ఓసీ త్రీ మట్టిని ఉంచితంగా అందించాలి

బీజేపీ మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు

ఎంపీడీవోకు వినతి పత్రం అందజేత

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఓసీ త్రీ మట్టిని ఉంచితంగా అందించాలి బీజేపీ మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఎల్ భాస్కర్ కు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గణపురం మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో అర్హులైన లబ్దిదారులు ఇండ్లు నిర్మించుకుంటున్నారు. అయితే గృహ నిర్మాణంకు మట్టి తప్పనిసరి అవసరం ఏర్పడుతుంది, కానీ ఆయా గ్రామ పంచాయతీల్లో మట్టి లభ్యత లేకపోవడం, ఉన్న ప్రాంతంలో మట్టి తీసేందుకు ఇరిగేషన్, రెవెన్యూ శాఖ నుండి అనుమతి లేకపోవడంతో ఇంటి నిర్మాణ లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని 17 గ్రామపంచాయితీల్లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి లబ్ధిదారులకు ఆయా గ్రామ పరిధిలో మట్టి లభ్యత లేదనందున సింగరేణి ఓసీ త్రీ మట్టిని సింగరేణి అధికారులతో మాట్లాడి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇప్పించాలని ఎంపీడీవోను కోరారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సోమా దామోదర్, దుగ్గిశెట్టి పున్ పాల్గొన్నారు

కోటగుళ్లలో ఘనంగా నందీశ్వరుని 2వ వార్షికోత్సవం..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T174225.515-1.wav?_=4

 

కోటగుళ్లలో ఘనంగా నందీశ్వరుని 2వ వార్షికోత్సవం

గణపేశ్వరునికి నందీశ్వరుడి కి రుద్రాభిషేకం

స్వామివారికి బిల్వార్చన

శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో శ్రావణమాసం చివరి సోమవారం నందీశ్వరుని రెండవ వార్షికోత్సవాన్ని నేత్రపర్వంగా
నిర్వహించారు.ఉదయం గణపతి పూజతో కార్యక్రమాలను ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు, సాయిబాబా దేవాలయ అర్చకులు వినయ్ లు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. 2023 ఆగస్టు 18 న నిజామాబాద్ సిపి పోతరాజు సాయి చైతన్య కీర్తి దంపతుల ఆధ్వర్యంలో నందీశ్వరుని ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం రెండవ వార్షికోత్సవం కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కన్నుల పండుగ గా నిర్వహించారు. ఈ సందర్భంగా నందీశ్వరుని కి గణపేశ్వరునికి రుద్రాభిషేకం త్రివేణి సంగమం జలాభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం పూలమాలలో పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి నందీశ్వరుని వార్షికోత్సవంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు భక్తులకు ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలు మహిళలకు అమ్మవారి గాజులను అందజేశారు. ఆలయంలో నందీశ్వరుని ప్రతిష్టించిన నిజామాబాద్ సిపి పోతరాజు సాయి చైతన్య, కీర్తి దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

కోటగుళ్లలో జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యుల పూజలు

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T143843.356.wav?_=5

కోటగుళ్లలో జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యుల పూజలు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం లో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో ఆదివారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, సతీమణి వారి కుటుంబ సభ్యులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వారు ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు నాగరాజు వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేసి శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

ఉత్తమ అవార్డు అందుకున్న ఎమ్మార్వో ,ఎంపీడీవో.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-39-3.wav?_=6

ఉత్తమ అవార్డు అందుకున్న ఎమ్మార్వో ,ఎంపీడీవో

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో గా విధులు నిర్వహిస్తున్న మధురకవి సత్యనారాయణ స్వామికి ఉత్తమ ఎమ్మార్వో అవార్డు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ,ఎస్పీ కిరణ్ కారే,జడ్పీ సీఈవో విజయలక్ష్మి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గణపురం ఎమ్మార్వో గా విధులు నిర్వహిస్తున్న మధురకవి సత్యనారాయణ స్వామి ఉత్తమ అవార్డు అందుకున్నారు.

Best EMRO and MPDO Awards in Ganapuram

అదేవిధంగా గణపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న ఎల్ భాస్కర్ ఉత్తమ ఎంపీడీవో అవార్డును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ కారే జెడ్పిసిఓ విజయలక్ష్మి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గణపురంలోవిధులు నిర్వహిస్తున్న ఎమ్మార్వో, ఎంపీడీవోలు ఉత్తమ అవార్డు అందుకున్నారు.

బిజెపి జిల్లా కార్యదర్శిగా జిట్టబోయిన సాంబయ్య.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-14-5.wav?_=7

బిజెపి జిల్లా కార్యదర్శిగా జిట్టబోయిన సాంబయ్య

గణపురం నేటి ధాత్రి :

గణపురం మండలం
భూపాలపల్లి జిల్లా బీజేపీ నూతన కమిటీలను ప్రకటించింది.జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి కమిటీలను ప్రకటించారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామ్ చందర్రావు ఆదేశాలతో నూతన కమిటీని ప్రకటించినట్లు జిల్లా అధ్యక్షులు తెలిపారు. గణపురం మండలానికి చెందిన జిట్టబోయిన సాంబయ్యను జిల్లా కార్యదర్శిగా ప్రకటించారు. జిల్లా నూతన కమిటీలో స్థానం పొందిన సాంబయ్య రాష్ట్ర జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రుణమాఫీ చేయాలని కరుణాకర్ రెడ్డి డిమాండ్..

జాతీయ జెండా ఆవిష్కరించిన మండల పార్టీ అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో మండల బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15 వరకు పూర్తి రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి మాటలు ఏమయ్యాయని ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి రెండవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నప్పటికీ ఇంకా రుణమాఫీ కాకపోవడం రైతులను విస్మరించడమే అని అన్నారు. ఇప్పటికైనా రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణ చంద్రారెడ్డి, సీనియర్ నాయకులు బైరగాని కుమారస్వామి, పెంచల రవీందర్, మాజీ సర్పంచ్ లు కట్ల శంకర్, పల్లెబోయిన సదయ్య, నాయకులు జానయ్య, మామిండ్ల సాంబయ్య యాదవ్, రజాక్, శామ్యూల్ శ్రావణ్, లాలూ, మార్క సాయి, వాజిద్, చక్రి, హాఫీజ్, శివ,గౌతమ

కేటీపీపీలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-52.wav?_=8

కేటీపీపి లో జాతీయ జెండాను ఎగరవేసిన చీఫ్ ఇంజనీర్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం చెల్పూర్ 79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన చీఫ్ ఇంజనీర్ చిట్టాప్రగఢ ప్రకాష్ స్వాతంత్ర్య సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ. వారి ఆశయ సాధనకోసం ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ విద్యుత్ ఉద్యోగులు అందరికీ 79 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల సుపరింటెండింగ్ ఇంజనీర్లు, ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు వివిధ ట్రేడ్ యూనియన్స్, అసోసియేషన్స్ నాయకులు విద్యుత్ ఉద్యోగులు అర్టీజన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు అనంతరం కెటిపిపి ముఖద్వారం అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో ఎస్సీ & ఎస్టీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన త్రివర్ణ పతాకాన్ని కూడా చీఫ్ ఇంజనీర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో క్రమశిక్షణతో ఉద్యోగ బాధ్యతలు విధులు నిర్వహిస్తున్న 20 మంది సెక్యూరిటీ సిబ్బందికి కెటిపిపి ఉత్తమ ఉద్యోగి అవార్డు సర్టిఫికెట్ ను అందించారు

గోదారి నీటిని గణపసముద్రం కు కలపాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-22-2.wav?_=9

గోదారి నీటిని గణపసముద్రం కు కలపాలి

గణపురం బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలo దేవాదుల ప్రాజెక్ట్ నుండి గోదావరి నీరు రామప్ప చెరువులో చేరడం జరుగుతుంది అదేవిధంగా గ్రావిటీ కెనాల్ ద్వారా గణపసముద్రం చెరువులోకి నీటిని వదిలి దాని ఆయకట్టు రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా చర్యలు తీసుకోవలసిందిగా ఎమ్మార్వో కి వినతి పత్రం ను మండల అధ్యక్షుడు నవీన్ రావు ఆధ్వర్యం లో ఇవ్వడం జరిగింది ఇందులో సీనియర్ నాయకులు దుగ్గిశెట్టి పున్నం చందర్ ఉపాధ్యక్షులు మాదాసు మొగిలి. బూత్ అధ్యక్షులు కాశెట్టి సాయి కన్వీనర్ .మండల కన్వినర్ మండల రాజు పాల్గొనడం జరిగింది అలాగే రేపు మండల కేంద్రం లో జరిగే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం లో అందరు పెద్ద ఎత్తున పాల్గొని స్వాత్రంత్ర సమర్యోదులను గుర్తు చేస్తూ బావితరాలకు తెలియజేయాలనీ కోరడం జరిగింది

స్నేహితురాలి కుమారుని వివాహంలో బాల్య మిత్రులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-08T133624.638.wav?_=10

స్నేహితురాలి కుమారుని వివాహంలో బాల్య మిత్రులు

గణపురం నేటి ధాత్రి

గణపురం బండారుపల్లి గిరిజన భవన్ లో గుండు లలిత రమేష్ దంపతుల కుమారుడు గుండు వినయ్ రవీన ల వివాహ వేడుకకు బాల్య మిత్రులుహాజరై నూతన మధు వరులను ఆశీర్వదించారు. తమ కుమారుడి వివాహ వేడుకకు బాల్య మిత్రులు హాజరై ఆశీర్వదించినందుకు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వివాహ వేడుకలో అలువల పద్మ రాణి విజయ హైమ సునీత వి సునీత తోట భద్రయ్య రఘువీర్ రామన్న రమేష్ సంపత్ హరి ప్రసాద్ సునీల్ రవీందర్ రావు పాల్గొని ఏడవ తరగతి పూర్తి చేసుకుని 33 సంవత్సరాలు గడుస్తున్న మిత్రురాలి కుమారుడి పెళ్లిలో అందరూ కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి మహాదేవుడికి మారేడు దళముల పూజ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-9-1.wav?_=11

శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి
మహాదేవుడికి మారేడు దళముల పూజ

సేవా సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం ధర్మరావుపేట గ్రామంలో శ్రావణమాసం శుక్ల పక్షం దశమి సోమవారం పర్వదిన సందర్బంగా శ్రీ ఉమామహేశ్వరసేవ సమితి ఆధ్వర్యంలో శువుడికి అత్యంత ప్రీతికరమైన మారేడు దళములను సేకరించి ఆలయ పూజారులు లంక కిషన్ శర్మ చే బిల్వపూజ స్వామి వారికి జరిపించారు.శ్రావణమాస రెండవ సోమవారం అయినందునా భక్తులు మహా దేవుడికి చందన అభిషేకం అర్చనలు చేయడం.

వచ్చిన భక్తులకు ఆశీర్వచనం తో పాటు తీర్థ ప్రసాదాలు అందించారాని సేవ సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు. పూజ కార్యక్రమంలొ మాజీ సర్పంచ్ రాచకొండ లావణ్య గోపాల్ మాజీ సింగిల్ విండో డైరెక్టర్ ఆరెందల శంకరయ్య మున్నూరు కాపు సంఘం నాయకులు బాపని సాంబయ్య శ్రీలక్ష్మి వెంకటేశ్వర ఏజన్సిస్ దూడ సతీష్ కుమార్ సేవ కమిటీ సభ్యులు దూలం శంకర్ బెనికి రాజు సింగం రాజవిరు గందే ప్రకాష్ మాదారపు వెంకటేశ్వర్లు ఆకుల స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ సర్వీస్ బిల్లింగ్ కొత్త హంగులతో ప్రారంభం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-04T170513.852.wav?_=12

ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ సర్వీస్ బిల్లింగ్ కొత్త హంగులతో ప్రారంభం

చీఫ్ ఇంజనీరింగ్ చిట్టప్రగడ ప్రకాష్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సర్వీస్ బిల్డింగ్ 3వ అంతస్తులో కొత్త హంగులతో ఏర్పాటు చేసిన సమావేశ మందిరం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన

చీఫ్ ఇంజనీర్ ఓం & ఎం చిట్టాప్రగడ ప్రకాష్ కార్యక్రమంలో అన్ని విభాగాల సూపరింటెండెంట్ ఇంజనీర్లు ఇంజనీర్ అధికారులు ఓ & ఏం మరియు అర్టీజన్ కార్మికులు పాల్గొన్నారు

గణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం

గణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల దుకాణం ఆకస్మిక తనిఖీ జిల్లా కలెక్టర్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఎరువుల దుకాణాన్ని జయశంకర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది ముందుగా వారు స్టాక్ బోర్డును పరిశీలించి 616 యూరియా బ్యాగులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని రైతులు అధైర్య పడద్దని రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంటాయని వారు తెలియజేయడం జరిగింది వారితో పాటు డి ఏ ఓ బాబురావు ఎం ఏ ఓ ఐలయ్య ఎమ్మార్వో మధురకవి సత్యనారాయణ స్వామి ఎంపీడీవో భాస్కర్ గణపురం మండల స్పెషల్ ఆఫీసర్ కుమారస్వామి పాల్గొనడం జరిగింది

మండలంలో యూరియా లభ్యత పర్యవేక్షణ

మండలంలో యూరియా లభ్యత పర్యవేక్షణ అదనపు కలెక్టర్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలో భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ పి. అశోక్ కుమార్ గణపురం మండలాన్ని సందర్శించి యూరియా లభ్యత పంపిణీని తనిఖీ చేశారు. వారి తో పాటు జిల్లా వ్యవసాయ అధికారి బాబు రావు
జిల్లా సహకార అధికారి ఎం. వాల్య నాయక్
మండల వ్యవసాయ అధికారి డి. ఇలయ్య ఏ సి ఎస్ గణపురం సీఈఓ ఉన్నారు.

గోదాముల తనిఖీలో యూరియా నిల్వలు సరిపడుగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు 405 బస్తాల యూరియా అందుబాటులో ఉంది. పంపిణీ పి ఓ ఎస్ యంత్రం మరియు ఆధార్ ధృవీకరణతో పారదర్శకంగా జరుగుతోంది.రైతులు ఆందోళన చెందకండి, విధి ప్రకారం యూరియా పొందాలని అధికారులు సూచించారు. పంట సీజన్ కోసం సరైన సమయంలో ఎరువులు అందించేందుకు యంత్రాంగం కట్టుబడి ఉంది. సొసైటీ స్టాప్ రైతులు బాబురావు మూల సదయ్య రైతులు పాల్గొన్నారు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డాక్టర్ రవీంద్ర నాయక్

గణపురం నేటి ధాత్రి

గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డాక్టర్ రవీంద్రా నాయక్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆకస్మిక తనిఖీ చేశారుడైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్ర నాయక్ ని భూపాలపల్లి జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు బూరుగు రవి కలిశారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్ర నాయక్ ని సన్మానించినారు
రాష్ట్రంలో ఉన్న హెల్త్ అసిస్టెంట్ అందరినీ ఫార్మసిస్టులను ల్యాబ్ టెక్నీషియన్లను రెగ్యులర్ అయిన వారందరినీ సర్వీస్ రెగ్యులరైజేషన్ గురించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ
రెగ్యులర్ చేయాలని
సకాలంలో జీతాలు ఇవ్వాలని వారిని కోరడం జరిగింది మెమోరండం ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు బూరుగు రవి టీఎన్జీవో జిల్లా కార్యదర్శి దశరధ రామారావు మురళీధర్ రెడ్డి టి సత్యనారాయణ శ్రీదేవి జమాలుద్దీన్ హెల్త్ అసిస్టెంట్లు కాపర్తి రాజు పరమేశ్వర్ గోపి సుధీర్ సతీష్ వేణు ల్యాబ్ టెక్నీషియన్ రజిత పాల్గొన్నారు

గణపురం పీఏసీఎస్ కార్యాలయంలో మొక్కలు నాటిన

గణపురం పీఏసీఎస్ కార్యాలయంలో మొక్కలు నాటిన

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురంమండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు.భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. గణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) కార్యాలయ ఆవరణలో చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని, మొక్కలను నాటి, నీరు పోశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… విరివిరిగా మొక్కలు నాటడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుందన్నారు. అంతేకాకుండా, విరివిగా వర్షాలు పడి పంటలు కూడా పుష్కలంగా పండుతాయన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణ కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమం అనంతరంగణపురం మండల కేంద్రంలోని స్వర్ణ భారతి మండల సమాఖ్య వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీఎస్సార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూసీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న మహిళలు ఆత్మగౌరవంతో బతుకుతారని తమ ప్రభుత్వం నమ్ముతోందని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అదేవిధంగా, రాష్ట్రంలో కోటి మంది మహిళలనుకోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు.ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేశామని గుర్తుచేశారు. వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.మహిళా స్వయం సహాయక ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి స్టాల్స్ ఏర్పాటు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

జులై 9 జరిగే కార్మికుల సమ్మె విజయవంతం చేయండి

జులై 9 జరిగే కార్మికుల సమ్మె విజయవంతం చేయండి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలోని బుద్దారం గ్రామ పంచాయతీ సిబ్బంది తో జులై 9 న జరిగే దేశ వ్యాప్త కార్మికుల సమ్మె లో పాల్గొని విజయవంతం చేయుటకు, సమ్మె ఎందుకో వివరిస్తున్న సిఐటియు మండల కార్మిక నాయకులు దాసరి నితీష్, బోడ నర్సింగ్, ఈ కార్యక్రమం లో బుద్దారం గ్రామ పంచాయతీ కార్మిక నాయకులు బొచ్చు భద్రయ్య, సోమిడీ సమ్మక్క, సుధాకర్ రావు, కొలిపాక సులోచన, బొచ్చు రజిత, నిర్మాణ కార్మికులు దాసరి అజయ్, బోడ సయ్యయ్య తదితరులు పాల్గొన్నారు.

గణపురం కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ.

గణపురం కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో భూపాలపల్లి నియోజకవర్గ గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా రెండోసారి ఓరుగంటి కృష్ణను ఎన్నుకోవడం జరిగింది కమిటీ సభ్యులు ఉపాధ్యక్షులు మామిళ్ళ మల్లేష్ పసునూటి శంకర్ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది ఓరుగంటి కృష్ణ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని రెండోసారి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి నాకు సహకరించిన పార్టీ నాయకులు గ్రామస్తులు అలాగే నా యొక్క మిత్ర బృందానికి నా హృదయపూర్వక నమస్కారాలు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గ్రామ నాయకులు పాల్గొన్నారు

గణపురం లో కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల.!

గణపురం లో కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల నిర్మాణ సన్నాహక సమావేశం

సంస్థాగత నిర్మాణం వైపు కాంగ్రెస్ అడుగులు
భూపాలపల్లి నియోజక వర్గం

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం లో ప్రతిపాదనల స్వీకరణ
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంస్థాగత నిర్మాణంలో భాగంగా, భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండల కేంద్రంలోని ప్రొ బెల్ స్కూల్ లో మండల అధ్యక్షులు రేపాక రాజేందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంస్థాగత నిర్మాణం సమావేశానికి ముఖ్య అతిధులుగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా పరిశీలకులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి , మాసంపెల్లి లింగాజి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సమావేశంలో వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఈరోజు గణపురం మండల కేంద్రంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని, మండల స్థాయి నుంచి పీసీసీ దాకా కార్యవర్గాలను ఏర్పాటు చేసేందుకు మండల కమిటీ అధ్యక్షుడు కి గ్రామ కమిటీ అధ్యక్షుడుకి ప్రతిపాదనలు పంపేందుకు, ఆసక్తి ఉన్న ముఖ్యనాయకులు, కార్యకర్తలు అందరూ సకాలంలో తమరి బయోడేటా, పాస్ ఫోటోతో ప్రతిపాదన సమర్పించాలని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ, అనుబంద సంస్థల, బ్లాక్ అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గోన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version