ఐనవోలులో యూరియా దందాపై నేటిధాత్రి కథనానికి స్పందన..

ఐనవోలులో యూరియా దందాపై నేటిధాత్రి కథనానికి స్పందన
రైతుల ఫిర్యాదులపై స్పందించిన వ్యవసాయ అధికారులు
లింక్ సేల్స్ పేరుతో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవు

నేటి ధాత్రి – ఐనవోలు:

 

 

ఐనవోలు మండలంలో యూరియా దందా విచ్చలవిడిగా కొనసాగుతుండటంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించి డీలర్లు లింక్ సేల్స్ పేరుతో మరో వస్తువులు బలవంతంగా కొనిపిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ విషయంలో నేటి ధాత్రి పత్రిక వార్త కథనాల రూపంలో వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. నేటిధాత్రి కథనాన్ని పరిగణలోకి తీసుకున్న వ్యవసాయ శాఖ అధికారులు స్పందించారు.
మండలంలోని వ్యాపారస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించిన అధికారులు రైతులపై లింక్ సేల్స్ రుద్దడం చట్టవిరుద్ధం. యూరియాకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం అందిస్తున్న నానో లిక్విడ్ యూరియా లేదా నానో లిక్విడ్ సంబంధించిన ఎరువులు రైతులు కావాలంటే ఇవ్వాలి గాని, ఎవరైనా బలవంతంగా లింక్ సేల్స్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.
తదుపరి వారు రైతులను ఉద్దేశించి యూరియా కోసం ఎవరైనా అనవసర వేధింపులు చేస్తే, లింక్ సేల్స్ పేరుతో ఇబ్బంది పెడితే వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. మేము వెంటనే చర్యలు తీసుకుంటాం” అని కోరారు.
ఐతే రైతులు మాత్రం అధికారులు కౌన్సిలింగ్‌నే కాక, కఠిన తనిఖీలు నిర్వహించి దందాకు చెక్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

ఐనవోలు మండలంలో యూరియా దందా రెచ్చిపోతోంది…

ఐనవోలు మండలంలో యూరియా దందా రెచ్చిపోతోంది

లింక్‌ సేల్స్‌తో రైతులపై వ్యాపారుల పెత్తనం
లింక్ సేల్స్ తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న చిన్న సన్నకారు రైతులు
అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం

నేటి ధాత్రి అయినవోలు:-

 

ఐనవోలు మండలంలో యూరియా దందా రోజురోజుకీ భగ్గుమంటోంది. పంటలకు అత్యవసరంగా అవసరమైన యూరియాను కృత్రిమ కొరత సృష్టించి, వ్యాపారులు లింక్‌ సేల్స్ పేరుతో రైతులపై అన్యాయాలు పెంచుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మండలంలోని చాలా దుకాణాల్లో యూరియా కావాలంటే మరో వస్తువు కొనాల్సిందేనని డీలర్లు తెగబడుతున్నారు. “స్టాక్ లేదు”, “రేపు రండి” అనే నాటకం, గోదాముల వెనకాల దాచిన సంచులు, నల్లబజారు ధరలకు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న సేల్స్… ఇవన్నీ రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.రైతులు ఉదయం నుంచే దుకాణాల ముందు క్యూల్లో నిలబడ్డా, చివరకు నిరాశతో వెళ్లాల్సిన పరిస్థితి. పంట దశ కీలకంగా ఉన్న ఈ సమయంలో యూరియా దొరకక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.వ్యాపారుల దందా పెరుగుతున్నా, వ్యవసాయ శాఖ, విజిలెన్స్‌ అధికారులు మాత్రం ఏ చర్యలు తీసుకోవడం లేదు. చర్యలు తీసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం రైతులలో మరింత ఆగ్రహం రేపుతోంది. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ యూరియాను కొరతగా చూపించి నల్లబజారులో అమ్మడం స్పష్టమైన దందా. వెంటనే తనిఖీలు జరగాలి. దందా ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం” అని రైతులు హెచ్చరిస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version