అదనపు కలెక్టర్కు అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకై వినతిపత్రం…

అదనపు కలెక్టర్కు అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకై వినతిపత్రం

సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్.

 

టేకుమట్ల మండల కేంద్రం మండలంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది సానుకూలంగా స్పందించిన అదనపు కలెక్టర్ ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ టేకుమట్ల, చిట్యాల, మొగుళ్ళపల్లి మండలాల్లో అగ్నిమాపక కేంద్రం లేకపోవడం వల్ల రైతులు, వ్యాపార వాణిజ్య వర్గాలు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే భూపాలపల్లి జిల్లా కేంద్రం నుండి అగ్ని మాపక కేంద్రం ఈ మూడు మండలాలకు చేరుకోవడం ఆలస్యం అవుతుందని, తద్వారా ధన, ప్రాణ నష్టం సంభవిస్తుందనిఅన్నారు. నిన్నటి రోజున రాఘవరెడ్డి పేట గ్రామానికి చెందిన రైతు గడ్డి కట్టలకు నిప్పు అంటుకోగా భూపాలపల్లి నుండి అగ్ని మాపక కేంద్రం గ్రామానికి చేరుకునే సరికే అవి అగ్నికి ఆహతి అయ్యాయాని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి టేకుమట్ల మండలంలో అగ్ని మాపక కేంద్రం ఏర్పాటు చేస్తే టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాలకు సౌకర్యం వంతంగా ఉంటుందని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి అంబాల అశ్వథామ తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version