3 ఏళ్ల బాల కార్మికురాలిని రక్షించిన టాస్క్ ఫోర్స్.. వీడియో వైరల్

3 ఏళ్ల బాల కార్మికురాలిని రక్షించిన టాస్క్ ఫోర్స్.. వీడియో వైరల్

అసోం రాజధాని గౌహతి పంజాబరిలో మానవత్వానికే మచ్చ తెచ్చే ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఒక ఇంట్లో బానిసలా మగ్గుతున్న 13 ఏళ్ల బాలికను జిల్లా కార్మిక టాస్క్ ఫోర్స్ అధికారులు రక్షించారు. బాలికను అత్యంత అమానవీయంగా మంచం లోపల ఉన్న ర్యాక్‌లో దాచిపెట్టారు.

 

ఇంటర్నెట్ డెస్క్: అసోం రాష్ట్రం గౌహతీ పంజాబరిలో ఓ కుటుంబం చిన్నారిని చిత్రహింసలకు గురి చేసింది. పనిలో పెట్టుకుని ఏడేళ్లుగా నరకం చూపించింది. ఈ విషయం గురించి తెలుసుకున్న జిల్లా కార్మిక టాస్క్ ఫోర్స్ అధికారులు ఆ ఇంటిపై దాడి చేశారు. అధికారులు ఇంటిని సోదా చేస్తున్న సమయంలో ఎక్కడా బాలిక కనిపించలేదు. అయితే, యజమానుల ప్రవర్తనపై అనుమానం వచ్చి బెడ్ కాట్(మంచం)ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మంచం లోపల ఒక ఇరుకైన ర్యాక్‌లో బాలికను కుక్కి దాచినట్లు గుర్తించిన అధికారులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.

మోదీ ప్రసంగానికి ముందే లోక్‌సభ వాయిదా..

మోదీ ప్రసంగానికి ముందే లోక్‌సభ వాయిదా

 

vదీంతో సభాకార్యక్రమాల ప్రకారం మోదీ చేయాల్సిన ప్రసంగం కూడా రేపటికి వాయిదా పడింది.

న్యూఢిల్లీ: విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం బడ్జెట్‌‌పై రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రసంగించాల్సి ఉంది. అయితే మోదీ ప్రసంగానికి ముందే సభను స్వీకర్ గురువారానికి వాయిదా వేశారు.
మూడుసార్లు వాయిదా

బడ్జెట్‌పై రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండటంతో సభ బుధవారంనాడు మూడు సార్లు వాయిదా పడింది. తొలుత సభ ప్రారంభ కాగానే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చ జరపాలంటూ విపక్ష సభ్యలు పట్టుబట్టడంతో గందరగోళ పరిస్థితుల మధ్య మధ్యాహ్నం 12 గంటల వరకూ లోక్‌సభ వాయిదా పడింది. దీంతో విపక్ష సభ్యులు పార్లమెంటు మెట్ల వద్ద ప్లకార్డులతో నిరసనకు దిగారు. మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే మళ్లీ గందరగోళం తలెత్తింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు సభలో సమాధానం ఇస్తానని కేంద్ర మంత్రి పీయూష్ గెయల్ చెప్పడంతో సభ రెండోసారి వాయిదా పడింది. తిరిగి 2 గంటలకు సభ ప్రారంభం కాగానే పీయూష్ గోయల్ మాట్లాడుతుండగా.. 8 మంది ఎంపీలను సమావేశాల నుంచి బహిష్కరించడంపై స్పీకర్‌ ఓం బిర్లాకు వ్యతిరేకంగా విపక్ష సభ్యలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో సాయంత్రం 5 గంటలకు సభ వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. తిరిగి సభ ప్రారంభమై మోదీ ప్రసంగించాల్సి ఉండగా దీనికి ముందే స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు.

లోక్‌సభ ప్రారంభం.. వెంటనే మధ్యాహ్నంకి వాయిదా..

లోక్‌సభ ప్రారంభం.. వెంటనే మధ్యాహ్నంకి వాయిదా

 

విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12.00 గంటలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సభను వాయిదా వేశారు.

 విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12.00 గంటలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సభను వాయిదా వేశారు. సోమవారం ఉదయం 11.00 గంటలకు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలోని సభ్యులు తమ ప్రతిపాదించిన అంశాలపై చర్చ జరగాలంటూ పట్టుబట్టారు. దాంతో విపక్ష ఎంపీల తీరుపై స్పీకర్ ఓంబిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అన్ని అంశాలపై చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాలకు విపక్షాలు సహకరించాలని సూచించారు. కానీ ముందు సమస్యలపై చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. దాంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభను మధ్యాహ్నాంకు స్పీకర్ వాయిదా వేశారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో బాంబు పేలుళ్లు, ఎస్ఐఆర్ (SIR), రైతుల సమస్యలు, ఢిల్లీలో కాలుష్యంపై సభలో చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ముందు ప్రశ్నోత్తరాలు చేపట్టాలని.. ఆ తర్వాత చర్చకు సిద్ధమంటూ స్పీకర్ స్పష్టం చేశారు. అందుకు విపక్ష సభ్యులు సమేమీరా అనడంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సభను మధ్యాహ్నాంకు వాయిదా వేశారు.

మరోవైపు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బాధ నుంచి ప్రతిపక్షాలు బయటకు రాలేదంటూ ప్రధాని మోదీ చేసి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. పార్లమెంట్‌లో ప్రజాసమస్యలు లేవనెత్తడం డ్రామా కాదని ఆమె పేర్కొన్నారు. SIRపై విమర్శకుల నోరు మూయిస్తున్నారంటూ కేంద్రంపై ప్రియాంకాగాంధీ మండిపడ్డారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version