కారేపల్లి టు పెరుపల్లి రోడ్డు నాసిరకంగా నిర్మాణం…

కారేపల్లి టు పెరుపల్లి రోడ్డు నాసిరకంగా నిర్మాణం.

వేసిన కోద్ది రోజుల్లోనే పాడైపోతున్న వైనం.

అధికారులు పట్టించు కోరా వాహనదారుల ఆవేదన.

కారేపల్లి. నేటి ధాత్రి

 

ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రము నుండి మాదారం వేళ్ళే ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణం కారేపల్లి రైల్వే గేటు వద్ద నుండి పెరుపల్లి వరకు ప్రజల సౌకర్యార్థం పాతరోడ్డు డ్యామెజీ అయిన దాన్ని తోలగించి కోత్త రోడ్డు నిర్మాణం చేపట్టారు వేసిన కోద్దిరోజుల్లోనే రోడ్డు పాడైపోయిన వైనం చూస్తే ఈరోడ్డు నిర్మాణం నాసిరకంగా నిర్మించినట్లుగా తెటతెల్లం అవుతుంది రోడ్డుని వేసిన కోద్దిరోజుల్లోనే పాడైపోయి వాహన దారులకు ప్రజలకు ప్రయాణంలో ఇబ్బందులు పడుతు యాక్సిడెంట్స్ కి గురి అవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్డు నిర్మాణం నాసిరకంగా నిర్మించినందునే వేసిన కోద్దిరోజుల్లోనే పాడైపోయినదని దాన్ని వేసిన కాంట్రాక్టర్లు రిపేరు చేసిన ఫలితం లేకుండా పోయిందని మరల రోడ్డు మరమత్తులు చేసిన కోద్దిరోజుల్లోనే పాడైపోయిందని నాసిరకంగా నిర్మించినందునే రోడ్డు దెబ్బ తింటున్నదని ప్రజలు వ్యక్తం చేశారు వాహనాలపైన వెళ్ళే వారు ప్రమాదంలో పడి యాక్సిడెంట్స్ జరిగే దుస్థితి స్తితి నేల కోన్నదని వేంటనే అధికారులు చర్యలు చేపట్టి నాసిరకంగా రోడ్డు నిర్మించిన దాన్ని పరిశీలించి రోడ్డు మరమత్తులు వేంటనే చేయాలని వాహనదారులు ప్రజలు వారి ఆవేదనలు వ్యక్తపరుస్తున్నారు.

సింగరేణి మండల కేంద్రము యుసిసిఆర్ఐ ఎంఎల్ మేడే.

సింగరేణి మండల కేంద్రము యుసిసిఆర్ఐ ఎంఎల్ మేడే జెండా ఆవిష్కరణ.

కారేపల్లి నేటి ధాత్రి :

 

ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం(మార్క్సిస్టు-లెనినిస్టు)యు.సి.సి.ఆర్.ఐ(యం-యల్) పార్టీ ఆధ్వర్యంలో 139వ మేడే దీక్షా దినాన్ని ఘనంగా నిర్వహించటం జరిగింది. మేడే వారోత్సవాల్లో భాగంగా స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి ఊరేగింపుగా ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో కార్యకర్తలు నినాదాలు చేస్తూ మేడే వర్ధిల్లాలి ప్రపంచ కార్మికులారా ఏకం కండి.పోరాడే వానిదే ఎర్రజెండా మార్క్సిజం లెనినిజo మావో ఆలోచన విధానం వర్ధిల్లాలి అనే తదితర నినాదాలు చేశారు.
ఈ మేడే కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ పోలెబోయిన ముత్తయ్య గారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా శ్రమని నమ్ముకొని పోరాడి పని దినాలను తగ్గింపు కొరకు తమ హక్కులు సాదించుకొన్న కర్శకులకు కార్మికులకు 139వ మేడే విప్లవ శుభాకాంక్షలు తెలియజేసారు.కార్యక్రమంలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ(ఓపిఢిఆర్) జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బాణాల లక్ష్మణా చారి మరియు కార్యకర్తలు కొమరం బీమ్ సెంటర్ లో ఎగరవేయడం జరిగింది.
ఈ మేడే వారోత్సవాల్లో నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొనగా నవోదయ సాంస్కృతిక సంస్థ కళాకారులు విప్లవ గేయాలు ఆలపించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version