ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు భేటీ బచావో బేటి పడావో పై అవగాహన కార్యక్రమం.
చిట్యాల ,నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం రోజున జిల్లా మహిళా సాధికారత ఆధ్వర్యంలో డ్రగ్స్ పై మరియు బాల్య వివాహాల పైన బేటి బచావో బేటి పడావో కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ శ్రీదేవి అధ్యక్షతన విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించినారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద పాల్గొని మాట్లాడుతూ విద్యార్థినిలు బాల్యవివాహాలను చేసుకోవద్దని బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలని అన్నారు, ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోతుందని అమ్మాయిల పైన వివక్షత చూపిస్తున్నారని కాబట్టి అమ్మాయిలు బాగా చదువుకొని సమాజంలో మంచి గుర్తింపు పొందాలని వారికి ఈ సమాజంలో ఎన్నో రక్షణ చట్టాలు వచ్చాయని వాటిని ఉపయోగించుకోవాలన్నారు అలాగే ఏదైనా సమస్య వస్తే 1098కి ఫోన్ చేసి తెలపాలన్నారు, ఈ కార్యక్రమంలో లెక్చరర్ యుగంధర్ కళావతి అనూష మమత మరియు అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.