అంగన్వాడి లో పోషణ మాస ఉత్సవాలు .
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని జడల్ పేట, కొత్తపేట గ్రామాలలో పోషణ మాస ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. 11 సంవత్సరాల నుండి కిశోర బాలికలందరు , మహిళలు,సమతుల ఆహారం, వ్యక్తిగత శుభ్రత, పాటిస్తూ బయట వారి మాటలకు, ప్రలోభాలకు, గురి కాకుండా ఉండాలని చెప్పి బరువులు, ఎత్తు లు చూసి, ఐరన్ మాత్రలు ఇచ్చి ప్రతిజ్ఞ చేయించనైనది. అంగన్వాడి టీచర్స్ కూరగాయలతో, పూలతో అలంకరించిన బతుకమ్మలు మట్టితో తయారు చేసిన, బొమ్మల స్టాల్స్ అందరినీ ఆనందపరచాయి. ఈ ప్రోగ్రాంలో ఏఎన్ఎం లహరి, టీచర్స్ వసంత ,మమత ,సాధన ,రమసుజాత, ఉమ, ఆశ వర్కరు సాయి వేద కిశొర బాలికలు హాజరైనారు.