దత్తాత్రేయ ఆలయంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని రంజోల్ గ్రామంలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో గురువారం దత్త జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకం, ఆరాధన, ప్రసాద వితరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త బసంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులకు మహా అన్నపూర్ణ ప్రసాదాన్ని అందజేశారు. దత్త పౌర్ణమి పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
