సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్న తమ దంపతులతో మజీ సర్పంచ్..

సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్న తమ దంపతులతో మజీ సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సిద్ధి వినాయకుడిని ఝరాసంగం గ్రామ మాజీ సర్పంచ్ జగదీశ్వర్ తమ దంపతులతో స్నేహితులతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన మాజీ సర్పంచ్ జగదీశ్వర్ అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజనీ, స్వయంభూ వినాయకుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు నాయకత్వంలో జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం గ్రామం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు మాజీ సర్పంచ్ తెలిపారు. అతనితోపాటు సజ్జన్ నాగేశ్వర్ దంపతులు కూడా దర్శించుకున్నారు,

శిరిడి సాయిబాబాకు పూజలు చేసిన వైస్ చైర్మన్ శ్రీనివాస్…

శిరిడి సాయిబాబాకు పూజలు చేసిన వైస్ చైర్మన్ శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ కి శాలువాతో సన్మానం చేసి శ్రీ షిరిడి సాయిబాబా దివ్య ఆశీస్సులు నీపై నీ గెలుపుకు కృషి చేసిన 15వ వార్డు ప్రజలకు ఉండాలని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చన అభిషేకాలు చేపించడం జరిగిందిa

శ్రీరామలింగేశ్వర అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు…

శ్రీరామలింగేశ్వర అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు

మాజీ స్పీకర్,శాసనసభ పక్షనేత ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీరామలింగేశ్వర అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మాజీ స్పీకర్,శాసనసభ పక్షనేత ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి.శివరాత్రి జాగరణ లో భాగంగా ఆయన అర్ధరాత్రి లింగోద్భావ కాలంలో ఆలయంలో పూజలు జరిపారు.అనంతరం ఆయన గ్రామస్తులను ఆప్యాయంగా పలకరిస్తూ సంభాషించారు.పలువురు గ్రామస్తులు గ్రామంలోని వల సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను అధికారంలో ఉన్నప్పుడు ఈ చిన్న గ్రామాన్ని గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశానని,గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి చేశానని అన్నారు.ఇకపై కూడా ప్రజల సుఖ సంతోషాలు అభివృద్ధి కోసమే తన కృషి ఉంటుందని తెలిపారు.

మేడారం తల్లులను దర్శించుకున్న పెద్ది స్వప్న

మేడారం తల్లులను దర్శించుకున్న పెద్ది స్వప్న

నల్లబెల్లి,నేటిధాత్రి:

వరంగల్ జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ పెద్ది సప్న సుదర్శన్ రెడ్డి శుక్రవారం మేడారం మహా జాతరలో వన దేవతలు సమ్మక్క సారక్క తల్లులను దర్శించుకున్నారు.ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర,అడవి తల్లి ఒడిలో జంపన్న వాగు ఒడ్డున వెలసిన సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో అష్టఐశ్వర్యలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని తల్లులను కోరుకున్నట్లు తెలిపారు.అడవిబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపాలైన సమ్మక్క–సారలమ్మ తల్లులను దర్శించుకోవడం మేడారం జాతర గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలుస్తోందని పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version