దత్త జయంతి సందర్భంగా ఆశ్రమాన్ని దర్శించిన కాంగ్రెస్ అభ్యర్థి…

దత్త జయంతి సందర్భంగా ఆశ్రమాన్ని దర్శించిన కాంగ్రెస్ అభ్యర్థి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మెడ గ్రామ పంచాయతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రుద్ర గాయత్రి, గురువారం దత్త జయంతి సందర్భంగా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలోని ఆశ్రమానికి వెళ్లి శ్రీ శ్రీ శ్రీ వైరాగ్య శిఖామణి అవదూత గిరి మహారాజ్ ను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు రుద్ర కృష్ణ, మాజీ సర్పంచ్ గాజుల బాల కిష్టయ్య, వార్డు అభ్యర్థులు, నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

దత్తాత్రేయ ఆలయంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ…

దత్తాత్రేయ ఆలయంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని రంజోల్ గ్రామంలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో గురువారం దత్త జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకం, ఆరాధన, ప్రసాద వితరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త బసంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులకు మహా అన్నపూర్ణ ప్రసాదాన్ని అందజేశారు. దత్త పౌర్ణమి పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు నిర్వహించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version