నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు.

నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు.

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

 

నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం ఉదయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో జహీరాబాద్ పురపాలక కమిషనర్ ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలో గురువారం, శుక్రవారం ప్రత్యేక బృందాలతో దాడులు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు, కమిషనర్ తెలిపారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తూ పట్టుబడిన వారికి వెయ్యి రూపాయల నుంచి రూ.5,000 వరకు జరిమానా విధిస్తామని కమిషనర్ ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.

న్యాల్ కల్ మండల ఇన్చార్జి తహసిల్దార్ పీ.రాజిరెడ్డి.

న్యాల్ కల్ మండల ఇన్చార్జి తహసిల్దార్ పీ.రాజిరెడ్డి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

మండల ఇన్చార్జి రాజిరెడ్డిని స్కాల్కల్ మండలము న్యాల్ కల్ తహసిల్దార్ నియమిస్తూ జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు.ఇది వరకు మండల తహసిల్దార్ గా విధులు నిర్వహించిన భూపాల్ మేడ్చల్ కు బదిలీ అవ్వడంతో మండల ఉప తహసిల్దారుగా విధులు నిర్వహిస్తున్న రాజిరెడ్డిని అదనపు బాధ్యతలు అప్పగించడంతో మండల ఇన్చార్జి తహసిల్దారుగా విధుల్లో చేరారు. విధి నిర్వహణలో రెవెన్యూ చట్టానికి లోబడి, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు విధులు నిర్వహించనున్నట్లు ఇన్చార్జి తహసిల్దార్ రాజిరెడ్డి స్పష్టం చేశారు.

వనపర్తి ఆర్యవైశ్య సంఘం ఎన్నికల నామినేషన్ల స్వీకరణ.

నేడు వనపర్తి ఆర్యవైశ్య సంఘం ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

వనపర్తి నేటిధాత్రి :

 

వనపర్తి పట్టణంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా పోటీ చేసే అభ్యర్థులు నేడు వనపర్తి వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవాలయం లో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజ్ శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు నామినేషన్లు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు నామినేషన్ వేసే అభ్యర్థులు 5000 రూపాయలు డిపాజిట్ ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఆర్యవైశ్య మహా సభ ఆదేశాలు నియమ నిబంధనలు పాటిస్తామని ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని ఆయన పేర్కొన్నారు వనపర్తి లో ఆర్యవైశ్య సంఘం అభ్యర్థిగా పోటీ చేయుటకు ఆర్యవైశ్య యువకులు న్యాయవాదులు రిటైర్డ్ ఉపాధ్యాయులు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది ఆర్యవైశ్య సంఘం అభ్యర్థిగా పోటీ చేయుటకు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో సభ్యత్వం రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలని పూరి బాలరాజ్ పేర్కొన్నారు

తంగళ్ళపల్లి మండలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ.

తంగళ్ళపల్లి మండలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లిమండలం బస్వాపూర్ గ్రామంలో. ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు. సత్తు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు.కార్యక్రమాలు తీసుకొచ్చి. రాష్ట్రంలో ప్రజలకు సన్న బియ్యం కార్యక్రమాన్ని అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ. ప్రభుత్వం ఇచ్చినటువంటి . ఆరు గ్యారంటీలే కాకుండా. ఎన్నో సంక్షేమ.పథకాలు తీసుకొచ్చి రాష్ట్రంలోని ప్రజలు అభివృద్ధిలో ఉంచాలని. ప్రజలకు. అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందు ఉంచుతున్నారని. అలాంటిది దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధిలో ముందు ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు దువ్వాసి దేవరాజు. సెక్రెటరీ వేణు. బలసాని శ్రీనివాస్ గౌడ్. అల్లూరి తిరుపతిరెడ్డి. బద్రి. లింబాద్రులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామా ప్రజలు తదితరులు పాల్గొన్నారు

పటిష్టతకు పని చేసేవారిని నూతన అధ్యక్షుడిగా అవకాశం.

కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పని చేసేవారిని నూతన అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలి

◆ సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చి పార్టీ విధేయులకు ప్రాధాన్యత ఇవ్వలి

◆ అన్ని వర్గాలను కలుపుకొని పోయే నాయకుడిని పెద్దపీట వెయ్యాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్,అల్ ఇండియా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శాసనసభ పరిది ఝారసంగం మండలంలోని మచ్నూర్ గ్రామంలో సోమవారం ఝారసంగం మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశమై పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మండలంలో బలమైన కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణంలో భాగంగా పార్టీ చేపట్టబోయే నూతన గ్రామ, మండల అధ్యక్షుల ఎంపికను అందరూ ఏకతాటిపై నిలిచి నూతన అధ్యక్షుడి ఎంపికను పూర్తి చేసి జహీరాబాద్ నియోజకవర్గంలోనే ఝారసంగం మండల కాంగ్రెస్ పార్టీని పటిష్టం చెయ్యాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ..

నూతన నాయకత్వాన్ని అందరి అభిప్రాయంతో ఎంచుకోవలని తెలిపారు.

పార్టీ నూతన మండల ఎంపిక కోసం సంస్థాగత ఎన్నికల ఇంచార్జ్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పార్టీ అధిష్టానం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ,ఓసి జనరల్ వారి నుంచి అనగా 2017 కంటే ముందు పార్టీలో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఉదాహరణకు ఝారసంగం మండల అధ్యక్షుడిగా ఒకే వ్యక్తి మూడు దశబ్దాలకుపై, న్యాల్కల్ మండల అధ్యక్షుడు నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో ఉన్నప్పటి నుంచి 2009 లో నియోజకవర్గల పునర్విభజనలో జహీరాబాద్ లో విలీనం అయిన నాటి నుంచి ఇప్పటివరకు అన్నగా రెండు దశాబ్దాలకు పైగా ఉండగా, 2009 నుండి
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండటం, మిగిలిన మండలాల వారు 2018 సంవత్సరం నుంచి ఉండటంపై పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నారు.

మూడు రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ఇచ్చిన పాసులను ఇష్టానుసారంగా ఇచ్చుకొని జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులకు,మాజీ జడ్పిటిసిలు,మాజీ ఎంపిపిలు, మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచ్ లకు ఇవ్వకపోవడంతో కార్యకర్యాల ఆగ్రహానికి కారణం అయింది.

ఏది ఏమైనప్పటికి పార్టీ అధిష్టానం మండల అధ్యక్షుడిని మార్చి పార్టీ శ్రేయస్సు కోసం పనిచేసే వారిని అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానంతో కోరారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ అసెంబ్లీ ఓటమి చెందడానికి పలు కారణాల్లో అధ్యక్షులను మార్చకపోవడం కూడా ఒకటని సమావేశంలో చెప్పుకోవడం విశేషం..

ఇప్పటికైనా పార్టీ అధిష్టానం స్పందించి 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించాలంటే నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో నూతన అధ్యక్షుల నియామకం చేపట్టి వారికి అవకాశం కల్పిస్తే వారు ఐకమత్యంగా ఉంటూ పార్టీ విజయం కోసం కష్టపడే అవకాశం ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పిసిసి ప్రచార కార్యదర్శి మహేందర్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎండి.

ముల్తానీ, ఝారసంగం మండల మాజీ ఎంపిటిసి ఫోరం అధ్యక్షుడు శంకర్ పాటిల్, మాజీ జడ్పిటిసి వినిల నరేష్, మాజీ ఎంపిపి దేవదాస్, మాజీ సర్పంచులు నవాజ్ రెడ్డి, రామిరెడ్డి, ఇస్మాయిల్ సాబ్, రాజుస్వామి, శంషోద్దీన్, నందప్ప పాటిల్, మహరుధ్ రావు, సుధాకర్, మాణిక్యం, మాజీ ఎంపిటిసిలు మొహమ్మద్ హాఫిజ్, రవి, మాజీ ఉప సర్పంచ్ సంగన్న, యువజన కాంగ్రేన్ అధ్యక్షుడు రాఘవేంద్ర, అభిలాశ్ రెడ్డి, యువ నాయకులు, సుధాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ ఎసిబి ట్రాప్.

ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ ఎసిబి ట్రాప్

నేటిధాత్రి:-

 

 

ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు… సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు..,

ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ కార్యాలయం లో డాకుమెంట్స్ రైటర్ పుచ్చాకాయల వెంకటేశ్వర రావుద్వారా గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కు రూ 30 వేలు లంచం స్వీకరిస్తూ ఏసీబీ కి పట్టు బడ్డ సబ్ రిజిస్టార్ అరుణ..,
ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ దాడి
మొత్తం రూ 50 వేలు డిమాండ్ చేసి 30 వేల రూపాయలకు అంగీకారం…

తాళం విరగొట్టి నగదు దోచుకెళ్ళారు.

‘తాళం విరగొట్టి నగదు దోచుకెళ్ళారు’

బాలానగర్ నేటి ధాత్రి:

అర్థరాత్రి వేళలో.. ఎవరూ లేని సమయంలో.. బాలానగర్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి శనివారం అర్ధరాత్రి నగదును దోచుకెళ్ళారు. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. ఈనెల 24వ తేదీన పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులు తాళం వేసి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పోస్ట్ కార్యాలయం వెనుక భాగంలో తాళం విరగొట్టి లోపలికి ప్రవేశించారు. కార్యాలయంలో పలు డాక్యుమెంట్స్ లు చిందరవందరగా పడేసి.

stole cash

రెండు లాకర్లలో ఉన్న సుమారు రూ. 30,740 వేల నగదును దోచుకెళ్ళారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఎవరూ చూడలేదు. సోమవారం స్వీపర్ కార్యాలయం శుభ్రం చేస్తుండగా.. విరిగిపోయిన తాళం చూసి అధికారులకు పోస్ట్ ఆఫీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఎస్సైకి సమాచారం ఇవ్వగా.. ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రాత్రి వేళలో పోలీస్ నిగా పెట్టి దొంగతనాలు జరగకుండా.. చర్యలు తీసుకోవాలని మండల కేంద్రం ప్రజలు అన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

కాకాణి అరెస్ట్ కూటమి కుట్ర !

కాకాణి అరెస్ట్ కూటమి కుట్ర !

తిరుపతి ఎంపి గురుమూర్తి

తిరుపతి(నేటి ధాత్రి)మే 26:

 

 

మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు పూర్తిగా అక్రమమని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఖండించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం కుట్రలకు తెరలేపిందన్నా
రు,ఆ క్రమంలోనే కాకాణి గోవర్ధన్ రెడ్డి పై అక్రమ కేసులు నమోదు చేశారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం రెడ్ బుక్” రాజ్యాంగాన్ని అమలు చేస్తోందన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రజల హక్కులను హరిస్తూ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న దుర్మార్గ పాలన రాష్ట్రానికి పెనువిపత్తని తెలిపారు.
కూటమి అక్రమాలపై ప్రశ్నించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల గొంతు నొక్కేందుకు అధికార దుర్వినియోగం ద్వారా ప్రభుత్వం అక్రమ కేసులను నమోదు చేస్తోందని, ఇది పూర్తిగా అప్రజాస్వామికమన్నారు. మాకు, మా పార్టీకి న్యాయవ్యవస్థపై గౌరవం ఉందని అన్నారు. న్యాయస్థానాలలోనే ఈ కుట్రలపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.

రెండవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల.

రెండవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

శ్రీ పద్మావతి ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నారాయణమ్మ

తిరుపతి(నేటి ధాత్రి) మే 26:

 

 

శ్రీపద్మావతి మహిళా డిగ్రీ రెండవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల చేసామని శ్రీ పద్మావతి ఉమెన్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపల్ నారాయణమ్మ ఆ ప్రకటనలో తెలిపారు. స్వయం ప్రతిపత్తి కలిగిన శ్రీపద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో 2024-2025 విద్యా సంవత్సరంలో డిగ్రీ చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థినులకు 28 ఏప్రిల్ నుండి 9 మే 2025 వరకు జరిగిన రెండవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.నారాయణమ్మ విడుదల చేశారు. స్వయం ప్రతిపత్తిని సాధించి ఈ పరీక్షలు నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన తిరుమల తిరుపతి దేవస్థానముల కార్య నిర్వాహణాధికారి కి, సంయుక్త కార్య నిర్వాహణాధికారి కి, విద్యాశాఖాధికారి కి, సంబంధిత విభాగాధికారులకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణమ్మ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరీక్షలలో 92 శాతం విద్యార్థినిలు ఉత్తీర్ణతను సాధించారని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎ. విద్యుల్లత తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ జి భద్రమణి, డాక్టర్ సి దివ్యవాణి, సూపరిండెంట్ శాంతి, ఎగ్జామినేషన్ మెంబెర్స్ జి సుధాకర, చంద్రశేఖర్, సంధ్య మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు..

డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం.

డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం

కల్వకుర్తి నేటి దాత్రి:

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో సోమవారం యంగ్ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ & 33/11 కెవి సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి , AICC/CWC చల్లా వంశీ చంద్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి స్వాగతం పలుకుతున్న సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి, కడ్తాల్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జర్పుల లక్పతి నాయక్ శాలువాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

బహిరంగ సభకు భారీగా తరలిరండి…

బహిరంగ సభకు భారీగా తరలిరండి…

నారా లోకేష్ కు టిడిపి జాతీయ పరిపాలన అధ్యక్షులుగా పదవి ఇవ్వాలని ప్రతిపాదన

కాకాని, జగన్ మైనింగ్ అవినీతి వెలికి తీయాలని ప్రతిపాదన

తిరుపతి(నేటి ధాత్రి) మే 26:

 

 

 

ఎన్టీఆర్ జన్మదిన పురస్కరించుకుని టిడిపి మహానాడు 27, 28,29 న భారీ బహిరంగ సభ కు భారీగా తరలిరావాలని తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ పిలుపు నిచ్చారు,
స్థానిక తిరుపతి
ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో సోమవారం తిరుపతి టిడిపి నాయకుల తో కలిసి ఆయన మాట్లాడుతూ నందమూరి తారకరామారావు జన్మదిన పురస్కరించుకొని 27 28 29 తేదీలలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని తలపెట్టారని తిరుపతి నుంచి అధిక సంఖ్యలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నాలని, నారా లోకేష్ కు టిడిపి జాతీయ పరిపాలన అధ్యక్షులుగా (టిడిపి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ) పదవి ఇవ్వాలన్న ప్రతిపాదన తిరుపతి నుంచి టిడిపి నాయకులు కార్యకర్తలు పలువురి అభిప్రాయలతో ఈ ప్రతిపాదనను పెడుతున్నామని ఇందుకు అందరూ అంగీకరించాలని కోరుతున్నామన్నారు.
కాకాని, జగన్ మైనింగ్ అవినీతి వెలికి తీయాలని ప్రతిపాదన
వైసీపీ పార్టీలోని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనింగ్ కేసులో పై చర్చించి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదనలను మహానాడులో చర్చించాలని
ఆయన అన్నారు,
ఈ మహానాడు కార్యక్రమంలో రాష్ట్ర పరిపాలనపై అంశాలపై అలాగే పలు అంశాలపై చర్చించుకుని ఇటు పార్టీని అటు రాష్ట్ర పరిపాలనను పరిపాలించేందుకు పొలంసాలపై చర్చించి అలాగే తిరుపతి నుంచి కూడా కొన్ని ప్రతిపాదనలు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు, అన్నిటిని అందరూ ఆమోదించి ఆదర్శవంతమైన పాలనను ప్రజలకు అందించాలని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకుంటారని ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు పలువురు మంత్రులు కూడా
హాజరు కానున్నారని ఆయన తెలిపారు,
ముఖ్యంగా 29వ తేదీన జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తో పాటు డిప్యూటీ మేయర్ ఆర్ సి, మునికృష్ణ,
కట్టా జయరామ్ యాదవ్, బుల్లెట్ రమణ, రామారావు,జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు.

ప్రతి విత్తన అమ్మకంపై రసీదు తప్పనిసరిగా ఇవ్వాలి.

అధిక ధరలకు విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్ తప్పదు.

పలు విత్తన దుకాణాలను తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్ సహాయ సంచాలక అధికారి శ్రీనివాస్.

నల్లబెల్లి నేటి ధాత్రి:

నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి సంబంధిత డీలర్ లైసెన్సును శాశ్వతంగా రద్దు చేయబడుతుందని టాస్క్ ఫోర్స్ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు సోమవారం మండల కేంద్రంలోని పలు విత్తన దుకాణాలను తనిఖీ చేపట్టి. పలు కంపెనీలకు చెందిన విత్తన ప్యాకెట్లను పరిశీలించి కంపెనీకి సంబంధించిన ప్రభుత్వం జారీ చేసిన ఆమోదిత పత్రాలు పరిశీలించారు అదేవిధంగా విత్తన షాపులలో స్టాక్ రిజిస్టర్ లను, స్టాక్ బోర్డులను క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆమోదిత పొందిన విత్తన ప్యాకెట్లను మాత్రమే రైతులకు అంది ఇవ్వాలని అందించే క్రమంలో తప్పనిసరిగా ప్రతి రైతుకు రసీదు ఇవ్వాలని. ప్రతిరోజు విక్రయించిన విత్తనాలను ప్రత్యేకంగా రిజిస్టర్ లో రైతుల పేర్లతో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని. విడిగా విత్తనాలు అమ్మకూడదని ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విత్తన ప్యాకెట్లను రైతులకు విక్రయించాలి అధిక ధరలకు విత్తన ప్యాకెట్లను విక్రయించినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పలువురు విత్తన డీలర్లను ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ అధికారులు రంజిత్ రెడ్డి, పి.ఎస్.ఐ జి రామ్మోహన్ , మండల వ్యవసాయ అధికారి బన్న రజిత, పోలీస్ సిబ్బంది, వ్యవసాయ విస్తరణ అధికారులు డీలర్లు తదితరులు ఉన్నారు.

మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత.

మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత.

#కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

#మహిళలు తీసుకున్న రుణాలతో స్వయం ఉపాధికి ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలి.

#రూ,10 కోట్ల బ్యాంకు రుణాల చెక్కును మహిళా సంఘాల బాధ్యులకు అందజేత.

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి:

నల్లబెల్లి నేటి ధాత్రి:

మహిళలు ఆర్థికంగా పురోగతి చెందినప్పుడే కుటుంబాలు, రాష్ట్రాల తో పాటు దేశాలు ఆర్థికంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పేర్కొన్నారు సోమవారం మండల కేంద్రంలోని మండల మహిళా సమైక్య భవనంలో అధ్యక్షురాలు ఊట్కూరి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాజన సభకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని అందుకు అనుగుణంగానే ఎలాంటి వడ్డీ లేని రుణాలు బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు అందజేయడం జరుగుతుందని దానిని ప్రతి ఒక్క మహిళ తీసుకున్న రుణాన్ని స్వయం ఉపాధికి ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదిగి సంఘాలను బలోపేతం చేసే విధంగా కృషి చేయాలని.

దేశ అభివృద్ధి చెందాలంటే వ్యవసాయంతో పాటు ఆర్థిక పురోగతి చెందినప్పుడే దేశం అన్ని విధాలుగా ముందుకు వెళుతుందని స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆనాడే ఆలోచించి మహిళా సంఘాల ఏర్పాటుకు పునాది వేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి మహిళా సంఘానికి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఎన్నికలు పూర్తయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ప్రతి మహిళా సంఘానికి పావలా వడ్డీ తో 2 లక్షల రూపాయల రుణాలు ఇవ్వడం జరిగిందని అన్నారు.

Congress

మహిళా సంఘాల ద్వారా వచ్చే రుణాలను ఎక్కువ మొత్తంలో వ్యవసాయంపై పెట్టుబడి పెట్టడం ద్వారా ఆర్థికంగా లాభాపేక్షం లేకపోవడం తద్వారా సంఘాలు ఆర్థికంగా ఎదగకపోవడం జరుగుతుందని వ్యవసాయానికి ఎలాగో బ్యాంకు రుణాలు తీసుకొని వ్యవసాయంపై పెట్టుబడి పెట్టి మహిళా సంఘాల ద్వారా వచ్చే రుణాన్ని చిన్నచిన్న వ్యాపారంపై ఖర్చు చేస్తే నెలకు కనీసం 10 వేల రూపాయల ఆదాయం వస్తే వెనకబడి కుటుంబ ఆర్థిక పరిస్థితి తో పాటు సంఘ అభివృద్ధి కొరకై పాటుపడడం జరుగుతుందని.

మండలంలో 996 సంఘాలు ఉండగా కనీసం 100 సంఘాలు సంఘానికి 50 నుండి 70 లక్షల వరకు రుణాలు కావాలని అడిగితే బ్యాంకర్స్ తో మాట్లాడి వారికి ఇచ్చే విధంగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

వచ్చిన రుణాన్ని ఏదో ఒక వారికి నచ్చిన వ్యాపారంపై పెట్టుబడి పెట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమని.

నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నత కోసమై ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదిగినప్పుడు ఎమ్మెల్యేగా నాకు అంతకంటే సంతోషం ఉండదని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, కమిటీ మెంబర్ జ్యోతి, అడిషనల్ డి ఆర్ డి ఓ రేణుక దేవి, డి పి ఎం అనిత, ఎమ్మార్వో ముప్పు కృష్ణ, ఎంపీడీవో నరసింహమూర్తి, ఏపిఎం సునీత, మండల సమైక్య కార్యదర్శి అనూష, కోశాధికారి రమ, సిఏలు, గ్రామ సంఘ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

కార్మిక చట్టాల పరిరక్షణపై ఉద్యమించాలి.

కార్మిక చట్టాల పరిరక్షణపై ఉద్యమించాలి

సివిల్ సప్లై హామాలి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గుంపెల్లి మునీశ్వర్

కేసముద్రం నేటి ధాత్రి:

ఏఐటియూసి అనుబంధ సివిల్ సప్లై హామాలి వర్కర్స్ యూనియన్ మహబూబాబాద్ జిల్లా మహాసభ వడ్డెబోయిన లక్ష్మీనరసయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా స్టేట్ సివిల్ సప్లై హమాలీ రాష్ట్ర అధ్యక్షులు గుంపల్లి మునిశ్వర్, ఏఐటీయూసీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు బి. అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని అన్నారు. సంస్కరణల పేరుతో కార్మిక చట్టాలను కుదించి, కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు చెప్పిన ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్యల వారధిగా ఉంటూ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యవసర వస్తువులను సరఫరా చేస్తున్న కార్మికులను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమని వారు అన్నారు. పెరుగుతున్న నిత్యవసర ధరలకు అనుగుణంగా కూలి రేట్లు లేవనీ, హమాలీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు రేషపల్లి నవీన్, మంద భాస్కర్, చొప్పరి శేఖర్,కాసు సాయి చరణ్,పెరుగు కుమార్,వీరవెల్లి రవి, వంకాయలపాటి జకరయ్య,రాజబోయిన శ్రీను, భానోత్ రాజు, ఎల్లుట్ల నారాయణ, అల్లరి నారాయణ, కొనుకటి మల్లారెడ్డి వెలిశాల ప్రభాకర్, సరిత తదితరులు పాల్గొన్నారు.

రైతులకు లైసేన్స్ లేని షాపుల వారు నకిలీ విత్తనాలు.

రైతులకు లైసేన్స్ లేని షాపుల వారు నకిలీ విత్తనాలు అమ్మేతే

కేసులు నమోదు చేయండి కలెక్టర్ అధికారులకు ఆదేశాలు

వనపర్తి నేటిధాత్రి :

వనపర్తి జిల్లాలో వనపర్తి లో రైతులకు ప్రభుత్వ లై సేన్స్ లేకుండా రైతులకు నకిలీ విత్తనాలు అమ్మకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ జిల్లా స్థాయి సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభవుతున్నందున రైతులు విత్తనాలు నాటేందుకు సమాయత్తం అవుతుంటారని, పొరపాటున నకిలీ విత్తనాలు కొనుగోలు చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందన్నారు. వనపర్తి జిల్లాలో షాపుల.వారు ఎక్కడ నకిలీ విత్తనాలు, ప్యాకింగ్ చేయని, లేబుల్ లేని విత్తనాలు అమ్మడానికి వీలు లేదని హెచ్చరించారు. టాస్క్ ఫోర్స్ అధికారులు జిల్లాలోని అన్ని విత్తనాలు అమ్మే షాపులు, డీలర్ షాపులను తనిఖీ చేసి ఎక్కడైనా నకిలీ విత్తనాలు ఉంటే కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పత్తి విత్తనాలు చాలా ఖరీదైనవి ఉండటం వల్ల నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్ లో గాని రైతులకు బ్రోకర్ల ద్వారా అమ్మే ప్రమాదం ఉందన్నారు.
హ్యాషన్ హౌస్ ఆఫీసర్, మండల వ్యవసాయ అధికారులతో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలు డీలర్ గింజల షాపులను తనిఖీ చేసి సీడ్ ప్యాకెట్ లను తనిఖీ చేయాలని, ప్యాకెట్ పై జి.ఈ.ఎ.సి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలని జి. ఈ. ఎ.సి నెంబర్ లేకున్నా, లూజ్ విత్తనాలు అమ్మకానికి పెట్టిన వెంటనే షాపు వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.లైసెన్స్ కలిగిన డీలర్లు మాత్రమే విత్తనాలు అమ్మాలని ఇతరులు విత్తనాలు అమ్మడానికి వీలు లేదన్నారు. లైసెన్స్ లేని వారు విత్తనాలు అమ్మినా, నకిలీ విత్తనాలు అమ్మినా సీడ్ యాక్టు 1966, సీడ్ కంట్రోల్ ఆర్డర్ 1983, ఈ. పి యాక్టు 1986 ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
జిల్లాలో రైతులు వరి పంట మాత్రమే కాకుండా ఇతర వాణిజ్య పంటల సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని కలెక్టర్ మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వరి సాగు చేసే రైతులు దొడ్డు రకం కాకుండా సన్న రకం మాత్రమే సాగు చెస్ విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు నకిలీ విత్తనాల పై అవగాహన కల్పించడమే కాకుండా పంట రైతులకు పంట మార్పిడి పై అవగాహన కల్పించాలని సూచించారు.
జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, డీఎస్పీ వెంకటేశ్వర రావు, ఏ.డి. ఎ చంద్ర శేఖర్, మున్నా, సి. ఐ లు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణి అర్జీలు పెండింగ్లో పెట్టవద్దు.

ప్రజావాణి అర్జీలు పెండింగ్లో పెట్టవద్దు

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్( నేటి ధాత్రి ):

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో వచ్చే అర్జీలు పెండింగ్లో పెట్టవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.మొత్తం 182 దరఖాస్తులు వచ్చాయి.రెవెన్యూ శాఖకు 75, హౌసింగ్ శాఖకు 36, ఎస్డీసీకి 12, డీఆర్డీఓ, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్కు తొమ్మిది చొప్పున, ఎస్పీ కార్యాలయానికి 6, జిల్లా ఉపాధి కల్పన అధికారి, నీటి పారుదల శాఖ కు 5 చొప్పున, జిల్లా సంక్షేమ అధికారికి 4, వ్యవసాయ శాఖ,  జిల్లా విద్యాశాఖ అధికారి, ఏడీ టెక్స్టైల్స్, సబ్ రిజిస్టర్, ఏడీ ఎస్ఎల్ఏ కు రెండు చొప్పున తదితర శాఖలకు దరఖాస్తులు వచ్చాయి. అలాగే వైద్యానికిి రూ. రెండు లక్షల ఆర్థిక సహాయం అందించిన కలెక్టర్ ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన బొల్లె శ్రీనివాస్ పక్షవాతంతో ఇబ్బంది పడుతున్నాడు. సాయం అందించాలని శ్రీనివాస్ భార్య శంకరవ్వ కలెక్టర్ కు విన్నవించారు. దీంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పందించి, శ్రీనివాస్ వైద్యానికి రూ. రెండు లక్షల చెక్కును అందజేశారు. వైద్యానికి సహాయం అందించిన కలెక్టర్ కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.

సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

మెపా రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ రవి ముదిరాజ్

పరకాల నేటిధాత్రి:

 

ఈనెల 25న ములుగు జిల్లా వెంకటాపూర్ లో ముదిరాజ్ ల సింహగర్జన సభ చైతన్య ర్యాలీకి ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చిన ధైర్యంగా ఎదుర్కొంటూ,అందరం ఒక తాటిపై వచ్చి సభను సక్సెస్ చేశామని సభకు అహర్నిశలు కష్టపడి విజయతీరాలకు చేర్చిన మెపా ఫౌండర్స్ మెంబర్స్,మెపా కోర్ కమిటీ సభ్యులకు,పిలవగానే సభకు వచ్చిన గౌరవ,ముఖ్య అతిథులకు,ముదిరాజ్ బందు మిత్రులకు,శ్రేయోభిలాషులకు,వివిధ జిల్లా,మండల,గ్రామాల ముదిరాజ్ కుల బాంధవులకు,మిత్రులకు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మెపా రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ రవి ముదిరాజ్ తెలిపారు.వారు మాట్లాడుతూ
ముదిరాజ్ ల బలగం,బలాన్ని,గలాన్ని చాటి చెప్పమని,మన హక్కుల పిల్లల బంగారు భవిష్యత్తు కోసంవిద్య,ఉద్యోగం,సాధికారత లక్ష్యంగా ముందుకు వెళ్దామని తెలిపారు.

మునీర్ అన్నకు నివాళులు అర్పించిన బెల్లంపల్లి.

మునీర్ అన్నకు నివాళులు అర్పించిన బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు.

బెల్లంపల్లి నేటిధాత్రి:

బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సదానందం ఆద్వర్యంలో కలం యోధుడు ఉద్యమనేత సీనియర్ పాత్రికేయులు దివంగత జర్నలిస్టు మునీర్ అన్నకు బెల్లంపల్లి పాత్రికేయుల నివాళులు అర్పించారు. సోమవారం రోజు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన చిత్ర
పటాన్ని ఏర్పాటుచేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సజ్ను ఫఫీ మాట్లాడుతూ మునీర్ భాయ్ పత్రికా రంగానికి విశేష సేవలు అందించడం తోపాటు కార్మిక వర్గానికి చేసిన సేవ లను గుర్తు చేసుకున్నారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందడం పత్రికా రంగానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కారుకూరి సదానందం మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో జేఏసీ కన్వీనర్ గా బాధ్యతలు స్వీకరించి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం వరకు మడమతిప్పని పోరాటాలు చేసిన మహనీయుడని, పత్రికా రంగంలో సీనియర్ పాత్రికేయుడుగా రాణిస్తూ విశ్లేషణాత్మకమైన కథనాలతో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విశేష కృషిని చేయడం జరిగిందని, నాలుగు దశాబ్దాలకు పైగా వివిధ పత్రికల్లో
బాధ్యతలు స్వీకరించి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తనదైన శైలిని ప్రదర్శించి ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిగా నిలిచిన మునీర్ భాయ్ సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి మృతి చెందడం పత్రికా రంగానికి తీరని లోటని ప్రెస్ క్లబ్ కార్యవర్గం కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనసారా ప్రార్థించారు. ఈ కార్యక్ర
మంలో బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ టేకుల బస్తి ఉపాధ్యక్షుడు ఇరుకుల్ల రమేష్,
ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ పాండే,కోశాధికారి కత్తుల నవీన్,కార్య
వర్గ సభ్యులు టి.శ్రావణ్, కె.రమేష్ ,
కె.సాగర్, ఉపాధ్యక్షుడు దండబోయిన భాస్కర్, ప్రధాన కార్యదర్శి సుభాన్ పాషా తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన కాలేశ్వరం సరస్వతి పుష్కరాలు.

ముగిసిన కాలేశ్వరం సరస్వతి పుష్కరాలు

భూపాలపల్లి నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపద, ఆరోగ్యం, వృద్ధి, పాడిపంటల శుభఫలితాల కోసం కాలేశ్వరం సరస్వతి పుష్కరాలు 12 రోజుల పాటు వైభవంగా నిర్వహించిన హోమాలు నేడు పూర్ణాహుతితో ముగిశాయి. సోమవారం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ మహా పర్వదినంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్ వెంకటరావు, ఈఓ మహేష్ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ 12 హోమాలు ప్రజల ఆర్థిక, శారీరక శ్రేయస్సు వ్యవసాయోత్పత్తి అభివృద్ధికి శుభపరిణామాలు కలగాలని ఆకాంక్షతో నిర్వహించినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. వేదపండితులు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సందర్భంగా శాంతి, ఐశ్వర్యం, సమృద్ధిని కోరుతూ విశేష పూజలు చేశారని తెలిపారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు

మాతా శిశు కేంద్రం లో ఆర్ ఎస్ఐ భార్య ప్రసవం.

మాతా శిశు కేంద్రం లో ఆర్ ఎస్ఐ భార్య ప్రసవం..

పెద్దపల్లి జిల్లా నేటి ధాత్రి:

వరంగల్ జిల్లాలోని మామునూరు క్యాంప్ రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఆర్ఎస్ఐ) గా ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తున్న ఈర్ల కృపావరం భార్య స్నిగ్ధ పెద్దపల్లి జిల్లాలోని మాతా శిశు కేంద్రంలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ఈ సందర్భంగా ఆర్ ఎస్సై మాట్లాడుతూ తనకు కూతురు పుట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న మెరుగైన వైద్య సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. ఏరియాలోని బొంకూరి కాలనీకి చెందిన ఆర్ఎస్ఐ కృపావరం భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.ఆ జంట ఇతరులకు ఆదర్శంగా నిలిచారని  కొనియాడారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version