బహిరంగ సభకు భారీగా తరలిరండి…

బహిరంగ సభకు భారీగా తరలిరండి…

నారా లోకేష్ కు టిడిపి జాతీయ పరిపాలన అధ్యక్షులుగా పదవి ఇవ్వాలని ప్రతిపాదన

కాకాని, జగన్ మైనింగ్ అవినీతి వెలికి తీయాలని ప్రతిపాదన

తిరుపతి(నేటి ధాత్రి) మే 26:

 

 

 

ఎన్టీఆర్ జన్మదిన పురస్కరించుకుని టిడిపి మహానాడు 27, 28,29 న భారీ బహిరంగ సభ కు భారీగా తరలిరావాలని తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ పిలుపు నిచ్చారు,
స్థానిక తిరుపతి
ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో సోమవారం తిరుపతి టిడిపి నాయకుల తో కలిసి ఆయన మాట్లాడుతూ నందమూరి తారకరామారావు జన్మదిన పురస్కరించుకొని 27 28 29 తేదీలలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని తలపెట్టారని తిరుపతి నుంచి అధిక సంఖ్యలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నాలని, నారా లోకేష్ కు టిడిపి జాతీయ పరిపాలన అధ్యక్షులుగా (టిడిపి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ) పదవి ఇవ్వాలన్న ప్రతిపాదన తిరుపతి నుంచి టిడిపి నాయకులు కార్యకర్తలు పలువురి అభిప్రాయలతో ఈ ప్రతిపాదనను పెడుతున్నామని ఇందుకు అందరూ అంగీకరించాలని కోరుతున్నామన్నారు.
కాకాని, జగన్ మైనింగ్ అవినీతి వెలికి తీయాలని ప్రతిపాదన
వైసీపీ పార్టీలోని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనింగ్ కేసులో పై చర్చించి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదనలను మహానాడులో చర్చించాలని
ఆయన అన్నారు,
ఈ మహానాడు కార్యక్రమంలో రాష్ట్ర పరిపాలనపై అంశాలపై అలాగే పలు అంశాలపై చర్చించుకుని ఇటు పార్టీని అటు రాష్ట్ర పరిపాలనను పరిపాలించేందుకు పొలంసాలపై చర్చించి అలాగే తిరుపతి నుంచి కూడా కొన్ని ప్రతిపాదనలు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు, అన్నిటిని అందరూ ఆమోదించి ఆదర్శవంతమైన పాలనను ప్రజలకు అందించాలని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకుంటారని ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు పలువురు మంత్రులు కూడా
హాజరు కానున్నారని ఆయన తెలిపారు,
ముఖ్యంగా 29వ తేదీన జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తో పాటు డిప్యూటీ మేయర్ ఆర్ సి, మునికృష్ణ,
కట్టా జయరామ్ యాదవ్, బుల్లెట్ రమణ, రామారావు,జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకార మహోత్సవానికి భారీగా తరలిరండి..

*ప్రమాణ స్వీకార మహోత్సవానికి భారీగా తరలిరండి..

*టిడిపి నాయకులు, జాతీయ బి సి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం..

తిరుపతి( నేటి ధాత్రి)మార్చి 27:

 

యాదవ కార్పొరేషన్ కు తిరుపతి టిడిపి బిసి నాయకులు మాజీ తుడా చైర్మన్ జి నరసింహ యాదవ్ రాష్ట్ర చైర్మన్ గా ఏప్రిల్ 2వ తేదీన విజయవాడలో జరుగు ప్రమాణ స్వీకారం మహోత్సవానికి పార్టీ నాయకులు కార్యకర్తలు బీసీ కుల సంఘ నాయకులు భారీగా తరలిరావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి జగన్నాథం పిలుపునిచ్చారు, గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో తిరుపతి టిడిపి బీసీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏప్రిల్ రెండవ తేదీన ఉదయం 9 గంటలకు యాదవ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గా గొల్ల నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవం కు బీసీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలిరావాలని రజక సంఘం, గాండ్ల సంఘం, యాదవ సంఘం,నాయి బ్రాహ్మణ సంఘం, మత్స్యకారుల సంఘం, వడ్డెర సంఘం, వన్నెకుల క్షత్రియ సంఘం, పట్టు శాలి సంఘం, శాలివాహన సంఘ నాయకులు
హాజరు కావాలని
బీసీ కార్పొరేషన్ లో రాష్ట్రంలో ఉన్నతమైన చైర్మన్ పదవిని మన తిరుపతి నాయకులు నరసింహ యాదవ్ కు రావడం మనకందరికీ ఆనందంగా ఉందని కనుక తిరుపతి జిల్లా నుంచి భారీగా తరలి వెళ్దామని పిలుపునిచ్చారు, తిరుపతి నుండి భారీగా బీసీ కుల సంఘ నాయకులు పెద్ద
ఎత్తున తరలిరావాలని టిడిపి నాయకులు మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి .జగన్నాథం
పిలుపునిచ్చారు,
ఈ కార్యక్రమంలో రజక కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కరాటే చంద్ర, గాండ్ల సాధికార రాష్ట్ర కమిటీ సభ్యులు జగన్నాథం, తిరుపతిలో కుల సంఘాల నాయకులు వడ్డెర సంఘం నాయకులు బాలాజీ,
కరాటే చంద్ర , అక్కినపల్లి లక్ష్మయ్య , ఆముదాల తులసీదాస్ , శంకరయ్య , భక్తవత్సలం , అశోక్
తదితరులు పాల్గొన్నారు..

అంకెల గారడీగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్..

అంకెల గారడీగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్..

విద్యారంగానికి 7.5%నిధులను మాత్రమే కేటాయించడాన్ని బిఆర్ఎస్వి పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం..

బిఆర్ఎస్వి సీనియర్ నాయకుడు వొల్లాల శ్రీకాంత్ గౌడ్

వీణవంక,( కరీంనగర్ జిల్లా ):నేటి ధాత్రి :

 

నేడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ సమావేశంలో 2025-2026 ఆర్థిక సంవత్సర బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీగా ఉంది. అమలుకాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తూ అధికారం చేపట్టిన ఈ ప్రభుత్వం పథకాలను అమలు చేయకుండా నానా అవస్థలు పడుతున్నారు. గత ఎన్నికల సమయంలో విద్యారంగానికి 15%నిధులు కేటాయిస్తామని ప్రగల్బాలు పల్కి, పోయిన బడ్జెట్ లో 7.3%నిరాశ మిగిల్చి, నేడు ఈ బడ్జెట్ లో కూడా 7.5%23,108 కోట్లు మాత్రమే కేటాయించింది. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అని వారి నినాదాలతో ఈ బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. కానీ వారి నినాదాలు వాస్తవానికి మాత్రం సంక్షేమనికి ఆమడ దూరం, అభివృద్ధి లో వెనుకబాటు తనం, సూపరిపాలన శూన్యం మాత్రమే చూస్తున్నాం. బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విద్యారంగానికి,యూనివర్సిటీలకు, గురుకులాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అద్భుతంగా అభిరుద్ది పరిచింది. కానీ ఈ ప్రభుత్వం యూనివర్సిటీ, గురుకులాలను నిర్లక్ష్యం చేస్తు విద్యార్థుల మరణాలకు కారణమౌతున్నాయి. గురుకులాలలో చదువుతున్న విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలను 200%, డైట్ చార్జీలు 40% పెంచుతామణి గత బడ్జెట్ లోనే అన్నారు. మళ్ళీ గతంలో మాదిరే ఇప్పుడు కాస్మోటిక్, డైట్ ఛార్జిలను 200%, 40% అంటున్నారు. అంటే గతంలో ఈ కేటాయింపులు జరగలేదా..?. మీ బడ్జెట్ నిధులు నీటి మూటలేనా..? అని అడుగుతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు చైతన్య వంతులు, విద్యావంతులు, మేధావులు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నాం. విద్యారంగా సమస్యల మీద అసెంబ్లీ ముట్టడి చేసిన కూడా మీ వైఖరి మారలేదు. వందేళ్లకు పైబడి ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ కీ 1000 కోట్లు రాష్టంలోని అన్నీ యూనివర్సిటీ లను అభివృద్ధి చేయాలి అలాగే యూనివర్సిటీ లో ఉన్న బోధన, బోధనేతర ఖాళీలను తక్షణమే భర్తీ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో విద్యారంగా సమస్యలు తీర్చే వరకు బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో మా పోరాటాన్ని ఉదృతం చేస్తామని  అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version