నేడు పెద్దింటి కథల కార్యశాల కార్యక్రమం.

నేడు పెద్దింటి కథల కార్యశాల కార్యక్రమం

సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి ):

తెలంగాణ ప్రభుత్వం సాహిత్య అకాడమీతో కలిసి యువ కథకుల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కథల కార్యశాల తేదీ 27 మే మంగళవారం ఉదయం 10 గంటల నుంచి రవీంద్రభారతి మినీ హాల్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రొహిబిషన్, ఎక్సైజ్, పర్యాటక మరియు సాంస్కృతిక పురావస్తు శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు. ఈ కథల కార్యశాలలో ప్రముఖ సినీ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ “కథలు ఎలా రాయాలి” అనే అంశంపై యువ కథకులకు రోజంతా శిక్షణ ఇవ్వనున్నారు. ఇది కొత్తగా రాస్తున్న యువ రచయితలకోసమే నిర్వహిస్తున్న కార్యశాల అని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలా చారి పేర్కొన్నారు.పెద్దింటి ఇప్పటికే యూనివర్సిటీలలో, డిగ్రీ కళాశాలలలో అనేక కథల కార్యశాలలు నిర్వహించారు. ఆయన రచించిన కథలు, నవలలు పలు యూనివర్సిటీల సిలబస్‌లలో భాగంగా ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలకు కథలు పాటలు మాటలు రాస్తున్నారు.

సహారా ఇండియా బాధితుల సంగం సమావేశం.

సహారా ఇండియా బాధితుల సంగం సమావేశం.

మందమర్రి నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మందమర్రి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో జరిగిన సహారా ఇండియా బాధితుల సంఘం సమావేశమై ఈ క్రింద పేర్కొనబడిన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించనైనది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సహారా బాధితుల సంఘం సభ్యుడు చిలుక సంజీవ్ మాట్లాడుతూ సహారా డబ్బులు విషయంపై మందమర్రి ఏజెంట్ డి. శ్రీనివాసరావు, మేనేజర్ ఎస్. టి. రావు ను నిలదీయగా గత ఐదు నెలల క్రితం లీగల్ నోటీసులు జారీ చేశారు.. అంటే అడిగితే న్యాయానికి సంకెళ్లు వేస్తారా మీరు? ఇది ఎక్కడి న్యాయం? చట్టానికి కళ్ళు ఉన్నాయని నిరూపిస్తాం. వందమంది దోషులు తప్పించుకున్నా పరవాలేదు గాని ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు భారతీయ శిక్ష స్మృతి ప్రకారం అని పేర్కొన్నారు. ఈ విషయం పై త్వరలో జిల్లా కలెక్టర్, రామగుండం సిపి పోలీస్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మరియు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వినతి పత్రం అందజేసి. అనంతరం ధర్నాలు రాస్తారోకలు గ్రామాల నుంచి మండలాల వరకు మండలం నుంచి జిల్లా వరకు జిల్లా నుంచి రాష్ట్రం వరకు పోరాడి మా డబ్బులు మాకు తెచ్చుకునే దిశగా ఎంత దూరమైనా వెళ్తామని పేర్కొన్నారు. అలాగేసింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజ్జల్లి వెంకటయ్య మాట్లాడుతూ
సహారా ఇండియా సంస్థలో కాలపరిమితి పూర్తి అయిన ఖాతాదారులకు వెంటనే సహారా సంస్థ డబ్బులు చెల్లించాలి. అలాగే బెల్లంపల్లి మంచిర్యాల నస్పూర్ కాలనీలో ఉన్నటువంటి సహారా ఇండియా మేనేజర్లకు బాధితుల డిపాజిట్లు వెంటనే చెల్లించే విధంగా కృషి చేయాలని వినతి పత్రాలు ఇవ్వడానికి తీర్మానం చేయనైనది.సంవత్సరాల తరబడి సహారా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ డిపాజిట్లు చెల్లించకపోవడం వలన వృద్ధులు వితంతువులు సీనియర్ సిటిజల్లు సింగరేణి విశ్రాంత ఉద్యోగులు ఇతరులు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇట్టి విషయంపై కూడా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ కి అదేవిధంగా బెల్లంపల్లి చెన్నూరు మంచిర్యాల శాసనసభ్యులకు కూడా సహారా బాధితుల పక్షాన వినతి పత్రాలు సమర్పించి బాధితులను ఆదుకునే విధంగా కృషి చేయాలని కోరుతూ తీర్మానించడమైనది.ఇట్టి కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా సహారా బాధితుల సంఘం సభ్యుడు చిలుక సంజీవ్, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజ్జెల్లి వెంకటయ్య, డి. రాజమౌళి నస్పూర్, డి. కొమురయ్య గంగారం, వెంబడి రాజేందర్ బెల్లంపల్లి, బొల్లు రాంబాబు మందమర్రి, దండు మల్లయ్య, యాదన్న, రాజమల్లు, సదానందం, నోముల వెంకన్న, సత్యనారాయణ, అజారుద్దీన్, ఓదేలు తదితరులు మహిళా సహారా బాధితులు పాల్గొనడం జరిగింది.

తెలంగాణ నూతన సమాచార కమీషనర్.

తెలంగాణ నూతన సమాచార కమీషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గడ్డం నర్సయ్య

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

ఈరోజు ఇటీవల తెలంగాణ నూతన సమాచార కమీషనర్ గా నియమితులైన సీనియర్ జర్నలిస్టు పి.వి. శ్రీనివాస్ ని హైదరాబాద్ లోని వారి కార్యాలయములో టీ.పి.సి.సి మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య మర్యాదపూర్వకంగా కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రసాదం అందించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.

విద్యుత్ షాక్ కు గురై గేదె మృతి.

విద్యుత్ షాక్ కు గురై గేదె మృతి..

కేసముద్రం నేటి ధాత్రి:

 

కేసముద్రం మండలంలోని నారాయణపురం గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ షాక్ కు గురై గేదె మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బాధితుడు కేతిరి శ్రీనివాస్ రెడ్డి తెలిపిన కథనంప్రకారం, తనకి చెందిన సుమారు రూ.30 వేల విలువగల గేదె రోజువారి రీత్యా మేతకి వెళ్లడం జరిగిందని, ఈ నేపథ్యంలో గేదె ఇంటికి రాలేదని చుట్టుపక్కల ఉన్నటువంటి చేనులలో తిరగడంతో గ్రామంలోని ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద మృతి చెందిందని తెలిపారు, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ట్రాన్స్ఫార్మర్ ఎత్తుపై పెట్టకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ కిందికి ఉండడం విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరి పై గేదె మృతి చెందిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందజేయాలని బాధితుడు వేడుకుంటున్నారు.

 రైతులకు జీలుగు విత్తనాలు పంపిణీ.

 రైతులకు జీలుగు విత్తనాలు పంపిణీ

నిజాంపేట నేటి ధాత్రి:

రైతులు వర్షాకాలం పంట కు లఘు ఏర్పడడానికి జీలుగు విత్తనాలు ఎంతగానో ఉపయోగపడుతుందని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రనీకి 200 క్వింటల్ల జీలుగు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు తీసుకొని వ్యవసాయ విస్తరణ అధికారులు కూపన్స్ జారీ చేస్తారని ఆ కూపన్స్ ఆగ్రోస్ మరియు డిసిఎంఎస్ సెంటర్లో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 30 కేజీల జీలుగు ధర రూ,, 2137. 50 ఉందన్నారు. మండల వ్యాప్తంగా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

గోహత్యలు అక్రమ రవాణాను అరికట్టాలి.

గోహత్యలు అక్రమ రవాణాను అరికట్టాలి
బీజేవైఎం నాయకులు వినతి

నిజాంపేట నేటి ధాత్రి:

గోహత్యలు, గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని బీజేవైఎం నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గల స్థానిక పోలీస్ స్టేషన్లో ఇన్చార్జ్ ఎస్సై సృజనకు గో హత్యలు, గోవుల అక్రమ రవాణా చేసే వారిని కఠినంగా శిక్షించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గోవులు దైవ స్వరూపమని అలాంటి గోవులను కొంతమంది హత్యలు చేస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆవును తల్లిలా భావించి గోమాత అని పిలుచుకునే సాంప్రదాయం భారతదేశంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం ప్రశాంత్ గౌడ్, బోయిని ప్రణయ్ కుమార్, గజం రాజు, మేకల రమేష్, సందీప్ గౌడ్, బాసం అనిల్, భరత్,  లు ఉన్నారు.

అక్రమ నిర్మాణమే అంటున్న పంచాయితీ అధికారులు.

అనుమతులులేని…అక్రమ నిర్మాణం…!

అక్రమ నిర్మాణమే అంటున్న పంచాయితీ అధికారులు

పట్టింపె లేదా ఏ…? అధికారులకు…

అక్రమ నిర్మాణ యజమానిపై ఇంత ప్రేమ ఎందుకో…!

సంవత్సరాలుగా సాగుతున్న అక్రమ నిర్మాణ సమస్యలు

నోటీసులతో సరి పెట్టుకుంటారా..? కోరాడ జులిపిస్తారా…

చేతులు తడిపినందుకేనా అనే అనుమానాలు?

కేసముద్రం నేటి ధాత్రి:

 

కేసముద్రం పట్టణ కేంద్రం లో అక్రమ నిర్మాణాలు యాదేచ్చకంగా కొనసాగుతున్నాయి.ఇది అధికారుల అలసత్వమా…? లేదా నిర్లక్ష్యమా…? లేక అక్రమ నిర్మాణదారుల బరితెగింపులా…? అనీ కేసముద్రం పట్టణ ప్రజలు ముక్కున వెలుసుకుంట్టున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది.ఒక సామాన్యుడు రెండు గదుల ఇంటి నిర్మాణం చేపట్టాలంటే పర్మిషన్ల పేరుతో గ్రామ పంచాయతీ కార్యాలయం ఆ పేపరు ఈ పేపర్ తీసుకురా అంటూ చెప్పులు అరిగేలా తిప్పించుకునే సందర్భాలు ఎక్కువే అంటున్న ప్రజలు, అధికారులు మాత్రం డబ్బు పలుకుబడి ఉన్న వ్యాపారస్తు లు డబ్బున్న బడా బాబులు అని చెప్పుకునే వారి నిర్మాణ సముదాయలకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస్తున్న కాని అధికారులు చూసి చూడనట్టు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం వెనుక ఆ అధికారులపై ప్రజలు అనుమానం వ్యక్తపరుస్తున్నారు. అక్రమ నిర్మాణ దారులు నన్ను ఎవరేం చేయలేరు అనే ధీమాతో నిర్మాణాలు పూర్తి పూర్తి చేస్తున్న సంఘటనలు. యాదేచ్చకంగా అధికారుల కళ్ళేదుట బహుళ అంతస్తుల పేక మేడ లాంటి భవనం ఏదే చ్చగా అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు నిర్మించినా కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అనేక అనుమానాలకు తావిస్తుంది..వివరలోకి వెళితే కేసముద్రం పట్టణ కేంద్రం నడిబొడ్డున మార్కెట్ రోడ్ ప్రధాన రహదారి లో భద్రకాళి టెక్స్టైటైల్స్ షాపింగ్ కాంప్లెక్స్ జి ప్లస్ టు..

construction

అనుమతులు పొంది పంచాయతీరాజ్ చట్టం – 2018 నియమ నిబంధనలను అతిక్రమించి జి ప్లస్ టు ఉన్న నిర్మాణాన్ని బహుళ అంతస్తుల అనగా ఐదు పోర్లతో పేక మేడ లాంటి అక్రమ నిర్మాణం చేపట్టి ఎలాంటి ఫైర్ సేఫ్టీ మరియు వెంటిలేషన్ రూల్స్ పాటించకుండా నిర్మాణం చేపట్టారు. నిర్మాణం చేపట్టిన ప్రదేశంలో అంత పెద్ద బహుళ అంతస్తులు నిర్మాణానికి అనువైన ప్రదేశమేనా? అంతటి అంతస్థకు ఆ ప్రదేశంలోని నేల సరి అయినదేనా కాదా అది తేల్చాల్సింది జులాజికల్ మైన్స్ అధికారులు నేల పరీక్ష తదనంతరం అనుమతులు తప్పనిసరిగా పాటించాలి అలాగే ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండా గాలి రావడానికి పోవడానికి ఒక్క కిటికీ కూడా నిర్మించకుండా ఒక్కొక్క ఫ్లోర్ కి ఒకటే గుమ్మం ఒకటే దారితో కూడిన డోర్ నిర్మాణం చేశారని అలాగే నాలుగు అంతస్తులకు గాను లిఫ్ట్ నిర్మించారని ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం సంభవిస్తే ఫైర్ సిబ్బందికి వెళ్లే మార్గమే లేదని షాపులో పనిచేసే అటువంటి వర్కర్స్ కి మరియు షాపింగ్ మాల్ వచ్చినటువంటి వినియోగదారులకు ప్రమాదం పొంచి ఉందని మనుషుల ప్రాణాలతో చెలగాటమేనని పలువురు భావిస్తున్నారు.కానీ ఎలాంటి సేఫ్టీ రూల్స్ పాటించకుండా సేఫ్టీ అనుమతులు అవేమీ లేకుండా ఎలా నిర్మిస్తారని, అనేక ప్రశ్నలకు తావిస్తుందని ప్రజలు భావిస్తున్నారు.అట్టి బహుళ అంతస్తుల పేక మేడ లాంటి భవన నిర్మాణంతో చుట్టుపక్కల ఉన్నటువంటి నిర్మాణాలకు ప్రమాదం జరుగుతుందని అనేది చర్చ జరుగుతుంది.గతంలో ఈ షాపింగ్ కాంప్లెక్స్ అదనపు అంతస్తుల నిర్మిస్తున్న సమయంలో ఒక భవన నిర్మాణ కార్మికుడు పై అంతస్తూ నుండి పడి మృతి చెందిన సంఘటన జరిగిందని, ప్రమాదం జరిగిన ఏ మాత్రం నిర్మాణం ఆపకుండా నిర్మాణాలు పూర్తి చేసిన పరిస్థితి కళ్ళముందే కనబడుతుంటే అధికారులు షాపింగ్ కాంప్లెక్స్ యజమాని తో కుమ్మక్కయ్యారని ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి.ఎన్నో సంవత్సరాలుగా ఈ తతంగం జరుగుతున్న కూడా అధికారులు కేవలం నోటీసులతోనే సరిపెడుతున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకుకపోవడం వెనక ఆంతర్యం ఏమిటో…?అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిందని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. అధికారులు చట్టాలను కేవలం నిరుపేదలపై సామాన్యులపై ప్రయోగిస్తారా.బడా వ్యాపారస్థులకు డబ్బు పలుకుబడి దారులకు కొమ్ము కాస్తున్నారని ప్రజల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలు అనుకున్నట్టుగానే పరిస్థితులు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయని. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి అక్రమ నిర్మాణదారులపై కొరడా జులిపించాలని వెంటనే స్పందించి పంచాయతీ రాజ్ చట్టాలకు లోబడి చర్యలు తీసుకోవాలని,అలాగే ఇంకా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కట్టడి చేయాలని ఇకనైనా మున్సిపల్ అధికారి మరియు పంచాయితీ అధికారులు చట్టాలపై నమ్మకం కలిగిస్తారా లేదా అని ప్రజలు వేచి చూస్తున్నారు.

మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం.

మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం.

చిట్యాల నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కేంద్రంలోని
ఎంపీడీవో ఆఫీస్ సమీపంలో గల ఎస్సీ కాలనీలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్ధం అయినట్లు సమాచారం అలాగే సమీపాన ఉన్న స్థానిక చర్చిలో షార్ట్ సర్క్యూట్ తో చర్చిలోని వస్తువులన్నీ కాలిపోయాయి అలాగే స్థానిక రైతు వేదికలో షార్ట్ సర్క్యూట్ ఫ్యాన్లు కంప్యూటర్లు కాలిపోయినాయి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్స్ కార్డు ఆన్లైన్ కోసం వచ్చిన రైతులు రైతు వేదికలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగడంతో రైతులందరూ ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకుని బయటికి పరుగులు తీశారు ఇంత జరిగినా కూడా విద్యుత్ శాఖ అధికారులు అటువైపు రాకపోవడం గమనార్హం, ఎంపీడీవో ఆఫీస్ సమీపంలో షార్ట్ సర్క్యూట్తో పరిసర ప్రాంతాలలో ప్రమాదాలు జరుగుతున్నాయి కనుక వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి షార్ట్ సర్క్యూట్ గల కారణాలను తెలుసుకొని పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు, రైతు వేదికలో కూడా అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ జరగడంతో బయటికి పరిగెత్తారు అనంతరం రైతులు రైతు వేదిక ముందు గల ప్రదేశంలో అగ్రికల్చర్ అధికారి మొబైల్ ఫోన్లో రైతుల ఆధార్ కార్డులు ఆన్లైన్ చేసుకుంటున్నారు, కాబట్టి రైతుల బాధలు స్థానిక ప్రజల బాధలు అర్థం చేసుకొని రైతు వేదికలో విద్యుత్ సమస్యను తొందరగా పరిష్కరించి పరిష్కరించి రైతుల కు సహకరించాలని అన్నారు ఏది ఏమైనా ఎంపీడీవో పరిసర ప్రాంతాల్లో గల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు కావున వెంటనే విద్యుత్ అధికారులు సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

రుక్మాపూర్ లో ఓ మహిళ దారుణ హత్య.

రుక్మాపూర్ లో ఓ మహిళ దారుణ హత్య

◆ ఘాతుకానికి పాల్పడ్డ గుర్తుతెలియని దుండగులు..?

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్ కల్ మండల రుక్మాపూర్ గ్రామంలో,గుర్తుతెలియని దుండగులు ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేసి పరారైన ఘటన సంగారెడ్డి జిల్లా, న్యాల్కల్ మండలం, రుక్మాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన రాణమ్మ (46)ను ఇంట్లోకి చొరబడి సీసాలతో పొడిచి, గొంతును నొలిపి హత్య చేశారు. ఇంట్లో నుంచి బంగారం, నగదును అపహరించినట్లు సమాచారం. మహిళ హత్య ఘటన తెలుసుకున్న జహీరాబాద్ డిఎస్పి సైదా నాయక్, జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు పోలీసుల బృందంతో విచారణ చేపడుతున్నారు.

రెండవసారి మారగాని బాలకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక.

సిపిఐ మరిపెడ మండల కార్యదర్శిగా రెండవసారి మారగాని బాలకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక

మరిపెడ నేటిధాత్రి:

ఒంటె కొమ్ము లక్ష్మారెడ్డి గార్డెన్ లో మరిపెడ మండలం ఐదవ మహాసభ జరగగా మరిపెడ మండలంలోని నీలికుర్తి గ్రామానికి చెందిన మారగాని బాలకృష్ణ గౌడ్ ఉన్నంత విద్యావంతుడైన మొదటి నుండి వామపక్ష విద్యార్థి సంఘ నాయకుడిగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు చేసి బాలకృష్ణ నూ గుర్తించి సిపిఐ పార్టీ మరిపెడ మండలం కార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తించి పార్టీ బలోపేతానికి కృషిచేసిన బాలకృష్ణని తిరిగి 5వ మండల మహాసభలో రెండవసారి సిపిఐ మరిపెడ మండలం కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది
భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యలపై కార్మిక శ్రామిక బడుగు బలహీన వర్గాల అణగారిన వర్గాల ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మరిపెడ మండలంలో పార్టీ సూచించిన విధంగా నిరంతరం పోరాటాలు కొనసాగిస్తానని తెలియజేశాడు ఈ ఎన్నికకు సహకరించిన సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారధికి జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి కి సిపిఐ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు.

సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ధర్నా.

సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ధర్నా

సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి ):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ధర్నా చేపట్టడం జరిగినది. గత కొద్ది కాలం నుండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రోటోకాల్ ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి.
రేవంత్ రెడ్డి చిత్రపటం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల,పట్టణ, గ్రామ స్థాయి,నాయకులు సిరిసిల్ల బైపాస్ లో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రేవంత్ రెడ్డి. చిత్రపటాన్ని పెట్టడానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు వెళ్లడం జరిగినది. అక్కడ ఉన్న బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని పెట్టడానికి అనుమతించకపోవడంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం జరిగినది. ఇంతలో పోలీసుల జోక్యంతో ఇరు పార్టీల వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగినది. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ నుండిజలగం ప్రవీణ్, మునిగేల్ రాజు,గజ్జల రాజు, గుండెలు శీను, భైరవేణి రాము, భాను,ఆరుట్ల మహేష్, చుక్క శేఖర్, రంజాన్ నరేష్, అభి గౌడ్,నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఆపరేషన్ సింధూర్ తో దేశ నికి రక్షణ బిజెపి.

ఆపరేషన్ సింధూర్ తో దేశ నికి రక్షణ బిజెపి

వనపర్తిలో బిజెపి తిరంగా ర్యాలీ

బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సీనియర్ న్యాయవాది మున్నూరు రవీందర్

వనపర్తి నేటిధాత్రి:

జమ్మూ కాశ్మీర్ పెహల్గాం మారణకాండకు ప్రతీకారంగా భారత సైన్యం సింధూర్ కు మద్దతుగా తిరంగా ర్యాలీ రాష్ట్ర బిజెపి పిలుపు మేరకు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సీనియర్ న్యాయవాది మున్నూరు రవీందర్ మాట్లాడుతూ ఇస్లామిక్ టెర్రరిస్ట్ రాజ్యాలు కుట్రపూరితంగా పెహల్గాంలో 26 మందిని ఊచ కోత ఘటనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ టెర్రరిస్టులకు వారికి ఆశ్రయం కల్పిస్తున్న వారిని ఆపరేషన్ సింధూర్ సైనిక చర్య ద్వారా మే 7 న కేవలం 22 నిమిషాల వ్యవధిలో పౌర సమాజానికి విఘాతం కలగకుండా 9 ఉగ్రస్తావరాలను పూర్తిగా నేలమట్టం చేసి వందలాదిమంది టెర్రరిస్టులను అంతమొందించి భారతదేశ రక్షణ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చెప్పారని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు వారికి మద్దతుగా నిలుస్తున్న బంగ్లాదేశ్ టర్కీ సౌదీ అరేబియా దేశాల వాణిజ్య ఒప్పందాలను పూర్తిగా రద్దుచేసి వారి ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినేలా చేశారని అన్నారు. వనపర్తి లో తిరంగా ర్యాలీలో పార్టీలకతీతంగా విద్యార్థి యువజన కుల ప్రజా సంఘాలు రిటైర్డ్ ఆర్మీ జవాన్లు పెద్ద ఎత్తున పాల్గొని దేశ భద్రత విషయంలో దేశ జవాన్లకు నేను సైతం మద్దతుగా రాజకీయ పార్టీల కు అతీతంగా తిరంగా ర్యాలీలో పాల్గొనడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నారాయణ జిల్లా రామన్ గౌడు.పట్టణ ప్రధాన కార్యదర్శి నల్లబోతుల అరవింద్ కుమార్. రాష్ట్ర నాయకులు సబి రెడ్డి వెంకట్ రెడ్డి, లోక్నాథ్ రెడ్డి పురుషోత్తం రెడ్డి బిశ్రీశైలం చిత్తారి ప్రభాకర్, గౌని హేమారెడ్డి , రత్నాకర్ రెడ్డి కృష్ణారెడ్డి తపస్ ఉపాధ్యాయ సంఘం అమరేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ చేయూత శ్రీనివాస్ రెడ్డి, విశ్రాంత ఉద్యోగుల సంఘం సూర్యనారాయణ, రామ్మూర్తి హిందూ రాష్ట్ర మహాసభ అధ్యక్షురాలు నారాయణ దాసు జ్యోతి రమణ వనపర్తి పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షులు బచ్చురాము, కృష్ణ గౌడ్ సామాజిక నాయకులు పోచా రవీందర్ రెడ్డి, బులియన్ మర్చంట్ బంగారు అనిల్ అయ్యప్ప ఆలయ కమిటీ ముత్తు కృష్ణ గురుస్వామి స్నేక్ సొసైటీ చీర్ల కృష్ణసాగర్ మెడికల్ అసోసియేషన్ వినోద్ రామన్ గౌడ్ కుమారస్వామి ఏర్పుల సుమిత్రమ్మ, తిరంగా ర్యాలీ కో కన్వీనర్ కదిరే మధు, ఆగపోగు కుమార్ఎండి ఖలీల్, అశ్విని రాద, వారణాసి కల్పన, మని వర్ధన్, సాగర్, బోయల రాము, రాజశేఖర్, ఎద్దుల రాజు, తదితరులు పాల్గొన్నారు

బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి ఇంటి దగ్గర.

33 వ వార్డు ప్లా నింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి ఇంటి దగ్గర

సీసీ రోడ్డుకు పూజ చేసిన కాంగ్రెస్ నేతలు

వనపర్తి నేటిధాత్రి:

వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డు ప్లా నింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ఇంటి దగ్గర సిసి రోడ్డు నిర్మాణానికి కాంగ్రెస్ నేతలు పూజ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ ఎస్ ఎల్ ఎన్ రమేష్ మాజె కౌన్సిలర్ బ్రహ్మం కాంగ్రెస్ నేతలు కూరగాయల రవీందర్ వార్డు ప్రజలు కిరాణాము వ్యాపారి ఆర్యవైశ్యుడు కాలూరు శ్రీనివాసులు శెట్టి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు 33 వ వార్డు ప్రజలు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేగారెడ్డికి ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డికి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ఆదివారం సాయంత్రం 5.00 గంటలకు డిఎస్పి సైదా నాయక్ మరియు ఇన్స్పెక్టర్ శివ లింగం ఆదేశాల మేరకు నేషనల్ హైవే-65 మీద ప్రిన్స్ ధాబ ముందర వాహనాలు తనికి చేస్తుండగా ఒక బ్లూ కలర్ ఆక్టివా మోటార్ సైకిల్ మీద ఇద్దరు వ్యక్తులు బీదర్ వైపు నుండి హైదరాబాద్ కు అక్రమంగా ఎండు గంజాయి ని తరలిస్తుండగా పట్టుకున్నాము ఆ ఇద్దరు వ్యక్తులు పేర్లు తెలుసుకొనగా1) షైక్ సల్మాన్ తండ్రి జబ్బార్ హైదరాబాద్ 2) మహమ్మద్ మొయిజుద్దీన్ తండ్రి సమీఉద్దీన్ హైదరాబాద్ ని తెలిపినారు వీరు ఇద్దరు బీదర్ లో ఇరానీ గల్లీలో గంజాయిని తక్కువ రేట్ కి కొనుగోలు చేసి హైదరాబాద్ లో ఎక్కువరేట్ కు అమ్ముకొనుటకు తీసుకుని వెళ్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తరువాత మెజిస్ట్రేట్ గారి ముందు హాజరు పరిస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా అల్లం ఓదెలు ఎన్నిక.

కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా అల్లం ఓదెలు ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి:

 

టేకుమట్ల మండలం అంకుషాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా రెండోసారి అల్లం ఓదెల్ ఏకగ్రీవంగా ఎన్నికైనాడు అనంతరం అల్లం ఓదెలు మాట్లాడుతూ గత ప్రభుత్వం అనేక ఒత్తిడి చేసిన పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసినందుకు గాను నన్ను గుర్తించి నా మీద నమ్మకంతో గ్రామ శాఖ అధ్యక్షుడిగా రెండోసారి నన్ను ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకి మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ కు మండల నాయకులకు అంకుషాపురం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను నిరుపేద లబ్ధిదారులకు అందే విధంగా కృషి చేస్తానని అల్లం ఓదెలు తెలిపారు

వర్ఫ్ ఆస్తులపై కన్నేసిన బీజేపీ ప్రభుత్వం.

వర్ఫ్ ఆస్తులపై కన్నేసిన బీజేపీ ప్రభుత్వం..

ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్.

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ బహిరంగ సభలో పాల్గొన్న నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన వక్స్ సవరణ బిల్లు ఎక్కువ రోజులు నిలువదని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కర్, కర్ణాటక రాష్ట్ర మంత్రి మహమ్మద్ రహీం ఖాన్ ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మోహియోద్దీన్ అన్నారు. వర్ఫ్ ఆస్తులపై బీజేపీ ప్రభుత్వం కన్నేసిందని ఆరోపించారు.వర్షంలోనే అతిధులు అదరకుండా బెదరకుండా సమావేశంలో మాట్లాడడం పట్ల ప్రజలు కుర్చీలను తమ నెత్తిపై పెట్టుకుని సభలో పాల్గొన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన అనంతరం కొన్ని వర్గాలపై రోజుకోరకమైన చట్టాలు నియమాలు నిబంధనలు తీసుకువచ్చి అణగదొక్కెందుకు కృషి చేస్తుందన్నారు. రబ్బర్ బాలు గోడకు కొడితే ఆ బాలు తిరిగి అదే వేగంగా వస్తుందన్న విషయాన్ని పాలకులు గ్రహించాలని అన్నారు.

వక్స్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఉదయం 3 గంటల వరకు పార్లమెంటులో ఉండి ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచి బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినానని ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు.త్వరలోనే కేంద్రంలో తమ ప్రభుత్వం వస్తుంది ఈ విధమైన బిల్లులన్నీ చెల్లకుండా పోతాయన్నారు. లౌకికత్వాన్ని పూర్తిస్థాయిలో పాటించేది అన్ని వర్గాలకు సమాన ప్రతిపాదికన గౌరవించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. ఎంఐఎం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ ముయ్యద్దీన్,ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు తైవుల్లా, లతోపాటు మాజీ టి ఎస్ ఐ డి సి చైర్మన్ మహమ్మద్ తన్వీర్, ఎంఐఎం జహీరాబాద్ అధ్యక్షులు మొహమ్మద్ అత్తర్ అహ్మద్,అశోక్ అప్పారావు, తాసిల్దార్ దశరథ్, మత పెద్దలు పుర ప్రముఖులు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వర్షంలోనే కొనసాగిన సదస్సు

జహీరాబాద్ పట్టణంలోని ఈద్గా మైదానంలో ఏర్పాటుచేసిన కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుకు వ్యతిరేక నిరసన సదస్సు వర్షంలోనే కొనసాగింది. వక్తలు వర్షంలో తడుచుకుంటూ ప్రసంగాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన సవరణ బిల్లు కంటే ఈ వర్షం కఠినమైంది కాదని ఇలాంటి వర్షాలను తాము ఇలాంటి ఎన్నో కష్టాలు సహిస్తామని వక్తలు ప్రకటించారు.

ఈద్గా మైదానంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.

ఈద్గా మైదానంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం..

గాయపడ్డ క్షతగాత్రులను పరామర్శించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ..

◆ ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్

◆ ఎంఐఎం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహియోద్దీన్

◆ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

◆ -కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం ఉజ్వల్ రెడ్డి

◆ జహీరాబాద్ మాజీ మంత్రివర్యులు డా౹౹ఎ. చంద్రశేఖర్..*

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని ఈద్గా మైదానంలో పార్లమెంట్ అమోదించిన “వక్స్ చట్టానికి వ్యతిరేకంగా బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంగా విద్యుత్-దీపాల కమాన్ కూలిపోవడంతో కింద కూర్చున్న 8 మందిపై పడి గాయాలయ్యాయి.తీవ్రంగా గాయపడిన వారికి హైదరాబాద్ తరలించారు.విద్యుత్ సరఫరా అవడంతో వెంటనే అధికారులు విద్యుత్ సరఫరాలను నిలిపివేశారు.దీంతో పెను ప్రమాదం తప్పింది.గాయపడి చికిత్స పొందుతున్న వారిని స్థానిక సన్ రోహి ఆసుపత్రిలో ఆదివారం మహమ్మద్ షబ్బీర్ అలీ ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్ ఎంఐఎం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహియోద్దీన్ డా౹౹ఎ. చంద్రశేఖర్,మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి పరామర్శించారు.వారు వైద్యులతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు.వారితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్,మండల కాంగ్రెస్ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పి.నాగిరెడ్డి,సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,అక్తర్,హర్షద్ పటేల్,అక్బర్, జుబేర్,జహంగీర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న రైల్వే బోర్డు.!

పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి

జహీరాబాద్ నేటి ధాత్రి:

పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న బీ ఆర్ఎస్ నాయకులు, రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్ హజ్ యాత్రకు వెళుతున్న శుభసందర్భంగా పూలమాల శాలవాతో సత్కరించి, హజ్ యాత్ర ప్రయాణం సురక్షితంగా సఫలంగా సాగాలని మాజీ మంత్రివర్యులు హరీష్ రావు,డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని పవిత్ర స్థలంలో దేవునితో ప్రార్థించాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.రాష్ట్ర దేశ ప్రజలందరూ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలు ఐష్టెశ్వర్యాలతో జీవించాలని మనసారా ప్రార్ధనలు చేయాలని తెలిపారు.

ఎస్సీ కాలనీలో అంబేద్కర్ నగర్ కామన్ ఆర్చి ప్రారంభోత్సవం.

ఎస్సీ కాలనీలో అంబేద్కర్ నగర్ కామన్ ఆర్చి ప్రారంభోత్సవం…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎస్సీ కాలనీలో అంబేద్కర్ నగర్ కమాన్ ఆర్చి ప్రారంభోత్సవం జరిగింది. సందర్భంగా నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో అంబేద్కర్ ఇందుకుగాను దాతలు సాయం కమాన్ ప్రారంభోత్సవం చేయడం జరిగిందని ఎందుకు సహకరించిన దాతలు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఇట్టి విమానానికి సహకరించిన దాతలకు కమిటీ ఆధ్వర్యంలో జ్ఞాపిక అందజేసి శాలువాలతో సత్కరించడం జరిగింది. ఇందుకుగానుముఖ్య అతిథులుగా గౌరవధాతలు. తుమ్మ రామస్వామి . రిటైర్డ్ సెక్రటేరియట్ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రెటరీ. గొట్టే.పద్మారావు రిటైర్డ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సూపర్డెంట్ కరీంనగర్. గొట్టే.జయశ్రీ స్పెషల్ డిస్టిక్ డిప్యూటీ కలెక్టర్ భువనగిరి జిల్లా. గొట్టే.అశోక్. రిటైర్డ్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్. గొట్టే సంజీవయ్య ఎస్సార్ మేనేజర్ ఎన్టిపిసి మరియు తుమ్మ శ్రీనివాస్ . టి జి పి డి సి ఎల్ జూనియర్ అసిస్టెంట్.గొట్టే పద్మ. టిఆర్ఎస్ జిహెచ్ఎంసి జనరల్ సెక్రెటరీ హైదరాబాద్ కమిటీ సభ్యులు గట్టేపల్లి రమేష్ .క్యారo పెంటయ్య. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగాల భూపతి లింగాల జలంధర్ . గొట్టే కరుణాకర్. నాయకులు గ్రామ మహిళలు తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే.

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

ముత్తారం నేటి ధాత్రి:

ముత్తారం మండల కేంద్రంలోని వెంకట లక్ష్మీ గార్డెన్ లో ప్రవళిక – శివ కుమార్ వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version