ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ ఎసిబి ట్రాప్.

ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ ఎసిబి ట్రాప్

నేటిధాత్రి:-

 

 

ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు… సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు..,

ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ కార్యాలయం లో డాకుమెంట్స్ రైటర్ పుచ్చాకాయల వెంకటేశ్వర రావుద్వారా గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కు రూ 30 వేలు లంచం స్వీకరిస్తూ ఏసీబీ కి పట్టు బడ్డ సబ్ రిజిస్టార్ అరుణ..,
ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ దాడి
మొత్తం రూ 50 వేలు డిమాండ్ చేసి 30 వేల రూపాయలకు అంగీకారం…

సైబర్ నేరస్థుల ఉచ్చులో పడవద్దు.

సైబర్ నేరస్థుల ఉచ్చులో పడవద్దు

సి.ఐ రాజ్ కుమార్ గౌడ్

మరిపెడ నేటిధాత్రి:

మరిపెడ మండల కేంద్రములో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఐదురోజుల వృత్యంతర శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా సైబర్ క్రైమ్ పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారిణి గాదె అనితా దేవి అద్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ యస్.రాజ్ కుమార్ గౌడ్ హాజరై ఉపాధ్యాయులు ఎవరు కూడా సైబర్ నేరస్థుల ఉచ్చులోపడొద్దని అన్నారు.సైబర్ నేరస్థుల వలలో చిక్కుకొని డబ్బులు నష్టపోవద్దని, ఆన్లైన్ బెట్టింగ్ లతో ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని అన్నారు.మార్కేట్లలో విరివిగా వాడుతున్న సోషల్ మీడియా లో పై అవగాహన కల్పించారు.యాప్ లను అవసరం మేరకే వాడాలని దుర్వినియోగం చేయొద్దని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు సంతోష్ కుమార్,అంజమ్మ,రిసోర్స్ పర్సన్స్ లింగాల మహేష్ గౌడ్, దోమల లింగయ్య,యాదగిరి,వెంకన్న,శ్రీను,మంగూ,మంగీలాల్, ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version